తాజా వార్తలు

Tamil Nadu: కర్మ ఫలితం ఎలా ఉంటుందో ఈ వీడియో చూడండి, పిల్లాడిని కొట్టబోయిన ఆటోడ్రైవర్, అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తాపడిన ఆటో, తీవ్ర గాయాలతో..

Hazarath Reddy

తమిళనాడులోని కడయనల్లూర్ లో సైకిల్ పై వెళ్తున్న బాలుడిని కొట్టేందుకు డ్రైవర్ తన చేతితో స్టీరింగ్ మీద నుంచి తీయడానికి ప్రయత్నించినప్పుడు ఒక ఆటోరిక్షా బోల్తా పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సైకిల్ తొక్కుతున్న అబ్బాయిని రిక్షావాలా చెంపదెబ్బ కొట్టేందుకు ప్రయత్నించబోయాడు.

Tamil Nadu: షాకింగ్ వీడియో, పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదని స్టేషన్ ముందే పెట్రోల్ పోసుకుని నిప్పంటిచుకున్న యువకుడు

Hazarath Reddy

చెన్నైలోని RK నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు . ఉత్తర చెన్నైలోని పులియన్‌తోప్ ప్రాంతానికి చెందిన రాజన్‌గా గుర్తించబడిన 30 ఏళ్ల వ్యక్తి జనవరి 20 సాయంత్రం పోలీస్ స్టేషన్ ముందు తనను తాను నిప్పంటించుకున్నాడు.

Kerala Shocker: వీడియో ఇదిగో, మొబైల్ ఫోన్ ఇవ్వకుంటే మీ అంతుచూస్తానంటూ ప్రిన్సిపాల్‌కి విద్యార్థి బెదిరింపులు

Hazarath Reddy

కేరళలోని పాలక్కాడ్‌లోని అనక్కర ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్‌ అండ్ కాలేజీలో జరిగిన షాకింగ్ సంఘటనలో 16 ఏళ్ల విద్యార్థి తన మొబైల్ ఫోన్ లాక్కున్న తర్వాత ఉపాధ్యాయుడిని బెదిరించాడు. క్యాంపస్‌లో మొబైల్ ఫోన్‌ల వినియోగాన్ని నిషేధించే కఠినమైన నిబంధనలు ఉన్నప్పటికీ, 11వ తరగతి విద్యార్థి క్లాస్‌లో దాన్ని ఉపయోగిస్తూ పట్టుబడ్డాడు.

Fire Accident At Shadnagar: షాద్‌ నగర్‌ ఆయిల్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం.. నిల్వ ఉంచిన ట్యాంకర్ పేలడంతో ఘటన, ప్రమాద సమయంలో పరిశ్రమలో 30 మంది కార్మికులు.. వీడియో ఇదిగో

Arun Charagonda

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని రాయికల్ గ్రామ శివారులోని BRS ఆయిల్ మిల్లు పరిశ్రమలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

Advertisement

Tirumala: తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల అప్‌డేట్.. రేపు ఉదయం ఆన్‌లైన్‌లో టోకెన్ల రిలీజ్, పూర్తి వివరాలివే

Arun Charagonda

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల దర్శన టోకెన్లకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. రేపు ఏప్రిల్ నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టోకెన్లు విడుదల కానుందని టీటీడీ అధికారులు వెల్లడించింది.

Janasena: జనసేనకు గుడ్ న్యూస్‌..కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు, గాజు గ్లాస్ చిహ్నాన్ని రిజర్వ్ చేస్తూ పవన్ కళ్యాణ్‌కు లేఖ పంపిన ఈసీ

Arun Charagonda

జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. ఆ పార్టీకి గాజు గ్లాస్ చిహ్నాన్ని రిజర్వ్ చేస్తూ పవన్ కళ్యాణ్‌కు లేఖ పంపింది ఈసీ.

BJP MP Etela Rajender: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై కేసు నమోదు, సెక్యూరిటీ డ్యూటీలో ఉండగా ఈటల రాజేందర్‌ దాడి చేశారంటూ ఫిర్యాదు

Arun Charagonda

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై పోలీస్ కేసు నమోదైంది. గ్యార ఉపేందర్ ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేశారు పోచారం పోలీసులు.

