News

Champai Soren Joins BJP: మలుపులు తిరుగుతున్న జార్ఖండ్‌ రాజకీయాలు, బీజేపీ గూటికి చేరిన మాజీ సీఎం చంపై సోరెన్‌, గిరిజనులకు బాసటగా నిలుస్తామని స్పష్టం

Hazarath Reddy

జార్ఖండ్‌ మాజీ సీఎం, జేఎంఎం (JMM) మాజీ నేత చంపై సోరెన్‌ (Champai Soren) భారతీయ జనతా పార్టీలో చేరారు. శుక్రవారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ (Shivraj Singh Chouhan) సమక్షంలో కమలం పార్టీలో చేరారు. చంపై సోరెన్‌కు జార్ఖండ్‌ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్‌ మరాండీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Gurukul School Staff Harass Students: విద్యార్థినులకు పురుగుల అన్నం, టీచర్లకు పరమాన్నం..ఇది గురుకులాల పరిస్థితి, ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరింపులు, తట్టుకోలేక రోడ్డెక్కిన విద్యార్థినులు!

Arun Charagonda

తెలంగాణలో పాలన పడకేసిందా?, నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను పట్టించుకునే వారేలేరా? అంటే జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఔననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా రంగారెడ్డి - శంషాబాద్ మండలంలోని పాలమాకులే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పురుగులు అన్నం పెట్టి పైశాచకాన్ని ప్రదర్శించారు గురుకుల పాఠశాల సిబ్బంది.

Shivaji Maharaj Statue Collapse: నన్ను అందరూ క్షమించండి, ఛత్రపతి శివాజీ విగ్రహం కూలడంపై ప్రధాని మోదీ నోటి వెంట సంచలన వ్యాఖ్యలు, ఇంకా ఏమన్నారంటే..

Hazarath Reddy

మాల్వాన్‌లోని రాజ్‌కోట్ కోటలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం వర్షాలకు కూలిన సంగతి విదితమే. ప్రతిపక్షాలు ఈ ఘటనపై బీజేపీ మీద విరుచుకుపడ్డాయి. ఈ నిరసనలపై, అలాగే విగ్రహం కూలడవపై ప్రధాని మోదీ స్పందించారు.

PM Modi Apologises Video: నన్ను క్షమించండి, ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని మోదీ శిరస్సు వంచి క్షమాపణలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

మాల్వాన్‌లోని రాజ్‌కోట్ కోటలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం వర్షాలకు కూలిన సంగతి విదితమే. ప్రతిపక్షాలు ఈ ఘటనపై బీజేపీ మీద విరుచుకుపడ్డాయి. ఈ నిరసనలపై, అలాగే విగ్రహం కూలడవపై ప్రధాని మోదీ స్పందించారు. మరాఠా యోధుడు శివాజీ కేవలం రాజు మాత్రమే కాదని, తాను ఆరాధించే దేవుడంటూ కూలడంపై.. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం క్షమాపణలు చెప్పారు.

Advertisement

CM Revanth Reddy On Yadadri: యాదాద్రి ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ, పెండింగ్ పనుల వివరాలను సమర్పించాలని అధికారులకు ఆదేశం

Arun Charagonda

యాదగిరిగుట్ట అభివృద్ధిపై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులు అర్ధంతరంగా వదిలేయడానికి వీల్లేదని..ఆలయ అభివృద్ధిని మరో స్థాయికి తీసుకెళ్లాలని అధికారులకు స్పష్టం చేశారు.

Paris Paralympics 2024: పారిస్ పారాలింపిక్స్‌లో పతకాలు గెలిచిన మిమ్మల్ని చూసి భారత్ గర్విస్తోంది, అవనీ లేఖా, మోనా అగర్వాల్‌లకు శుభాకాంక్షలు తెలిపిన ప్రదాని మోదీ

Hazarath Reddy

పారిస్ పారాలింపిక్స్ 2024లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లలో పతకాలు సాధించిన పారా అథ్లెట్లు అవనీ లేఖా, మోనా అగర్వాల్ లకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ తన శుభాకాంక్షలు తెలియజేసేందుకు X, (ట్విట్టర్‌) లోకి వెళ్లారు.

