సమాచారం
LPG Cylinder Price Slashed: ఎల్‌పీజీ వినియోగదారులకు గుడ్ న్యూస్, 14.2 కేజీ సిలిండర్‌పై రూ.65 తగ్గింపు, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
Hazarath Reddyసబ్సీడియేతర లిక్విఫైడ్‌ పెట్రోలియం గ్యాస్‌ (ఎల్‌పీజీ) సిలిండర్‌ (14.2 కేజీ) ధరను రూ.65 తగ్గిస్తున్నట్లు (LPG Cylinder Price Drops) ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (IOC) పేర్కొంది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్‌ ధరలు 55 శాతం మేర పడిపోవడంతో రేట్లు తగ్గించినట్లు ఐఓసీ తెలిపింది. ఈ తగ్గించిన రేట్లు ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి అమలు కానున్నాయి. దీంతో ఢిల్లీలో ఎల్‌పీజీ సిలిండర్‌ రూ. 744కి లభించనుంది. గత నెలలో ఇది రూ. 805.5 ఉండగా ఇది ఇప్పుడు రూ. 61.5 రూపాయలు తగ్గింది.
Salaries Defer in AP: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల జీతాల చెల్లింపు వాయిదా, లాక్‌డౌన్ పూర్తయిన తర్వాత జీత భత్యాలు చెల్లించే అవకాశం, కీలక నిర్ణయం తీసుకున్న జగన్ సర్కారు
Hazarath Reddyఏపీలో కరోనా వైరస్ (Coronavirus in AP) చాపకింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో జగన్ సర్కారు (Jagan Government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల జీత భత్యాలను ఈ నెలకు ఇవ్వడం లేదని తెలిపింది. వారందరి జీత భత్యాలు చెల్లింపును వాయిదా వేసింది. దీనికి సంబంధించిన జీవోను ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS jagan) జారీ చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో 100 శాతం జీత భత్యాలను వారికి నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.
Coronavirus Global Report: ప్రపంచాన కరోనా మృత్యుఘోష, ఇటలీలో 50 మంది డాక్టర్లు బలి, 8 లక్షలకు చేరువలో కోవిడ్-19 కేసులు, 37 వేలకు చేరిన మృతులు, కోలుకుంటున్న ఇటలీ
Hazarath Reddyప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 37,820 మంది కరోనా (Coronaviru) మహమ్మారికి బలైయ్యారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇక కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 8 లక్షలకు దగ్గర్లో ఉంది. వైరస్‌ నిర్థారణ అయినవారిలో మంగళవారం ఉదయం నాటికి 1,65,659 మంది కోలుకున్నారు.
Corona Cases in AP: ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు, ఒక్కరోజే 17 కొత్త కేసులు, 40కి చేరిన కోవిడ్ 19 కేసుల సంఖ్య, విశాఖలో కరోనాను జయించిన అర‌వై ఏళ్ల వృద్ధుడు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో (Andhra pradesh) లాక్ డౌన్ పాటిస్తున్నా కరోనా పాజిటీవ్ కేసులు పెరిగిపోతున్నాయి. నిన్న ఒక్కరోజే కొత్తగా 17 పాజిటీవ్ కేసులు (coronavirus cases in AP) నమోదయ్యాయి. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు, వారి బంధువులలో కొందరికీ వైరస్ వ్యాప్తి చెందినట్లు అధికారులు గుర్తించారు. గత రాత్రి వరకు 164 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా 147 మందికి నెగిటివ్ రాగా 17 మందికి పాజిటీవ్ వచ్చింది.
Banks Mega Merger: బ్యాంకు కస్టమర్ల అలర్ట్ టైం, ఏప్రిల్ 1 నుంచి మిగిలేది 4 ప్రభుత్వరంగ బ్యాంకులే, విలీనం కానున్న ఆరుబ్యాంకులు, కనుమరుగుకానున్న ఆంధ్రా బ్యాంకు
Hazarath Reddyబ్యాంక్ కస్టమర్లకు అలర్ట్ కావాల్సిన సమయం ఆసన్నమైంది. బ్యాంకుల విలీనానికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve bank of india) ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) గతంలోప్రకటించిన బ్యాంకుల విలీనం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుంది. ఈ వీలీనంతో ఏప్రిల్ 1 నుంచి పది ప్రభుత్వ రంగ బ్యాంకులు 4 ప్రభుత్వ రంగ బ్యాంకులుగా (Merger of 10 public sector banks into 4) అవతరించనున్నాయి.
