Information

Rs 2,000 Notes To Be Withdrawn: మే 23 నుంచి సెప్టెంబరు 30లోగా రెండు వేల రూపాయల నోట్లు మార్చుకోండి, వినియోగదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులు ఆదేశాలు జారీ చేసిన ఆర్‌బీఐ

Hazarath Reddy

కేంద్రబ్యాంకు రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది.చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లను ఉపసంహరిస్తూ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. వినియోగదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది

Telangana Weather Forecast: తెలంగాణ ప్రజలకు చల్లని కబురు, రాబోయే మూడు రోజుల్లో వర్షాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోకి చేరిన నైరుతి రుతుపవనాలు

Hazarath Reddy

తెలంగాణలో మండే ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది

Andhra Pradesh Weather Report: ఏపీని వణికిస్తున్న భానుడు, నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత, 33 మండలాలకు వడగాడ్పుల హెచ్చరిక

Hazarath Reddy

ఏపీ రాష్ట్రంలో భానుడు భగభగలాడుతున్నాడు. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వేడిగాలులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గురు­వారం ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరులో అత్యధికంగా 45.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది.

IMD Weather Update: ఐఎండీ లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో, 5 రాష్ట్రాలకు హీట్ వేవ్ హెచ్చరిక, తొమ్మిది రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక, తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం రిపోర్ట్ ఇదే..

Hazarath Reddy

దేశంలో భానుడు భగభగమంటున్నాడు.ప్రతిరోజు 40 నుంచి 45 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.ఇప్పటికే ఎండలతో జనం మాడిమసైపోతుంటే రాగల మూడు నాలుగు రోజుల్లో ఐదు రాష్ట్రాల్లో ఎండలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరించింది.

Advertisement

SCR Cancels 17 Trains: రైల్వే ప్రయాణికులకు గమనిక, రేపు,ఎల్లుండి 17 రైళ్లు రద్దు చేసిన ఎస్‌సీఆర్, మరికొన్ని ప్రధాన రైళ్లు భారీ ఆలస్యం, రద్దయిన రైళ్ల పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

సికింద్రాబాద్‌(Secunderabad) నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించే రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. ఈనెల 20, 21 తేదీల్లో 17 రైళ్లు రద్దు కాగా.. ఇంకొన్ని ప్రధాన రైళ్ల సర్వీసులు ఆలస్యంగా నడవనున్నాయి.చర్లపల్లి టెర్మినల్‌ వద్ద ఆర్‌యూసీ నిర్మాణ పనుల దృష్ట్యా ఈ నెల 21న ఆ మార్గంలో నడిచే 17 రైళ్లను రద్దు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

Setting Up 8 New Cities Across India: భారత్‌లో 8 కొత్త నగరాల ఏర్పాటు దిశగా కేంద్రం.. ప్రస్తుతం పట్టణాలపై జనాభా ఒత్తిడి తగ్గించేందుకే..

Rudra

నగరాలకు వలస వెళ్తున్న జనాభా అంతకంతకూ పెరిగిపోతున్నది. దీంతో ప్రస్తుతమున్న నగరాలపై జనాభా ఒత్తిడి పెరిగిపోతుంది. దీంతో దేశంలో మొత్తం ఎనిమిది నగరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తాజాగా వెల్లడించారు.

RBI's Remittance Scheme and TCS: ఎల్ఆర్ ఎస్ కిందకు ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్స్.. ఆర్బీఐ అనుమతి లేకుండా 2.50 లక్షల డాలర్ల వరకు పంపే వెసులుబాటు.. కేంద్రం నోటిఫికేషన్

Rudra

విదేశాల్లో ఉన్న బంధువులు, స్నేహితులకు డబ్బులు పంపించే వారికి శుభవార్త. ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్స్ తో విదేశీ కరెన్సీతో నిర్వహించే లావాదేవీలను ఆర్బీఐ సరళీకృత చెల్లింపు పథకం (ఎల్ఆర్ఎస్) కిందకు తీసుకొస్తున్నట్టు కేంద్రం తెలిపింది.

Summer Rush at Tirumala: తిరుమల వెళ్లే వారికి అలర్ట్, దర్శనానికి 36 గంటల సమయం, మూడు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు

Hazarath Reddy

వేసవి సెలవుల కారణంగా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో తిరుమల ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో అన్నీ కంపార్ట్‌మెంట్లు,షెడ్లు కిక్కిరిసిపోయాయి

Advertisement

Mahila Samman Certificate Scheme: మహిళలకు మోదీ సర్కారు శుభవార్త, మహిళా సమ్మాన్‌ పథకంపై నో టీడీఎస్, పెట్టుబడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

కేంద్ర సర్కారు 2023–24 బడ్జెట్‌లో మహిళా సమ్మాన్‌ (Mahila Samman Scheme) పేరుతో ప్రత్యేక డిపాజిట్‌ పథకాన్ని ప్రకటించింది. గరిష్టంగా రూ.2 లక్షల వరకు ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. వార్షిక వడ్డీ 7.5 శాతం. రెండేళ్లకు గడువు ముగుస్తుంది. మహిళల కోసమే ఈ డిపాజిట్‌ను తీసుకొచ్చింది

TS High Court Recruitment 2023: రూ.90 వేలకు పైగా జీతంతో తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు, మూడు విభాగాల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

