సమాచారం

Burevi Cyclone: మరో 12 గంటల్లో వాయుగుండంగా మారనున్న అల్పపీడనం, డిసెంబర్ 2న ట్రింకోమలీ వద్ద బురేవి తుఫాన్ తీరం దాటే అవకాశం, తమిళనాడు, ఏపీ, కేరళకు భారీ వర్ష ముప్పు

Hazarath Reddy

ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న తీవ్ర అల్పపీడనం (Extreme low pressure) బలపడుతోంది. ఇది నేటి సాయంత్రానికి తుపానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. గడిచిన 3 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి కన్యాకుమారికి తూర్పు, ఆగ్నేయ దిశగా 930 కిలోమీటర్లు, ట్రింకోమలై(శ్రీలంక)కు తూర్పు ఆగ్నేయ దిశగా సుమారు 710 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమైంది.

Cyclone Burevi: మళ్లీ బురేవి తుఫాన్ దూసుకొస్తోంది, కేరళలో నాలుగు జిల్లాల్లో రెడ్ అలర్ట్, డిసెంబర్ 2వ తేదీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం, ఏపీ, తమిళనాడుకు తప్పని మరో ముప్పు

Hazarath Reddy

నివర్ తుఫాను మిగిల్చిన విషాదం మరువక ముందే మరో తుఫాను (Cyclone Burevi) విరుచుకుపడానికి రెడీ ఉంది. తాజాగా బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన మరో అల్పపీడనంతో తమిళనాడు, కేరళలోని నాలుగు జిల్లాలో రెడ్ అలర్ట్ (Red Alert Issued in Four Districts) ప్రకటించారు. అల్పపీడనం వాయుగుండంగా మారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో స్థానిక ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్త చర్చలు చేపట్టాయి.

RRB Exams 2020: డిసెంబర్ 15 నుంచి 23 మధ్య ఆర్‌ఆర్‌బి పరీక్షలు, అభ్యర్థులకు ఎలాంటి కాల్ లెటర్ పంపరు, rrbcdg.gov.in నుంచి కాల్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపిన ఇండియన్ రైల్వే

Hazarath Reddy

ఎంతోమంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఆర్‌ఆర్‌బి పరీక్షలు డిసెంబర్ 15 నుంచి 23 మధ్య జరగనున్నాయి. ఈ మేరకు ఇండియన్ రైల్వే ప్రకటించింది. అయితే అభ్యర్థలకు ఎటువంటి కాల్ లెటర్స్ పంపబడవని నేరుగా ఆర్ఆర్బీ వెబ్ సైట్ rrbcdg.gov.in అబ్యర్థులంతా డౌన్లోడ్ చేసుకోవాలని ఇండియన్ రైల్వే సూచించింది.

Heavy Rain Forecast: మరో తుఫాను ముప్పు, 4 రాష్ట్రాలకు భారీ వర్ష హెచ్చరిక, తమిళనాడుకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, రెండో తేదీన బురేవి తుపాన్‌గా అవకాశం

Hazarath Reddy

నివర్ తుఫాన్ రేపిన కల్లోలం మరవక ముందే మరోసారి తుఫాన్ విరుచుకుపడనుంది. రానున్న తుఫాను మొత్తం నాలుగు రాష్ట్రాలను వణికించనుంది. కాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారనుంది. ఈ నేపథ్యంలో ఒకటో తేదీ నుంచి దక్షిణ తమిళనాడులో వర్షాలు (Heavy Rain Forecast) కురవనున్నాయి.

