News

Anna University Rape Case: వీడియో ఇదిగో, కొర‌డాతో కొట్టుకున్న తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, అన్నా యూనివర్శిటీ అత్యాచారం కేసు నిర్లక్ష్యంపై స్టాలిన్ ప్రభుత్వంపై మండిపాటు

Hazarath Reddy

చెన్నైలోని అన్నా యూనివర్శిటీ విద్యార్థులకు రక్షణ కల్పించడంలో డీఎంకే ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై శుక్రవారం తనపై తాను ఆరు సార్లు కొరడా దెబ్బ‌లు కొట్టుకున్నారు.

Telangana Shocker: పోలీసుల వేధింపులు..పీహెచ్‌డీ విద్యార్థిని ఆత్మహత్య, తండ్రి తీసుకున్న డబ్బులకు తనను వేధించడంపై మనస్తాపం..సూసైడ్, నాచారంలో విషాదం

Arun Charagonda

హైదరాబాద్‌ నాచారంలో విషాదం చోటు చేసుకుంది. తండ్రి తీసుకున్న డబ్బులకు పోలీసులు తనను వేధిస్తున్నారని ఆత్మహత్య చేసుకుంది పీహెచ్‌డీ విద్యార్థిని. తండ్రితో చాలా ఏళ్ల నుంచి కలిసి ఉండకపోయినా.. డబ్బుల కోసం తననే వేధిస్తున్నారని సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకుంది దీప్తి.

Dr Manmohan Singh Dies: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు,కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపిన అమిత్‌ షా, జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు

Hazarath Reddy

మాజీ ప్రధాని, ప్రముఖ‌ ఆర్థిక‌వేత్త మ‌న్మోహ‌న్ సింగ్ (Manmohan Singh) గురువారం క‌న్నుమూశారు. ఈ నేపథ్యంలో ఆయన పార్థివదేహానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నివాళులర్పించారు. ఉదయం మన్మోహన్‌ సింగ్‌ నివాసానికి చేరుకున్న ప్రధాని ఆయన భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు.

Dangerous Stunt Caught on Camera: షాకింగ్ వీడియో, పిల్లాడిని బానెట్ మీద కూర్చోపెట్టుకుని కారును వేగంగా నడిపిన డ్రైవర్, కేసు నమోదు చేసిన పోలీసులు

Hazarath Reddy

రాజస్థాన్‌లోని ఝలావర్‌లో ఓ వ్యక్తి చిన్నారిని బానెట్‌పై కూర్చోబెట్టుకుని కారు నడుపుతున్న వీడియో వైరల్‌గా మారింది. గుర్జార్ కా ధాబా సమీపంలోని జాతీయ రహదారి 52పై ఈ స్టంట్ రికార్డ్ చేయబడింది. వీడియోలో కనిపిస్తున్న కారు నంబర్ ప్లేట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

NIMS Suspends OP Services: మన్మోహన్ మృతి నేపథ్యంలో నిమ్స్ లో ఓపీ సేవలు నిలిపివేత.. హాస్పిటల్ వద్ద రోగుల ఆందోళన

Rudra

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి తెలంగాణ ప్రభుత్వం నేడు సెలవు ప్రకటించింది. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Allu Arjun: నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్, నేటితో ముగియనున్న 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్..ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్న బన్నీ

Arun Charagonda

సంధ్య థియేటర్ ఘటనలో నేడు నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు నటుడు అల్లు అర్జున్. గతంలో అల్లు అర్జున్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. నేటితో ముగియనున్న 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ ముగియనుండగా కోర్టుకు హాజరుకానున్నారు. ఇదే కేసులో అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది హైకోర్టు.

Cockroach Found In Biryani: బిర్యానీలో బొద్దింక.. హైదరాబాద్ మదీనాగూడలోని తాడిపత్రి బిర్యానీ సెంటర్ లో ఘటన (వీడియో)

Rudra

హైదరాబాద్ లోని పలు రెస్టారెంట్ లో ఫుడ్ క్వాలిటీ, శుభ్రత అంతకంతకూ పడిపోతున్నది. తాజాగా నగరంలోని మదీనాగూడలోని తాడిపత్రి బిర్యానీ సెంటర్ లో యధేచ్ఛగా బొద్దింకలు స్వైర విహారం చేశాయి.

Australia vs India: స్టీవ్ స్మిత్ సెంచరీ...ఆస్ట్రేలియా 474 ఆలౌట్..ఓపెనర్‌గా వచ్చి నిరాశ పర్చిన రోహిత్ శర్మ..ఆదిలోనే రెండు వికెట్లు కొల్పోయిన టీమిండియా

Arun Charagonda

మెల్ బోర్న్ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ ఈ సిరీస్‌లో రెండో సెంచరీ చేశాడు. మూడు సిక్స్‌లు, 13 ఫోర్లతో 140 పరుగులు చేసి ఔట్ కాగా స్మిత్ కెరీర్‌లో ఇది 34వ సెంచరీ.

Advertisement

Manmohan Singh Last Rites On Saturday: శనివారం మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియలు.. ఏడు రోజులు సంతాపదినాలు.. ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకం సగానికి అవనతం

Rudra

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కన్నుమూశారు. ఆయన అంతిమ సంస్కారాలను శనివారం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ప్రకటించారు.

KCR Condolence To Manmohan Singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి.. మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని వ్యాఖ్య

Rudra

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని ఆయన అన్నారు.

