Information

FICCI Convention 2020: రైతుల ఆదాయం రెట్టింపు కోసమే కొత్త వ్యవసాయ చట్టాలు, ఎఫ్ఐసీసీఐ 93వ వార్షిక స‌మావేశంలో వర్చువల్ ద్వారా ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు (Farm Reform Laws) వ్యవసాయం, దాని అనుబంధ రంగాల మధ్య ఉన్న అడ్డంకులను తొలగించడానికి ఉపయోగపడతాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకే కొత్త వ్య‌వ‌సాయ సంస్క‌ర‌ణ‌ల‌‌ను తీసుకువ‌చ్చిన‌ట్లు ప్ర‌ధాని మోదీ (PM Narendra Modi) తెలిపారు. ఎఫ్ఐసీసీఐ 93వ వార్షిక స‌మావేశంలో (FICCI Convention 2020) ప్రధాని వర్చువల్ కార్యక్రమం ద్వారా ప్రసంగించారు.

Farmers' Protest: మెట్టుదిగని ప్రభుత్వం..పట్టు వీడని రైతులు, ఫలించని హోం మంత్రి అమిత్ షా ప్రయత్నాలు, విఫలమైన ఆరో రౌండ్ చర్చలు, నేడు సింఘూ సరిహద్దులో రైతు సంఘాల సమావేశం

Hazarath Reddy

డిసెంబర్ 8న భారత్ బంద్ విజయవంతం కావడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయి రైతుల ఆందోళనను విరమించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. రైతు సంఘాలతో అదే రోజు సాయంత్రం ఏడుగంటలకు సమావేశం (Amit Shah's Meeting With Farmer Leaders) ఏర్పాటు చేశారు. అయితే అమిత్ షా ప్రయత్నాలు ఫలించలేదు. ప్రభుత్వం మెట్టు దిగకపోవడం అలాగే రైతులు పట్టు వీడకోవడంతో బుధవారంనాడు జరగాల్సిన ఆరో రౌండ్‌ చర్చలు రద్దయ్యాయి.

What is Swaminathan Report?: స్వామినాథన్ కమిషన్ ఏం చెబుతోంది? జాతీయ రైతుల కమిషన్ సూచనలు ఏమిటి? ఎంఎస్ స్వామినాథన్ రిపోర్ట్ యొక్క ముఖ్య సిఫార్సులు ఏమిటీ? పూర్తి సమాచారం

Hazarath Reddy

రైతులు ఎప్పుడు ఉద్యమాలు, ధర్నాలు చేసినా ముందుగా గుర్తుకు వచ్చేది స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్, గతంలో మధ్యప్రదేశ్ రైతులు ఉద్యమం చేసిన సమయంలోనూ ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ చేస్తున్న భారత్ బంద్ లోనూ ఎంఎస్ స్వామినాథన్ నివేదికను అమలు చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎంఎస్ స్వామినాథన్ నివేదిక గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇంతకీ స్వామినాథన్ నివేదిక అంటే ఏమిటి? రైతులు ఈ నివేదికను అమలు చేయాలని ఎందుకు పట్టబడుతున్నారు. ఈ రిపోర్ట్ లో ఏముంది ఓ సారి చూద్దాం.

Bharat Bandh 2020: రైతుల పోరాటానికి అన్నా హజారే మద్ధతు, ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టిన సామాజిక కార్యకర్త, స్వామినాథ‌న్ క‌మిష‌న్ ప్ర‌తిపాదన‌ల‌ను అమ‌లు చేయాల‌ని డిమాండ్

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్య‌వ‌సాయ చట్టాల‌ను (agri laws) వ్య‌తిరేకిస్తూ దేశ‌వ్యాప్తంగా ఇవాళ భార‌త్ బంద్ నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. విపక్షాలు సైతం దీనికి మద్ధతు ఇస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో రైతుల‌కు మ‌ద్ద‌తుగా సామాజిక కార్య‌క‌ర్త అన్నా హ‌జారే నిరాహార దీక్ష (Anna Hazare on day-long hunger strike) చేప‌ట్టారు

Advertisement

ITR Filing For 2019-20: డిసెంబర్ 31 చివరి తేదీ, వెంటనే ఐటీఆర్ ఫైల్ చేయండి, లేదంటే రూ. 5 వేల వరకు పెనాల్టీ, 6 నెలల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం

Hazarath Reddy

డిసెంబర్ 31 లోగా తప్పనిసరిగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ 31 తర్వాత ఐటీఆర్ ఫైల్ (Income Tax Returns Filing) చేస్తే కనీసం రూ.5,000 వరకు ఆదాయపు పన్ను శాఖ పెనాల్టీ వసూలు చేయనుంది. ఈ ఫైన్ రూ.10,000 వరకు ఉండే అవకాశం ఉంది.