Coronavirus Spread in India: ఇండియాలో ఒక్కరోజే 227 కేసులు నమోదు, రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య, మొత్తం 1251కి చేరిన కోవిడ్ 19 పాజిటివ్ కేసులు
Hazarath Reddyభారత్‌లో (India) సోమవారం కరోనావైరస్ కేసుల సంఖ్య (Coronavirus Spread in India) బాగా పెరిగింది. ఇప్పటివరకు దేశంలో 1,251 మందికి కోవిడ్ -19 నిర్ధారణ జరిగింది. గత 24 గంటల్లోనే 227 COVID-19 కేసులు (Coronavirus Cases Jump to 1251) నమోదయ్యాయి. భారతదేశంలో ఇప్పటివరకు ఒకే రోజులో అత్యధికంగా నమోదైన కేసులు ఇవే.
Delhi Nizamuddin Markaz: ఢిల్లీ మత ప్రార్థనల్లో కరోనావైరస్ కల్లోలం, ఆరుమంది మృతి, క్వారంటైన్‌లోకి 2వేల మంది, మర్కజ్‌ మౌలానాపై కేసు నమోదు, ఆదేశించిన ఢిల్లీ సర్కారు
Hazarath Reddyఢిల్లీలో జరిగిన ఓ మత కార్యక్రమం (Delhi Nizamuddin Markaz) దేశంలో ఇప్పుడు కరోనావైరస్ (coronavirus) కల్లోలానికి కారణమైంది. ఆ ప్రార్థనలు దేశంలో ప్రమాద ఘంటికలు మోగించాయి. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ (Delhi Nizamuddin) ప్రాంతంలోని ‘తబ్లిగి ఏ జమాత్‌' మార్చి 1-15 మధ్యలో జరిగిన ఈ కార్యక్రమానికి విదేశాల నుంచి ఎంతోమంది హాజరయ్యారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వందలమంది ఇందులో పాల్గొన్నారు. కాగా విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల ద్వారా వీరిలో పలువురికి కరోనా వైరస్‌ సోకినట్టు ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి.
Donated To Fight Coronavirus: కరోనా అంతు చూస్తామంటున్న కార్పోరేట్, సెలబ్రిటీల నుంచి మినిష్టర్ల దాకా.., పీఎం రిలీఫ్ ఫండ్‌కి భారీగా విరాళాలు, ఇప్పటివరకు అందిన మొత్తం లిస్టు ఇదే
Hazarath Reddyదేశంలో కరోనావైరస్ (Coronavirus) మెల్లిగా విస్తరించుకుంటూ పోతున్న నేపథ్యంలో దాన్ని నియంత్రించేందుకు కార్పోరేట్ (Corporates) ప్రపంచం ముందుకు వచ్చింది. సెలబ్రిటీల నుంచి మినిష్టర్ల దాకా అందరూ దాన్ని అంతు చూసేందుకు రెడీ అయ్యారు. ఇండియాలో సోమవారం సాయంత్రానికి 1071 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, అలాగే 34 మంది మరణించారు. భారతదేశం కరోనావైరస్ వ్యాప్తిపై పోరాడుతూనే ఉండటంతో, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు (Business Mans) మరియు రాజకీయ నాయకులతో (Political Leaders)సహా అన్ని వర్గాల ప్రజలు దాని నియంత్రణకు భారీగా విరాళాలు (Donated To Fight Coronavirus) అందిస్తున్నారు. భారతదేశంలో కరోనావైరస్‌పై పోరాటానికి ఇప్పటివరకు విరాళాలు ఇచ్చిన వ్యక్తుల జాబితాను ఓ సారి చూద్దాం.
WhatsApp Update: వాట్సాప్ స్టేటస్‌లో కీలక మార్పు, ఇకపై వీడియోల నిడివి 15 సెకన్లకే పరిమితం, ఇకపై స్టేటస్ ద్వారా 16 సెకన్ల కన్నా ఎక్కువ ఉంటే షేర్ చేయలేరు
Hazarath Reddyప్రముఖ ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్ వాట్సాప్ (WhatsApp) కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ (Lockdown) పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో వాట్సాప్ స్టేటస్ లో అప్‌లోడ్ చేసే వీడియోల నిడివిని (Status video) సగానికి కుదించింది. వాట్సాప్ వినియోగంలో వస్తున్న అంతరాయాన్ని నివారించే చర్యల్లో భాగంగా దీన్ని15 సెకన్లకు (15 seconds) పరిమితం చేసింది.
India Lockdown: ఆ వార్తలను నమ్మకండి, 21రోజుల తర్వాత లాక్‌డౌన్‌ పొడిగింపు అంతా పుకారు, కేంద్రం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా వెల్లడి
Hazarath Reddyకరోనా వైరస్‌ (Coronavirus) నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన 21రోజుల లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగిస్తారనే వార్తలను కేంద్రం కొట్టిపారేసింది. లాక్‌డౌన్‌ గడువు పెంచుతారన్న వదంతులు ఒట్టి పుకార్లేనని తేల్చిచెప్పింది. ఈ మేరకు సోమవారం కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా (Cabinet Secretary Rajiv Gauba) స్పందించారు. దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ 21 రోజులేనని స్పష్టం చేశారు.