AP CID Ex Chief Sanjay: ఏపీ సీఐడీ మాజీ చీఫ్‌ సంజయ్‌పై క్రమశిక్షణ చర్యలు..ఆదేశించిన సీఎస్ విజయానంద్, అభియోగాలపై వివరణ ఇవ్వాలని ఆదేశం

Arun Charagonda

ఏపీ సీఐడీ మాజీ చీఫ్‌ సంజయ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీఎస్‌ విజయానంద్‌ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

MLA Padmarao Goud: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావుకు గుండెపోటు ..స్టంట్ వేసిన డాక్టర్లు, డెహ్రాడూన్ టూర్‌లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే

Arun Charagonda

సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ కు గుండెపోటు వచ్చింది. మూడు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి డెహ్రాడూన్ టూర్‌కు పద్మారావు గౌడ్ వెళ్లారు.

Gannavaram Airport: గన్నవరం ఎయిర్‌పోర్టులో దట్టమైన పొగ మంచు..పలు విమానాల ఆలస్యం, తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగ మంచు కమ్ముకుంది. పొగ మంచు కారణంగా విమానాల ల్యాండింగ్‌కి అంతరాయం ఏర్పడింది.

CM Revanth Reddy:తెలంగాణలో రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు, దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వంతో డాటా కంట్రోల్ సంస్థ ఎంవోయూ

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన సత్ఫలితాన్నిస్తోంది. తెలంగాణలో రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది ప్రముఖ డాటా సంస్థ CtrlS.

Jeet Adani and Diva Shah Wedding Date: గౌతం అదానీ కొడుకు పెళ్లి తేదీ ఫిక్స్, అత్యంత సాధారణంగా బిలియనీర్ కొడుకు పెళ్లి, దివా షాతో ఏడడుగులు వేయనున్న జీత్ అదానీ

Hazarath Reddy

అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కుమారుడు జీత్ వివాహం వచ్చే నెలలో జరగనుంది. జీత్ అదానీ 7 ఫిబ్రవరి 2025న దివా షాను వివాహం చేసుకోనున్నారు. ఫిబ్రవరి 7న తన కుమారుడి వివాహాన్ని అహ్మదాబాద్‌లో నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఆయన వెంట ఆయన భార్య ప్రీతి అదానీ, కుమారులు కరణ్, జీత్, కోడలు పరిధి, మనవరాలు కావేరి ఉన్నారు.

Advertisement

Priyanka Chopra Visits Chilkur Balaji Temple: వీడియో ఇదిగో, కొత్త ఛాప్టర్ మొదలైంది అంటూ ప్రియాంక చోప్రా పోస్ట్, చిలుకూరు బాలాజీని దర్శించుకున్న ప్రముఖ నటి

Hazarath Reddy

చిలుకూరు బాలాజీ ఆశీస్సులతో కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నట్లు పేర్కొన్నారు. లాస్ ఏంజెలెస్ నుంచి ఆమె కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ వచ్చారు. మహేశ్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కించనున్న చిత్రంలో ప్రియాంక హీరోయిన్‌గా ఎంపికయ్యారని వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్టు కోసమే ఆమె హైదరాబాద్‌లో ఉన్నట్లుగా భావిస్తున్నారు.

Venu Swamy Apologizes: వీడియో ఇదిగో, నన్ను క్షమించండి ఇంకోసారి అలాంటి వ్యాఖ్యలు చేయను, నాగచైతన్య–శోభిత విడాకులు తీసుకుంటారనే జోస్యంపై క్షమాపణలు చెప్పిన వేణుస్వామి

Hazarath Reddy

కొన్ని రోజుల క్రితం అక్కినేని నాగ చైతన్య (Nagachaitanya), శోభిత ధూళిపాల (Shobitha Dhulipalla) వివాహం సందర్భంగా ఓ చానల్‌లో ఈ ఇద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండరు అని, విడాకులు తీసుకుంటారని వేణు స్వామి జోస్యం చెప్పిన విషయం తెలిసిందే.