Advertisement

Oxford Vaccine: వికటించిన కరోనా వ్యాక్సిన్, సీరంపై రూ. 500 కోట్ల దావా వేసిన వాలంటీర్, తీవ్రంగా ఖండించిన సీరం ఇన్‌స్టిట్యూ‌ట్‌ ఆఫ్‌ ఇండియా, ప్రతిగా వాలంటీర్‌పై రూ.100 కోట్ల దావా వేస్తామంటూ ప్రకటన

Hazarath Reddy

కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఆశలు చిగురిస్తున్న నేపథ్యంలో వివాదాస్పద అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. బ్రిటన్‌లో ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ (Oxford Vaccine) వేయించుకున్న ఓ వలంటీర్‌లో నాడీ సమస్యలు తలెత్తిన ఘటనను చూసే ఉంటాం. అయితే తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది.

Farmers Protest in Delhi: మాటల్లేవ్.., మా డిమాండ్లు నెరవేర్చాల్సిందే, ఢిల్లీలో కదం తొక్కుతున్న రైతులు, మూడో రోజుకు చేరిన చలో ఢిల్లీ నిరసన కార్యక్రమం

Hazarath Reddy

ప్రధాని మోదీ సర్కార్‌ తెచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేపడుతున్న ఆందోళన ఉధృత రూపం (Farmers Protest in Delhi) దాల్చింది. చలో ఢిల్లీ నిరసన కార్యక్రమంలో భాగంగా మూడో రోజు శనివారం వేలాది మంది రైతన్నలు దేశ రాజధానిలో (Delhi) కదంతొక్కారు.

Covid Second Wave: కరోనా సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరం, వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించిన అత్యున్నత న్యాయస్థానం, 10 రాష్ట్రాల నుంచే కేసులు ఎక్కువగా వస్తున్నాయని తెలిపిన కేంద్రం

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ (Covid Second Wave) కల్లోలం రేపుతోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో కోవిడ్ మూడవదశలోకి (Covid Third Wave) ప్రవేశించింది. భారత్ లో కూడా సెకండ్ వేవ్ ఛాయలు కనిపిస్తున్నాయి, ఇప్పటికే ఢిల్లీ సెకండ్ వేవ్ దాటి మూడవ దశలోకి (Delhi Coronavirus) ప్రవేశించిందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, ఆంక్షల్ని కఠినంగా అమలు చేయాలని సుప్రీం కోర్టు (Supreme Court) శుక్రవారం కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.

Another Low Depression: నివర్ కల్లోలంలో ముంచుకొస్తున్న మరో ముప్పు, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, ఆదివారం నాటికి బలపడి తుపానుగా మారే అవకాశముందని హెచ్చరించిన ఐఎండీ

Hazarath Reddy

నివర్ తుఫాను ప్రభావానికి మరో తుఫాను తోడు కానుందని చెన్నైలోని భారత వాతావరణ విభాగం మరో హెచ్చరిక జారీ చేసింది. ఈ నెల 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం (Another Low Depression) ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.

Advertisement

#MumbaiTerrorAttack: ముష్కర మూకలు విరుచుకుపడిన వేళ.. 26/11కు పన్నెండేళ్లు, ఉగ్రదాడిలో 166 మంది అమాయక ప్రజలు బలి, అమరులకు నివాళులు అర్పించిన యావద్భారతం

Hazarath Reddy

ముంబైలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమానికి 12 ఏళ్లు (Mumbai terror attack 12 years on) పూర్తయ్యాయి. 2008 నవంబర్‌ 26న పాకిస్థాన్ నుంచి అరేబియా సముద్రం మార్గం ద్వారా వచ్చిన పది మంది అత్యాధునిక తుపాకులతో విరుచుకుపడిన వేళ, 18 మంది భద్రతా సిబ్బంది అమరులు కాగా, 166 మంది అమాయక ప్రజలు బలయ్యారు.

Nivar Cyclone: తీరాన్ని తాకిన నివర్ తుఫాను, అయినా పొంచి ఉన్న పెనుముప్పు, తమిళనాడు, ఏపీలో అతి భారీ వర్షాలు, పలు రైళ్ల రాకపోకలు రద్దు, తిరుమలలో విరిగిపడిన కొండ చరియలు

Hazarath Reddy

తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాలకు ఈ తుఫాను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. తుపాను తీరం దాటాక గంటకు 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు వివరించారు.

