Information

Health Tips: వీర్య స్కలనం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? తరచూ హస్త ప్రయోగం ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందా, సైంటిస్టులు ఏమంటున్నారంటే..

Hazarath Reddy

భావప్రాప్తి అనేది ఒక ఆహ్లాదకరమైన అనుభవం. కొద్ది సెకన్ల పాటు మీ కండరాలు సంకోచించబడతాయి, మీ స్పృహ మారుతుంది. సామాజిక బంధాన్ని ప్రోత్సహించే రెండు హార్మోన్ల (ఆక్సిటోసిన్, ప్రోలాక్టిన్) రక్త స్థాయిలు పెరుగుతాయి.

Heatwave Ends in India: మండే ఎండలకు ఇక సెలవు, దేశంలో హీట్ వేవ్ ముగిసిందంటూ చల్లని కబురును చెప్పిన ఐఎండీ, ఇక నుంచి వర్షాలు కురుస్తాయని వెల్లడి

Hazarath Reddy

గత కొన్ని వారాలుగా భారత్‌ను పట్టి పీడిస్తున్న వేడిగాలులకు ఎట్టకేలకు (Heatwave Ends in India) తెరపడింది. ఈరోజు నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని, ఢిల్లీలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది.ఈ ప్రాంతంలో వర్షపాతం లేకపోవడం, అధిక పీడన వ్యవస్థతో సహా కారకాల కలయిక వల్ల హీట్ వేవ్ ఏర్పడిందని IMD తెలిపింది.

HC on Forcibly Seize Vehicles: ఈఎంఐ కట్టకపోతే రికవరీ ఏజెంట్లు వాహనం ఎత్తుకెళ్లడం చట్టవిరుద్ధం, వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులకు పాట్నా హైకోర్టు ఆదేశాలు

Hazarath Reddy

రుణ ఈఎంఐ కట్టకపోతే ఏజెంట్ల సాయంతో బలవంతంగా వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం చట్టవిరుద్ధమైన చర్యగా పాట్నా హైకోర్టు ప్రకటించింది. ‘‘రికవరీ ఏజెంట్లు వాహనాలను సీజ్ చేయడం చట్టవిరుద్ధం. జీవనం, ఉపాధికి సంబంధించి ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు కిందకు వస్తుంది’’ అని జస్టిస్ రాజీవ్ రంజన్ ప్రసాద్ తీర్పు చెప్పారు.

AP Weather Report: ఏపీ వాతావరణం రిపోర్ట్ ఇదిగో, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో వేడిగాలులు, ప్రజలు, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన

Hazarath Reddy

ఏపీలో వాతావరణంపై ఏపీ వెదర్ డిపార్ట్ మెంట్ అప్ డేట్ ఇచ్చింది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అందించిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. పలు జిల్లాలో వర్షాలు పడతాయని, మరి కొన్ని జిల్లాల్లో ఎండలు ఎక్కువగా కాస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement

AP High Court on Children: పిల్లల్ని అత్తమామల దగ్గర నుంచి తండ్రి తీసుకువెళితే కిడ్నాప్ కిందకు రాదు, తండ్రి వారికి చట్టబద్ధ సంరక్షకుడని తెలిపిన ఏపీ హైకోర్టు

Hazarath Reddy

పిల్లలను అత్తమామల నుంచి తీసుకువెళ్లిన కేసులో తండ్రికి ఏపీ హైకోర్టు ఊరటనిచ్చింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అత్తమామల నుంచి పిల్లల్ని తండ్రి తీసుకెళ్లడం కిడ్నాప్‌ కాదని తీర్పు ఇచ్చింది. సున్నీ మహ్మదీయ చట్టం ప్రకారం పిల్లలకు తండ్రి చట్టబద్ధ సంరక్షకుడని గుర్తుచేసింది

TS EAMCET 2023 Results Out: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల, విద్యార్థులు తమ రిజల్ట్స్‌ను eamcet.tsche.ac.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి (ఉన్నత విద్య) వాకాటి కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్‌ మిట్టల్‌, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్ లింబాద్రి విడుదల చేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ eamcet.tsche.ac.inలో ఫలితాలను తనిఖీ చేయవచ్చు.

