సమాచారం
Coronavirus pandemic: కరోనాను ఇండియా నుంచి తరిమికొడదాం, రూ.1500 కోట్ల విరాళం ప్రకటించిన టాటా గ్రూపు, తక్షణమే స్పందించాల్సిన సమయమిది, ట్విట్టర్లో రతన్ టాటా ట్వీట్
Hazarath Reddyప్రపంచాన్ని వణికిస్తూ.. ప్రజలకు నిద్రలేని రాత్రులను చూపిస్తున్న కరోనావైరస్ మహమ్మారిపై (Coronavirus pandemic) యుద్ధానికి టాటా గ్రూప్‌ (Tata Trusts) శనివారం భారీ విరాళం ప్రకటించింది. తొలుత రూ.500 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించిన టాటా ట్రస్టు, అనంతరం రూ.1,000 కోట్ల విరాళాన్ని అందిస్తున్నట్లు ‘టాటా సన్స్‌’ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ (N CHANDRASEKARAN) ప్రకటించారు. దీంతో టాటా గ్రూప్‌ మొత్తం రూ.1,500 కోట్ల విరాళం ప్రకటించినట్లయ్యింది.
AP DGP Damodar Goutam Sawang: మాకు కుటుంబం ఉంది, సెలవులు లేకుండా మీకోసం కష్టపడుతున్నాం, కరోనాని ఏపీ నుండి తరిమికొట్టడానికి అందరూ సహకరించాలి, మీడియాతో గౌతం సవాంగ్
Hazarath Reddyకరోనా వైరస్ (COVID-19) ప్రబలుతున్న ప్రస్తుత తరుణంలో అందరూ ఇళ్లకే పరిమితం కావాలని, ఎవరూ అనవసరంగా బయటకు రావొద్దని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ (AP DGP Goutam Sawang) పిలుపునిచ్చారు. ఏపీలో లాక్ డౌన్‌ను (AP Lockdown) పటిష్టంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు.పోలీసులు మీ సేఫ్టీ కోసమే పనిచేస్తున్నారు. ప్రతి పోలీస్‌కూ కుటుంబం ఉంటుందని, కానీ రాత్రింబవళ్లు సెలవులు కూడా లేకుండా వారు ప్రజల కోసం కష్టపడుతున్నారని తెలిపారు.
COVID-19 Deaths in India: కేరళను కాటేసిన కరోనావైరస్, తొలి మరణం నమోదు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 69 ఏళ్ల వృద్ధుడు మృతి, ఇండియాలో 20కి చేరిన మృతులు
Hazarath Reddyకేరళ రాష్ట్రంలో తొలి కరోనా మరణం (First Coronavirus Death in Kerala) నమోదైంది. వైరస్‌ బారిన పడి చికిత్స పొందుతున్న 69 ఏళ్ల వ్యక్తి కొచ్చి మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృత్యువాత పడ్డాడు. దుబాయ్‌నుంచి ఇండియాకు వచ్చిన సదరు వ్యక్తి ఈనెల 22న నిమోనియా లక్షణాలతో కొచ్చిలోని కాలమస్సేరి మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో చేరాడు. అతడి ఆరోగ్య పరిస్థితి అదుపు తప్పటంతో వెంటిలేటర్‌పై ఉంచారు వైద్యులు.
Operation Namaste: కరోనాపై ఆర్మీ ‘ఆపరేషన్ నమస్తే’ వార్, ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిన ఇండియన్ ఆర్మీ చీఫ్, 13 లక్షల మంది సైనికులను, కుటుంబాలను కాపాడటమే లక్ష్యమన్న మనోజ్ ముకుంద్ నరవణే
Hazarath Reddyదేశంలో కరోనావైరస్ (Coronavirus) చాపకింద నీరులా మెల్లిగా విస్తరిస్తూ వెళుతోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14 వరకు ఇళ్లలోనుంచి ఎవరూ బయటకు రావద్దని ప్రధానమంత్రి మోడీ (PM Modi) లాక్ డౌన్ విధించారు. అన్ని రాష్ట్రాలు ఈ లాక్ డౌన్ పాటిస్తున్నాయి. అయితే ఆర్మీలో (Indian Army) పనిచేస్తున్న వారి పరిస్థితి ఏంటి.. వారికి రక్షణ ఎలా అనే సందేహం అందరికీ రావచ్చు. ఈ నేపథ్యంలో ఆర్మీ కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ఆర్మీ చీఫ్ ప్రారంభించారు.
