ప్రపంచం
Coronavirus Outbreak: కోవిడ్-19తో 10 కోట్ల మంది చనిపోతారట, స్పానిష్ ఫ్లూ మాదిరిగా కరోనా వ్యాప్తి భయకరంగా ఉంటుందని తెలిపిన ప్రముఖ జర్నల్ లాన్సెట్
Hazarath Reddyకోవిడ్-19తో 10 కోట్ల మంది చనిపోతారంటూ ఇప్పుడు సరికొత్త వాదన బయటకు వచ్చింది. ప్రముఖ జర్నల్ లాన్సెట్ (The Lancet) ఈ వాదనను తెరపైకి తెచ్చింది. 1918 లో సంభవించిన స్పానిష్ ఇన్ ఫ్లు ఎంజా ( Spanish Flu) మాదిరిగానే కరోనా వ్యాప్తి కూడా భయంకరంగా ఉంటుందని ఈ పత్రికలో ప్రచురించిన ఒక పరిశోధన తెలిపింది. ప్రఖ్యాత మెడికల్ జనరల్ ది లాన్సెట్‌లో ప్రచురించబడిన పరిశోధనా పత్రానికి 'యాక్టివ్ కేస్ ఫైండింగ్ విత్ కేస్ మేనేజ్‌మెంట్: ది కీ టు ట్రాకింగ్ ది కోవిడ్ -19 పాండమిక్' అని పేరు పెట్టారు. కాగా గతంలో వచ్చిన HINI ఇన్ ఫ్లు ఎంజా కారణంగా ప్రపంచంలో 10 మిలియన్ల మంది మరణించారు.
Coronavirus in India: కరోనా నుంచి కోలుకున్నపేషెంట్ ఆత్మహత్య, కోవిడ్-19 పోతుందని 400 గొర్రెలు ఝార్ఖండ్‌లో బలిచ్చారు, డేంజర్ జోన్‌లో ఢిల్లీ, భారత్‌లో 8 వేలు దాటిన మృతుల సంఖ్య
Hazarath Reddyభారత్‌లో గత 24 గంటల్లో 9996 పాజిటివ్‌ కేసులు (Coronavirus Cases in India) రికార్డు అయ్యాయి. నిన్న ఒక రోజులోనే 357 మంది కూడా మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో మొత్తం కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 286579గా నిలిచింది. ఇందులో యాక్టివ్‌ కేసులు 137448గా ఉన్నట్లు ఆరోగ్యశాఖ చెప్పింది. వైరస్‌ సంక్రమించిన వారిలో 141029 మంది కోలుకున్నట్లు పేర్కొన్నది.
Coronavirus in India: పుట్టినరోజే కరోనాతో ఎమ్మెల్యే మృతి, కోవిడ్-19 కేసుల్లో వూహాన్ నగరాన్ని మించిపోయిన ముంబై, దేశ వ్యాప్తంగా 2 లక్షల 75 వేలు దాటిన కరోనా కేసులు
Hazarath Reddyదేశంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య (Coronavirus in India) రోజులు గడుస్తున్న కొద్దీ వేగంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 9,985 కేసులు నమోదు కాగా, 279 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,76,583కి చేరగా.. మృతుల సంఖ్య (Coronavirus Deaths) 7,745కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 1,33,632 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా గడిచిన 24 గంటల్లో 1,45,216 మందికి కరోనా టెస్టులు చేశారు.
WHO on Coronavirus: ముప్పు మరింతగా పెరుగుతోంది, కోవిడ్-19 వ్యాప్తిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్ఓ, నిర్లక్ష్యమే పెను ప్రమాదంగా మారిందని తెలిపిన సంస్థ అధ్యక్షుడు టెడ్రోస్‌ అధనామ్‌
Hazarath Reddyప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న తీరుపై (coronavirus situation) ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితి మరింత దిగజారుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అధ్యక్షుడు టెడ్రోస్‌ అధనామ్‌ (Tedros Adhanom Ghebreyesus) హెచ్చరించారు. . ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు70 లక్షలను మించడంతో ఆందోళన వ్యక్తం చేసిన సంస్థ ఈ వ్యాఖ్యలు చేసింది. ఐరోపాలో పరిస్థితి మెరుగుపడుతున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి తీవ్రతరం అవుతోందని సంస్థ ఆందోళనతో కూడని హెచ్చరికలు చేసింది.