Coronavirus Cases in India: మహారాష్ట్రలో చేయి దాటుతున్న పరిస్థితి, 1,071కు చేరుకున్న కరోనా కేసులు, ఒక్కరోజే 8మంది మృతి, దేశ వ్యాప్తంగా 30కి చేరుకున్న కోవిడ్-19 మృతుల సంఖ్య
Hazarath Reddyభారత దేశంలో కరోనావైరస్‌ కేసుల సంఖ్య (Coronavirus Cases in India) వెయ్యి మార్కును దాటింది. ఆదివారం 106 కొత్త కేసులు (New Cases) నమోదు కాగా వైరస్‌ సోకిన వారి సంఖ్య 1,024కు చేరింది. ఒక్కరోజే 8 మంది మరణించగా దేశవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య (COVID 19 Deaths) 29కు పెరిగింది. ఢిల్లీలో (Delhi) ఆదివారం కొత్తగా 23 కేసులు నమోదుకాగా వైరస్‌ సోకిన వారి సంఖ్య 72కు చేరింది. మహారాష్ట్రలో (Maharashtra) అత్యధికంగా 186, ఆ తర్వాత కేరళలో 182 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
Telangana Lockdown: ఏప్రిల్ 15 తర్వాత కూడా తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తేసే ఛాన్స్ లేదు, ఇది ఎంత దూరం పోతుందో తెలియదు, అందరూ కదిలిరావాలి, పిలుపునిచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్
Hazarath Reddyకోవిడ్-19 (COVID-19) నియంత్రణకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించిన సంగతి విదితమే. ఇది ఏప్రిల్ 15 వరకు కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఇది తెలంగాణలో (Telangana Lockdown) ఆ తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) స్పష్టం చేశారు. మనది చాలా పెద్ద దేశమని అంతా మంచిగా ఉన్న సమయంలో మళ్లీ వైరస్ వ్యాప్తి చెందితే పరిస్థితి ఏంటని అన్నారు.
Free Ration Distribution in AP: ఏపీలో ఉచితంగా రేషన్ సరుకులు, నెల సరుకులను ముందుగానే పంపిణీ చేస్తున్న ఏపీ సర్కారు, మార్చి 29 నుంచి ఏప్రిల్‌ చివరిలోగా 3సార్లు ఇవ్వాలని నిర్ణయం
Hazarath Reddyకరోనావైరస్ (Covid 19 outbreak) దెబ్బకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ (Lockdown) అమలవుతోంది. దేశంలోని దాదాపు అన్నీ రాష్ట్రాల్లో కూడా లాక్‌డౌన్ ( coronavirus lockdown) అమలు అవుతున్న నేపథ్యంలో సామాన్యులు నిత్యావసర సరుకుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు (Andhra Pradesh government) కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ సరుకులను అందరికీ ఉచితంగా (Free Ration Distribution in AP) అందిస్తోంది.
Coronavirus Lockdown: వలస కూలీలను ఎక్కడికక్కడే ఆపేయండి, లాక్‌డౌన్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు, వెల్లడించిన కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు
Hazarath Reddyకరోనావైరస్‌పై పోరుకు దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌ (India Lockdown) ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక ఆదేశాలు (Centre orders) జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో వలసకూలీలు (migrant workers) ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తున్నట్లుగా గుర్తించామని దీనిని పూర్తిగా నివారించాలని కేంద్రం స్పష్టం చేసింది.ఇందులో భాగంగా లాక్‌డౌన్‌ను (coronavirus lockdown) పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో ఆదివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు ఈమేరకు వెల్లడించారు.
CM KCR Press Meet: ఏప్రిల్‌ 7 తర్వాత కరోనా సమస్య ఉండదు, కొత్త కేసులు నమోదు కాకుంటే జరిగేది అదే, తెలంగాణలో 70కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య, మీడియతో సీఎం కేసీఆర్
Hazarath Reddyఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య (Coronavirus Cases) 70కి చేరిందని, మరో 11 మంది కూడా చికిత్స తీసుకుని కోలుకున్నారని తెలిపారు. మన దగ్గర చికిత్స తీసుకుని కోలుకున్న వ్యక్తితో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడారు. గాంధీ వైద్యులు అందించిన ధైర్యంతోనే కోలుకున్నానని కోలుకున్న వ్యక్తి చెప్పాడు. మిగిలిన 58 మందిలో కూడా పరీక్షలు నిర్వహించి తగ్గినవారిని క్రమంగా పంపిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.