Infosys Software Engineer Arrest: కరోనాపై చెత్త పోస్ట్, జైలుపాలయిన ఇన్ఫోసిస్ ఐటీ ఉద్యోగి, ఉద్యోగం నుంచి తొలగించిన యాజమాన్యం, బెంగుళూరులో ఘటన
Hazarath Reddyఒకవైపు ప్రపంచమంతా కరోనా (Coronavirus) కల్లోలంతో భయకంపితులవుతోంది. మరీ ముఖ్యంగా శరవేగంగా పెరుగుతున్నకరోనా(COVID-19) పాజిటివ్ కేసులతో కర్ణాటక రాష్ట్రం అల్లకల్లోలమవుతోంది. ఈనేపథ్యంలో అక్కడ కరోనాను విస్తరింపజేయాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కటకటాలను (Infosys Software Engineer Arrest) లెక్కిస్తున్నాడు. అంతేకాదు ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకున్నాడు.
Covid-19 'Methanol Rumours': ఇది తాగితే కరోనావైరస్ చస్తుంది, ఇరాన్‌లో షికార్లు చేస్తున్న పుకార్లు, మెథనాల్‌ తాగి 400 మంది మృతి, 1000 మందికి పైగా అనారోగ్యం, వదంతులు నమ్మవద్దంటున్న వైద్యులు
Hazarath Reddyఇరాన్ లో కరోనావైరస్ కి విరుగుడు ఇదేనంటూ ఓ వార్త చక్కర్లు (Fake News Turns Fatal) కొడుతోంది. మెథనాల్‌ తాగితే (Drinking Methanol) కరోనాని అరికట్టవచ్చని అక్కడ ఫేక్ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కరోనాకు విరుగుడుగా ఇక్కడి ప్రజలు ఇండస్ట్రియల్‌ ఆల్కహాల్‌ను సేవిస్తుండటంతో పరిస్థితి విషమిస్తోంది. మెథనాల్‌ ను తాగడంతో ఈనాటివరకు ఇరాన్‌లో 400 మంది మరణించారు.
COVID-19 in India: ఇండియాలో 78 మంది రికవరీ, 873కి చేరిన కరోనా కేసులు, ఇప్పటివరకు 19 మంది కరోనా కాటుకు బలి, లోకల్ టెస్టింగ్ కిట్స్ అభివృద్ధి చేస్తున్న ఐసీఎంఆర్
Hazarath Reddyదేశంలో కరోనా వైరస్‌ (Coronavirus Outbreak in India) మహమ్మారి మెల్లిగా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 149 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో శనివారం ఉదయం నాటికి కరోనా బాధితుల సంఖ్య 873కు చేరింది. అదే విధంగా కోవిడ్‌-19 మరణాల సంఖ్య ( COVID-19 Deaths in India) 19కి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ఉదయం వెల్లడించింది.
Coronavirus in US: అమెరికా అల్లకల్లోలం, లక్ష దాటిన కరోనా కేసులు, న్యూయార్క్‌ను నాశనం చేస్తోన్న కరోనావైరస్, ప్రపంచ వ్యాప్తంగా 6 లక్షలకు చేరువలో కోవిడ్ 19 కేసులు
Hazarath Reddyచైనా.. ఇటలీ.. స్పెయిన్‌.. ఇలా ఒక్కో దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా వైరస్‌ ఇప్పుడు అమెరికాపై (America) అనూహ్యస్థాయిలో విరుచుకుపడుతున్నది. అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్ దెబ్బకు (Coronavirus Scare in US) విలవిలలాడుతోంది. అక్కడ కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య నిన్నటికి లక్ష (1,01,000) దాటేసింది. వారం రోజుల క్రితం ఈ సంఖ్య 8 వేలే ఉండగా ఇప్పుడు లక్షను దాటేసింది. గురువారం ఒక్క రోజే అమెరికాలో ఏకంగా 16,877 కొత్త కేసులు (COVID-19 Cases in US) నమోదయ్యాయి.
