తాజా వార్తలు

Mahindra Classic BSA Goldstar 650: మోటార్ సైకిల్స్ రంగంలోకి మ‌హీంద్రా కంపెనీ, ఆగ‌స్ట్ 15న తొలి బైక్ ను మార్కెట్లోకి తెస్తున్న మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా

VNS

మినీ ట్రక్కులు.. ట్రాక్టర్లు, కార్ల తయారీలో పేరొందిన దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం ‘మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra)’ తాజాగా మోటారు సైకిల్ ను దేశీయ మార్కెట్లోకి తీసుకొస్తోంది. బర్మింగ్ హాం స్మాల్ ఆర్మ్స్ (బీఎస్ఏ) బ్రాండ్ మద్దతుతో క్లాసిక్ లెజెండ్స్, వింటేజ్ మోటారు సైకిల్స్‌లతో భాగస్వామ్య ఒప్పందం కల మహీంద్రా అండ్ మహీంద్రా ఈ మోటారు సైకిల్ తీసుకొస్తున్నది.

Ola To Join Quick Commerce Business: జెప్టోకు పోటీగా స‌ర్వీసులు ప్రారంభించ‌నున్న ఓలా, త్వ‌రలోనే క్విక్ డెలివ‌రీ స‌ర్వీస్ లోకి రంగ ప్ర‌వేశం చేయ‌నున్నట్లు స‌మాచారం

VNS

క్విక్ కామర్స్ (Quick Commerce) రంగంలో బ్లింకిట్ (Blinkit), జెప్టో (Zepto) సంస్థలతో పోటీ పడేందుకు ఓలా సిద్ధమవుతున్నది. మరో దఫా క్విక్ కామర్స్ (Quick Commerce) రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నదని ఓ ఆంగ్ల దినపత్రికలో వార్తా కథనం ప్రచురితమైంది.

Suma in Real Estate Fraud: రియ‌ల్ ఎస్టేట్ ఫ్రాడ్ లో యాంక‌ర్ సుమ క‌న‌కాల‌, సోష‌ల్ మీడియాలో క్లారిటీ ఇచ్చిన స్టార్ యాంక‌ర్

VNS

టాలీవుడ్ బుల్లితెరపై టాప్‌ యాంకర్‌ ఎవరు అంటే.. సుమ కనకాల (Suma Kanakala) అని ఠక్కున చెప్పేస్తారు ఎవరైనా.. ఆమె మాటలో చమత్కారం, స్పాంటేనియస్‌ అందర్ని ఆకట్టుకుంటాయి. ఎలాంటి ఫంక్షన్‌నైనా తన ప్రతిభతో రక్తికట్టిస్తుంది.

PAK New Coach: పాకిస్థాన్ కొత్త కోచ్ గా ఆస్ట్రేలియ‌న్ సీనియ‌ర్ ఆట‌గాడు, బంగ్లాదేశ్ తో టెస్టు ముందు కీల‌క నిర్ణ‌యం

VNS

పాకిస్తాన్‌ టెస్ట్‌ జట్టు హై పెర్ఫార్మెన్స్‌ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ కోచ్‌ టిమ్‌ నీల్సన్‌ (Tim Nielsen) నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు అధికారికంగా ప్రకటించింది. నీల్సన్‌ పేరును పాక్‌ టెస్ట్‌ జట్టు హెడ్‌ కోచ్‌ జేసన్‌ గిలెస్పీ ప్రతిపాదించాడు. గిలెస్సీ, నీల్సన్‌ కలిసి గతంలో సౌత్‌ ఆస్ట్రేలియా క్రికెట్‌ అకాడమీలో పని చేశారు

Advertisement

Indian Foreign Ministry Statement: బంగ్లాదేశ్ పౌరుల‌కే మొద‌టి ప్రాధాన్యం, కీల‌క స్టేట్ మెంట్ ఇచ్చిన భార‌త విదేశాంగ శాఖ‌

VNS

బంగ్లాదేశ్‌ కొనసాగుతున్న హింసాకాండ మధ్య భారత విదేశాంగశాఖ (Indian Foreign Ministry) కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్‌కు సంబంధించినంత వరకు బంగ్లాదేశ్‌ పౌరుల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తుందని విదేశాంగ స్పష్టం చేసింది. శాంతిభద్రతల పునరుద్ధరణ కోసం ఆశిస్తున్నామని పేర్కొంది.

Megastar Chiranjeevi: కేరళ సీఎం పినరయి విజయన్‌తో మెగాస్టార్ చిరంజీవి భేటీ, కేరళ వరద బాధితులకు సాయంగా రూ. కోటి చెక్ అందజేత

Arun Charagonda

కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తనవంతు సాయంగా రూ. కోటి విరాళాన్ని ప్రకటించారు చిరంజీవి, రామ్ చరణ్. ఈ నేపథ్యంలో స్వయంగా చెక్‌ను అందజేసేందుకు కేరళకు వచ్చారు చిరంజీవి. ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ను కలిశారు. అనంతరం ఆయనతో ముచ్చటించి కోటి రూపాయల చెక్ ను అందజేశారు.

