India

Andhra Pradesh: వీడియో ఇదిగో, డ్యూటీ సమయంలో ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగి, కంప్యూటర్లు పని చేయడం లేదంటూ సేవలు నిలిపివేత

Team Latestly

కాకినాడ జిల్లాలోని తాళ్లరేవు మండలంలోని ఒక పోస్టాఫీసులో duty సమయంలో ఉద్యోగి ప్రవర్తనపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ సేవలు పొందడానికి వచ్చిన ప్రజలు గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోందని, కంప్యూటర్లు పనిచేయడం లేదనే పేరుతో సేవలను నిలిపివేసి ఉద్యోగి మొబైల్ ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ గడుపుతున్నాడని ఆరోపణలు వ్యక్తమయ్యాయి.

Hyderabad: హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన సోనోకో, ఈబీజీ గ్రూప్, ఫైనాన్స్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటు చేయనున్న సోనోకో, ఈబీజీ పవర్‌హౌస్‌పై రెండేళ్లలో భారీ పెట్టుబడికి ప్రణాళిక

Team Latestly

హైదరాబాద్‌ అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా వేగంగా ఎదుగుతున్న నేపథ్యంలో.. మరో రెండు ప్రముఖ గ్లోబల్ సంస్థలు నగరంలో తమ కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించాయి. అమెరికాకు చెందిన సొనోకో ప్రోడక్ట్స్‌, జర్మన్‌ బహుళ రంగ సంస్థ ఈబీజీ గ్రూప్‌ తమ కొత్త కేంద్రాలను హైదరాబాద్‌లో స్థాపించడం, నగర వ్యాపార వాతావరణానికి మరొక కీలక గుర్తింపుగా నిలిచింది.

Egg Price Hike: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన కోడిగుడ్ల ధరలు, సామాన్యులు కొనలేక విలవిల, జనవరి వరకు ఇదే పెరుగుదల ఉంటుందని చెబుతున్న మార్కెట్ వర్గాలు

Team Latestly

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కోడిగుడ్ల ధరలు సాధారణ ప్రజలు ఊహించని విధంగా పెరిగిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా నమోదు అవుతున్న ఈ పెరుగుదల రిటైల్ నుండి హోల్‌సేల్ మార్కెట్ల వరకు అన్ని స్థాయిల్లో ప్రభావం చూపిస్తోంది. ఒక్కో గుడ్డు ధర రిటైల్ అవుట్‌లెట్లలో ఏడు రూపాయలను దాటిపోవడం వినియోగదారులకు గట్టి భారం అయింది.

YS Jagan: అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన వైఎస్ జగన్, నిమిషాల వ్యవధిలోనే ముగిసిన విచారణ, అనంతరం సీబీఐ కోర్టు నుంచి లోటస్ పాండ్ కు చేరుకున్న జగన్

Team Latestly

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గురువారం హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టులో ప్రత్యక్షంగా హాజరయ్యారు. కోర్టు ఆవరణలోకి ప్రవేశించిన తర్వాత ఆయన కొద్ది సేపు వెయిటింగ్ రూంలో వేచిచూశారు.

Advertisement

Patna Shocker: షాకింగ్ వీడియో ఇదిగో, పాట్నాలో గర్భిణీ స్త్రీని స్కూటర్‌తో లాక్కెళ్లిన పోలీసు, కారణం ఏంటంటే..

Hazarath Reddy

పాట్నాలోని మెరైన్ డ్రైవ్ నుండి వచ్చిన ఒక షాకింగ్ వీడియోలో, రోడ్డు తప్పు వైపుకు ప్రవేశించడంపై ట్రాఫిక్ వివాదం తర్వాత ఒక పోలీసు.. గర్భిణీ స్త్రీని తన స్కూటర్‌తో లాగుతున్న దృశ్యాలు ఉన్నాయి. ఆ మహిళ దాదాపు 20 మీటర్ల దూరం స్కూటర్‌ను అంటిపెట్టుకుని ఉండి పడిపోవడంతో గాయాల పాలైంది,

Passenger Falls from Train: వీడియో ఇదిగో, రన్నింగ్ ట్రైన్ దిగుతూ కిందపడ్డ ప్రయాణికుడు, త్రుటిలో తప్పిన ప్రాణాపాయం, కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఘటన

Team Latestly

హైదరాబాద్‌ కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఓ ప్రమాదం తృటిలో తప్పింది. కదులుతున్న రైలు పూర్తిగా ఆగకముందే ప్లాట్‌ఫాంపైకి దిగేందుకు ప్రయత్నించిన ఒక ప్రయాణికుడు అదుపు తప్పి రైల్వే ట్రాక్‌ వైపు జారిపోయాడు.