Nivar Cyclone Effect: భారీ వర్షాలతో వణికిపోతున్న ఏపీ, తమిళనాడు రాష్ట్రాలు, తీవ్ర తుఫానుగా మారిన నివర్, తమిళనాడులో పలుచోట్ల 12 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు, రాత్రికి తీరం దాటే అవకాశం

Hazarath Reddy

నివర్ తుఫాన్ తమిళనాడు, ఏపీని (Nivar Cyclone Effect) కుదిపేస్తోంది. భారీ వర్షాలు, ఈదురు గాలులతో తమిళనాడు తీర ప్రాంతం అతలాకుతలం అవుతుండగా తుఫాను ప్రభావంతో (Nivar Cyclone) ఏపీలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి.

Cyclone Nivar: ముంచుకొస్తున్న మరో ముప్పు, తీవ్రరూపం దాల్చిన నివార్ తుఫాన్, ఏపీ, తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తమిళనాడులో ఏడు జిల్లాల్లో హై అలర్ట్‌

Hazarath Reddy

ఈనెల 30 నాటికి దక్షిణ అండమాన్‌లో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది వాయుగుండంగా మారి తుపాన్‌గా రూపుదిద్దుకునే అవకాశం ఉంది. ఇది వాయువ్య దిశగా పయనించి డిసెంబర్‌ 2న నాగపట్టణం సమీపంలో తీరం దాటవచ్చని వాతావరణ కేంద్రం అంచనావేస్తోంది.

Advertisement

Cyclone Nivar Live Tracker: తుఫాన్ సముద్రంలో కదులుతున్న వీడియో చూశారా, నవంబర్ 25న తీరం దాటే అవకాశం, తమిళనాడు, ఏపీని వణికించనున్న అతి భారీ వర్షాలు

Hazarath Reddy

విండ్. కామ్ ఈ నివార్ తుఫాను కదులుతున్న వీడియోని అందించింది.లైవ్ ట్రాకర్ (Cyclone Nivar Live Tracker Map on Windy) ద్వారా ఈ తుఫాను కదలికలను తెలుసుకోవచ్చు.

COVID-19 Third Wave: యూరప్ దేశాల్లో కరోనా కల్లోలం, 2వ దశ దాటి 3వ దశలోకి కోవిడ్-19, ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

Hazarath Reddy

కరోనావైరస్..ఈ పేరు ఇప్పుడు ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ విశ్వరూపం చూపిస్తోంది. ఇప్పుడు ఈ వైరస్ యూరప్‌ దేశాలను (European Countries) వణికిస్తోంది. అక్కడ కరోనా మొదటి దశను దాటుకుని రెండవ దశలోకి (Coronavirus Second Wave) ఇప్పటికే చేరింది. ఇక మూడవ దశలోకి (COVID-19 Third Wave) వెళ్లేందుకు రెడీ అవుతోంది.

Cyclone Nivar: ఈ నెల 25న తీరాన్ని దాటనున్న నివార్, ఏపీకి పెను ముప్పు, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం, తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాలు అలర్ట్

Hazarath Reddy

పీ రాష్ట్రానికి ‘నివార్’ రూపంలో (Cyclone Nivar) మరో తుపాను ముప్పు పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన ‘నివార్’ సైక్లోన్‌ మరో 24 గంటల్లో వాయుగుండం తుఫాన్‌గా బలపడనున్న నేపథ్యంలో మూడ్రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Curfew in More Cities: మళ్లీ ప్రధాన నగరాల్లో కర్ఫ్యూ, చాలా నగరాల్లో రెండవ దశకు చేరిన కరోనావైరస్, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని రాష్ట్ర ప్రభుత్వాల హెచ్చరిక

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని నగరాల్లో సెకండ్ వేవ్ స్టార్ట్ కాగా మరికొన్ని చోట్ల మూడో వేవ్ ప్రారంభం అయింది. ఢిల్లీ వంటి నగరాల్లో మూడవ దశకు చేరిన కరోనావైరస్ తెగ ఆందోళన కలిగిస్తోంది. ఇక పండుగల తర్వాత కరోనా కేసులు పెరు గుతుండటంతో పలు రాష్ట్రాలు ప్రధాన నగరాల్లో రాత్రి వేళ కర్ఫ్యూ విధిస్తున్నాయి. కఠిన ఆంక్షలు (New Restrictions Imposed in Cities) విధిస్తున్నాయి.

Advertisement

PM Modi Holds Security Review: శభాష్ ఇండియన్ ఆర్మీ, ఉగ్రవాదులను హతమార్చడం ద్వారా పెద్ద విధ్వంసాన్ని ఆపారు, కశ్మీర్లో పరిస్థితిపై ఉన్నతస్థాయి భద్రతాసమీక్ష నిర్వహించిన ప్రధాని మోదీ

Hazarath Reddy

భారత ప్రధాని నరేంద్ర మోదీ కశ్మీర్లో పరిస్థితిపై శుక్రవారంనాడు ఉన్నతస్థాయి భద్రతాసమీక్ష (PM Modi Holds Security Review) నిర్వహించారు. ఈ సమీక్షలో హోం మంత్రి అమిత్‌ షా (Union Home Minister Amit Shah), జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ (National Security Advisor (NSA) Ajit Doval), విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్‌ శింగ్లా (Foreign Secretary Harsh Vardhan Shringla), హోం, ఆర్మీ, ఇంటెలిజెన్స్‌ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

2008 Mumbai Attacks: ముంబైపై ఉగ్ర పంజా..సూత్రధారి హఫీజ్‌ సయీద్‌కు పదేళ్ల జైలు శిక్ష విధించిన లాహోర్‌ కోర్టు, 26/11 ఉ​గ్రదాడిలో 166 మంది అమాయకులు మృత్యువాత, వందలాది మందికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

2008వ సంవత్సరంలో ముంబైలో ఉగ్రవాదుల జరిపిన దాడులతో (Mumbai Terror Attacks) దేశం మొత్తం ఒక్కసారిగా షాక్ కు గురైన సంగతి విదితమే. అక్టోబర్ నెలలో 26వ తేదీన దేశ ఆర్థిక రాజధానిని టార్డెట్ చేసిన ఉగ్రవాదులు ముంబై తాజ్‌ హోటల్‌లో కాల్పులకు (2008 Mumbai Attacks) తెగబడింది.

Delhi Lockdown News: మళ్లీ లాక్‌డౌన్ దిశగా ఢిల్లీ, అనుమతించాలని కేంద్రాన్ని కోరనున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కోవిడ్-19 హాట్‌స్పాట్‌‌గా మారే మార్కెట్లలో కఠిన ఆంక్షలు

Hazarath Reddy

గడిచిన వారంరోజుల్లో దేశ రాజధానిలో ప్రతిరోజు 4వేలకు పైగా పాజటివ్‌ కేసులు వెలుగుచూస్తున్నాయి. మరోవైపు మృతుల సంఖ్య కూడా భారీగా పెరగడం అధికార యంత్రానికి చెమటలు పుట్టిస్తోంది.

India Coronavirus: దేశంలో 4 నెలల తరువాత తక్కువ కేసులు, తాజాగా 29,163 మందికి కోవిడ్, 82,90,370 మంది డిశ్చార్జి, 449 మంది మృతితో 1,30,519కు చేరుకున్న మరణాల సంఖ్య

Hazarath Reddy

భారత దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య (India Coronavirus) తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 29,163 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మధ్య కాలంలో 30 వేల లోపు కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. నిన్న ఒక్కరోజు 449 మంది మృత్యువాత (Covid Deaths) పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 88.74,290కు చేరాయి.

Advertisement
Advertisement