Gurukul School Students Protest: పురుగుల అన్నం పెడుతున్నారంటూ రోడెక్కిన గురుకుల పాఠశాల విద్యార్థులు, సీఎం రేవంత్ రెడ్డి వచ్చి మా గోడు వినాలని డిమాండ్, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

రంగారెడ్డి - శంషాబాద్ మండలంలోని పాలమాకులే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పురుగులు అన్నం పెట్టి, ఉపాధ్యాయులు మాత్రం వేరే కూరలు చేసుకుని తింటున్నారని విద్యార్థులు రోడ్డెక్కారు. మేం అడిగితే ఇంటి నుండి తెచ్చుకోండని అంటున్నారని అన్నారు. మంచి నీటి సమస్య కూడా ఉంది. చెప్పలేని పదజాలంతో బూతులు తిడుతున్నారు.

‘Actions Have Consequences’: పాకిస్తాన్‌తో యుద్దం తప్ప ఇకపై చర్చలు ఉండవు, కీలక వ్యాఖ్యలు చేసిన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, ఉగ్ర చర్యలకు తగిన పరిణామాలుంటాయని హెచ్చరిక

Hazarath Reddy

దాయాది దేశం పాకిస్థాన్‌ (Pakistan) విషయంలో భారత్‌ వైఖరిపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ (S Jaishankar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశంతో చర్చలు జరిపే కాలం ముగిసిందన్నారు. ఇకమీదట సానుకూలమైనా ప్రతికూలమైనా పాక్ నుంచి వచ్చే చర్యకు తప్పకుండా ప్రతిచర్య ఉంటుందని స్పష్టంచేశారు

Advertisement

Paris Paralympics 2024 Shooting:  పారిస్ పారాలింపిక్స్‌ భారత్‌కు రెండు పతకాలు, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన అవనీ లేఖరా, కాంస్య పతకంతో మెరిసిన మోనా అగర్వాల్

Hazarath Reddy

పారిస్ పారాలింపిక్స్‌లో శుక్రవారం భారత్ పతకాల వేటను మొదలుపెట్టింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్ (SH1)లో మోనా అగర్వాల్ కాంస్య పతకం సాధించగా.., అవనీ లేఖరా తన బంగారు పతకాన్ని మళ్లీ కాపాడుకుంది. పారిస్ పారాలింపిక్స్ రెండో రోజు భారత్‌ రెండు పతకాలతో మెరిసింది.

Robert Vadra At Hyderabad: హైదరాబాద్‌లో రాబర్ట్ వాద్రా, ఘనస్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు, ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని వెల్లడించిన వాద్రా

Arun Charagonda

కాంగ్రెస్ నేత రాబర్ట్ వాద్రా హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న వాద్రాకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు వాద్రా. ఈ సందర్భంగా తెలంగాణలోని వివిధ ప్రాంతాలను సందర్శించనున్నారు వాద్రా. ప్రజలకు జరుగుతున్న ఇబ్బందులు, సమస్యలు అడిగి తెలుసుకుంటానని చెప్పారు.

Avani Lekhara Wins Gold: పారిస్ పారాలింపిక్స్‌, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన అవనీ లేఖరా, కాంస్య పతకంతో మెరిసిన మోనా అగర్వాల్

Hazarath Reddy

పారిస్ పారాలింపిక్స్‌లో శుక్రవారం భారత్ పతకాల సంఖ్య మొదలయింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్ (SH1)లో మోనా అగర్వాల్ కాంస్యంతో ముగియగా, అవనీ లేఖరా తన బంగారు పతకాన్ని కాపాడుకుంది. పారిస్ పారాలింపిక్స్ రెండో రోజు భారత్‌కు ప్రస్తుతం రెండు పతకాలు ఉన్నాయి.

V. Vijayasai Reddy: నేను జగన్ సైనికుడిని, పార్టీ మార్పు రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన విజయసాయి రెడ్డి, వైఎస్‌ఆర్సీపీలోనే ఉంటానని స్పష్టం చేసిన వైసీపీ రాజ్యసభ ఎంపీ

Hazarath Reddy

వైసీపీ రాజ్యసభ సభ్యుల పార్టీ మార్పు వ్యవహారం ఇప్పుడు ఏపీ దుమారం రేపుతోంది. ఇప్పటికే ఇద్దరు ఎంపీ రాజీనామాలు చేశారు.ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనకు తానే ఓ క్లారిటీ ఇచ్చారు. తాను కూడా పార్టీ మారుతున్నానంటూ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ట్విట్టర్లో మండిపడ్డారు. తాను ఎక్కడికీ వెళ్లట్లేదంటూ క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Telangana Rain Update: తెలంగాణకు వర్షాలే వర్షాలు, నాలుగు రోజుల పాటు కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక, రేపు భారీ వర్షం కురిసే అవకాశం

Arun Charagonda

రానున్న నాలుగు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రేపు అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని దీని ఫలితంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