Cyclone Arnab: మళ్లీ ఇంకో తుఫాను దూసుకొస్తోంది, అర్నబ్ తుఫాన్‌గా నామకరణం, హిందూ మహాసముద్రంలో గల్ఫ్ ఆఫ్ మన్నార్ సమీపంలో ఏర్పడే అవకాశం ఉందని అంచనా

Hazarath Reddy

బురేవి తుఫాన్ కల్లోలం మరచిపోకముందే మరో తుఫాన్ (Cyclone Arnab) తమిళనాడును మరికొన్ని రాష్ట్రాలను వణికించడానికి రెడీ అయింది. నివర్, బురెవి తుఫాన్లు మిగిల్చిన విధ్వంస పరిస్థితులకు తోడుగా అర్నబ్ తుఫాను (Next Cyclonic Storm) అల్ల కల్లోలం చేయడానికి రెడీ అవుతోంది. హిందూ మహాసముద్రంలో (Indian Ocean) గల్ఫ్ ఆఫ్ మన్నార్ సమీపంలో ఏర్పడుతుందని అంచనా వేస్తోన్న ఈ తుఫాన్‌కు ఆర్నబ్ తుఫాన్‌ అని పేరు పెట్టారు. బంగ్లాదేశ్ ఈ పేరును సూచించింది.

Burevi Cyclone: తమిళనాడును అల్లకల్లోలం చేసిన బురేవి తుఫాను, ఏడు మంది మృతి, మరణించిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన తమిళనాడు సీఎం

Hazarath Reddy

తమిళనాడు రాష్ట్రాన్ని బురేవి తుఫాను (Burevi Cyclone) వణికించింది. తుఫాను కారణంగా ఏడుగురు మరణించారని అధికారులు ప్రకటించారు. అయితే అనధికార సమాచారం ప్రకారం ఈ సంఖ్య మరింతగా ఉన్నట్లు తెలుస్తోంది. వందలాది గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. వరుసగా రెండు రోజుల పాటు ఈ తుఫాన్ (Cyclone Burevi) తమిళనాడును వణికించింది. కడలూరు జిల్లాలో 300 గ్రామాలు వరదలకు ప్రభావితం కాగా, రామనాథపురం జిల్లాలోని రామేశ్వరం యొక్క పెద్ద ప్రాంతాల్లో విద్యుత్ పూర్తిగా స్థంభించిపోయింది.

Anil Vij Tests Positive for Covid: వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా వచ్చింది, హర్యానా హోంశాఖమంత్రి అనిల్ విజ్‌కు కోవిడ్ పాజిటివ్, భారత్ బయోటెక్ కోవాక్సీన్‌ను తీసుకున్న అనిల్ విజ్

Hazarath Reddy

వ్యాక్సిన్ బయటకు వచ్చిందని, కరోనా కంట్రోల్ అవుతుందనే దాని మీద ఆశలు చిగురుస్తున్న సమయంలో నిరాశాకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. భారత్ బయోటెక్ (Bharat Biotech) కోవాక్సీన్‌ను తీసుకున్న హర్యానా హోంశాఖమంత్రి అనిల్ విజ్ (Anil Vij Tests Positive for Covid) తాజాగా కరోనా వైరస్ బారిన పడ్డారు.

Advertisement

Burevi Cyclone: బురేవి తుఫాన్ భయం ఇంకా పోలేదు, దక్షిణ తమిళనాడులో స్థిరంగా కొనసాగుతున్న బురేవి తుఫాన్, ఈ రోజు తీరం దాటే అవకాశం, మూడు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం

Hazarath Reddy

బురేవి తుపాన్‌ తమిళనాడు రాష్ట్ర ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మన్నార్‌ గల్ఫ్‌లో కొనసాగుతున్న బురేవి తుఫాన్‌ (Burevi Cyclone) బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా మారి తమిళనాడులోని (Tamil Nadu) పంబన్‌కు పశ్చిమ నైరుతి దిశలో కొనసాగుతోంది.

Bharat Bandh on Dec 8: డిసెంబర్ 8న భారత్ బంద్, దేశ రాజధానిలో తీవ్ర రూపం దాల్చిన రైతుల ఉద్యమం, కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలనే రైతుల పోరాటానికి మద్ధతుగా నిలిచిన సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దుష్యంత్‌ దవే

Hazarath Reddy

మోదీ సర్కారు తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులు..కేంద్రంపై ఒత్తిడిని మరింత పెంచేందుకు తమ ఉద్యమాన్ని (Farmers Protest in Delhi) ముమ్మరం చేయాలని నిర్ణయించారు. డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవడంతో డిసెంబర్‌ 8న భారత్‌ బంద్‌ (Bharat Bandh on Dec 8) కార్యక్రమాన్ని రైతులు తలపెట్టారు.

