Information

New Traffic Rules In Hyd: రాంగ్ రూట్ లో వచ్చే వాహనాలకు రూ. 1,700 ఫైన్.. ట్రిపుల్ రైడింగ్ కు రూ. 1,200 జరిమానా.. హైదరాబాద్ లో నేటి నుంచి ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం!

Rudra

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేవారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపనున్నారు. అవును. ఇప్పటికే పలు కఠిన నిబంధనలను అమలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు... ఈ రోజు నుంచి స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించబోతున్నారు. ఆ వివరాలు ఏంటంటే?

WHO Measles Updates: తట్టు సోకిన వ్యక్తి ద్వారా మరో 18 మందికి వైరస్ సోకే ప్రమాదం.. డబ్లూహెచ్ వో వెల్లడించిన మరిన్ని ముఖ్యాంశాలు ఏమిటంటే?

Rudra

ప్రపంచవ్యాప్తంగా తట్టు కేసులు అంతకంతకూ పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తున్నదని, ఈ వైరస్ కారణంగా లక్షలాది మంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్ వో) తెలిపింది. తట్టు సోకిన ఓ వ్యక్తి కారణంగా 12 నుంచి 18 మందికి ఈ వ్యాధి సోకొచ్చని హెచ్చరించింది.

Sabarimala Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్.. మరో 38 ప్రత్యేక రైళ్లను సిద్ధం చేస్తున్న దక్షిణమధ్య రైల్వే.. డిసెంబరు, జనవరి నెలల్లో అందుబాటులోకి

Rudra

శబరిమల భక్తుల సౌకర్యార్థం డిసెంబరు, జనవరి నెలలో 38 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్, నర్సాపూర్ నుంచి ఇవి అందుబాటులో ఉండనున్నాయి.

UIDAI Update: ఆధార్ దుర్వినియోగంపై రాష్ట్రాలకు కేంద్రం సూచన, ఆధార్‌ను గుర్తింపు ధ్రువీక‌ర‌ణ‌గా ఆమోదించే ముందు దానిని పరిశీలించాలని ఆదేశాలు

Hazarath Reddy

ఇది మోస‌గాళ్ళు, సామాజిక వ్య‌తిరేక శ‌క్తులు దుర్వినియోగం చేసే అవ‌కాశాన్ని నిరోధిస్తుంది. ఇది ఆరోగ్య‌వంత‌మైన వినియోగాన్ని ప్రోత్స‌హించ‌డ‌మే కాక ప్ర‌తి 12 అంకెల సంఖ్య ఆధార్ కాద‌న్న యుఐడిఎఐ వైఖ‌రిని పున‌రుద్ఘాటిస్తుంది.

Advertisement

EPFO Wage Ceiling Changes: వేతన జీవులకు శుభవార్త.. వేతన సీలింగ్ సవరణకు ఈపీఎఫ్‌వో రెడీ.. వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ. 21 వేలకు పెంచే యోచన.. 75 లక్షల మందికి లబ్ధి.. రిటైర్మెంట్ సమయంలో పెద్దమొత్తంలో ఉద్యోగుల చేతికి సొమ్ము

Rudra

పెరుగుతున్న ధరలతో సతమతమవుతూ, భవిష్యత్తు ఆర్థిక అవసరాలు తీరేదెలా అంటూ ఆందోళన పడుతున్న వేతన జీవులకు ఇది నిజంగా శుభవార్తే. పెన్షన్ పథకానికి సంబంధించి ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితి(సీలింగ్)ని పెంచాలని ఈపీఎఫ్‌వో నిర్ణయించినట్టు ప్రాథమికంగా తెలుస్తున్నది.

TTD: వ‌యోవృద్ధులైన శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త, ఈ నెల 24న డిసెంబరు నెల ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టికెట్ల కోటా విడుదల, ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని కోరిన టీటీడీ అధికారులు

Hazarath Reddy

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న భక్తులకు (senior citizens on Nov 24) వీలుగా డిసెంబరు నెల ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టోకెన్ల కోటాను (TTD to release December’s quota) ఈనెల 24 న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

JEE Main 2023: జేఈఈ మెయిన్‌ 2023 నోటిఫికేషన్ అలర్ట్, వచ్చే వారం విడుదల కానుందని వార్తలు, పరీక్షలు తొలి విడత జనవరిలో, రెండో విడత ఏప్రిల్‌లో నిర్వహించే అవకాశం

Hazarath Reddy

జేఈఈ మెయిన్‌ 2023 నోటిఫికేషన్‌ ఈ వారంలో విడుదల చేసే అవకాశంలేదని, వచ్చే వారంలో (నవంబర్‌ 30నాటికి) పరీక్ష తేదీలు వెల్లడించే అవకాశం ఉందని సంబంధిత అధికారులు పేర్కొన్నట్టు సమాచారం.

