తాజా వార్తలు

Aprilia RS 457 Price Hike: ఎప్రిలియా ఆర్ఎస్ 457 బైక్ ధరను రూ. 10 వేలు పెంచిన కంపెనీ, ప్రస్తుతం దీని ధర ఎంతంటే..

Hazarath Reddy

అప్రిలియా ఇండియా RS 457 ధరలను రూ. 10,000 పెంచింది. ప్రారంభంలో రూ. 4.10 లక్షలతో ప్రారంభించబడింది. అప్రిలియా RS 457 ఔత్సాహికులలో పెద్ద విజయాన్ని సాధించింది. పెరిగిన ధర మూడు రంగుల పథకాలకు వర్తిస్తుంది. ఈ మోటార్‌సైకిల్ ధర ఇప్పుడు ₹ 4.20 లక్షలు ఎక్స్-షోరూమ్.

Honda Elevate Black Edition: హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ వచ్చేసింది, ధర రూ. 15.51 లక్షల నుండి ప్రారంభం

Hazarath Reddy

ఆటో ప్రియులను ఆకర్షించే హోండా ఎలివేట్ డార్క్ ఎడిషన్ వేరియంట్‌ల ట్రెండ్ గురించి మేము మీకు చెప్పినట్లు గుర్తుందా? ఒక వారం తర్వాత, హోండా కార్స్ ఇండియా ఎలివేట్ కాంపాక్ట్ SUV యొక్క 'బ్లాక్ ఎడిషన్'ని విడుదల చేసింది.హోండా ఎలివేట్ యొక్క కొత్త స్పెషల్ ఎడిషన్ మోడల్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది:

Makar Sankranti 2025: వీడియో ఇదిగో, పోటీ ఇవ్వకుండానే కోడీ పందెంలో ఓడిపోయిన రత్తయ్య కోడి పుంజు, రెప్పపాటులో రూ. 20 లక్షలు హుష్‌ కాకి

Hazarath Reddy

అయితే ఈ ఏడాది కూడా రత్తయ్య పుంజు బరిలోకి దిగింది. రెప్పపాటులో 20లక్షలు హుష్‌ కాకి అయ్యాయి. పోటీ ఇవ్వకుండానే రత్తయ్య పుంజు కుప్పకూలింది. తాజాగా జరిగిన కోడీ పందెంలో ఓడిపోయింది రత్తయ్య కోడి. కనీస పోటీ ఇవ్వకుండానే కిందపడిపోయిన కోడి..ఈ కోడి పందెం ద్వారా దాదాపు రూ. 20 లక్షలు చేతులు మారాయి.

Delhi Weather: ఢిల్లీలో దట్టమైన పొగమంచు...100కి పైగా విమానాల ఆలస్యం, 7 విమానాలు రద్దు.. పూర్తి వివరాలివే

Arun Charagonda

బుధవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కారణంగా 100కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక 7 విమానాలను రద్దు చేయగా కొన్ని విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Rupee Falls To All-Time Low: డాలర్ ముందు విలవిలలాడుతున్న రూపాయి, మళ్లీ మూడేళ్ల కనిష్ఠానికి పడిపోయిన భారత కరెన్సీ, దేశ ఆర్థిక వ్యవస్థకూ దెబ్బ తప్పదంటున్న విశ్లేషకులు

Hazarath Reddy

డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోయింది. మండే ఒక్కరోజే ఏకంగా 66 పైసలు దిగజారింది. దాదాపు గత రెండేండ్లలో ఈ స్థాయిలో ఎప్పుడూ క్షీణించలేదు. 2023 ఫిబ్రవరి 6న రూపాయి డాలర్‌తో పోలిస్తే 68 పైసలు పతనమైంది.

EPFO ELI Scheme: ఈపీఎఫ్‌ వినియోగదారులకు అలర్ట్‌! నేడే యూఏఎన్ యాక్టివేషన్‌కు చివరి తేదీ...వివరాలివే

Arun Charagonda

ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) యూనివర్సల్ యాక్టివేషన్ నంబర్ (UAN)ని యాక్టివేట్ చేసేందుకు బ్యాంక్ అకౌంట్‌ను ఆధార్‌తో లింక్ (Aadhar Link) చేసే గడువు నేటితో ముగియనుంది.