Subh Sukh Chain: సుభాష్ చంద్రబోస్ సుబ్ సుఖ్ చైన్ జాతీయ గీతం కథ ఏమిటి? మన జాతీయ గీతంలో అనవసర పదాలు ఎందుకు అంటున్న సుబ్రహ్మణ్య స్వామి, నేతాజీ Subh Sukh Chain గీతం గురించి ఓ సారి తెలుసుకుందాం

Hazarath Reddy

రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన భరోటో భాగ్యో బిధాట (Bharoto Bhagyo Bidhata) అనే బెంగాలీ కవిత ఆధారంగా ఈ పాట రూపొందించబడింది. సుభాష్ చంద్రబోస్ 1943 లో జర్మనీ నుండి ఆగ్నేయాసియాకు మారిన తరువాత, ఆజాద్ హింద్ రేడియోతో రచయిత ముంతాజ్ హుస్సేన్ మరియు ఐఎన్ఎకు చెందిన కల్నల్ అబిద్ హసన్ సఫ్రానీ సహాయంతో ఠాగూర్ యొక్క జన గణ మనను హిందుస్తానీ సుబ్ సుఖ్ చైన్ లోకి తిరిగి వ్రాశారు.

LPG Price Hike: రూ. 50 పెరిగిన సిలిండర్ ధర, డిసెంబర్ 2 నుంచి అమల్లోకి, ఢిల్లీలో రూ.644కు, హైదరాబాద్‌లో రూ.696.5కు చేరిన ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర

Hazarath Reddy

సామాన్యుడిపై మరోసారి అయిల్ కంపెనీలు గుదిబండను (LPG Prices Hiked) మోపాయి.. ఇప్పటికే పెట్రో ధరల సెగతో ఇబ్బంది పడుతున్న జనంపై మరో పిడుగు పడింది. ఇప్పటికే ధరలమోత, పెరుగుతున్న ద్రవ్యోల్బణం మద్య దేశంలో వంట గ్యాస్ భారం కూడా పెరగనుంది.దేశంలో వరుసగా చమురు ధరలు వరుసగా పెంచుతూ వస్తున్న పెట్రో కంపెనీలు తాజాగా గ్యాస్‌ సిలిండర్‌ రేట్లను (LPG cylinder prices hiked in December 1) పెంచాయి.

Advertisement

Covid Pandemic: కరోనా తగ్గినా డేంజరేనట, బ్రెయిన్‌ స్ట్రోక్‌, గుండెపోటు వంటివి వస్తున్నాయంటున్న శాస్త్రవేత్తలు, ఇండియాలో స్పుత్నిక్‌-వి ట్రయల్స్ ప్రారంభం, ఏపీలో తాజాగా 685 మందికి కరోనా

Hazarath Reddy

కరోనా నుంచి కోలుకున్న కొందరిలో మళ్లీ ఆరోగ్య సమస్యలు తిరగబెడుతున్నాయని అమెరికా శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రధానంగా ‘మల్టీ సిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ’ రకానికి చెందిన రుగ్మతలు బయటపడుతున్నాయని తెలిపారు.

Burevi Cyclone: మరో 12 గంటల్లో వాయుగుండంగా మారనున్న అల్పపీడనం, డిసెంబర్ 2న ట్రింకోమలీ వద్ద బురేవి తుఫాన్ తీరం దాటే అవకాశం, తమిళనాడు, ఏపీ, కేరళకు భారీ వర్ష ముప్పు

Hazarath Reddy

ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న తీవ్ర అల్పపీడనం (Extreme low pressure) బలపడుతోంది. ఇది నేటి సాయంత్రానికి తుపానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. గడిచిన 3 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి కన్యాకుమారికి తూర్పు, ఆగ్నేయ దిశగా 930 కిలోమీటర్లు, ట్రింకోమలై(శ్రీలంక)కు తూర్పు ఆగ్నేయ దిశగా సుమారు 710 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమైంది.

Cyclone Burevi: మళ్లీ బురేవి తుఫాన్ దూసుకొస్తోంది, కేరళలో నాలుగు జిల్లాల్లో రెడ్ అలర్ట్, డిసెంబర్ 2వ తేదీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం, ఏపీ, తమిళనాడుకు తప్పని మరో ముప్పు

Hazarath Reddy

నివర్ తుఫాను మిగిల్చిన విషాదం మరువక ముందే మరో తుఫాను (Cyclone Burevi) విరుచుకుపడానికి రెడీ ఉంది. తాజాగా బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన మరో అల్పపీడనంతో తమిళనాడు, కేరళలోని నాలుగు జిల్లాలో రెడ్ అలర్ట్ (Red Alert Issued in Four Districts) ప్రకటించారు. అల్పపీడనం వాయుగుండంగా మారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో స్థానిక ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్త చర్చలు చేపట్టాయి.