Health Tips: ఎప్పుడూ ఎనర్జీగా ఉండాలా? అయితే ఈ 5 జ్యూస్‌లు మీ డైలీ దినచర్యలో తప్పక చేర్చుకోండి

Team Latestly

ఆరోగ్యంగా ఉండాలని ఎవరు కోరుకోరు. ప్రతి ఒక్కరూ జీవితాంతం వ్యాధుల నుండి విముక్తి పొందాలని కోరుకుంటారు. ఆరోగ్యంగా ఉండటానికి ఒకే ఒక రహస్యం ఉంది. అది ఆరోగ్యకరమైన జీవనశైలి. మీ జీవనశైలి ఆహారపు అలవాట్లు ఆరోగ్యంగా ఉంటే మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు.

Tragedy at Bus Stop: వీడియో ఇదిగో, బస్టాండులో ప్రయాణికుల మీదకి దూసుకెళ్లిన బస్సు, నాలుగేళ్ల బాలుడు మృతి, పలువురికి గాయాలు, నాసిక్ ప్రాంతంలోని సిన్నార్ బస్టాండులో ఘటన

Team Latestly

మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతం సిన్నార్ బస్టాండులో ఘోర విషాదం చోటుచేసుకుంది. బస్టాండ్‌లోని ప్లాట్‌ఫామ్‌పై నిల్చొని బస్సు కోసం వేచిచూస్తున్న ప్రయాణికులపైకి ఒక బస్సు అకస్మాత్తుగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

Advertisement

Telangana: దారుణం.. కారుకు సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్‌ను ఎలా కొడుతున్నాడో వీడియోలో చూడండి, సైడ్ ఇవ్వకపోతే కొడతావా అంటూ నిలదీసిన ప్రయాణికులు

Team Latestly

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్ రేజ్ ఘటన మరోసారి సంచలనం సృష్టించింది. ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామం సమీపంలో జరిగిన ఈ సంఘటనలో, తన కారుకు సైడ్ ఇవ్వలేదన్న కారణంతో ఒక వ్యక్తి ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దారుణంగా దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బస్సులో ప్రయాణిస్తోన్న పలువురు ఈ దృశ్యాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు.

U19 World Cup Schedule Out: అండర్-19 ప్రపంచకప్ 2026 షెడ్యూల్ వచ్చేసింది, తొలి మ్యాచ్‌లో అమెరికాతో టీమిండియా ఫైట్, ఫిబ్రవరి 6న హరారే వేదికగా ఫైనల్, పూర్తి షెడ్యూల్ ఇదిగో..

Team Latestly

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) 2026 అండర్–19 పురుషుల క్రికెట్ ప్రపంచకప్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ ప్రతిష్టాత్మక యువజట్ల టోర్నమెంట్‌కు ఆఫ్రికా ఖండంలోని జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్త ఆతిథ్యాన్ని వహించనున్నాయి.

Tirumala Update: డిసెంబర్ 30 నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం, సామాన్యులకే పెద్దపీట వేయనున్న టీటీడీ, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు

Team Latestly

తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్తను ప్రకటించింది. ప్రతి ఏడాదిలా ఈసారి కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనాలను భక్తులకు కల్పించనున్నట్లు టీటీడీ అధికారికంగా ప్రకటించింది. ఈ సంవత్సరం వైకుంఠ ద్వార దర్శనాలు డిసెంబర్ 30వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి.

NBK111: బాలకృష్ణ 111వ సినిమాలో హీరోయిన్‌గా నయనతార, అధికారికంగా ప్రకటించిన చిత్ర యూనిట్, నవంబర్‌లో ఈ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించే అవకాశం

Team Latestly

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న చిత్రం NBK111 నుంచి సినీ అభిమానులను ఉర్రూతలూగించే అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమాలో కథానాయికగా లేడీ సూపర్‌స్టార్ నయనతార నటిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

Advertisement

Bihar Election EVM Controversy: ఈవీఎంలలో ముందే 25 వేల ఓట్లు పడ్డాయని ఆర్జేడీ నేత ఆరోపణ,స్పందించిన ఎన్నికల సంఘం, ఈవీఎంను ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని తేల్చిన ఈసీ

Team Latestly

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌కు ముందే ఈవీఎంలలో 25 వేల ఓట్ల చొప్పున ఓట్లు పడ్డాయంటూ ఆర్జేడీ సీనియర్ నేత జగదానంద సింగ్ చేసిన ఆరోపణలను ఎన్నికల సంఘం (ECI) ఖండిస్తున్నట్లు తెలిపింది. బీహార్ తీర్పు ప్రజల అభీష్టాన్ని ప్రతిబింబించలేదని, ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని, అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉందని ఆర్జేడీ సోమవారం పేర్కొంది

Meerut Tragedy Caught on Camera: షాకింగ్ వీడియో ఇదిగో, ఎద్దుల బండి పక్కన నడుస్తున్న మహిళకు చేదు అనుభవం, గోడ మధ్యలో ఇరుక్కుని తిరిగిరాని లోకాలకు..