Pawan Kalyan: స్మగ్లింగ్ చేసే వారిని హీరోలుగా చూపిస్తున్నారు..?, పవన్ కామెంట్స్ బన్నీని ఉద్దేశించినవేనా?

Arun Charagonda

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ కర్ణాటకలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కర్ణాటక పర్యటన సందర్భంగా ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్యతో పాటు అటవీ శాఖ మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్.

Kancheepuram: ఇదేం చోద్యం, దేవాలయం హోర్డింగ్‌లో పోర్న్ స్టార్ మియా ఖలీఫా ఫొటో, తమిళనాడులో మండిపడుతున్న భక్తులు

Hazarath Reddy

తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఒక పండగ కోసం ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లో పోర్న్ స్టార్ మియా ఖలీఫా ఫొటో కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ఆలయాల్లో పార్వతి దేవతను పూజించే 'ఆడి' పండుగ జరుగుతుంది. ఈ క్రమంలో వేడుకల్లో హోర్డింగ్‌లను కూడా ఏర్పాటుచేశారు.

Advertisement

Vinesh Phogat: పతకంపై ఆశలు, గుడ్ న్యూస్ చెప్పిన సీఏఎస్‌ కోర్టు, పతకం పొందేందుకు అర్హురాలని కామెంట్

Arun Charagonda

పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరి వినేశ్ ఫోగాట్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందని ఒలింపిక్స్‌ నుండి వైదొలగగా ప్రతి ఒక్కరిని ఈ నిర్ణయం నిరాశ పర్చింది.

Zika Virus in Pune: పూణేలో జికా వైరస్ కలవరం, ఒక్కరోజే కొత్తగా 7 కేసులు నమోదు, 73కు పెరిగిన మొత్తం జికా వైరస్ కేసులు, అలర్ట్ అయిన వైద్యశాఖ అధికారులు

Hazarath Reddy

మహారాష్ట్రలోనిని పూణేలో జికా వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈరోజు కొత్తగా మరో ఏడు కేసులు నమోదయ్యాయి. దీంతో పుణేలో కేసుల సంఖ్య 73కు చేరుకున్నాయి. నివేదికల ప్రకారం... ఇప్పటి వరకు నలుగురు మరణించారు.

Pawan Kalyan on Movies: వీడియో ఇదిగో, ఇప్పుడు స్మగ్లింగ్ చేయడమే హీరోయిజం అయ్యింది, టాలీవుడ్ సినిమా హీరోలపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, ఆ హీరోని టార్గెట్ చేశారా..

Vikas M

సినిమా హీరోలపై ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు సినిమాల్లో హీరో అడవులను కాపాడేవాడని.. ఇప్పుడు స్మగ్లింగ్ చేయడమే హీరోయిజం అయ్యిందని వ్యాఖ్యానించారు. బెంగళూరు పర్యటనలో ఉన్న ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘40 ఏళ్ల క్రితం సినిమాల్లో హీరో అడవులను కాపాడేవాడు. కానీ ఇప్పుడు హీరోనే అడవులను నరికి స్మగ్లింగ్‌ చేస్తున్నాడు.

Fahadh Faasil in ‘Pushpa 2–The Rule’: పుష్ప‌-2 నుంచి అదిరిపోయే అప్‌డేట్, మాస్ లుక్‌లో అదరగొట్టిన ఫహాద్ ఫాజిల్

Vikas M

టాలీవుడ్ డైరెక్ట‌ర్‌ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ న‌టిస్తున్న పుష్ప‌-2 నుంచి తాజాగా మేక‌ర్స్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీలో ప్ర‌తినాయ‌కుడిగా న‌టిస్తున్న మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు.

Advertisement

Raj Tarun Gets Anticipatory Bail: రాజ్ త‌రుణ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు, పెళ్లి జరిగినట్లు ఆధారాలు లేవని తెలిపిన తెలంగాణ‌ హైకోర్టు

Vikas M

టాలీవుడ్ న‌టుడు రాజ్ త‌రుణ్‌కు హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. అతడికి తెలంగాణ‌ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. త‌న‌ను మోసం చేశాడు అంటూ లావ‌ణ్య అనే యువ‌తి రాజ్ త‌రుణ్‌పై నార్సింగి పోలీస్ స్టేష‌న్‌లో కేసు పెట్టిన విష‌యం తెలిసిందే.లావణ్యతో రాజ్ తరుణ్‌కు పెళ్లి జరిగినట్లు ఆధారాలు లేక పోవడంతో బెయిలిచ్చింది

Rohit Sharma: విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ రికార్డును సమం చేసిన రోహిత్‌ శర్మ, ఇంతకీ ఏ రికార్డో తెలుసా ?

