సమాచారం
Work From Home: డిసెంబర్ 31 వరకు ఇంటి నుంచే పని, ఐటీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్రం, దేశంలో కొనసాగుతున్న కరోనావైరస్ కల్లోలం
Hazarath Reddyకరోనావైరస్‌ దేశంలో పెను కల్లోలాన్ని రేపుతోంది. ఈ నేపథ్యంలో కంపెనీలు ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’కు (Work From Home) అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇప్పటికే చాలా వరకు ఐటీ కంపెనీలు ( IT Companies) ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేయడానికి వెసులుబాటు కల్పించాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం (Union Govt) మరోసారి ఐటీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఐటీ, బీపీవో కంపెనీలకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని డిసెంబర్‌ 31 వరకు పొడిగించింది. భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో మరికొన్ని నెలల పాటు 'వర్క్ ఫ్రం హోం' సౌకర్యాన్ని కేంద్రం పొడిగించింది.
AP Schools Reopen Date: సెప్టెంబర్ 5 నుంచి ఏపీలో స్కూళ్లు ప్రారంభం, మీడియాతో మాట్లాడిన విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఇంకా ఏమన్నారంటే..
Hazarath Reddyఏపీలో కొవిడ్‌–19 నిబంధనలను అనుసరించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సెప్టెంబర్‌ 5 నుంచి రాష్ట్రంలో పాఠశాలల పునః ప్రారంభించాలని (AP Schools Reopen Date) నిర్ణయించినట్లు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. మెరుగైన విద్య, విద్యార్థులకు రుచికరమైన జగనన్న గోరుముద్ద (మధ్యాహ్న భోజన పథకం)పై మంగళవారం సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం అనంతరం మంత్రి (Education Minister Adimulapu Suresh) సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.
Privatisation of Banks: మిగిలేది 5 ప్రభుత్వ రంగ బ్యాంకులే, బ్యాంకుల ప్రైవేటీకరణ వైపు మోదీ సర్కారు చూపు, కరోనా సంక్షోభంతో ఆర్థిక వ్యవస్థ కుదేల్
Hazarath Reddyప్రస్తుతం దేశంలో డజను ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. అయితే రానున్న కాలంలో ఇవి అయిదు లేకుంటే నాలుగుగా అవతరించనున్నాయని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకు (PSB)ల్లో సగానికిపైగా బ్యాంకులను ప్రైవేటీకరించాలని (Privatisation of Banks) మోదీ సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. ఆ ప్రాసెస్ లో భాగంగా తొలుత ఆరు బ్యాంకులను ప్రైవేటీకరించే అవకాశం ఉంది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (BOI), సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (CBI), ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (IOB), బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (BOM), యూకో బ్యాంక్‌ను వ్యూహాత్మక ఇన్వెస్టర్లకు విక్రయించనున్నట్లు ప్రభుత్వ వర్గాల నుంచి వార్తలు అందుతున్నాయి.
Lalji Tandon Dies: మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ లాల్‌జీ టాండన్ కన్నుమూత, గ‌వ‌ర్న‌ర్ మృతి ప‌ట్ల ప్ర‌ధాని మోదీ సంతాపం, ఆనందీబెన్ పటేల్‌కు మధ్యప్రదేశ్ అదనపు బాధ్యతల‌ు
Hazarath Reddyమధ్యప్రదేశ్‌ గవర్నర్‌ లాల్జీ టాండన్ (85) కన్నుమూశారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం లక్నోలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస (Lalji Tandon Dies) విడిశారు. బీజేపీ తొలినాళ్ల నుంచి క్రమశిక్షణగల నేతగా గుర్తింపు పొందిన లాల్జీ.. ఉత్తరప్రదేశ్‌ శాసన సభకు, శాసన మండలికి పలు పర్యాయాలు ఎన్నికైయ్యారు. సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా మాయావతి సర్కార్‌లో రాష్ట్రమంత్రిగా కూడా వ్యహరించారు. కళ్యాణ్‌ సింగ్‌ ప్రభుత్వంలోనూ కొనసాగారు.