RRB Exams 2020: డిసెంబర్ 15 నుంచి 23 మధ్య ఆర్‌ఆర్‌బి పరీక్షలు, అభ్యర్థులకు ఎలాంటి కాల్ లెటర్ పంపరు, rrbcdg.gov.in నుంచి కాల్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపిన ఇండియన్ రైల్వే

Hazarath Reddy

ఎంతోమంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఆర్‌ఆర్‌బి పరీక్షలు డిసెంబర్ 15 నుంచి 23 మధ్య జరగనున్నాయి. ఈ మేరకు ఇండియన్ రైల్వే ప్రకటించింది. అయితే అభ్యర్థలకు ఎటువంటి కాల్ లెటర్స్ పంపబడవని నేరుగా ఆర్ఆర్బీ వెబ్ సైట్ rrbcdg.gov.in అబ్యర్థులంతా డౌన్లోడ్ చేసుకోవాలని ఇండియన్ రైల్వే సూచించింది.

Advertisement

Heavy Rain Forecast: మరో తుఫాను ముప్పు, 4 రాష్ట్రాలకు భారీ వర్ష హెచ్చరిక, తమిళనాడుకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, రెండో తేదీన బురేవి తుపాన్‌గా అవకాశం

Hazarath Reddy

నివర్ తుఫాన్ రేపిన కల్లోలం మరవక ముందే మరోసారి తుఫాన్ విరుచుకుపడనుంది. రానున్న తుఫాను మొత్తం నాలుగు రాష్ట్రాలను వణికించనుంది. కాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారనుంది. ఈ నేపథ్యంలో ఒకటో తేదీ నుంచి దక్షిణ తమిళనాడులో వర్షాలు (Heavy Rain Forecast) కురవనున్నాయి.

Oxford Vaccine: వికటించిన కరోనా వ్యాక్సిన్, సీరంపై రూ. 500 కోట్ల దావా వేసిన వాలంటీర్, తీవ్రంగా ఖండించిన సీరం ఇన్‌స్టిట్యూ‌ట్‌ ఆఫ్‌ ఇండియా, ప్రతిగా వాలంటీర్‌పై రూ.100 కోట్ల దావా వేస్తామంటూ ప్రకటన

Hazarath Reddy

కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఆశలు చిగురిస్తున్న నేపథ్యంలో వివాదాస్పద అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. బ్రిటన్‌లో ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ (Oxford Vaccine) వేయించుకున్న ఓ వలంటీర్‌లో నాడీ సమస్యలు తలెత్తిన ఘటనను చూసే ఉంటాం. అయితే తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది.

Farmers Protest in Delhi: మాటల్లేవ్.., మా డిమాండ్లు నెరవేర్చాల్సిందే, ఢిల్లీలో కదం తొక్కుతున్న రైతులు, మూడో రోజుకు చేరిన చలో ఢిల్లీ నిరసన కార్యక్రమం

Hazarath Reddy

ప్రధాని మోదీ సర్కార్‌ తెచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేపడుతున్న ఆందోళన ఉధృత రూపం (Farmers Protest in Delhi) దాల్చింది. చలో ఢిల్లీ నిరసన కార్యక్రమంలో భాగంగా మూడో రోజు శనివారం వేలాది మంది రైతన్నలు దేశ రాజధానిలో (Delhi) కదంతొక్కారు.

Covid Second Wave: కరోనా సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరం, వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించిన అత్యున్నత న్యాయస్థానం, 10 రాష్ట్రాల నుంచే కేసులు ఎక్కువగా వస్తున్నాయని తెలిపిన కేంద్రం

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ (Covid Second Wave) కల్లోలం రేపుతోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో కోవిడ్ మూడవదశలోకి (Covid Third Wave) ప్రవేశించింది. భారత్ లో కూడా సెకండ్ వేవ్ ఛాయలు కనిపిస్తున్నాయి, ఇప్పటికే ఢిల్లీ సెకండ్ వేవ్ దాటి మూడవ దశలోకి (Delhi Coronavirus) ప్రవేశించిందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, ఆంక్షల్ని కఠినంగా అమలు చేయాలని సుప్రీం కోర్టు (Supreme Court) శుక్రవారం కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.

Advertisement
Advertisement