Makar Sankranti 2025: వీడియో ఇదిగో, మకర సంక్రాంతి వేడుకల్లో ముగ్గురిని పొడిచిన ఎద్దు, యజమాని అదుపుచేయలేకపోవడంతో మనుషుల పైకి దూసుకువచ్చిన ఎద్దు

Hazarath Reddy

కర్నాటకలోని మాండ్యలోని హోసహళ్లిలో మకర సంక్రాంతి వేడుకల సందర్భంగా ఓ ఎద్దు ముగ్గురు వ్యక్తులను నేలకూల్చిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. మకరసంక్రాంతి రోజు సాయంత్రం ఆవులు, ఎద్దులను మండే అగ్నిగుండంపైకి పంపించే సంప్రదాయ ఆచారంలో భాగంగా ఈ సంఘటన జరిగింది.

IND-W vs IRE-W: వైట్ వాష్ లక్ష్యంగా బరిలోకి దిగిన భారత మహిళల క్రికెట్ జట్టు...ఐర్లాండ్‌తో మూడో వన్డే అప్‌డేట్

Arun Charagonda

భారత మహిళల క్రికెట్ జట్టు మరియు ఐర్లాండ్ మహిళల క్రికెట్ జట్టుల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉన్న భారత జట్టు, సిరీస్ చివరి మ్యాచ్‌లో వైట్‌వాష్ లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.

Advertisement

Mark Zuckerberg on AI: సాప్ట్‌వేర్ ఇంజినీర్లకు బిగ్ షాకిచ్చిన మార్క్ జుకర్‌బర్గ్, మిడ్ లెవల్ సాప్ట్‌వేర్ ఇంజినీర్లను AIతో రిప్లేస్ చేస్తామని ప్రకటన

Hazarath Reddy

2025లో మిడ్ లెవల్ సాప్ట్‌వేర్ ఇంజినీర్లను AIతో రిప్లేస్ చేస్తామని తెలిపారు. ప్రస్తుతం మనుషులు చేస్తున్న కాంప్లెక్స్ కోడింగ్ టాస్కులను హ్యాండిల్ చేయగలిగే AI సిస్టమ్స్ ను మెటా సహా పలు టెక్ కంపెనీలు డెవలప్ చేస్తున్నాయి. దీంతో సాప్ట్‌వేర్ ఇంజినీర్లు రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తోంది

Meta Layoffs: 3,600 మంది ఉద్యోగులకు షాకిచ్చిన మార్క్ జుకర్ బర్గ్, 2025 ఆరంభంలోనే ఇంటికి సాగనంపుతున్న టెక్ దిగ్గజం మెటా

Hazarath Reddy

Meta CEO మార్క్ జుకర్‌బర్గ్ 2025లో దాదాపు 3,600 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ధృవీకరించారు. జుకర్‌బర్గ్ 2025 "తీవ్రమైన సంవత్సరం" అని పేర్కొన్నందున ప్రపంచవ్యాప్తంగా అత్యల్ప పనితీరు ఉన్న ఉద్యోగులపై మెటా తొలగింపులు ప్రభావం చూపుతాయి.

ED To Prosecute Kejriwal: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం, లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్‌ ప్రాసిక్యూషన్‌కు ఈడీ అనుమతి

Arun Charagonda

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్‌, మనీష్ సిసోడియా ఈడీ ప్రాసిక్యూషన్‌కు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అమోదం తెలిపింది.

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో అమానుషం..ఆటో డ్రైవర్‌పై యువతి దాడి, సారీ చెప్పినా వినకుండ దాడి చేసిన యువతీ, వీడియో ఇదిగో

Arun Charagonda

Advertisement

Fire Accident At Uttarpradesh: కుంభమేళాకు వెళ్తుండగా అగ్ని ప్రమాదం.. మంటల్లో భైంసా ప్రయాణికుల బస్సు..వృద్దుడు సజీవ దహనం, వీడియో

Arun Charagonda

కుంభమేళాకు వెళ్తుండగా అగ్ని ప్రమాదం జరుగగా మంటల్లో భైంసా ప్రయాణికుల బస్సు దగ్దమైంది.