Assam Floods: ఉగ్రరూపం దాల్చిన బ్రహ్మపుత్ర నది, అసోం వరదల్లో 85కు చేరిన మృతుల సంఖ్య, 70 ల‌క్ష‌ల మందిపై వరదల ప్రభావం, అసోం సీఎం సోనోవాల్‌కు ప్రధాని మోదీ ఫోన్
Hazarath Reddyఅసోంలో వ‌ర‌ద ఉధృతి (Assam Floods) తీవ్ర‌రూపం దాల్చింది. బ్రహ్మపుత్రా నది (Brahmaputra river) ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహించడంతో అనేక వందలాది ఇళ్లు నీట మునిగాయి. వరదల ధాటికి ఇళ్లు, వంతెనలు నేలమట్టమయ్యాయి. దాదాపు 70వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు దాదాపు లక్ష క్వింటాళ్ల బియ్యం, 19,397 క్వింటాళ్ల కందిపప్పు, 173,006 లీటర్ల వంట నూనె అందజేసినట్టు అధికారులు తెలిపారు.
Ayodhya Bhoomi Poojan: భూమి పూజకు 250 మంది అతిథుల‌ు, ప్రధాని మోదీని ఆహ్వానించిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు, ఆగ‌స్టు 5న అయోధ్య రామాలయ భూమి పూజ కార్యక్రమం
Hazarath Reddyవ‌చ్చే నెల 5వ తేదీన అయోధ్యలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించ‌నున్న శ్రీరాముని మందిర నిర్మాణం భూమి పూజ‌కు (Ayodhya Bhoomi Poojan) శ్రీరామ‌భ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టు (Shri Ram Janmbhoomi Teerth Kshetra) ఆహ్వానాలను పంపుతోంది. భూమి పూజ కార్యక్రమానికి (Ram Temple Construction) సుమారు 250 మంది అతిథుల‌ను పిల‌వనున్న‌ట్లు అనధికార సమాచారం. అయోధ్యలోని ప్ర‌ముఖ సాధువులు, రాముడి గుడి నిర్మాణం కోసం పోరాడిన వ్య‌క్తులు ఈ ఆహ్వాన లిస్టులో ఉన్న‌ట్లు తెలుస్తోంది. కాగా ఇప్ప‌టికే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీకి (PM Narendra Modi) ఈ కార్య‌క్ర‌మానికి రావాల్సిందిగా శ‌నివారం ఆహ్వానం అందింది.
Uttarakhand Cloudburst: ఉత్తరాఖండ్‌లో వరదలు, ముగ్గురు మృతి..పదకొండు మంది గల్లంతు, అసోంలో 79కు చేరిన మృతుల సంఖ్య, అస్సాం సీఎంకు ప్రధాని మోదీ ఫోన్
Hazarath Reddyఉత్తర, ఈశాన్యభారతదేశంలో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పర్యాటక రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో కుండపోతగా వర్షాలు (Uttarakhand Cloudburst) కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు భారీ వరదలతో జలమయం అయ్యాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి కొండ ప్రాంతాల నుంచి ప్రమాదకర స్థాయిలో వరద నీరు గ్రామాల్లోకి చేరుతోంది. పిథోరాగ్‌ జిల్లాలోని ( Cloudburst in Pithoragarh) మడ్‌కట్‌ గ్రామంలోకి వచ్చిన వరద నీటిలో ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయి మృతి చెందారు. మరో పదకొండు మంది ఆ వరదల్లో చిక్కుకొని తప్పిపోయినట్లు మేజిస్ట్రేట్ వి.కె.జోగ్దాండే తెలిపారు.
International Flights: నేటి నుండి అమెరికా, ఫ్రాన్స్‌కు విమాన సర్వీసులు, తొలి దశలో మొత్తం 46 విమాన సర్వీసులు, వెల్లడించిన పౌర విమానయాన శాఖ
Hazarath Reddyకోవిడ్-19 కారణంగా దాదాపు నాలుగు నెలలుగా నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులు (India resumes some international travel) నేడు తిరిగి ప్రారంభం కానున్నాయి. అమెరికా, ఫ్రాన్స్ దేశాల నుంచి మన దేశానికి నేటి నుంచి పాక్షికంగా విమానాలు (International Flights) నడవనున్నాయి. అమెరికాకు చెందిన యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ ఈ నెల 17-31 మధ్య 18 విమానాలను నడపనుంది. ఢిల్లీ-న్యూయార్క్‌ (Delhi- New york) మధ్య ప్రతి రోజూ, ఢిల్లీ-శాన్‌ఫ్రాన్సిస్కో మధ్య వారానికి మూడు రోజులు విమానాలు నడపనున్నట్టు పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి (Hardeep singh puri) తెలిపారు.
