News
Varikuntla Subbaiah Funeral: సైనిక లాంచనాలతో ముగిసిన ఆర్మీ జవాను వరికుంట్ల సుబ్బయ్య అంత్యక్రియలు, మతాలకతీతంగా భారీ ఎత్తున తరలివచ్చన ప్రజానీకం
Hazarath Reddyవిధి నిర్వహణలో ఎల్ఓసీలో అమరుడైన వరికుంట్ల సుబ్బయ్య అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో ముగిసాయి. అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గం నార్పలలో అశేష జనవాహిని మధ్య అంత్యక్రియలు జరిగాయి. మతాలకతీతంగా భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు.
AP High Court: ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు, ట్రాఫిక్ ఛలాన్ కట్టకపోతే విద్యుత్, నీటి సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు..పోలీసు అధికారుల తీరుపై ఫైర్
Arun Charagondaఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ట్రాఫిక్ చలాన్ కట్టకపోతే ఇళ్లకు విద్యుత్, నీళ్ల సరఫరా ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాల డ్రైవర్లు తెలంగాణ సరిహద్దుకు వెళ్లగానే సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారని వ్యాఖ్యానించింది.
Missing Virus Vials: క్వీన్స్లాండ్ ల్యాబ్ నుంచి లీకైన వందలాది వైరస్లు ఎంత ప్రమాదకరమో తెలుసుకోండి, వీటిల్లో హెండ్రా వైరస్ చాలా డేంజరస్..
Hazarath Reddyచైనా వూహాన్ ల్యాబ్ నుంచి లీకయినట్లుగా భావిస్తున్న కరోనావైరస్ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి విధ్వంసం సృష్టించిందో మనమందరం చూశాం. తాజాగా అదే తరహాలో ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ పబ్లిక్ హెల్త్ వైరాలజీ ల్యాబ్ నుంచి ప్రమాదకరమైన వందలాది వైరస్ లు మిస్సింగ్ కావడం కలకలం రేపుతోంది.
Tamilnadu: స్కూల్లో దారుణం..పాఠాలు వింటూనే గుండెపోటుతో విద్యార్థిని మృతి, సీసీటీవీలో రికార్డు అయిన షాకింగ్ దృశ్యాలు
Arun Charagondaతమిళనాడులోని రాణిపేటలో విషాదం నెలకొంది. స్కూల్లో పాఠాలు వింటూనే హార్ట్ ఎటాక్తో విద్యార్థిని మృతి చెందింది. ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థిని అద్విత హార్ట్ ఎటాక్తో కుప్పకూలి మృతి చెందాడు. ఈ హృదయ విదారక సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
AP Jitender Reddy: తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా జితేందర్ రెడ్డి, మాజీ క్రికెటర్ చాముండేశ్వరి నాథ్పై గెలుపు
Arun Charagondaతెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి నియమితులయ్యారు. జితేందర్ రెడ్డి , మాజీ క్రికెటర్ వి.చాముండేశ్వరీ నాథ్కి మధ్య ఎన్నిక జరగగా.. జితేందర్ రెడ్డికి 43 ఓట్లు రాగా, చాముండికి 9 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీంతో జితేందర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు.
Weather Forecast: ఏపీకి తప్పిన ముప్పు, తమిళనాడు వైపుకు కదిలిన అల్పపీడనం, రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్, భారీ వర్షాలతో చెన్నై విలవిల
Hazarath Reddyనైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది వాయుగుండంగా బలపడిన తర్వాత.. శ్రీలంక, తమిళనాడు తీరాలవైపుగా పయనించి అక్కడే తీరం దాటే సూచనలున్నాయని వెల్లడించారు.
Andhra Pradesh Shocker: ఏపీలో సంచలనం.. కూతురిని వేధించాడని కువైట్ నుండి వచ్చి చంపేశాడు, తానే హత్యచేశానని కువైట్ నుండి వీడియో రిలీజ్
Arun Charagondaఏపీలో సంచలనం జరిగింది. కూతురుని వేధించాడని కువైట్ నుంచి వచ్చి ఓ దివ్యాంగుడిని చంపేశాడు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్తమంగంపేటలో ఘటన జరిగింది. గత శనివారం తెల్లవారుజామున గుట్ట ఆంజనేయులు అనే దివ్యాంగుడు దారుణ హత్యకు గురయ్యాడు. అనుమానాస్పద మృతి కేసుగా భావించి కేసు నమోదు చేశారు పోలీసులు.
Hyderabad: లాల్దర్వాజ నల్లపోచమ్మ దేవాలయంలో అద్భుతం, పసుపులో కుడికాలి పాదం..క్యూ కడుతున్న భక్తులు..వీడియో ఇదిగో
Arun Charagondaహైదరాబాద్ లాల్దర్వాజ మేకలబండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో అద్భుతం జరిగింది. పసుపులో కుడికాలి పాదం గుర్తు దర్శనమివ్వడంతో సాక్షాత్తూ అమ్మవారు వచ్చారనే నమ్మకంతో భక్తులు దర్శనం కోసం బారులు తీరారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Tamil Nadu Rains: తమిళనాడును ముంచెత్తిన భారీ వర్షాలు, స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ, వీడియోలు ఇవిగో..
Hazarath Reddyఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాన్ని భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై (Chennai)కూడా తడిసి ముద్దయింది. భారీ వర్షం నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు.
Tirumala: తిరుమలలో భారీ వర్షం, అల్పపీడనం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం..పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలు తాత్కాలికంగా మూసివేత
Arun Charagondaతిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. అల్పపీడనం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వర్షానికి ఇబ్బందులు పడుతున్నారు భక్తులు. ఘాట్ రోడ్డులలో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు. కొండచరియలు విరిగేపడే ప్రమాదం ఉండడంతో అప్రమత్తమయ్యారు సిబ్బంది. పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలు తాత్కాలికంగా మూసివేశారు.
Avanthi Srinivas: వైసీపీకి బిగ్ షాక్, పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, రాజీనామా లేఖను జగన్కు పంపించిన అవంతి..జనసేనలో చేరే అవకాశం!
Arun Charagondaఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీకి షాక్ల మీద షాక్లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు పార్టీని వీడగా తాజాగా వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు. పార్టీ, పదవులకు రాజీనామా చేసిన ఆయన...తన రాజీనామా లేఖను జగన్కు పంపించారు.
Manchu Lakshmi: ఫ్యామిలీలో వివాదం నేపథ్యంలో మంచు లక్ష్మీ వేదాంతం, ఆస్తులు ఎవరికీ ఇచ్చేది లేదని మోహన్ బాబు చెప్పిన నేపథ్యంలో మంచు లక్ష్మీ ట్వీట్ వైరల్
Arun Charagondaమంచు ఫ్యామిలీలో వివాదం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంచు లక్ష్మి నోట వేదాంతం వల్లించింది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా మంచు లక్ష్మి చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఆస్తులు ఎవరికీ ఇచ్చేది లేదని తెగేసి చెప్పిన మోహన్ బాబు మాటలకు కూతురు లక్ష్మి ఇలా వేదాంతం వల్లిస్తుందని అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Maharashtra: అమానుషం..చనిపోయిన మహిళ చేతి బంగారు గాజులు దొంగతనం, రోడ్డు ప్రమాదంలో 7 గురు మృతి...షాకింగ్ వీడియో
Arun Charagondaమహారాష్ట్రలో అమానుషం చోటు చేసుకుంది. ప్రమాదంలో మరణించిన మహిళ చేతి గాజులు చోరీకి పాల్పడగా ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీకెమెరాకు చిక్కాయి. ముంబై-కుర్లా వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో ఏడుగురు మృతి.. 49 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Year Ender 2024: ఈ ఏడాది క్రికెట్లో సంచలనం, పాకిస్థాన్ను ఓడించిన అమెరికా... మరెన్నో సంచలనలు, వివరాలివిగో
Arun Charagondaప్రపంచంలో క్రికెట్కు ఉండే ఆదరణ ఇంత కాదు. కోట్లాది మంది క్రికెట్ను ఇప్పటికీ వీక్షిస్తున్నారంటే అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా భారత్ వర్సెస్ పాకిస్థాన్, ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్లు జరుగుతున్నాయంటే అంతే. టీవీలకు అతుక్కుపోవాల్సిందే. ఇక ప్రతీ ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా క్రికెట్లో ఎన్నో అద్భుతాలు జరిగాయి. వాటిని ఓ సారి పరిశీలిస్తే
Telangana Shocker: ఆన్లైన్ ట్రేడింగ్కు కుటుంబం బలి, ట్రేడింగ్లో కొడుక్కి నష్టాలు రావడంతో గడ్డి మందు తాగిన కుటుంబం..నలుగురు మృతి
Arun Charagondaఆన్లైన్ ట్రేడింగ్కు కుటుంబం బలి అయింది. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కాసిపేటకు చెందిన శివప్రసాద్(26) అప్పు చేసి ఆన్లైన్ ట్రేడింగ్ చేశాడు. అందులో నష్టాలు రావడం, అప్పులు ఇచ్చిన వారి నుండి ఒత్తిడి ఎక్కువవడంతో తండ్రి మొండయ్య(60), తల్లి శ్రీదేవి(54), అక్క చైతన్య(30)తో కలిసి గడ్డి మందు తాగాడు.వరంగల్ ఏంజీఏం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నలుగురు మరణించారు.
Warangal: అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన కారు..ఒకరు మృతి, మాదన్నపేట చెరువు మత్తడి వద్ద అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన కారు...వీడియో
Arun Charagondaవరంగల్ - నర్సంపేట పట్టణంలో నర్సింహులు పేటకు చెందిన ముగ్గురు యువకులు నర్సంపేటలో ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా మాదన్నపేట చెరువు మత్తడి వద్ద వారి కారు అదుపుతప్పి చెరువులో పడిపోయింది. దీంతో వెంటనే ఇద్దరిని కాపాడగా.. మరో యువకుడు మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Manchu Vishnu Meets Rachakonda CP: మంచు విష్ణుకు వార్నింగ్ ఇచ్చిన రాచకొండ సీపీ సుధీర్ బాబు, మరోసారి గొడవలు పునరావృతం అయితే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరిక.. విష్ణు ప్రధాన అనుచరుడు కిరణ్ అరెస్ట్
Arun Charagondaనటుడు మంచి విష్ణుకు వార్నింగ్ ఇచ్చారు రాచకొండ సీపీ సుధీర్ బాబు. సీపీ నోటీసుల నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ ఆఫీస్కు వచ్చిన విష్ణును గంటన్నర సేపు విచారించారు సుధీర్ బాబు. నాలుగు రోజులుగా మంచు కుటుంబంలో నెలకొన్న వివాదాలపై ఆరా తీశారు. మరోసారి గొడవలు పునరావృతం అయితే చట్టపరమైన చర్యలు ఉంటాయి...శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించవద్దని హెచ్చరించారు.
Mohan Babu: మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు, జర్నలిస్టుపై దాడి ఘటనలో బీఎన్ఎస్ 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసుగా మారుస్తూ కేసు నమోదు చేసిన పోలీసులు
Arun Charagondaమోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. జర్నలిస్టుపై దాడి ఘటనలో ఆయనపై బీఎన్ఎస్ 118 సెక్షన్ కింద ఇదివరకే ఎఫ్ఐఆర్ నమోదు చేయగా దానిని బీఎన్ఎస్ 109 సెక్షన్ కింద హత్యాయత్నంగా మారుస్తూ కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు, ప్రస్తుతం కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మోహన్ బాబు.
CM Revanth Reddy: UPSC విజేతలను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, రాజీవ్ సివిల్స్ అభయ హస్తం పథకం ద్వారా రూ.లక్ష ఆర్ధిక సాయం అందించిన ప్రభుత్వం
Arun Charagondaతెలంగాణ నుంచి #UPSC సివిల్ సర్వీసెస్ మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం కింద ప్రజా ప్రభుత్వం లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన వారిలో 20 మంది అభ్యర్థులు ఎంపిక కావడం పట్ల ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలిపారు
KTR Open Letter To Rahul Gandhi: మూటలపై ఉన్న శ్రద్థ, మీరిచ్చిన మాటలపై లేదా? రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ
VNSచేతి గుర్తుకు ఓటేస్తే చేతగానీ ముఖ్యమంత్రిని తెలంగాణపై రుద్దారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ వల్ల అన్నదాతల నుంచి ఆడబిడ్డల దాకా ప్రతివర్గం అరిగోస పడుతోందని అన్నారు. ప్రగతి పథంలో పరుగులు పెట్టిన రాష్ట్రం అధోగతి పాలవుతుంటే తెలంగాణ వైపు కన్నెత్తి చూడని మీ తీరును చూసి నాలుగు కోట్ల ప్రజలు నిత్యం రగిలిపోతున్నారని మండిపడ్డారు.