Manmohan Singh-Telangana: మన్మోహనుడి హయాంలోనే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు.. ఎంతమంది వ్యతిరేకించినప్పటికీ వెనక్కితగ్గని ధీశాలి

Rudra

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం అరవై ఏండ్లపాటు సుదీర్ఘ పోరాటం జరిగినప్పటికీ, అప్పటి ప్రధాని మన్మోహనుడి ప్రభుత్వంలోనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగింది.

PV Sindhu Couple At Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నవ దంపతులు పీవీ సింధు, వెంకట దత్త సాయి (వీడియో)

Rudra

భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పీవీ సింధు వెంకట దత్తసాయి దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Advertisement

Telangana Govt. Declares Holiday: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ మ‌ర‌ణం.. విద్యాసంస్థ‌లు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు నేడు సెల‌వు ప్ర‌క‌టించిన తెలంగాణ ప్ర‌భుత్వం.. వారం రోజుల‌పాటు రాష్ట్ర‌వ్యాప్తంగా సంతాప దినాలు

Rudra

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ లో తుది శ్వాస విడిచారు. మన్మోహన్ మృతి నేపథ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం విద్యాసంస్థ‌లు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు నేడు సెల‌వు ప్ర‌క‌టించింది.

Union Budget 2025-26: వేత‌న‌జీవుల‌కు త్వ‌ర‌లోనే గుడ్ న్యూస్, రూ. 15 ల‌క్ష‌ల వ‌ర‌కు ట్యాక్స్ మిన‌హాయింపు ఇచ్చే యోచ‌న‌లో కేంద్రం, ఈ బడ్జెట్ లో బొనాంజా ప్ర‌కటించే ఛాన్స్

VNS

కేంద్ర ఆర్థిక మంత్రి 2025-26 ఆర్థిక సంవత్సరంలో పట్టణ ప్రాంతాల్లో నివసించే లక్షలాది మంది పన్ను చెల్లింపు దారులకు రిలీఫ్ కల్పించాలని నిర్మలా సీతారామన్ భావిస్తున్నారు. పట్టణాల్లో నివసించే వారికి రూ.15 లక్షల వరకూ పన్ను పరిధి నుంచి మినహాయింపు (Cutting Income Tax) ఇచ్చే అవకాశం ఉంది.

Dr Manmohan Singh Dies: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన రాజ‌కీయ దురంధ‌రుడు

VNS

భార‌త మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్(92) (Manmohan Singh) ఇక‌లేరు. తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన ఆయ‌న్ను హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్‌కు త‌ర‌లించారు. అక్క‌డ ఆయ‌న చికిత్స పొందుతూ క‌న్నుమూశారు (Manmohan Singh Passes Away). మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ పని చేశారు.

K Annamalai on Sandhya Theatre Incident: తెలంగాణ‌లో అన్నీ వదిలేసి సినిమావాళ్ల వెంట‌ప‌డుతున్నారు! సీఎం రేవంత్ రెడ్డిపై త‌మిళ‌నాడు బీజేపీ చీఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

VNS

తెలంగాణలో ప్రధాన నటుడు ఆయనే అని, సీఎం పాత్రలో కూడా ఆయన బాగా నటిస్తున్నారని విమర్శించారు. ఆయన రాజకీయాల కోసం ఒకరిని బలిపశువును చేయడం, వేధించడం సరికాదని అన్నామలై హితవు పలికారు.

Advertisement

Dr Manmohan Singh Dies?: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూశార‌ని వార్త‌లు, సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టి డిలీట్ చేసిన రాబ‌ర్డ్ వాద్రా, కాంగ్రెస్ పార్టీ నుంచి రాని క్లారిటీ

VNS

భార‌త మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్(92) (Manmohan Singh) ఇక‌లేరు. తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన ఆయ‌న్ను హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్‌కు త‌ర‌లించారు. అక్క‌డ ఆయ‌న చికిత్స పొందుతూ క‌న్నుమూశారు (Manmohan Singh Passes Away). ఆయ‌న మ‌ర‌ణ వార్త‌ను ప్రియాంక వాద్రా భ‌ర్త రాబ‌ర్డ్ వాద్రా సామాజిక మాద్య‌మం ఎక్స్ లో పోస్ట్ చేశారు. అయితే కాసేప‌టికే ఆ ట్వీట్ ను ఆయ‌న డిలీట్ చేశారు.

Geetha Arts Express Gratitude To TG Govt: సీఎం రేవంత్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు! అల్లు అర‌వింద్ నేతృత్వంలోని గీతా ఆర్ట్స్ పోస్ట్, ఇంకా ఏమ‌న్నారంటే?

VNS

తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ వేదికపై ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా సినీ ఇండస్ట్రీకి మద్దతు అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Government) ప్రముఖ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ (Geetha Arts) ధన్యవాదాలు తెలియజేసింది.

Manmohan Singh Health Update: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు తీవ్ర అస్వస్థత, ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు

Hazarath Reddy

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. మూలాల ప్రకారం, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఢిల్లీ ఎయిమ్స్ అత్యవసర విభాగంలో చేరారు. గతంలో కూడా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఆయన దేశ రాజధానిలోని ఎయిమ్స్‌లో చేరడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, మారుతి స్వామి ఆలయంపై దాడి, శివలింగం, వినాయక స్వామి, కుమార స్వామి విగ్రహాలను ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

Hazarath Reddy

క్రిస్మస్ పండుగ ముందు రోజు దేవాలయంపై కొంత మంది మతోన్మాదులు దాడి చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో బందరు కోటలోని శ్రీశాన్తి నమ్ర మారుతి స్వామి ఆలయం ప్రాంగణంలోని శివలింగం, వినాయక స్వామి, కుమార స్వామి విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement