News
Andhra Pradesh: వీడియో ఇదిగో, గుంటూరులో వైసీపీ నేత తనను లైంగికంగా వేధిస్తున్నాడని మీడియా ముందుకు మహిళ
Hazarath Reddyగుంటూరులో వైసీపీ నేత దేవరకొండ నాగేశ్వరరావు తనను లైంగికంగా వేధిస్తున్నాడని స్వరాజ్యలక్ష్మి అనే మహిళ ఆధారాలతో మీడియా ముందుకు వచ్చింది. తన కుటుంబాన్ని కూడా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసిన బాధితురాలు
Manchu Family Dispute: మైక్ తీసుకొచ్చి నోట్లో పెట్టారు, మీ ఇంట్లో ఎవరైనా దూరి ఇలా చేస్తే అంగీకరిస్తారా? రెండో ఆడియోని విడుదల చేసిన మోహన్ బాబు
Hazarath Reddyసీనియర్ హీరో మంచు మోహన్ బాబు జర్నలిస్టుపై దాడి ఘటన కలకలం రేపుతున్న నేపథ్యంలో ఆయన రెండో సారి ఆడియో విడుదల చేశారు. జర్నలిస్ట్ను కొట్టాలని తాను దైవసాక్షిగా అనుకోలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కుటుంబ సమస్యల్లో ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా? అని ఆడియోలో ప్రశ్నించారు
Hyderabad: కేపీహెచ్బీ మెట్రో స్టేషన్ సమీపంలో వ్యభిచారం, 8 మంది మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వ్యభిచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని కూకట్పల్లి ACP శ్రీనివాసరావు హెచ్చరిక
Hazarath Reddyకేపీహెచ్బీలో వ్యభిచారం నిర్వహించే 8 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేపీహెచ్బీ మెట్రో స్టేషన్ సమీపంలో రాత్రి 8 గంటల నుంచి 10 వరకు 10 స్పెషల్ టీంలను ఏర్పాటు చేశాం.. వ్యభిచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూకట్పల్లి ACP శ్రీనివాసరావు హెచ్చరించారు.
Atul Subhash Suicide Case: అతుల్ సుభాష్ కేసు, దేశ వ్యాప్తంగా న్యాయం కోసం గళమెత్తుతున్న పురుష ప్రపంచం, Xలో ట్రెండింగ్లో నిలిచిన #MenToo, #JusticeIsDue హ్యాష్ ట్యాగ్లు
Hazarath Reddyడబ్బుల కోసం భార్య, కుటుంబ సభ్యులు వేధించడంతో బెంగళూరుకు చెందిన టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అతుల్ యొక్క 24 పేజీల డెత్ నోట్ మరియు వీడియో సందేశం వైరల్ అయ్యాయి, వేధింపులు, తప్పుడు ఆరోపణలను ఎదుర్కొంటున్న పురుషుల దుస్థితిని ఎత్తిచూపారు.
Instagram Stunt Goes Wrong: వీడియో ఇదిగో, ట్రైన్ బయట వేలాడుతూ రీల్, చెట్లు అడ్డు రావడంతో ఒక్కసారిగా ఢీకొని.. ఆ తర్వాత ఏమైందంటే..
Hazarath Reddyశ్రీలంకలో కదులుతున్న రైలులో ఓ చైనా మహిళ బయటకు వేలాడుతూ కనిపించింది. రైలు కదులుతున్నప్పుడు, ఆమె ప్రమాదకరంగా బయటకు వేలాడుతూ ఉండగా ఓ చెట్లున్న పొద తగలడంతో ఆమె ఒక్కసారిగా పట్టు కోల్పోయింది.
Atul Subhash Suicide Case: అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు, రాత్రికి రాత్రే ఇంటి నుంచి పరారైన అతని భార్య నికితా సింఘానియా, వీడియో ఇదిగో..
Hazarath Reddyబెంగుళూర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు దేశ వ్యాప్తంగా అనేక అంశాలకు కేంద్ర బిందువుగా మారింది. భార్య, ఆమె కుటుంబ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడు దేశంలో చర్చకు దారి తీసింది. ఈ కేసులో భార్య నికితా సింఘానియా కుటుంబంపై సమాజం నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Atul Subhash Suicide: భార్య, అత్తమామలు వేధిస్తున్నారని టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య, 24-పేజీల సూసైడ్ నోట్ రాసి మరీ బలవనర్మరణం
Hazarath Reddyఉత్తరప్రదేశ్కు చెందిన 34 ఏళ్ల వ్యక్తి సోమవారం తన నివాసంలో సీలింగ్కు ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న అతుల్ సుభాష్ తన భార్య, ఆమె బంధువుల నుంచి వేధింపులకు గురిచేస్తున్నట్లు 24 పేజీల డెత్ నోట్ను వదిలివెళ్లినట్లు వారు తెలిపారు.
Atul Subhash Suicide: నెల రోజుల ఆఫీసు పని ముందే చేసి ఆత్మహత్య చేసుకున్న అతుల్ సుభాష్, కీలక విషయాలను వెల్లడించిన మృతుడి మామ
Hazarath Reddyమహీంద్రాలో ప్రతిభావంతులైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన అతుల్ సుభాష్ డిసెంబర్ 9న తన జీవితాన్ని విషాదకరంగా ముగించాడు. ఈ ఘటన అతని కుటుంబం, సహచరులను దిగ్భ్రాంతికి గురిచేసింది. బాధ యొక్క స్పష్టమైన సంకేతాలు లేనప్పటికీ, అతుల్ తన చివరి రోజును నిశితంగా ప్లాన్ చేసుకున్నాడు.
Atul Subhash Suicide Case: విడాకుల భరణం నిర్ణయించేందుకు 8 మార్గదర్శకాలను వెల్లడించిన సుప్రీంకోర్టు, దేశ వ్యాప్తంగా కదలికలు రేపుతున్న అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు
Hazarath Reddyవరకట్న చట్టాల దుర్వినియోగంపై చర్చకు దారితీసిన బెంగుళూరు టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య నుండి ఉత్పన్నమైన వార్తల మధ్య సుప్రీంకోర్టు ప్రత్యేక విడాకుల కేసుపై దృష్టి సారించింది. విడాకుల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు, భరణం మొత్తాన్ని నిర్ణయించడానికి ఎనిమిది పాయింట్ల సూత్రాన్ని జాబితా చేసింది
Jagga Reddy: ఏఐసీసీ నేతలపై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్, పార్టీని చంపేయాలని చూస్తున్నారు..అధికారంలో ఉన్న పార్టీ ఉండేది ఇలాగేనా? అని మండిపాటు
Arun Charagondaఅధికారంలో ఉన్న పార్టీ ఉండేది ఇలాగేనా? చెప్పాలని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఇంచార్జీలు పార్టీని చంపేయాలని చూస్తున్నారు...ఇంతకు ఏఐసీసీ కార్యదర్శులు ఉన్నారా? వేరే రాష్ట్రం వెళ్ళిపోయారా? చెప్పాలన్నారు. దీపాదాస్ మున్షీ ఉందా? ఆమె కూడా వేరే రాష్ట్రం వెళ్ళిపోయిందా?, కొత్త వాళ్ళకు పదవులు ఇచ్చేస్తారా? ఫైనల్ అయ్యేవరకు మాకు చెప్పరా? అని మండిపడ్డారు. ఓ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి విష్ణుపై నిప్పులు చెరిగారు జగ్గారెడ్డి.
Mandakrishna Madiga: కేబినెట్లో మాదిగలకు అవకాశం కల్పించాలి, మాదిగలంటే కాంగ్రెస్కు చిన్నచూపు తగదన్నమందకృష్ణ మాదిగ,తెలంగాణ తల్లి విగ్రహం మార్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్న?
Arun Charagondaమాదిగలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడిన మందకృష్ణ..కాంగ్రెస్ అగ్రనాయకత్వంలో మాదిగలకు పలుకుబడి లేదు అన్నారు.
Telangana: దారుణం, స్కూల్ నుంచి గంట ముందు ఇంటికి వెళ్లిందని విద్యార్థిని చేయి విరిగేలా కొట్టిన టీచర్, దుబ్బ ప్రభుత్వ పాఠశాలలో ఘటన
Hazarath Reddyస్కూల్ నుంచి ఇంటికి గంట ముందు వెళ్లినందుకు విద్యార్థిని చేయి విరిగేలా కొట్టింది ఓ టీచర్. నిజామాబాద్ జిల్లా దుబ్బ ప్రభుత్వ పాఠశాలలో ఈ దారుణం చోటు చేసుకుంది.