Weather Forecast: బలహీనపడిన వాయుగుండం, ఏపీకి తప్పిన భారీ వర్షాల ముప్పు, నెల్లూరు జిల్లాలో మాత్రమే భారీ వర్షాలు కురిసే అవకాశం

Hazarath Reddy

బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మంగళవారం బలహీనపడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం, దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరం సమీపంలో కొనసాగుతోంది.

Advertisement

PM Kisan Samman Nidhi: పీఎం కిసాన్ అనర్హుల ఏరివేతకు కొత్త రూల్స్, అక్రమార్కుల నుండి డబ్బుల రికవరీకి కేంద్ర ప్రభుత్వం చర్యలు, సొమ్ముల రికవరీతో పాటు కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

Hazarath Reddy

కేంద్ర అన్నదాతలకు అందిస్తున్న పిఎం కిసాన్ (PM Kisan Samman Nidhi) రైతుల వినియోగదారుల సంఖ్య 10 కోట్లు దాటింది. ఈ సమాచారం కేంద్ర ప్రభుత్వమే సోమవారం ఇచ్చింది. 2019 ప్రారంభంలో 3.16 కోట్లుగా ఉన్న ఈ సంఖ్య 2022 నాటికి మూడింతలు (PM-KISAN Scheme Crossed 10 Crore) పెరిగింది.

Larsen & Toubro: భారీగా ఉద్యోగాలు, ఎల్‌అండ్‌టీ 3000 మంది ఇంజినీరింగ్‌ ట్రెయినీలు నియామకం, వీరిలో మహిళా ఉద్యోగులే ఎక్కువ

Hazarath Reddy

నిర్మాణ రంగ దిగ్గజం లార్సన్‌ అండ్‌ టూబ్రో (ఎల్‌అండ్‌టీ) నిరుద్యోగులకు శుభవార్తను అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3,000 మంది పైచిలుకు ఇంజినీరింగ్‌ ట్రెయినీలను తీసుకున్నట్లు వెల్లడించింది. వీరిలో తాజా గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్లు ఉన్నట్లు తెలిపింది.

Weather Forecast: గంటకు 25 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న వాయుగుండం, దక్షిణ కోస్తాంధ్ర వైపు దూసుకొస్తుందని ఐఎండీ వెల్లడి, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు

Hazarath Reddy

నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ఇది గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వాయవ్యదిశగా కదులుతోంది. ఇది సోమవారం అర్ధరాత్రి తర్వాత నుంచి పశ్చిమ వాయవ్యదిశగా పయనిస్తూ దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది.

Layoffs In Tech Companies: మొన్న ట్విట్టర్, మెటా, నిన్న లైఫ్ట్, ఫిన్ టెక్, అమెజాన్, నేడు జొమాటో.. ప్రతిష్టాత్మక సంస్థల్లో ఉద్యోగులను ఎందుకు తొలగిస్తున్నారు? మరో ఆర్ధిక మాంద్యానికి ఇది సంకేతమా? నిపుణులు ఏమంటున్నారు??

Rudra

దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది. ఇప్పటికే ట్విట్టర్, మెటా, అమెజాన్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు భారీ స్థాయిలో ఉద్యోగుల్ని తొలగించగా, ఇప్పుడు జొమాటో కూడా అదే బాటపట్టింది. తాజా నిర్ణయం ద్వారా కంపెనీ నుంచి కనీసం 3 శాతం ఉద్యోగుల్ని తొలగించినట్లుగా జొమాటో ప్రకటించింది.

Advertisement

Twitter Hiring: ట్విట్టర్ లో ఉద్యోగుల తొలగింపునకు బై బై.. ఇకపై కొత్త నియామకాలు చేపడుతాం.. ఎలాన్ మస్క్ కీలక ప్రకటన

Rudra

ట్విట్టర్ పగ్గాలు చేపట్టిన మూడు వారాల్లోనే ఏకంగా 7,500 మంది ఉద్యోగులను ఇంటికి పంపించిన ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. ఇకపై ఉద్యోగుల తొలగింపు ఉండబోదని, త్వరలో కొత్త నియామకాలు చేపడుతామని ప్రకటించారు.