India-China LAC Standoff: భారత్‌-చైనా సరిహద్దు వివాదం, లడఖ్‌లో రాజ్‌నాథ్ సింగ్, ఎల్‌ఏసీ వెంబడి పరిస్థితులను సమీక్షిచేందుకు పర్యటన, రక్షణ మంత్రి వెంట బిపిన్ రావ‌త్, ముకుంద్‌ నరవణే
Hazarath Reddyకేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ (Defence minister Rajnath Singh) శుక్రవారం ఉదయం‌ లడఖ్‌ చేరుకున్నారు. భారత్‌-చైనా దేశాల మధ్య సరిహద్దు ప్రతిష్టంభన (India-China LAC Standoff) కొనసాగుతున్న వేళ వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి పరిస్థితులను సమీక్షించేందుకు ఆయన పర్యటిస్తున్నారు. ల‌డ‌ఖ్‌లో (Ladakh) స‌రిహ‌ద్దు వ‌ద్ద చైనాతో ఘ‌ర్ష‌ణ త‌లెత్తిన నేప‌థ్యంలో ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లేహ్‌లోని స్త‌క్నా ఫార్వ‌ర్డ్ ఏరియాను సంద‌ర్శించారు. ఆయన వెంట త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావ‌త్ (CDS Bipin Rawat), ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణే (Army Chief Mukund Naravane) కూడా ఉన్నారు.‌
Coronavirus in india: సెప్టెంబర్ 1నాటికి 35 లక్షలకు కరోనా కేసులు, అంచనా వేసిన ఐఐఎస్సీ, దేశంలో 10 లక్షలు దాటిన కోవిడ్-19 కేసులు..25 వేల మరణాలు, ఒక్క రోజులో 34,956 మందికి కొత్తగా కోవిడ్ 19 పాజిటివ్
Hazarath Reddyభారతదేశంలో కరోనా మహమ్మారి (Coronavirus in india) మరింత వేగంగా విస్తరిస్తోంది. దేశంలో వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 10 లక్షల మార్కును దాటేసింది. మొత్తం కరోనావైరస్ కేసులు (Coronavirus Cases in India) 10,03,832 కు చేరింది. మరోవైపు మరణాల సంఖ్య ( Coronavirus Deaths in india) 25 వేలను దాటింది. గత 24 గంటల్లో 687 మందితో కలిపి మొత్తం మరణాల సంఖ్య 25,602 కు పెరిగింది. అయితే రికవరీ రికార్డు స్థాయిలో పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖవెల్లడించింది. 24 గంటల్లో 22,942 బాధితులు కోలుకున్నట్టు ప్రకటించింది. కాగా దేశంలో తొలి కోవిడ్‌-19 కేసు జనవరి 30 న కేరళలో నమోదైంది. దాదాపు 170 రోజుల్లోనేబాధితుల సంఖ్య 10 లక్షలకు చేరింది.
International Flights: జూలై 17 నుండి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం, వెల్లడించిన పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి
Hazarath Reddyఅంతర్జాతీయ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించినున్నట్లు (International Flights to Begin in India) పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి (Hardeep Singh Puri) చెప్పారు. కోవిడ్ -19 మహమ్మారి మధ్య అంతర్జాతీయ విమాన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించడానికి సిద్ధం అవుతున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ముందుగా జూలై 18 నుంచి ఆగస్టు 1 వరకు ఫ్రాన్స్ నుండి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పారిస్ మధ్య 28 విమానాలను నడుపుతామని తెలిపారు.
Coronavirus lockdown: దేశంలో మళ్లీ పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ తప్పదా? మరోసారి లాక్‌డౌన్‌ దిశగా అడుగులు వేస్తున్న పలు రాష్ట్రాలు, కొవిడ్‌-19 కేసుల్లో ప్రపంచంలో మూడో స్థానానికి భారత్
Hazarath Reddyదేశంలో కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకు కేసులు (Coronavirus Cases in India) పెరిగిపోతున్నాయి. దేశంలో పలు రాష్ట్రాల్లో కోవిడ్-19 కల్లోలాన్ని రేపుతోంది. కొవిడ్‌-19 పాజిటివ్‌ల జాబితాలో ప్రపంచంలోనే భారత్‌ ( India Coronavirus) మూడోస్థానానికి చేరింది. దేశంలో 10 లక్షలకు చేరువలో కరోనా కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో మళ్లీ పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ (Coronavirus lockdown) విధిస్తే కాని పరిస్థితులు అదుపులోకి వచ్చేలా కనబడటం లేదు.