నిరుద్యోగులకు తెలంగాణ హైకోర్టు శుభవార్తను తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-3 పోస్టుల భర్తీకి తెలంగాణ హైకోర్టు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

Weather Update: ఎండలతో అల్లాడిపోతున్న ఏపీ ప్రజలకు శుభవార్త, రాగల ఐదు రోజుల పాటు తేలికపాటి వర్షాలు, జూన్‌ 15వ తేదీ నాటికి రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ఆగమనం

Hazarath Reddy

ఎండలతో అల్లాడిపోతున్న ఏపీ ప్రజలకు భారత వాతావరణ శాఖ శుభవార్తను తెలిపింది. కోస్తా నుంచి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోందని.. దీని ప్రభావంతో రాగల ఐదు రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

TSRTC: ఎల‌క్ట్రిక్ ఈ-గ‌రుడ బ‌స్సుల్లో విజ‌య‌వాడ వెళ్లే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్, నెల రోజుల పాటు బస్సు ఛార్జీలను తగ్గించిన టీఎస్‌ఆర్టీసీ

Hazarath Reddy

హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ వెళ్లే ప్ర‌యాణికుల‌కు టీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్ వినిపించింది. ఆర్టీసీ ఎల‌క్ట్రిక్ ఈ-గ‌రుడ బ‌స్సుల ఛార్జీల‌ను త‌గ్గిస్తున్న‌ట్లు ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ ప్ర‌క‌టించారు.

Advertisement

TS Inter Supplementary Exam Date 2023: జూన్ 12 నుంచి ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు, టైం టేబుల్‌ను విడుద‌ల చేసిన ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు

Hazarath Reddy

మే 9వ తేదీన తెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఫ‌లితాలు విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ ప‌రీక్ష‌ల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం జూన్ 12 నుంచి ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు బుధ‌వారం ప్ర‌క‌టించింది.

Central Govt Jobs: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త, NPCIL 129 పోస్టులను రిక్రూట్ చేస్తుంది, అర్హత ఏంటో తెలుసుకోండి

kanha

ఉద్యోగాల కోసం చాలా కాలంగా రిక్రూట్‌మెంట్ కోసం వెతుకుతున్న యువతకు శుభవార్త. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL)లో ఉద్యోగం పొందడానికి అర్హులైన అభ్యర్థులకు సువర్ణావకాశం ఉంది. NPCIL వివిధ విభాగాలలో డిప్యూటీ మేనేజర్ మరియు జూనియర్ హిందీ అనువాదకుల 129 పోస్టులను నియమించింది.

Soaring Temperatures: అత్యవసరమైతేనే బయటకు రండి, పగలు బయటకు రావద్దని హెచ్చరించిన వాతావరణ శాఖ, తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగలు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగమంటున్నాడు. రెండు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత రెండు మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం (ఐఎండీ) ప్రకటించింది.

BSF Recruitment 2023: జస్ట్ 10th పాసయితే చాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందండి..నెలకు రూ.81000 జీతం లభిస్తుంది

kanha

సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్)లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు సువర్ణావకాశం వచ్చింది. దీని కోసం, BSF హెడ్ కానిస్టేబుల్ (HC) పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులను కోరింది.

Advertisement

Monsoon Forecast 2023: ఈ సారి కాస్త ఆలస్యంగా వ‌ర్షాకాలం, జూన్ 4న కేర‌ళ‌కు నైరుతీ రుతుప‌వ‌నాలు, 4 రోజులు లేట్‌గా రుతుప‌వ‌నాలు రానున్న‌ట్లు తెలిపిన ఐఎండీ

Hazarath Reddy

కేరళలో రుతుపవనాలు జూన్ 4న ప్రారంభమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) మంగళవారం తెలిపింది, స్వల్ప ఆలస్యాన్ని హైలైట్ చేసింది. నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1న ఏడు రోజుల ప్రామాణిక విచలనంతో కేరళ మీదుగా అస్తమిస్తాయి.

Temperatures Soar In Telugu States: నిప్పుల కొలిమిలో తెలుగు రాష్ట్రాలు, రాజమండ్రిలో అత్యధికంగా 49 డిగ్రీల ఉష్ణోగ్రత, మరో 3 రోజులు బయటకు రావొద్దని హెచ్చరికలు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. మరో మూడు రోజులపాటు ఇదే తీవ్రతతో కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. పగటిపూటే కాదు.. రాత్రి పూట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని చెబుతోంది.

DOST Admission 2023: తెలంగాణలో డిగ్రీ కాలేజీలో సీట్ల కోసం నేటి నుంచి దోస్త్‌ అడ్మిషన్ల ప్రక్రియ, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలాగో ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో సీట్లను భర్తీ చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇప్పటికే డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అందులో భాగంగా నేటి నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది.

Electric AC Bus: నేటి నుంచే హైదరాబాద్ నుంచి విజయవాడకు ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు, ప్రతి 20 నిమిషాలకు ఒకటి చొప్పున బస్సు

Hazarath Reddy

రాష్ట్రంలో పర్యావరణహితమైన ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌ నుంచి విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను ‘ఈ–గరుడ’ పేరుతో నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ప్రతి 20 నిమిషాలకు ఒకటి చొప్పున ఈ బస్సులను నడపనున్నా­రు.

Advertisement
Advertisement