TikTok: టిక్ టాక్‌కు బిగ్ షాక్...టిక్ టాక్ పై అమెరికాలో నిషేధం?, మస్క్ చేతికి టిక్ టాక్ వెళ్లే అవకాశం!

Arun Charagonda

టిక్ టాక్..ఈ యాప్ గురించి తెలియని వారుండరూ. చైనాకు చెందిన ఈ యాప్‌ను భారత్ సహా చాలా దేశాలు బ్యాన్ చేయగా తాజాగా ఈ జాబితాలో అమెరికా కూడా చేరిపోయింది.

Manchu Manoj: రంగంపేటకు మంచు మనోజ్..జల్లికట్టులో పాల్గొననున్న మనోజ్, మనోజ్ రాకపై అలర్ట్ అయిన పోలీసులు

Arun Charagonda

నేడు రంగంపేటకు వెళ్లనున్నారు హీరో మంచు మనోజ్. జల్లికట్టులో పాల్గొననున్నారు మనోజ్. మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లనుండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు

Warangal: వరంగల్‌లో దొంగల బీభత్సం.. వరుస చోరీలు, కట్టర్లతో తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడ్డ దుండగులు..బాధితుల ఆవేదన

Arun Charagonda

వరంగల్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఏనుమాముల ఇందిరమ్మ కాలనీ, గీసుకొండ, దామెర, బొడ్డు చింతలపల్లి గ్రామాల్లో వరుస చోరీలకు పాల్పడ్డారు.

Advertisement

South Africa: దక్షిణాఫ్రికాలో పెను విషాదం.. బంగారు గనిలో చిక్కుకుని 100 మంది మృతి..ఆకలి, డీహైడ్రేషన్ కారణంగా మృతి చెందొచ్చని అనుమానం

Arun Charagonda

దక్షిణాఫ్రికాలో పెను విషాదం చోటు చేసుకుంది. బంగారు గనిలో చిక్కుకుని సుమారు 100 మంది కార్మికులు మృతి చెందగా నెలల తరబడి అక్రమంగా బంగారం మైనింగ్ జరుగుతోంది.

Justice Sujay Pal:తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సుజయ్ పాల్....బాధ్యతల స్వీకరణ

Arun Charagonda

న్యాయమూర్తి సుజయ్ పాల్ తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

Kanuma 2025 Wishes In Telugu: మీ బంధు మిత్రులకు కనుమ పండగ సందర్భంగా Whatsapp Status, Quotes, Instagram Messages కోసం ఇక్కడ ఉన్న ఫోటో గ్రీటింగ్స్ వాడుకోండి..

sajaya

Kanuma 2025 Wishes In Telugu: కనుమ వేడుక సంక్రాంతి పండుగలో మూడవరోజు ఈ వేడుకను పశువుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తారు. సంవత్సరం అంతా ఆరుగాలం శ్రమించిన రైతుకు బసవన్న అండగా నిలుస్తుంది. అలాంటి బసవన్నలను పూజించే పండగే కనుమ ఈరోజు పశువులను అలంకరించి వాటికి పూజలు నిర్వహిస్తారు కనుమ పండుగ రోజున మినప గారెలు తింటారు.

Makarajyothi Darshan Video: మకరజ్యోతి దర్శనం వీడియో ఇదిగో, పొన్నాంబలమేడు కొండల్లోని కందమల శిఖరంపై దర్శనమిచ్చిన మకరజ్యోతి, స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో మోగిన శబరిమల

Hazarath Reddy

కేరళలోని శబరిమలలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా మకరజ్యోతి దర్శనమిచ్చింది. పొన్నాంబలమేడు కొండల్లోని కందమల శిఖరంపై మకరజ్యోతి కనిపించింది. దీంతో అయ్యప్ప నామస్మరణతో శబరిమల గిరులు మారుమోగాయి. మకరజ్యోతి దర్శనంతో అయ్యప్ప భక్తులు పరవశించిపోయారు

Advertisement
Advertisement