COVID-19 Death Toll In India: ఇండియాలో 29కు చేరిన మృతులు, 24 గంటల్లో 106 కొత్త కేసులు, పాజిటివ్‌ కేసులు సంఖ్య 979, కోవిడ్‌-19పై హెల్త్‌బులెటిన్‌ విడుదల చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ
Hazarath Reddyఇండియాలో చాపకింద నీరులా కరోనా (Coronavirus) విస్తరిస్తోంది. రోజు రొజుకు దేశ వ్యాప్తంగా కోవిడ్ 19 కేసులు పెరుగుతున్నాయి. భారత్‌లో (India) 979 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లో కొత్తగా106 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా..ఆరుగురు మరణించారని వెల్లడించింది. దీంతో కోవిడ్‌-19 కారణంగాంఖ ఇప్పటి వరకు దేశంలో మృతిచెందిన వారిసంఖ్య 29కు (COVID-19 Death Toll In India) చేరింది. తాజాగా కోవిడ్‌-19పై (COVID-19) కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్‌బులెటిన్‌ విడుదల చేసింది.
Kerala Lockdown: మందు లేక 5మంది ఆత్మహత్య, కేరళ సర్కారు కీలక నిర్ణయం, ఇకపై మద్యం అందించాలని ఎక్సైజ్ విభాగానికి ఆదేశాలు జారీ చేసిన కేరళ సీఎం పినరయి విజయన్
Hazarath Reddyకరోనా వైరస్‌ ( Coronavirus) వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ( Lockdown) అమలవుతోంది. ఇక అన్ని రాష్ట్రాల్లో మద్యం షాపులు, బార్లను మూసివేశారు. కేరళలో అయితే గత రెండు రోజుల నుంచి మద్యం షాపులు మూసివేయడంతో.. మందు బాబులు విలవిలలాడిపోతున్నారు. కేరళలో (Kerala) మద్యం (alcoholics) దొరక్కపోవడంతో త్రిసూర్‌ జిల్లాకు చెందిన సనోజ్‌(35) అనే వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దాదాపు 5 మంది మందు దొరక్క ఆత్మహత్య చేసుకోవడంతో కేరళ సర్కారు అలర్ట్ అయింది.
Coronavirus in US: అమెరికాలో కరోనా మృత్యు ఘోష, నెలల పసికందును మింగేసిన కోవిడ్-19, లక్షా 21 వేలకు పైగా కరోనా కేసులు, రెండు వేలు దాటిన మృతులు సంఖ్య
Hazarath Reddyఅగ్రరాజ్యం అమెరికా (America) కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. ఆ దేశంలో కరోనా (Coronavirus) విలయతాండవం చేస్తోంది. అమెరికాలో కోవిడ్ 19కు (COVID 19) ఓ ముక్కుపచ్చలరారని చిన్నారి బలైంది. చికాగోకు చెందిన నెలల పసికందు కోవిడ్‌-19 బారినపడి ప్రాణాలు విడిచిందని ఇల్లినాయిస్‌ ఆరోగ్యశాఖ (ఐడీపీహెచ్‌) శనివారం వెల్లడించింది.
COVID-19 in Spain: కరోనా కాటుకు బలైన స్పెయిన్‌ రాణి, పారిస్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన మారియా థెరీసా, స్పెయిన్‌లో 73 వేలకు చేరిన కరోనా కేసులు
Hazarath Reddyకరోనా మహమ్మారి కరోనాకు (COVID 19) స్పెయిన్‌ రాణి మారియా థెరీసా (Princess Maria Teresa) బలయ్యారు. ఆమె వయసు 86 ఏళ్లు. ప్రాణాంతక వైరస్‌ బారిన పడిన యువరాణి ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సోషియాలజీ ప్రొఫెసర్‌గా పనిచేసిన మారియా స్పెయిన్‌ రాజు ఫెలిప్‌-6కు సోదరి. 1933 జులై 28 న ఆమె జన్మించారు. ఫ్రాన్స్‌లో చదువుకున్న మారియా సామాజిక కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించి ‘రెడ్‌ ప్రిన్సెస్‌’గా పేరు సంపాదించారు.
Coronavirus Hits Paramilitary Forces: భారత రక్షణ దళాలను తాకిన కరోనావైరస్, బీఎస్ఎఫ్ అధికారికి కోవిడ్ 19, క్వారంటైన్‌లో పలువురు బీఎస్ఎఫ్ అధికారులు,వారి కుటుంబసభ్యులు
Hazarath Reddyదేశంలో కరోనావైరస్ (Coronavirus) పంజా విసురుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా, ఉగ్రవాదుల నుండి రక్షణ బలగాల దాకా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. తాజాగా ఈ వైరస్ భారత రక్షణ బలగాలను (Coronavirus Hits Paramilitary Forces in India) తాకింది. పారామిలిటరీ ఫోర్స్ లో పనిచేస్తున్న బీఎస్ఎఫ్ అధికారికి (BSF Officer) కరోనా పాజిటివ్ అని తేలడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.