Offline UPI Payments: ఇంటర్నెట్ లేకుండా యూపీఐ పేమెంట్స్ చేయవచ్చని తెలుసా, ఈ సింపుల్ స్టెప్స్ ద్వారా నెట్ లేకుండా మీరు ఎవరికైనా డబ్బులు పంపుకోండి

Hazarath Reddy

నగదు బదిలీల కోసం అందరూ UPI చెల్లింపులపై ఆధారపడుతున్నారు. అయితే ఇంటర్నెట్ సమస్య అందరినీ వేధిస్తూ ఉంది. నగదు బదిలీల కోసం చాలా వరకు UPI చెల్లింపులపై వస్తూ ఉండటంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే నెట్‌వర్క్‌తో పనిలేకుండా కేవలం ఆఫ్‌లైన్ ప్రక్రియతో డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేసే కొత్త సర్వీసును NPCI అందుబాటులోకి వచ్చింది.

Cold Wave in Telugu States: వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు.. రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. 2017 తర్వాత నవంబరులో తెలంగాణలో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. రానున్న 48 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు

Rudra

తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరిగి జనం గజగజ వణుకుతున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం స్థిరంగా కొనసాగుతున్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.

Cold Wave In Telugu States: చ.. చ.. చలి.. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత.. ఉత్తర భారతం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో అంతకంతకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. ఇవాళ, రేపు చలి మరింతగా ప్రభావం.. దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు పడొచ్చన్న వాతావరణశాఖ

Rudra

పెరిగిన చలి తీవ్రతతో తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో ఇరు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పడిపోతున్నాయి. పగటిపూట సైతం చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఇవాళ, రేపు చలి మరింతగా ప్రభావం చూపెడుతుందని వాతావరణశాఖ తెలిపింది.

Advertisement

Aadhaar-Pan Linking: ఆధార్ కార్డు, పాన్ కార్డు లింక్ కు చివరి తేదీ ఇదే.. ఆ తర్వాత చేయాలంటే భారీ జరిమానా.. మరోసారి గడువు తేదీ పొడిగించేది లేదన్న ఆదాయపు పన్ను శాఖ.. తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని సూచన

Rudra

బ్యాంకులో ఖాతా తెరవడం నుంచి మొదలుకొని ఆస్తులు కొనాలన్నా, అమ్మాలన్నా పాన్ కార్డు తప్పనిసరి.. రూ.50 వేలకు పైబడిన వ్యవహారాలకు పాన్ నెంబర్ ఉండాల్సిందే! ఇంతటి కీలకమైన డాక్యుమెంట్ చెల్లుబాటు కాకుండా పోతే... ఆధార్ తో లింక్ చేయకుండా ఉంటే మీ పాన్ కార్డు రద్దయ్యే ముప్పు ఉందని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరిస్తోంది.

TRAI: స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేలా ట్రాయ్ సంచలన నిర్ణయం, గుర్తు తెలియని నంబర్ల నుంచి కాల్ వస్తే..ఆ కాలర్ పూర్తి వివరాలు కనిపించేలా కెవైసీ ఫీచర్

Hazarath Reddy

గుర్తుతెలియని నెంబర్ నుంచి వచ్చే కాల్స్ ఎంత చికాకు తెప్పిస్తుంటాయో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కాల్స్ కు అడ్డుకట్ట వేసేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కీలక నిర్ణయం తీసుకుంది.

Cold Wave in Telugu States: వచ్చే 4 రోజులు చలి పులితో అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక, తెలుగు రాష్ట్రాల్లో గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు, ఏపీలో అక్కడక్కడా మోస్తారు నుంచి భారీ వర్షాలు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాలు చలితో వణికిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా చలి తీవ్రత ఎక్కువగా (Cold Wave in Telugu States) ఉంది. ప్రధాన నగరాలతో పాటు ముఖ్యపట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో గురువారం చలి విజృంభణ కనిపిస్తోంది.

Weather Forecast: ఏపీకి మరో వాయుగుండం ముప్పు, 18 నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిక, తీరం వెంబడి 40-45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో వాయుగుండం ముప్పు పొంచివుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు (Heavy Rainfall In Andhra Pradesh) కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం హెచ్చరించింది

Advertisement
Advertisement