One Nation, One Election: జమిలి ఎన్నికలు అంటే ఏమిటి ? ఇంతకుముందు ఇండియాలో ఎప్పుడైనా జరిగాయా, ఒకే దేశం-ఒకే ఎన్నిక పై సమగ్ర విశ్లేషణాత్మక కథనం
Hazarath Reddyఒకే దేశం-ఒకే ఎన్నిక (జమిలి ఎన్నికలు) బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో జమిలి ఎన్నికలు సాధ్యమా? ఈ ఎన్నికలు నిర్వహించాలంటే కేంద్రం ఏం చేయాల్సి ఉంటుందనే దానిపై రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
Jamili Elections: జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ అమోదం, త్వరలో పార్లమెంట్ ముందుకు రానున్న బిల్లు, అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు
Arun Charagondaజమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ అమోదం తెలిపింది. కేబినెట్ అమోదం తెలిపిన నేపథ్యంలో త్వరలోనే ఈ బిల్లు పార్లమెంట్ ముందుకురానుంది.ఈ బిల్లు అమోదంలోకి వస్తే తొలి దశలో పార్లమెంటు,
Keerthy Suresh Marries Antony: గోవాలో ఘనంగా నటి కీర్తి సురేష్ వివాహం, చిననాటి స్నేహితుడు ఆంటోనిని వివాహం చేసుకున్న కీర్తి
Arun Charagondaనటి కీర్తి సురేష్ వివాహం కన్నుల పండువగా జరిగింది. తన చిననాటి స్నేహితుడు ఆంటోని తట్టిల్ను వివాహం చేసుకుంది కీర్తి. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కీర్తి సురేష్ వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Harishrao: సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సత్తా చూపుదాం, అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీని నిలదీస్తాం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో హస్తం పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలన్న మాజీ మంత్రి హరీశ్ రావు
Arun Charagondaముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే చాయ్ తాగినంత సేపట్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు తీరుస్తా అన్నాడని గుర్తు చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. సిద్దిపేటలో సర్వ శిక్షా అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మే శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్ రావు...కేసీఆర్ను అధికారం నుంచి దించడానికి ఒక గంట ఎక్స్ట్రా పని చేయాలని మిమ్మల్ని అడిగాడు రేవంత్ రెడ్డి...అధికారంలోకి వచ్చిన నెలలో సెక్రటేరియట్లో కూర్చొని చాయ్ తాగుతూ సమస్య పరిష్కరించుకుంటామన్నావు కదా రేవంత్ రెడ్డి, ఇంకా నెల కాలేదా? చెప్పాలన్నారు.
Grandhi Srinivas Resigns: వైసీపీని వీడిన మరో కీలక నేత, పార్టీతో పాటు అన్ని పదవులకు రాజీనామా చేసిన భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్
Hazarath Reddyవైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసిన ఘటన మరువక ముందే భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపించారు.
Delhi to Rajahmundry Flight: రాజమండ్రి నుంచి ఢిల్లీకి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం, తొలి నాన్స్టాప్ విమానానికి వాటర్ కేనన్స్తో సిబ్బంది స్వాగతం
Hazarath Reddyరాజమండ్రి నుంచి ఢిల్లీకి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. నేడు ఢిల్లీ నుంచి బయలుదేరిన ఇండిగో విమానం మధురపూడి విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.
Opposition MPs Protest: జార్జ్ సోరస్, అదానీ అంశాలతో పార్లమెంటులో గందరగోళం, పార్లమెంట్ ఆవరణలో అదానీ ఇష్యూపై ప్రతిపక్ష ఎంపీల నిరసన
Hazarath Reddyలోక్సభ(Loksabha)లో నేడు కూడా గందరగోళం నెలకొన్నది. సభ ప్రారంభమైన క్షణం నుంచి అధికార, విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. అదానీ అంశంపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. దీంతో సభను మధ్యాహ్నం ఒంటి గంట వరకు వాయిదా వేశారు.
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, రాధిక శరత్ కుమార్..వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారి దర్శనం...వీడియో ఇదిగో
Arun Charagondaతిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, నటి రాధికా శరత్ కుమార్. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.