Vikas M

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ... క్రిస్‌ గేల్‌ రికార్డును సమం చేశాడు. వన్డేల్లో అత్యధిక​ సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో గేల్‌, రోహిత్‌ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. వన్డేల్లో ఈ ఇద్దరు చెరో 331 సిక్సర్లు బాదారు. ఈ జాబితాలో పాక్‌ మాజీ ఆటగాడు షాహిద్‌ అఫ్రిది (351) టాప్‌లో ఉన్నాడు. రోహిత్‌ తర్వాతి స్థానంలో జోస్‌ బట్లర్‌ ఉన్నాడు

RBI On UPI Payments: ఇకపై యూపీఐ పేమెంట్స్ రూ.5 లక్షలు,యథాతథంగా రెపో రేటు, కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ

Arun Charagonda

ద్రవ్య పరమతి విధాన సమీక్షలో భాగంగా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కీలక రేపో రేటును 6.5% వద్దనే యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు రోజుకు యూపీఐ పేమెంట్స్ లిమిట్ రూ.1 లక్ష మాత్రమే ఉండగా దానిని రూ. 5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, విద్యార్థినులతో ఇంగ్లీష్ టీచర్ అసభ్యకర ప్రవర్తన, చెప్పులతో చితకబాదిన తల్లితండ్రులు

Hazarath Reddy

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి మోడల్ స్కూల్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పాఠాలు చెప్పాల్సిన మాస్టర్ అడ్డదారి తొక్కాడు. స్కూలులో పనిచేసే ఇంగ్లీష్ టీచర్ విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై మండిపడిన తల్లిదండ్రులు అతగాడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. చెప్పులతో ఎడాపెడా వాయించి పడేశారు.

Advertisement

Bihar Shocker: వీడియో ఇదిగో, యూట్యూబ్‌లో చూసి బాంబులు తయారు చేసిన పిల్లలు, ఒక్కసారిగా అవి పేలడంతో గాయాలపాలై ఆస్పత్రిపాలు..

Hazarath Reddy

బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని గైఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్నీ బాంగ్రా కళ్యాణ్ గ్రామంలో యూట్యూబ్ వీడియోను చూసి బాంబు తయారీకి ప్రయత్నించిన ఐదుగురు చిన్నారులు గాయపడిన దారుణ ఘటన చోటుచేసుకుంది

Ola: క్విక్‌ కామర్స్‌ వ్యాపారంలోకి మళ్లీ ఓలా రీ ఎంట్రీ, డార్క్‌స్టోర్స్‌ ఏర్పాట్లు చేసుకునే పనిలో పడిన రైడ్ దిగ్గజం, ఈ సంస్థలకు గట్టి పోటీనిచ్చే అవకాశం

Vikas M

గతంలో క్విక్‌ కామర్స్‌ (quick commerce) విభాగంలో అడుగపెట్టి అర్ధంతరంగా వైదొలగిన ఓలా తాజాగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతోంది. మరోసారి రీఎంట్రీ ఇచ్చేందుకు సమాయత్తం అవుతోంది. ఇందుకోసం సొంతంగా డార్క్‌ స్టోర్లను (చిన్నపాటి గోదాములు) ఏర్పాటు చేయాలని ఓలా మాతృ సంస్థ ఏఎన్‌ఐ టెక్నాలజీస్‌ భావిస్తున్నట్లు సమాచారం.

Waqf (Amendment) Bill 2024: వక్ఫ్‌ బిల్లుపై వెనక్కి తగ్గిన కేంద్రం, విస్తృత పరిశీలన కోసం జాయింట్‌ పార్లమెంటరీ కమిటీకి పంపించనున్నట్లు ప్రకటన, వక్ఫ్‌ సవరణ బిల్లులో ఏముంది, ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి ?

Hazarath Reddy

ఈరోజు జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర మైనారిటీ వ్యవహారాలమంత్రి కిరెన్ రిజిజు వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఉన్న వక్ఫ్ చట్టం, 1995 (2013లో సవరించిన విధంగా) కు దాదాపు 40 సవరణలు తీసుకురావాలని ప్రతిపాదించింది

Andhra Pradesh Rain Update: ఏపీకి మరో మూడు రోజులు అలర్ట్, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక, దంచికొడుతున్న వానలు

Hazarath Reddy

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ, తమిళనాడు పరిసరాలపై ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాలపై విస్తరించి ఉన్న మరో ద్రోణి వచ్చే 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement
Advertisement