Team Latestly

ఆదివారం మీరట్‌లోని రోటా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగిన ఎద్దుల బండి ప్రమాదంలో కమలేష్ అనే 55 ఏళ్ల మహిళ మరణించింది, ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కమలేష్ తన పొలంలో చెరకు కోసి ఇంటికి తిరిగి వస్తుండగా కినౌని గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది.

Weather Update: తెలంగాణలో చలిపులి పంజా, గజగజ వణుకుతున్న హైదరాబాద్, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనిష్ఠ స్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రతలు, రాష్ట్రమంతటికీ ఎల్లో అలర్ట్‌ జారీ

Team Latestly

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలిపులి తన పంజా విసురుతోంది. రాజధాని హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా భారీగా పడిపోయాయి. దీని ఫలితంగా రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు.

Health Tips: రాత్రి పడుకునే ముందు...ఈ 7 ఆహారాలు, పానీయాలు అసలు ముట్టుకోవద్దు, మీ రాత్రి భోజనం మెనూను ఒకసారి చెక్ చేసుకోవాల్సిన సమయం ఇదే..

Team Latestly

కొన్ని ఆహారాలు, పానీయాలు ఎంత రుచికరంగా లేదా ఆరోగ్యకరంగా అనిపించినా, వాటిని రాత్రిపూట, ముఖ్యంగా పడుకోవడానికి ముందు తీసుకోవడం ఏ మాత్రం మంచిది కాదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ అలవాట్లు మీ జీర్ణవ్యవస్థపై భారం వేయడమే కాక, మీ గాఢ నిద్ర (Deep Sleep)కు కూడా తీవ్ర అంతరాయం కలిగిస్తాయి

Advertisement

Lemon Tea Benefits: రోజూ లెమన్ టీ తాగేవారు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు, ఈ పదార్థాలతో కలిసి తాగితే ప్రమాదమే, ఈ ఆహార పదార్థాలను తాగే సమయంలో దూరంగా ఉంచండి

Team Latestly

లెమన్ టీని ప్రతిరోజూ తాగే వాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఉదయం లేచిన వెంటనే ఒక వేడి నిమ్మ టీ తాగితే శరీరానికి తేలికపాటిగా అనిపించడం, జీర్ణక్రియను మెరుగుపర్చడం, బరువు తగ్గడంలో సహకరించడం వంటి అనేక ప్రయోజనాలుంటాయి.

Saudi Arabia Bus Accident: సౌదీ అరేబియా ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి, భారత యాత్రికుల బస్సును ఢీకొట్టిన డీజిల్ ట్యాంకర్, 45 మంది సజీవ దహనం

Team Latestly

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత యాత్రికులతో వెళుతున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో అందరూ నిద్రలో ఉండటంతో 45 మంది సజీవ దహనమయ్యారు.

Saudi Arabia Bus Accident: ఎంత విషాద ఘటన ఇది.. ఒకే కుటుంబంలో 18 మంది మృతి, సౌదీ రోడ్డు ప్రమాదంలో 45 మంది హైదరాబాద్ వాసులు దుర్మరణం, మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

Team Latestly

తెలంగాణలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. సౌదీ అరేబియాలో జరిగిన ఘోర ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన 45 మంది ఉమ్రా యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ వివరాలను తెలంగాణ హజ్ కమిటీ అధికారిక ప్రకటనలో నిర్ధారించింది. పవిత్రమైన ఉమ్రా యాత్ర ముగించుకుని మదీనాకు వెళ్తున్న ఈ యాత్రికుల ప్రయాణం అకస్మాత్తుగా విషాదంగా మారింది.

Electric Car Fire Video: వీడియో ఇదిగో, ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో ఎలక్ట్రిక్ కారులో అకస్మాత్తుగా మంటలు, అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలి బూడిదైన కారు

Team Latestly

హైదరాబాద్ లోని నారాయణగూడ పరిధిలోని ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఓ ఎలక్ట్రిక్ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి కలకలం సృష్టించాయి. ఈ అగ్నిప్రమాదంలో కారు పూర్తిగా కాలి బూడిదైంది. మంటల తీవ్రతకు సమీపంలో పార్క్ చేసి ఉన్న మరో కారు కూడా పాక్షికంగా దెబ్బతింది.

Advertisement
Advertisement