Turkey Fire: టర్కీలో ఘోర అగ్ని ప్రమాదం, 66 మంది మృతి, మరో 55 మందికి గాయాలు, 12 అంత‌స్తులు ఉన్న గ్రాండ్ క‌ర్తాల్ హోట‌ల్‌లో ఎగసిన మంటలు, వీడియో ఇదిగో

Hazarath Reddy

ట‌ర్కీలోని స్కీయింగ్ రిసార్టు హోట‌ల్‌లో ఘోర అగ్నిప్ర‌మాదం(Hotel Fire) చోటు చేసుకుంది. ఆ ప్ర‌మాదంలో 66 మంది మృతిచెంద‌గా, 51 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. బోలో ప్రావిన్సులో ఉన్న 12 అంత‌స్తులు గల గ్రాండ్ క‌ర్తాల్ హోట‌ల్‌లో తెల్ల‌వారుజామున 3.30 నిమిషాల‌కు ఈ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. హోట‌ల్ మంట‌ల నుంచి త‌ప్పించుకునే క్ర‌మంలో దూకిన ఇద్ద‌రు బాధితులు కూడా మృతిచెందారు

Jana Sena on Deputy CM Issue: డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ మాట్లాడవద్దు, నేతలకు ఆదేశాలు జారీ చేసిన జనసేన కేంద్ర కార్యాలయం

Hazarath Reddy

డిప్యూటీ సీఎం అంశం ఏపీ రాజకీయల్లో పెను ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే ఈ అంశంపై దృష్టి సారించిన టీడీపీ హైకమాండ్ వివాదానికి ముగింపు పలికే విధంగా చర్యలు తీసుకుంది. ఈ అంశంపై ఎవరూ బహిరంగంగా మాట్లాడొద్దని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

APPSC Group 1 Mains Exam Schedule: ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల తేదీలు విడుదల, మే 3 నుంచి 9 వరకు మెయిన్స్‌ నిర్వహణ

Hazarath Reddy

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు మెయిన్స్‌ నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షను డిస్క్రిప్టివ్ టైప్‌లో నిర్వహిస్తామని, ప్రశ్నపత్రాన్ని ట్యాబ్‌ల్లో ఇవ్వాలని నిర్ణయించినట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి తెలిపారు.

Donald Trump 2.0: గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును 'గల్ఫ్ ఆఫ్ అమెరికా'గా మార్చిన డొనాల్డ్ ట్రంప్,అంతర్జాతీయ భద్రత కోసం గ్రీన్‌ల్యాండ్‌ కొనుగోలుకు సరికొత్త వ్యూహం

Hazarath Reddy

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన మొదటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లలో గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును కొత్తగా "గల్ఫ్ ఆఫ్ అమెరికా"గా పేరు మార్చడానికి ఒక ఆర్డర్ ఉంది.ఈసందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యుత్తమ, శక్తిమంతమైన దేశంగా దాని స్థానాన్ని అది పొందిందని తెలిపారు.

Maadhavi Latha VS JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డి నుంచి నన్ను కాపాడండి, సైబరాబాద్ కమిషనరేట్ లో ఫిర్యాదు చేసిన మాధవీలత, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలుగుదేశం పార్టీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ పోలీసులకు సినీ నటి మాధవీలత ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం ఆమె మాట్లాడుతూ.. జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలతో తాను ఎంతో ఆవేదనకు గురయ్యానని చెప్పారు. సినిమా హీరోయిన్లు, మహిళలపై అసభ్యకరంగా మాట్లాడి... ఆ తర్వాత క్షమాపణ చెబితే సరిపోతుందా? అని ప్రశ్నించారు

Mahakumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు, 8 రోజుల్లో దాదాపు 9 కోట్ల మంది పుణ్య స్నానాలు, 45 రోజులపాటు సాగనున్న ఆధ్యాత్మిక వేడుక

Hazarath Reddy

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు (Maha Kumbh) భక్తులు రికార్డు స్థాయిలో వస్తున్నారు. గంగ యమునా సరస్వతీ నదుల కలయిక అయిన త్రివేణీ సంగమంలో స్నానాలు చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి వస్తున్నారు.

Advertisement
Advertisement