తాజా వార్తలు
Car Crash In USA: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు భారతీయులు మృతి, పూర్తిగా కాలిపోయిన శరీరాలు
Arun Charagondaఅమెరికాలోని టెక్సాస్ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 హైదరాబాదీలు సహా నలుగురు భారతీయులు మృతి చెందారు. మంటల్లో పూర్తిగా శరీరాలు కాలిపోయాయి. ఓరంపాటి ఆర్యన్ రఘునాథ్ (కూకట్పల్లి, హైదరాబాద్),ఫారూక్ షేక్ (BHEL హైదరాబాద్),దర్శిని వాసుదేవన్ (తమిళనాడు), పాలచర్ల లోకేష్ చనిపోయిన వారిలో ఉన్నారు.
Hyderabad Rains : హైదరాబాద్లో అర్థరాత్రి భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం, నీట మునిగిన అపార్టుమెంట్ల సెల్లార్లు
Arun Charagondaభాగ్యనగరం హైదరాబాద్ను మరోసారి వర్షం ముంచెత్తింది. మంగళవారం అర్థరాత్రి నుండి తెల్లారే వరకు వర్షం దంచి కొట్టడంతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు రావడంతో ప్రజలు కంటి మీద కునుకు లేకుండా గడిపారు.
Audi Italy Chief Fabrizio Longo Dies : ట్రెక్కింగ్ చేస్తూ 10 వేల అడుగుల ఎత్తులో నుంచి కింద పడిన ఆడి కార్ల ఇటలీ బాస్ ఫాబ్రిజియో లాంగో, అక్కడికక్కడే మృతి
Vikas Mఇటలీలో ఆడి కార్ల కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఫాబ్రిజియో లాంగో ప్రమాదవశాత్తు పెద్ద లోయలో పడి చనిపోయాడు.62ఏళ్ల ఫాబ్రిజియో వీకెండ్ ట్రెక్కింగ్ కోసం సెప్టెంబర్ 1న ఇటలీ, స్విస్ దేశాల సరిహద్దలో ఉన్న కొండ ప్రాంతానికి వెళ్లాడు. దురదృష్టవశాత్తు అతను ట్రెక్కింగ్ చేసేటప్పుడు 10 వేల అడుగుల ఎత్తైన కొండ నుంచి జారి పడ్డాడు.
Devara Chuttamalle Song: 100 మిలియన్ వ్యూస్తో దూసుకుపోతున్న దేవర చుట్టమల్లె సాంగ్, నాలుగు వారాలుగా మోస్ట్ ట్రెండింగ్ జాబితాలో..
Vikas Mజూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్న దేవర మూవీ రెండు పార్టులుగా తెరకెక్కుతున్న సంగతి విదితమే. దేవర పార్టు 1 సెప్టెంబర్ 27న గ్రాండ్గా విడుదల కానుంది.ఈ సినిమా నుంచి వచ్చిన చుట్టమల్లె పాట విడుదలైన నెలలోపే (29 రోజులు) యూట్యూబ్లో 100 మిలియన్లకుపైగా వ్యూస్తో నంబర్ 1 స్థానంలో ట్రెండింగ్లో నిలిచింది
Ajay Ratra: బీసీసీఐ కొత్త సెలెక్టర్గా అజయ్ రాత్రా, సలీల్ అంకోలా స్థానాన్ని భర్తీ చేయనున్న అజయ్, కీలక విషయాన్ని వెల్లడించిన బీసీసీఐ
Vikas Mభారత క్రికెట్ నియంత్రణ మండలి కొత్త సెలెక్టర్గా అజయ్ రాత్రా(Ajay Ratra) ఎంపికయ్యాడు. ప్రస్తుతం సెలెక్టన్ ప్యానెల్ సభ్యుల్లో ఒకరైన సలీల్ అంకోలా(Salil Ankola) స్థానాన్ని అజయ్ భర్తీ చేయనున్నాడు. ఈ విషయాన్ని మంగళవారం బీసీసీఐ (BCCI) వెల్లడించింది.
Pakistan vs Bangladesh: బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్కు ఘోర పరాభవం, టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన బంగ్లా, దాయాది దేశంపై టెస్టు సిరీస్ గెలవడం ఇదే మొదటిసారి
Vikas Mటెస్టు క్రికెట్లో బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. పాకిస్థాన్తో జరిగిన టెస్టు సిరీస్లో క్లీన్ స్వీప్ చేసింది. రెండో టెస్టులో ఆరు వికెట్ల తేడాతో బంగ్లా విజయం నమోదు చేసింది. అయిదో రోజు టీ బ్రేక్కు ముందే.. బంగ్లా మ్యాచ్ను ముగించేసింది. స్వంత గడ్డపై దాయాది దేశానికి ఘోర పరాభవం ఎదురైంది.పాక్పై బంగ్లాదేశ్ టెస్టు సిరీస్ గెలవడం ఇదే మొదటిసారి.