India Coronavirus: దేశంలో కరోనా కల్లోలం, రికార్డు స్థాయిలో కొత్తగా 9,987 కొత్త కేసులు, 2,66,598కు చేరిన కోవిడ్-19 కేసుల సంఖ్య
Hazarath Reddyదేశంలో కరోనా వైరస్ కల్లోలం (India Coronavirus) కొనసాగుతూనే ఉంది. కేసులు రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. మహారాష్ట్ర ఇప్పటికే చైనాను దాటేసింది. గడచిన 24 గంటల్లో ఇదివరకెన్నడూ లేనంతగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మంగళవారం కొత్తగా 9,987 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 2,66,598కు పెరిగింది.
Global COVID-19 Deaths: ప్రపంచవ్యాప్తంగా 4 లక్షల మందికి పైగా మృతి, 70 లక్షలు దాటేసిన కోవిడ్-19 కేసులు, కేసుల వివరాలను ఇక వెల్లడించమని తెలిపిన బ్రెజిల్
Hazarath Reddyప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు (Global COVID-19) పెరుగుతూనే ఉన్నాయి. లాటిన్‌ అమెరికా, రష్యా భారత్‌లో కేసులు పెరుగుతూ ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా ఆదివారం నాటికి 70 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఆదివారం నాటికి ప్రపంచ వ్యాప్త మృతుల సంఖ్య నాలుగు లక్షలు (Global COVID-19 Deaths) దాటింది. అమెరికాలో మృతులు 1.10 లక్షలకు చేరువ కాగా, యూరప్‌ దేశాల్లో 1.75 లక్షల మందికి పైగా మరణించారు.
COVID-19 Deaths in India: చైనాను దాటేసిన మహారాష్ట్ర, దేశ వ్యాప్తంగా 7 వేలమందికి పైగా మరణం, ఇండియాలో 2,56,611కి చేరుకున్న కోవిడ్-19 కేసుల సంఖ్య
Hazarath Reddyదేశంలో కరోనావైరస్ (Coronavirus Outbreak) తన ప్రతాపాన్ని కొనసాగిస్తోంది. వరుసగా ఆరో రోజూ తొమ్మిది వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 9983 పాజిటివ్‌ కేసులు నమోదవడంతోపాటు, 206 మంది (COVId-9 Deaths in India) మరణించారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 2,56,611కి పెరిగింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1,24,095 మంది బాధితులు కోలుకోగా, మరో 1,25,381 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో ఇప్పటివరకు ఈ ప్రాణాంతక వైరస్‌ వల్ల 7135 మంది మరణించారు.
COVID19 in India: భారత్‌లో 2,36,657 దాటిన కోవిడ్-19 బాధితుల సంఖ్య, దేశవ్యాప్తంగా ఒక్కరోజులోనే 9.887 పాజిటివ్ కేసులు నమోదు, 6,642 కు పెరిగిన కరోనా మరణాలు
Team Latestlyనిన్న దేశవ్యాప్తంగా 4,610 మంది కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,14,072 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 1,15,942 ఆక్టివ్ కేసులు ఉన్నాయని....
Dawood Ibrahim: దావూద్ ఇబ్రాహీంకు కరోనా పాజిటివ్, అతని భార్యకు కూడా కోవిడ్ 19 పాజిటివ్, క్వారంటైన్‌లో దావూద్ పర్సనల్ స్టాఫ్, వార్తలను ఖండిస్తున్న పాక్ ప్రభుత్వం
Hazarath Reddyభారత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు (Underworld Don Dawood Ibrahim) కూడా కోవిడ్ 19 పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దావూద్‌తో పాటు అతని భార్య మెహజబీన్‌కు(His Wife Test Positive) కూడా కరోనా సోకినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం అతని సిబ్బంది, పర్సనల్ స్టాఫ్ మొత్తం క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. దావూద్ ఇబ్రహీం, అతని భార్య పాకిస్తాన్‌లోని కరాచీలో ఓ మిలిటరీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
Coronavirus in India: గత 24 గంటల్లో భారత్‌లో 9,851 కేసులు, దేశంలో మొత్తం 2,26,334 పాజిటివ్‌ కేసులు, ఆందోళన కలిగిస్తున్న మహారాష్ట్ర
Hazarath Reddyభారత్‌లో కోవిడ్ 19 (Coronavirus in India)విశ్వరూపం చూపిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి కేసులు సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మరణాలు కూడా ప్రతి రోజు 200 పైగా సంభవిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే దాదాపు 10 వేల కేసులు ( Coronavirus Cases) వెలుగుచూశాయి. గడిచిన 24 గంటల్లో 9,851 పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా, 273 మంది మృత్యువాత పడ్డారు. ఒకేరోజు ఈ సంఖ్యలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. దీంతో ఇప్పటి వరకు దేశంలో 2,26,770 కరోనా కేసులు నమోదవ్వగా, 6,348 మంది ప్రాణాలు విడిచారు. కరోనా నుంచి కోలుకొని 1,09,462 మంది డిశ్చార్జి అయ్యారు.
Vijay Mallya: లిక్కర్ కింగ్‌ను ఇప్పట్లో ఇండియాకు పంపలేం, విజయ్ మాల్యా న్యాయ ప్రక్రియ పూర్తి కాలేదని తెలిపిన యూకే ప్రభుత్వం
Hazarath Reddyలిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను (Vijay Mallya) భారత్‌కు అప్పగించే విషయంలో యూకే ప్రభుత్వం (UK Govt) ఊహించని మెలిక పెట్టింది. ఇంకా న్యాయ ప్రక్రియ పూర్తి కాలేదనీ.. పెండింగ్‌లో ఉన్న సమస్య పూర్తయ్యే వరకు మాల్యాను భారత్‌కు పంపలేమని బ్రిటిష్ హైకమిషన్ (British High Commission) పేర్కొంది. చట్ట పరమైన నిబంధనల కారణంగా భారతదేశానికి అప్పగించలేమని బ్రిటిష్ హైకమిషన్ ప్రతినిధి వ్యాఖ్యలను ఉటంకిస్తూ సీఎన్‌బీసీ రిపోర్టు చేసింది. యూకే హైకమిషన్ ఈ విషయాన్ని ధృవీకరించిందని కూడా తెలిపింది.
International Flight Operations: జులై నుంచి విదేశాలకు విమాన సర్వీసులు, జూన్ 30 వరకూ నిషేధం అమల్లోకి, దేశంలో పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసులు
Hazarath Reddyకరోనా కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన సుదీర్ఘ లాక్‌డౌన్‌ అనంతరం అంతర్జాతీయ విమాన సర్వీసులు (International Flight Operations) తిరిగి ప్రారంభం కానున్నాయి. జులై నుంచి విదేశాలకు విమాన రాకపోకలు పునరుద్ధరించే అవకాశం ఉందని విమానయాన మంత్రిత్వ శాఖ (Aviation ministry) వర్గాలు వెల్లడించాయి. కాగా రెండు నెలల పాటు దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో నిలచిపోయిన దేశీయ విమాన సర్వీసులను మే 25 నుంచి పునరుద్ధరించిన సంగతి తెలిసిందే.