RIL AGM 2020: తక్కువ ధరకే జియో నుంచి 4జీ, 5జీ స్మార్ట్‌ఫోన్లు, ఏజీఎంలో వెల్లడించిన ముఖేష్ అంబానీ, గూగుల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం
Hazarath Reddyనేడు జరిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వాటాదారుల 43వ వార్షిక సమావేశం (AGM)లో ముఖేష్ అంబానీ పలు సంచలన నిర్ణయాలు ప్రకటించారు. అంతర్జాతీయ టెక్‌ దిగ్గజం గూగుల్‌ భాగస్వామ్యంలో అందరికి ఆమోదయోగ్యమైన 4జీ, 5జీ స్మార్ట్‌ఫోన్లను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ( mukesh ambani) తెలిపారు.
Mumbai Rain Forecast: ముంబైకి భారీ వర్షం ముప్పు, హెచ్చ‌రించిన భార‌త వాతావ‌ర‌ణ కేంద్రం, కొంక‌ణ్ తీరాన్ని కమ్ముకున్న మేఘాలు
Hazarath Reddyకోవిడ్-19 తో విలవిలలాడుతున్న మ‌హారాష్ర్ట‌కు భారీ వర్షం రూపంలో మరో ప్రమాదం పొంచి ఉందని ఐఎండీ హెచ్చరించింది. మహారాష్ట్రలోని ప‌లు ప్రాంతాల్లో నేడు భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురువ‌నున్న‌ట్లు భార‌త వాతావ‌ర‌ణ కేంద్రం(IMD) హెచ్చ‌రించింది. కొంక‌ణ్ తీరంతో పాటు ముంబై, థానేలో భారీ వ‌ర్షాలు (High Tide Alert Mumbai) కురుస్తాయ‌ని పేర్కొంది. కొంక‌ణ్ తీరాన్ని తీవ్ర‌మైన మేఘాలు క‌మ్ముకున్న‌ట్లు తెలిపింది. ముంబై, థానేలో 200 మీల్లీమీట‌ర్ల కంటే ఎక్కువ వ‌ర్ష‌పాతం న‌మోదు కానున్న‌ట్లు పేర్కొంది.
CBSE Class 10th Results 2020: సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు రేపు విడుదల, ట్విట్టర్ ద్వారా వెల్లడించిన కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్
Hazarath Reddyనిన్న 12వ తరగతి ఫలితాలు విడుదల చేసిన సీబీఎస్ఈ (Central Board of Secondary Education) రేపు 10వ తరగతి ఫలితాలు విడుదల చేస్తోంది. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. "ప్రియతమ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులారా... రేపు సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు (CBSE Class 10th Results 2020) ప్రకటిస్తున్నారు. విద్యార్థులందరికీ బెస్టాఫ్ లక్" అంటూ రమేశ్ పోఖ్రియాల్ ట్వీట్ చేశారు.
Padmanabhaswamy Temple: ఆరవ నేలమాలళిగను వారు తెరుస్తారా, అనంతపద్మనాభ స్వామి ఆలయ పాలనపై హక్కులు రాజకుటుంబానికి చెందుతాయని సుప్రీం తీర్పు
Hazarath Reddyతొమ్మిది సంవత్సరాలుగా కొనసాగుతున్న అనంతపద్మనాభ స్వామి (Sree Padmanabhaswamy Temple) ఆలయ నిర్వహణ వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ఆలయ మేనేజ్ మెంట్ వివాదంలో ట్రావెన్ కోర్ రాజ కుటుంబానికి అనుకూలంగా సుప్రీం తీర్పును ప్రకటించింది. రాజకుటుంబానికి ఆలయ పాలనపై ఉన్న హక్కులను సమర్థించింది. ఈ క్రమంలోనే ఆలయానికి సంబంధించి పాలనా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు త్రివేండ్రం జిల్లా న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీని నియమించింది. కొత్త కమిటీ ఏర్పాటు అయ్యే వరకు ప్రస్తుత కమిటీ కొనసాగుతుందని సుప్రీంకోర్టు (Supreme Court) తెలిపింది. స్టిస్ యూయూ లలిత్, జస్టిస్ మల్హోత్రాలతో కూడిన ధర్మాసనం ఈ స్పష్టమైన తీర్పు చెప్పింది.
CBSE 12th Result 2020 Declared: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల, పదో తరగతి ఫలితాలు కూడా త్వరలో విడుదల, ఫలితాలను http://results.nic.in/ లేదా http://cbse.nic.in/ లేదా http://cbseresults.nic.in/ ద్వారా చెక్ చేసుకోండి
Hazarath Reddyసీబీఎస్ఈకి చెందిన 12వ తరగతి పరీక్ష ఫలితాలు (CBSE 12th Result 2020 Declared) విడుదలయ్యాయి. ఈ మేరకు జులై 13న విడుదల చేయనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (HRD) శుక్రవారం వెల్లడించిన విషయం తెలిసిందే. అనుకున్నట్లుగానే ఈ రోజు ఫలితాలు (CBSE 12th Result 2020) విడుదలయ్యాయి.
Heavy Rains in AP: ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు, రాష్ట్రంపై కొనసాగుతున్న షియర్‌ జోన్‌ ప్రభావం, అలర్ట్ జారీ చేసిన విశాఖ వాతావరణ కేంద్రం
Hazarath Reddyఆగ్నేయ ఉత్తరప్రదేశ్‌ నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ వరకూ ఏర్పడిన ఉత్తర–దక్షిణ ఉపరితల ద్రోణి బలహీనపడింది. దీనివల్ల గాలుల కలయికతో ఏర్పడిన షియర్‌ జోన్‌ ప్రభావం రాష్ట్రంపై కొనసాగుతోంది. మరోవైపు నైరుతి రుతు పవనాలు కోస్తా, రాయలసీమపై చురుగ్గా ఉన్నాయి.వీటన్నింటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో.. నేడు, రేపు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
World's 1st Coronavirus Vaccine: కరోనావైరస్‌ని చంపే తొలి వ్యాక్సిన్ రెడీ, రష్యాలో అన్ని క్లినికల్‌ ట్రయల్స్‌ను పూర్తి చేసుకున్న కోవిడ్‌–19 వ్యాక్సిన్‌, త్వరలో మార్కెట్లోకి..
Hazarath Reddyకోవిడ్-19 గుప్పిట్లో చిక్కుకొని ప్రపంచదేశాలు విలవిలలాడుతున్న వేళలో వ్యాక్సిన్‌పై (COVID-19 Vaccine) జరుగుతున్న ప్రయోగాలు జీవితంపై కొత్త ఆశలను చిగురింపజేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రపంచంలోనే తొలిసారిగా రష్యాలో కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ అన్ని దశల క్లినికల్‌ ట్రయల్స్‌ని పూర్తి చేసుకోవడం ప్రపంచానికి ఊరట కలిగించే అంశంగా చెప్పవచ్చు. రష్యాలోని సెచెనోవ్‌ మెడికల్‌ యూనివర్సిటీ చేసిన కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగం (World's 1st Coronavirus Vaccine) కీలక దశలన్నింటినీ విజయవంతంగా పూర్తి చేసినట్టుగా ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ట్రాన్స్‌లేషన్‌ మెడిసిన్‌ అండ్‌ బయోటెక్నాలజీ డైరెక్టర్‌ వాదిమ్‌ తారాసోవ్‌ వెల్లడించారు.
Rewa Solar Plant: రెవా సౌర విద్యుత్తు ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ, భారత్‌లో ఊపందుకున్న సౌరవిద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు
Hazarath Reddyజల, థర్మల్ విద్యుత్ కు ప్రత్యామ్నాయంగా ప్రపంచం దృష్టి సౌరశక్తిపై పడింది. భారత్‌లోనూ సౌరవిద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని రెవాలో నిర్మించిన 750 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ప్రాజెక్టును ప్ర‌ధాని మోదీ ఇవాళ జాతికి అంకితం చేశారు. రెవా సౌర విద్యుత్తు ప్రాజెక్టుతో కేవ‌లం స‌మీప ప‌రిశ్ర‌మ‌ల‌కు విద్యుత్తు అంద‌డ‌మే కాకుండా, ఢిల్లీలోని మెట్రో రైలుకు కూడా విద్యుత్తు స‌ర‌ఫ‌రా జ‌రుగుతుంద‌ని మోదీ తెలిపారు.