Ram Lalla Idol Shifting: అయోధ్యలో కీలక ఘట్టం, రామ జన్మభూమి ప్రాంగణంలోకి రాముని విగ్రహం, 9.5 కిలోల సింహాసనంపై రాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించిన యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్
Hazarath Reddyఅయోధ్యలో రామ మందిర నిర్మాణానికి (Ayodhya Ram Temple construction) సంబంధించి కీలక ఘట్టానికి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం (Uttar pradesh Govt) శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (CM Yogi Adityanath) అయోధ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చైత్ర నవరాత్రి పర్వదినం పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజామున పూజల అనంతరం రాముని విగ్రహాన్ని రామ జన్మభూమి ప్రాంగణంలోకి (Ram Lalla Idol Shifting) తరలించారు.
Coronavirus in US: అమెరికాలో కరోనా కల్లోలం, ఒక్కరోజులోనే 10 వేల కొత్త కేసులు, 622కి పెరిగిన మృతుల సంఖ్య, దక్షిణ కొరియా సాయం కోరిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
Hazarath Reddyఅగ్రరాజ్యాన్ని కరోనావైరస్ (Coronavirus) ముప్పతిప్పలు పెడుతోంది. ఆ దేశంలో 24 గంటల వ్యవధిలోనే పదివేల కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఆ దేశంలో కోవిడ్‌ (Covid-19) బాధితుల సంఖ్య 49,594కు చేరుకుంది. ఒకే రోజులోనే 130 మంది మరణించారు. దీంతో అమెరికాలో (America) మృతుల సంఖ్య 622కి పెరిగింది. కోవిడ్‌ కల్లోలానికి ప్రపంచ వ్యాప్తంగా 16,961 మంది ప్రాణాలు కోల్పోగా, 4 లక్షల మందికిపైగా వ్యాధి బారిన పడ్డారు. ప్రపంచం మొత్తమ్మీద సుమారు 175 దేశాలు, ప్రాంతాలు కరోనా కోరల్లో చిక్కుకున్నాయి.
Coronavirus Alert in AP: ఏపీలో కరోనాపై నియంత్రణ, మరోసారి సమగ్ర సర్వే, ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు నమోదు చేయాలని ఏపీ సీఎం వైయస్ జగన్ ఆదేశాలు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) రాష్ట్రవ్యాప్తంగా మరోసారి సమగ్ర సర్వే(Another Comprehensive survey) నిర్వహించనున్నారు. ప్రతి ఇంట్లో ఉన్నవారి ఆరోగ్య వివరాలనూ వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు నమోదు చేయనున్నారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP Chief Minister YS Jagan Mohan Reddy) ఆదేశించారు. ఇప్పటివరకూ విదేశాలనుంచి రాష్ట్రానికి వచ్చినవారు, వారితో కాంటాక్ట్‌ అయిన వారిపైనే కాకుండా ప్రజలందరి మీద కూడా దృష్టి పెట్టాలని సీఎం తెలిపారు.
Coronavirus: కరోనావైరస్‌ను ఇండియా తరిమేస్తుంది, ఆ సత్తా భారత్‌కు ఉంది, డబ్ల్యూహెచ్‌వో ఎగ్జిక్యూటివ్‌ డెరైక్టర్‌ మైకేల్‌ ర్యాన్‌ వెల్లడి, పాకిస్తాన్‌లో 959 కరోనా కేసులు
Hazarath Reddyకరోనా వైరస్‌ను (Deadly Coronavirus) ఎదుర్కోవడంలో భారత్‌ (India) చేపడుతున్న అసాధారణ, కఠిన చర్యలను ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి. గతంలో పోలియో, మశూచి (స్మాల్‌పాక్స్‌) వంటి పెద్ద మహమ్మారులను జయించిన భారత్‌ ప్రపంచానికే మార్గం చూపిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కితాబిచ్చింది. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలన్నీ భారత్‌కు ఉన్నాయని డబ్ల్యూహెచ్‌వో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మైకేల్‌ ర్యాన్‌ (WHO Executive Director Michael J Ryan) తెలిపారు.