TS EAMCET Results 2023: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల రేపే, ఉదయం 9:30 గంటలకే విద్యార్థులు అలర్ట్ కావాలి, ఫలితాల సమయంలో మార్పు చేసినట్లు తెలిపిన అధికారులు

Hazarath Reddy

జవహర్‌లాల్‌ నెహ్రూ అగ్రికల్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీలో ఉదయం 9.30 గంటలకు ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి (ఉన్నత విద్య) వాకాటి కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్‌ మిట్టల్‌, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్ లింబాద్రి విడుదల చేయనున్నారు.

193 Free Poll Symbols: గాజులు నుంచి లాగుడు బండి దాకా, ఇండిపెండెంట్ అభ్యర్థుల కోసం 193 ఫ్రీ గుర్తులను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

Hazarath Reddy

కేంద్ర ఎన్నికల సంఘం వివిధ పార్టీలకు గుర్తులను ఖరారు చేయడం తెలిసిందే. అదే సమయంలో ఆటో, టోపీ, ట్రక్కు, ఇస్త్రీ పెట్టె వంటి పలు గుర్తులపై నిషేధం విధించింది. ఆ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలో, 193 ఫ్రీ గుర్తులను కూడా ఎన్నికల సంఘం విడుదల చేసింది

Advertisement

UPSC IAS Final Results 2022 Declared: యూపీఎస్‌సీ సివిల్‌ సర్వీసెస్‌ 2022 ఫలితాలు విడుదల, ఆలిండియా టాపర్‌గా నిలిచిన ఇషితా కిషోర్‌

Hazarath Reddy

UPSC నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌ – 2022 ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 933 మంది ఈ పరీక్షల ద్వారా వివిధ సర్వీసులకు ఎంపికయ్యారు. వారిలో ఇషితా కిషోర్‌ అనే యువతి ఆలిండియా టాపర్‌గా నిలిచారు.

Rs 2000 Note Exchange: రూ. 2 వేల నోట్లు మార్చుకోవాలంటే ఆధార్ కార్డు అవసరమా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్లారిఫికేషన్ ఇదిగో..

Hazarath Reddy

రూ.2000 కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు ఆధార్ కార్డు అవసరం లేదని, అధికారిక ధ్రువీకరించిన పత్రాలు ఏమీ ఉండవని పంజాబ్ నేషనల్ బ్యాంక్ మంగళవారం తెలిపింది. అలాంటివి అడగవద్దని బ్యాంకు దాని శాఖలను ఆదేశించింది. ఎలాంటి ఫారమ్‌ను పూరించాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసింది.

Rs. 2000 Note Withdrawn: నేటి నుంచి రూ. 2000 నోటు మార్పిడి షురూ.. 55 వేల బ్యాంక్‌ బ్రాంచీలు రెడీ.. రోజుకు ఎన్ని మార్చుకోవచ్చంటే??

Rudra

2 వేల నోటు వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటన చేసి నాలుగు రోజులైనా.. డిపాజిట్లు మొదలయ్యేది మాత్రం మరికాసేపట్లోనే. ఇదే ఇప్పుడు అసలు కథ. ముందు జాగ్రత్తగానే ఆర్‌బీఐ కూడా అలర్ట్‌ అయింది. గతంలో ఉన్న అనుభవాలను మళ్లీ పునారావృతం కాకుండా ప్రత్యేక ప్రకటన చేసింది.

Rains In Telangana: తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు... పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ కూడా

Rudra

తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణలో వచ్చే మూడ్రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచన చేసింది. తూర్పు తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Advertisement

RBI Governor on 1,000 Notes: మళ్లీ రూ.1000 నోట్లు చలామణిలోకి వస్తున్నాయా, వైరల్ అవుతున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన RBI గవర్నర్ శక్తికాంత దాస్

Hazarath Reddy

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) రూ. 2,000 నోట్ల ఉపసంహరణ తర్వాత ప్రభావాన్ని తగ్గించడానికి రూ. 1,000 బ్యాంకు నోట్లను తిరిగి ప్రవేశపెట్టే ప్రణాళిక లేదని RBI గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. రూ వేయి నోట్లు ప్రవేశపెడుతున్నారనే నివేదికలను "ఊహాజనితం" అంటూ కొట్టిపారేశారు.