Gandhi Statue Vandalised: అమెరికాలో మ‌హాత్మా గాంధీ విగ్ర‌హం ధ్వంసం, క్షమాపణలు కోరిన అమెరికా, ఆర్మీని రంగంలోకి దింపుతామని తెలిపిన ట్రంప్
Hazarath Reddyగత కొన్ని రోజులుగా అమెరికా అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. నల్లజాతీయుడి హత్యతో అగ్రరాజ్యంలో ఆందోళనలు (Ongoing Protests in US) మిన్నంటాయి. మిన్నియాపోలీస్‌లో జార్జ్ ఫ్లాయిడ్ అనే ఓ నల్లజాతీయుడిని పోలీసులు హతమార్చడంతో.. అమెరికా అంతటా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ సెగ ఇండియా మహత్ముడికి (Mahatma Gandhi) కూడా తగిలింది. అమెరికాలో ఆందోళ‌న‌కారులు మ‌హాత్మా గాంధీ విగ్ర‌హాన్ని ధ్వంసం (Gandhi Statue Vandalised) చేశారు. వాషింగ్ట‌న్ డీసీలోని ఇండియ‌న్ ఎంబ‌సీలో ఉన్న గాంధీ విగ్ర‌హాన్ని న‌ల్ల‌జాతీయులు ధ్వంసం చేసిన‌ట్లు తెలుస్తోంది. బ్లాక్ లైవ్స్ మ్యాట‌ర్ నిర‌స‌న‌కారులు ఈ విధ్వంసానికి పాల్ప‌డిన‌ట్లు ఓ వార్త సంస్థ పేర్కొన్న‌ది.
Coronavirus in India: ఆరు వేలు దాటిన మృతుల సంఖ్య, దేశంలో కొత్త‌గా 9304 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 2,16,919కి చేరుకున్న కోవిడ్ 19 కేసులు
Hazarath Reddyక‌రోనా వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య భార‌త్‌లో (Coronavirus Deths in India) ఆరు వేలు దాటింది. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 9304 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దేశంలో క‌రోనా వైర‌స్ కేసుల సంఖ్య (Coronavirus Cases in India) 2,16,919కి చేరుకున్న‌ది. గ‌త 24 గంట‌ల్లో 60 మంది మృతిచెందారు. దేశంలో మొత్తం 106737 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 104107 మంది వైర‌స్ బారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మ‌ర‌ణించిన వారి సంఖ్య 6075కు చేరుకున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌మంత్రిత్వ‌శాఖ వెల్ల‌డించింది.
India COVID-19: గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 8909 తాజా కేసులు నమోదు, దేశంలో 2 లక్షల దాటిన కోవిడ్-19 కేసులు, 5815కు చేరిన మరణాల సంఖ్య
Hazarath Reddyభారత్‌లో కరోనా (Coronavirus Cases in India) మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 8909 తాజా కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటివరకూ నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,07,615కు ఎగబాకింది. కరోనా (Coronavirus) మహమ్మారి బారి నుంచి 1,00,303 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రికవరీ రేటు దాదాపు 50 శాతానికి చేరడం సానుకూల పరిణామమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Death of George Floyd: జార్జ్ ఫ్లాయిడ్‌ది నరహత్యే, పోస్టుమార్టం నివేదికలో బహిర్గతం, నిరసనలపై మండిపడిన డొనాల్డ్ ట్రంప్, హత్యను ఖండించిన టెక్ దిగ్గజాలు
Hazarath Reddyజార్జ్ ఫ్లాయిడ్‌ (46) మరణంపై అమెరికా (America) నిరసనలతో ఆందోళనకరంగా మారిన సమయంలో కీలకమైన అధికారిక పోస్ట్‌మార్టం నివేదిక వెలువడింది. అతని మెడపై బలమైన ఒత్తిడి వలనే చనిపోయాడని, ఇది నరహత్య అని మినియాపోలిస్‌లోని(Minneapolis) హెన్నెపిన్ కౌంటీ వైద్యులు నిర్ధారించారు. యుఎస్ పోలీసులు అదుపులో ఉండగా అతడు గుండెపోటుకు గురైనట్లు నివేదిక తెలిపింది. అటు ఫ్లాయిడ్ కుటుంబం ఏర్పాటు చేసిన ప్రైవేట్ పరీక్షల విచారణలోనూ ఇది పోలీసుల హత్యగానే (Death of George Floyd) నిర్ధారణ అయింది.