Coronavirus in India: ఉగాది శుభవార్త, కరోనాపై ఇండియా ఘనవిజయం, 48 మంది పేషెంట్లు రికవరీ, మొత్తం కేసులు సంఖ్య 519, లాక్‌డౌన్‌తో తగ్గు ముఖం పడుతున్న కేసులు
Hazarath Reddyదేశ వ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) పంజా విసురుతున్న నేపథ్యంలో దాన్ని నియంత్రణకు ఇండియా (India) గట్టి చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే కరోనా (COVID-19) భారీన పడిన పేషంట్లు రికవరీ అవుతున్నారనే శుభవార్త ఉగాది (Ugadi) సంధర్భంగా వినిపించింది నియంత్రణతో పాటుగా పేషంట్లను మాములు స్థితికి (Covid-19 Patients Recovered) తీసుకువచ్చే విషయంలో ఇండియా ఓ అడుగు ముందుకేసిందని చెప్పవచ్చు.
Supreme Court Partially Closed: కరోనా భయం, సుప్రీంకోర్టు పాక్షిక మూసివేత, కేసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ, లాయర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుకు హాజరుకావాలి, ఆదేశాలు జారీ చేసిన సీజే
Hazarath Reddyదేశంలో కరోనా వైరస్‌ (Coronavirus) వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ( Supreme Court) కీలక ఆదేశాలు జారీచేసింది. సోమవారం సాయంత్రం 5.00 గంటలలోపు న్యాయవాదుల అన్ని చాంబర్లను సీల్ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్ఏ బాబ్డే (Chief Justice of India SA Bobde) ఆదేశించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్న తరుణంలో తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు వ్యక్తిగత వాదనలు ఉండవని స్పష్టం చేశారు.
Coronavirus Deaths in India: ముంబైలో మరో కరోనా మరణం, మృత్యువాత పడిన పిలిఫ్పిన్స్‌ దేశస్తుడు, దేశంలో ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య, పాజిటివ్ కేసులు 415, ఆందోళనకరంగా మహారాష్ట్ర
Hazarath Reddyభారతదేశంలో కరోనావైరస్ (Coronavirus Spreads) చాపకింద నీరులా విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్‌ కేసులు (Coronavirus Cases in India), మరణాలు పెరిగిపోతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 64 కొత్త కేసులు బయటపడ్డాయి. సోమవారం ఉదయం నాటికి కరోనా కేసుల సంఖ్య 415కు చేరినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ తెలిపింది. ప్రస్తుతం కరోనా మృతుల సంఖ్య (COVID-19 Deaths in India) ఎనిమిదికి చేరింది. మహారాష్ట్రలో (Maharashtra) పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. అక్కడ మూడో మరణం నమోదైంది.
Lockdown: లాక్‌డౌన్‌ అంటే ఏమిటి, ఏమి చేయవచ్చు..ఏమి చేయకూడదు, ఏ సర్వీసులు అందుబాటులో ఉంటాయి, లాక్‌డౌన్‌ ఎన్ని రకాలు, పూర్తి విశ్లేషణాత్మక కథనం
Hazarath Reddyకరోనావైరస్ మహమ్మారి (Deadly Coronavirus) ఇప్పుడు ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. దీని దెబ్బకు దేశాలకు దేశాలే లాక్‌డౌన్‌ (Lockdown) విధించుకుంటున్నాయి. ఇప్పుడు ఏ దేశంలో చూసినా వినిపిస్తున్న ఒకే ఒక పదం లాక్‌డౌన్‌. మొదటగా చైనాలోని వుహాన్‌ పట్టణంలో మొదలైన ఈ లాక్‌డౌన్‌ ఇప్పుడు అన్ని దేశాల్లోకి వచ్చేసింది. ఇండియా కూడా ఇప్పుడు లాక్‌డౌన్‌ వైపు చూస్తోంది. దేశంలో చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. ఇంతకీ లాక్‌డౌన్‌ (What Is Lockdown) అంటే ఏమిటీ. దాని వల్ల ఏం జరుగుతుంది. ఓ సారి చూద్దాం.
Coronavirus Lockdown: లాక్‌డౌన్ దిశగా ఇండియా, ఇప్పటికే లాక్‌డౌన్‌లో 8 రాష్ట్రాలు, దేశ వ్యాప్తంగా 80 జిల్లాల్లో లాక్‌డౌన్‌, అందుబాటులో అత్యవసర సేవలు మాత్రమే..