ICC World Test Championship 2025 Final: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్ తేదీ వచ్చేసింది, తొలిసారి వేదిక కానున్న లార్డ్స్ మైదానం, పూర్తి వివరాలు ఇవే..
Vikas Mప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్ తేదీని, వేదికను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రకటించింది. ఫైనల్ మ్యాచ్ వచ్చే ఏడాది జూన్ 11 నుంచి 15వ తేదీ వరకు లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరుగుతుందని ఐసీసీ తెలిపింది. జూన్ 16ను రిజర్వ్ డేగా ప్రకటించింది.
Telugu States Rains: వరద బాధితులకు రూ. 1 కోటి విరాళం ప్రకటించిన మహేష్ బాబు, ప్రభుత్వాల ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అభ్యర్థన
Vikas Mఇరు తెలుగు రాష్ట్రాలను వరదలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్కు తాను రూ.50 లక్షలు చొప్పున విరాళం ఇస్తున్నట్టు ప్రకటించాడు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు అందించడానికి, వరద ప్రాంతాల పునరుద్ధరణ విషయంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు సమష్టిగా మద్దతు ఇద్దామంటూ మహేశ్ బాబు పిలుపునిచ్చారు.
Bull Attacks Elderly Woman: వీడియో ఇదిగో, వృద్ధురాలిని కొమ్ములతో అమాంతం ఎత్తేసిన ఎద్దు, గాలిలోకి ఎగిరి పల్టీలు కొట్టిన బాధితురాలు
Vikas Mసెప్టెంబరు 2న ఆన్లైన్లో కనిపించిన కలతపెట్టే వీడియోలో, ఒక వృద్ధ మహిళను ఒక భారీ ఎద్దు గాలిలో అనేక మీటర్ల పైకి ఎగరవేయడం కనిపించింది. బలహీనమైన స్త్రీ తన మద్దతు కర్రతో ఇంటి ప్రవేశ ద్వారం వైపు నడుస్తుండగా, ఒక పెద్ద ఎద్దు అదే ద్వారం గుండా ప్రవేశించడానికి ప్రయత్నించింది.
Pakistan Floods: పాకిస్థాన్లో వరదలు, 293 మంది మృతి, 564 మందికి గాయాలు, రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక
Hazarath Reddyపాకిస్థాన్లో గత రెండు నెలల్లో రుతుపవనాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో మొత్తం 293 మంది మృతి చెందగా, 564 మంది గాయపడ్డారని, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలిపింది.
Indian National Jailed in Singapore: మైనర్ బాలికపై లైంగిక వేధింపులు, సింగపూర్లో భారతీయ వ్యక్తికి 14 నెలలు జైలు శిక్ష
Hazarath Reddyసింగపూర్లో తెలిసిన కుటుంబానికి చెందిన టీనేజ్ బాలికపై వేధింపులకు పాల్పడిన కేసులో 52 ఏళ్ల భారతీయ వ్యక్తికి 14 నెలల జైలు శిక్ష పడింది. 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను వేధించినందుకు, నేరస్థుడికి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా, లాఠీ లేదా అటువంటి శిక్షలను ఒకేసారి పొందవచ్చు
France Shocker: భర్త దారుణం, భార్యకు మత్తు ఇచ్చి 71 మంది మగాళ్ల చేత 92 సార్లు అత్యాచారం, అంతే కాకుండా కసిగా వారిని బూతు పదాలతో రెచ్చగొడుతూ వీడియోలు తీస్తూ పైశాచికానందం
Hazarath Reddyఫ్రాన్స్ కు చెందిన 71 ఏళ్ల వ్యక్తి తన భార్యకు మత్తుమందు ఇచ్చి పదేళ్లుగా అపరిచిత వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడేలా చేశారని ఆరోపణలు వచ్చాయి. భర్త తన భార్య సాయంత్రం భోజనం లేదా వైన్లో నిద్ర మాత్రలు, యాంటి యాంగ్జైటీ మందులను చూర్ణం చేసి ఆమెను అపస్మారక స్థితికి చేర్చేవాడు.
Kadapa Fire Video: వీడియో ఇదిగో, కడపలో ట్రాన్స్ ఫార్మర్ పేలి 4 ద్విచక్ర వాహనాలు దగ్ధం, సిటీ యూనియన్ బ్యాంక్ పక్కన ఒక్కసారిగా పేలుడు
Hazarath Reddyఏపీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కడపలో ట్రాన్స్ ఫార్మర్ పేలి 4 ద్విచక్ర వాహనాలు దగ్ధం అయ్యాయి. కడప కోఆపరేటివ్ కాలనీలో సిటీ యూనియన్ బ్యాంక్ పక్కన ట్రాన్స్ఫార్మర్ ఒక్కసారిగా పేలింది. పేలిన వెంటనే మంటలు అక్కడున్న బైకులకు అంటుకున్నాయి.
Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు, రాష్ట్ర విద్యా కమిషన్ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు, ఔటర్ రింగ్ రోడ్డులోని 51 గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేస్తు ఆర్డినెన్స్
Hazarath Reddyరాష్ట్ర విద్యా కమిషన్ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్, ముగ్గురు సభ్యులతో ప్రభుత్వం విద్యా కమిషన్ను ఏర్పాటు చేయనుంది. ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీలో ఈ కమిషన్ కీలక పాత్ర పోషించనుంది.
Vijayawada Floods: విజయవాడలో బాహుబలి ఘటన, పీకల్లోతు నీళ్ళలో చంటిబిడ్డను పెట్టెలో పెట్టుకొని తీసుకెళ్తున్న వరద బాధితులు
Hazarath Reddyవిజయవాడ లో చంటిబిడ్డను పెట్టెలో పెట్టుకొని వరద బాధితులు తీసుకెళ్తోంది. పీకల్లోతు నీళ్ళు ఉండటం తో బిడ్డను కాపాడుకునేందుకు సింగ్ నగర్ వాసులు ఇలా మోసుకెళ్ళారు.
CM Chandrababu: వీడియో ఇదిగో, నా పట్ల ప్రజల స్పందన చూసి ప్రధాని ఆశ్చర్యపోయారు, మీరున్నారు కదా ఏపీ ప్రజలకు భయం లేదని మోదీ చెప్పారని తెలిపిన సీఎం చంద్రబాబు
Hazarath Reddyచంద్రబాబు మాట్లాడుతూ..ప్రధాని మోదీతో మాట్లాడినప్పుడు మీరున్నారు కదా.. భయం లేదని చెప్పారు. హుద్హుద్ సమయంలో నా పనితీరును ఆయన మెచ్చుకున్నారు. నా పట్ల ప్రజల స్పందన చూసి ప్రధాని ఆశ్చర్యపోయారు’’ అని చంద్రబాబు అన్నారు.
Telangana Rains: వీడియో ఇదిగో, వాగులో కొట్టుకుని పోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు, చేపలు పట్టేందుకు వెళ్లి చిక్కుకుపోయిన బాధితుడు
Hazarath Reddyమెదక్ జిల్లాలో వాగులో కొట్టుకుని పోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు. టేక్మాల్ మండలం గుండు వాగులో ఘటన చోటు చేసుకుంది.చేపలు పట్టేందుకు గుండు వాగు బ్రిడ్జి పైకి వెళ్లిన కల్లూరుకు చెందిన రమావత్ నందు (45) ప్రవాహం ఎక్కువ కావడంతో నీటిలో కొట్టుకుపోతున్నాడు. వెంటనే స్పందించిన పోలీసులు తాళ్ల సాయంతో అతన్ని కాపాడారు.
Andhra Pradesh Floods: ఈ ఆపదలో గుడ్లవల్లేరు ఘటనపై ఫోకస్ చేస్తారా, కుట్రలు జరుగుతున్నాయంటూ మండిపడిన ఏపీ సీఎం చంద్రబాబు, ప్రభుత్వం తరఫున చేయాల్సిందంతా చేస్తామని వెల్లడి
Hazarath Reddyవరద ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. అనంతరం విజయవాడ కలెక్టరేట్ వద్ద చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. వరద బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలూ చేపట్టామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు
Telugu States Floods: తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు రూ. కోటి విరాళం ప్రకటించిన ఎమ్మెల్యే బాలకృష్ణ, ఇంకా ఏమన్నారంటే..
Hazarath Reddyఎమ్మెల్యే బాలకృష్ణ (Nandamuri Balakrishna) సైతం భారీ విరాళం ప్రకటించారు. వరద బాధితుల సహాయార్థం తన వంతు సాయంగా ఒక్కో రాష్ట్రానికి రూ.50 లక్షలు చొప్పున మొత్తం రూ.కోటి విరాళంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
Andhra Pradesh Floods: వరద బాధితులకు కోటి రూపాయలు విరాళం ప్రకటించిన జగన్, ఎలా ఇవ్వాలనేది చర్చించి నిర్ణయం తీసుకుందామని పార్టీ నేతలతో తెలిపిన వైసీపీ అధినేత
Hazarath Reddyవైసీపీ అధ్యక్షుడు జగన్ ఇవాళ పార్టీ సీనియర్ నేతలు, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నేతలతో తాడేపల్లిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ వరద బాధితులకు రూ.1 కోటి సాయం ప్రకటించారు. ఈ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, కారుమూరి, కురసాల కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.