New Ebola Virus: ఓవైపు కరోనా..మరోవైపు ఎబోలా, కాంగోలో ఎబోలా వైరస్ దెబ్బకు నలుగురు మృతి, 11సార్లు కాంగోలో వ్యాధి విజృంభణ, ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్‌ఓ
Hazarath Reddyకరోనా కల్లోలం (Coronavirus) మరచిపోకముందే ప్రపంచాన్ని మరో వైరస్ గడగడలాడించేందుకు రెడీ అయింది. గతంలో వణికించి వెళ్లిన ఎబోలా వైరస్‌ (New Ebola Virus) మళ్లీ పంజా విసురుతోంది. తాజాగా ఆఫ్రికన్‌ దేశమైన కాంగోలో (Democratic Republic of the Congo) మరోమారు ఎబోలా వైరస్‌ బయటపడింది. దేశంలోని వంగాటా ప్రావిన్స్‌లో ఆరు ఎబోలా కేసులు గుర్తించామని ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇందులో ఆరుగురు మరణించారని, మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారని వెల్లడించింది.
COVID-19 Deaths in India: 24 గంటల్లో 204 మంది మృతి, 5,598కు చేరిన కోవిడ్-19 మరణాలు, దేశంలో 198,706కు పెరిగిన కరోనా కేసులు, 40 వేల మార్కును దాటిన ముంబై
Hazarath Reddyభారత్‌లో కరోనా కేసుల సంఖ్య (Coronavirus in India) రోజురోజూకూ పెరిగిపోతూనే ఉంది. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపుల తర్వాత వైరస్‌ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 8171 తాజా కేసులు (COVID 19 Cases) వెలుగుచూడటంతో మంగళవారం నాటికి మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,98,706కు చేరింది. దేశంలో మొత్తంగా కరోనా బాధితుల సంఖ్య 2లక్షలకు చేరువలో ఉంది. గడచిన 24 గంటల్లో మరో 204 మంది చనిపోవడంతో (COVID-19 Deaths in India) మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,598కు చేరింది.
COVID-19 in India: దేశంలో కరోనా కల్లోలం, ఆసియాలో అగ్రస్థానంలోకి భారత్, దేశ వ్యాప్తంగా 2 లక్షలకు చేరువలో కోవిడ్-19 కేసులు, మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపిన ప్రధాని మోదీ
Hazarath Reddyభారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య (COVID-19 in India) భారీగా పెరిగిపోతోంది. కరోనా కేసుల్లో ఆసియాలో భారత్ అగ్రస్థానంలోకి చేరింది. ప్రభుత్వం ఓ వైపు లాక్‌డౌన్‌ నిబంధనలను (Lockdown Relaxation) మరింతగా సడలిస్తూ పోతుండగా, మరోవైపు అంతే వేగంగా కరోనా మహమ్మారి (Coronavirus) విస్తరిస్తున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8392 పాజిటివ్‌ కేసులు నమోదవగా, ఈ వైరస్‌ ప్రభావంతో 230 మంది మృతిచెందారు. మొత్తంగా దేశంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య (Coronavirus Cases in India) 1,90,535కి పెరిగింది.
India Coronavirus: లాక్‌డౌన్ 5 తప్పదా..? 24 గంటల్లో రికార్డు స్థాయిలో 7,466 కేసులు నమోదు, దేశంలో లక్షా అరవై ఐదు వేలు దాటిన కోవిడ్-19 కేసులు, 4,706 మంది మృతి
Hazarath Reddyభారత్‌లో గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,466 కరోనా కేసులు (India Coronavirus) నమోదు కాగా, 175మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య (Coronavirus Cases in India) 1,65,799కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. కాగా, దేశంలో ఒక్క రోజు వ్యవధిలో ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా నుంచి 71,105 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, 4,706 మంది మృతి (Coronavirus Deaths) చెందారు. ప్రస్తుతం 89,987 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.