Hazarath Reddyకరోనా వైరస్‌ వ్యాప్తిని (Coronavirus Scare) అరికట్టడంలో భాగంగా నిన్న దేశ వ్యాప్తంగా ప్రజలంతా జనతా కర్ఫ్యూలో (Janata Curfew) భాగస్వాములై, విజయవంతం చేశారు.అయితే ఇది ఒక్కరోజుకు పరిమితం కాకుండా ఈ నెలాఖరు వరకు పాటించేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే 8 రాష్ట్రాలు స్వీయ నిర్భంధంలోకి వెళ్లాయి. ఈ నెలాఖరు వరకు 8 రాష్ట్రాలు స్వీయనిర్బంధంలో ఉండనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఢిల్లీ, రాజస్థాన్‌, బిహార్‌, నాగాలాండ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌ వంటి రాష్ట్రాలు ఈ నెల 31 అర్థరాత్రి వరకు లాక్‌డౌన్ విధించుకున్నాయి.
Italy Coronavirus Deaths: ఇటలీ మృత్యు ఘోష, కరోనా మరణాలు 5,476, పాజిటివ్ కేసులు 60 వేలకు దగ్గరలో, ప్రపంచవ్యాప్తంగా 13 వేలకు పైగా కోవిడ్-19 మరణాలు
Hazarath Reddyకరోనావైరస్ ఇటలీ, ఇరాన్‌, స్పెయిన్‌ దేశాల్లో విలయతాండవం చేస్తున్నది. ఇటలీలో ఇప్పటివరకు 5,476 మం ది మృత్యువాత (Italy Coronavirus Deaths) పడ్డారు. శనివారం ఒక్కరోజే 793 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్‌ (Coronavirus) వెలుగులోకి వచ్చాక ఒక దేశంలో ఇంతమంది మృతి చెందడం ఇదే తొలిసారి. ఇటలీలో (Italy) జనవరి 31న తొలికేసు నమోదుకాగా, నెలలోపే వైరస్‌ దేశమంతా వ్యాపించింది. పరిస్థితి చేయిదాటుతుండడంతో ఆలస్యంగా మేల్కొన్న సర్కారు (Italy Govt) ఈ నెల 10న దేశవ్యాప్త దిగ్బంధం ప్రకటించింది. అయినప్పటికీ గత రెండు రోజుల్లోనే దాదాపు 1,420 మంది మరణించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
AP Lockdown: మార్చి 31 వరకు ఏపీ లాక్‌డౌన్, అత్యవసర సేవలు మినహా అన్ని రకాల సేవలు నిలిపివేత, ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలి, మీడియాతో ఏపీ సీఎం వైయస్ జగన్
Hazarath Reddyకరోనా వైరస్ (Coronavirus) తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ఏపీ సర్కారు (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 వరకు రాష్ట్రాన్ని లాక్ డౌన్ (AP Lockdown) చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS jagan) ప్రకటించారు. అత్యవసర సేవలు మినహా అన్ని రకాల సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. మార్చి 31 వరకు ప్రజలందరూ తమ ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. పదిమంది కంటే ఎక్కువ మంది గుమిగూడొద్దని హెచ్చరించారు. రాష్ట్ర సరిహద్దులన్నింటినీ మూసేస్తున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ కూలీలు మాత్రం పొలం పనులకు వెళ్లినప్పుడు రెండు మీటర్ల దూరం ఉండేట్లు చూసుకోవాలన్నారు.
All Passenger Trains Cancelled: దేశ వ్యాప్తంగా రైళ్లు బంద్, ఈ నెల 31 వరకు అన్ని ప్యాసింజర్ రైళ్లు రద్దు, తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం, కరోనా విశ్వరూపంతో అలర్ట్ అయిన కేంద్రం
Hazarath Reddyకరోనావైరస్ కట్టడికి అనేక చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం (Central govt) తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అన్ని ప్యాసింజర్ రైలు సర్వీసులు (All Passenger Trains Cancelled) నిలిపివేసింది. మార్చి 31వ తేదీ వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది. మార్చి 31 తర్వాత పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం ఉంటుందని కేంద్రం తెలిపింది. అయితే గూడ్స్ రైళ్లు మాత్రం యధావిధిగా నడుస్తాయని కేంద్రం వెల్లడించింది.