Rs 2000 Notes Deposit in Bank: రూ.2000 నోట్లు రూ. 50 వేల పైన డిపాజిట్ చేయాలంటే పాన్ కార్డు తప్పని సరి, ఈ మొత్తానికి ఆదాయపు పన్నువర్తిస్తుందని తెలిపిన ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్

Hazarath Reddy

బ్యాంకు ఖాతాల్లో రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్లకు ప్రస్తుత ఆదాయపు పన్ను ఆవశ్యకత రూ.2,000 నోట్లపై కూడా వర్తిస్తుందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. రూ. 2000 నోట్లలో రూ. 50,000 కంటే ఎక్కువ డిపాజిట్ చేయడానికి పాన్ కార్డ్ అవసరమని ఆయన అన్నారు.

RBI Governor on Rs 2,000 Note: ప్రస్తుత ఆదాయపు పన్ను నిబంధన రూ. 2,000 నోట్లకు కూడా వర్తిస్తుంది, ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సోమవారం నాడు రూ. 2,000 నోట్లను, అత్యధిక విలువ కలిగిన కరెన్సీ నోటును చలామణి నుండి ఉపసంహరించుకోవాలని తీసుకున్న నిర్ణయం సెంట్రల్ బ్యాంక్ యొక్క కరెన్సీ నిర్వహణ కార్యకలాపాలలో ఒక భాగమని తెలిపింది.

Rs 2000 Note Exchange: రేపటి నుంచి ఏ బ్యాంకులోనైనా రూ.2000 నోట్లు మార్చుకోవచ్చు, బ్యాంక్ కౌంటర్లలో ఇంతకు ముందు లాగే సేవలు అందించనున్న బ్యాంకులు

Hazarath Reddy

బ్యాంక్ కౌంటర్‌లో రూ. 2000 నోట్లను మార్చుకునే సదుపాయం సాధారణ పద్ధతిలో ప్రజలకు అందించబడుతుంది, అంటే ఇంతకుముందు అందించిన విధంగానే ఈ సేవలు అందిచడం జరుగుతుందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI)తెలిపింది. రూ. 2000 నోట్లను ఇతర డినామినేషన్‌ల నోట్లలోకి మార్చుకోవడానికి రేపు, మే 23 నుండి ఏ బ్యాంక్‌లోనైనా ఒకేసారి రూ. 20,000 పరిమితి వరకు మార్చుకోవచ్చు.

Advertisement

Rains In AP: ఏపీకి చల్లని కబురు.. నేడు పలుచోట్ల వర్షాలు.. ఈదురు గాలులు, పిడుగులు పడే అవకాశం ఉన్నదన్న ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక

Rudra

మండుటెండలు, వడగాలులతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Special Trains For Summer: వేసవి కోసం రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు.. 380 ప్రత్యేక రైళ్లు సిద్ధం.. దేశంలోని ప్రధాన కేంద్రాల మీదుగా 6,369 ట్రిప్పుల నిర్వహణకు నిర్ణయం

Rudra

వేసవిలో ప్రయాణాలు, టూర్స్, ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు రైల్వే శాఖ ఎప్పటిలాగే ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయించింది. మొత్తం 380 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Toor Dal Price Hike: దేశంలో కందిపప్పు కొరత.. కొండెక్కిన ధర.. దుకాణాల్లో దర్శనమిస్తున్న నోస్టాక్ బోర్డులు.. ప్రస్తుతం కిలో కందిపప్పును రూ. 140కి విక్రయిస్తున్న వైనం

Rudra

పెట్రోల్, గ్యాస్ ధరలతో ఇప్పటికే కుదేలైన సామాన్యులను.. ఇప్పుడు కందిపప్పు ధరలు భయపెడుతున్నాయి. డిమాండ్‌కు సరిపడా కందిపప్పు అందుబాటులో లేకపోవడంతో దేశవ్యాప్తంగా సూపర్ మార్కెట్లు సహా కిరాణా దుకాణాల్లోనూ నోస్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి.

How To Exchange Rs 2000 Notes? 2000 రూపాయల నోట్లను ఎలా మార్చుకోవాలి, ఏ తేదీ లోపల మార్చుకోవాలని ఆర్ బీఐ చెప్పింది, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

కేంద్రబ్యాంకు రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది.చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లను ఉపసంహరిస్తూ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. వినియోగదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement
Advertisement