Telangana: వీడియో ఇదిగో, సెల్ఫీ దిగుతూ కాలుజారి నాగార్జున సాగర్ ఎడమ కాలువ‌లో పడిన యువతి, తాళ్ల సాయంతో ఆమెను పైకి లాగి కాపాడిన స్థానికులు

Hazarath Reddy

నల్గొండ జిల్లాలో సెల్ఫీ మోజు ఓ యువతి ప్రాణాల‌మీద‌కు తెచ్చింది. సెల్ఫీ దిగే క్ర‌మంలో ప్ర‌మాద‌వ‌శాత్తు కాలుజారి నాగార్జున సాగర్ ఎడమ కాలువ‌లో ప‌డింది. న‌ల్గొండ జిల్లా వేముల‌ప‌ల్లి మండ‌ల కేంద్రంలోని నాగార్జున సాగ‌ర్ ఎడ‌మ కాలువ వ‌ద్ద శుక్ర‌వారం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

Allahabad High Court: భర్తను భార్య రూంలోకి రానివ్వకుండా వేరే రూంలో పడుకోమనడం క్రూరత్వమే, కేసులో భర్తకు విడాకులు మంజూరు చేసిన అలహాబాద్ హైకోర్టు

Hazarath Reddy

భర్తతో కాపురం చేయడానికి భార్య నిరాకరించి, అతడిని ప్రత్యేక గదిలో నివసించమని బలవంతం చేస్తే, ఆమె అతని వైవాహిక హక్కులను హరించివేస్తుందని, అదే క్రూరత్వానికి సమానమని అలహాబాద్ హైకోర్టు ఇటీవల పేర్కొంది.

Uttar Pradesh: వీడియో ఇదిగో, నూరేళ్ల ఆయుష్షు ఈ తాగుబోతుకు, నడిరోడ్డు మీద కుర్చీలో కూర్చుని ఉండగా వెనక నుంచి ఢీకొట్టిన లారీ, తృటిలో ప్రాణాలతో బయటపడ్డ మందుబాబు

Hazarath Reddy

ప్రతాప్‌గఢ్‌లోని చిల్‌బిలా కూడలిలో రద్దీగా ఉండే రహదారి మధ్యలో తాగిన వ్యక్తి కుర్చీపై కూర్చొని, ట్రక్కు ఢీకొనడంతో తృటిలో తప్పించుకున్నట్లు చూపించే షాకింగ్ వీడియో వైరల్‌గా మారింది. ట్రక్.. కుర్చీని ఢీకొన్న క్షణాన్ని క్లిప్ సంగ్రహిస్తుంది, అయితే తాగుబోతును ఢీకొట్టిన తరువాత ప్రమాదాన్ని పట్టించుకోకుండా లారీ వెళ్లిపోయింది

Advertisement

UK Horror: యూకేలో దారుణం, స్కూలు నుంచి ఇంటికి వెళుతున్న బాలికను 17 సార్లు కత్తితో పొడిచిన బాలుడు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

జనవరి 27, 2023న 15 ఏళ్ల పాఠశాల విద్యార్థిని హోలీ న్యూటన్‌ను కత్తితో పొడిచి చంపినందుకు 17 ఏళ్ల బాలుడిని న్యూకాజిల్ క్రౌన్ కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ సంఘటన UKలోని హెక్సామ్, నార్తంబర్‌ల్యాండ్‌లో జరిగింది. దాడి జరిగిన రోజున స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు ఆమె తన పాఠశాల అయిన క్వీన్ ఎలిజబెత్ హైస్కూల్‌ను విడిచిపెట్టిన తర్వాత నిందితుడు హోలీ న్యూటన్‌ను వెంబడించారు.

Meda Raghunadha Reddy on Party Change Rumors: రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్‌తోనే నా ప్రయాణం, పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి

Hazarath Reddy

ఏపీ రాజకీయాల్లో ఎన్నికల్లో ఓటమి చెందిన వైసీపీ నుంచి నేతలు ఒకరొకరుగా రాజినామా చేస్తున్నారు. వైసీపీకి రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్ రెడ్డి రాజీనామా చేయనున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ మారడంపై క్లారిటీ ఇస్తూ.. తాను పార్టీ మారడం లేదని తేల్చి చెప్పారు. పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.

Chandrababu On NBK 50 Years: బాలకృష్ణ కెరీర్‌ అన్‌స్టాపబుల్‌..చంద్రబాబు ప్రశంసలు, కథానాయకుడే కాదు ప్రజా నాయకుడు అంటూ కితాబు

Arun Charagonda

బాలయ్య 50 ఏళ్ల సినీ ప్రస్థానంపై ఎక్స్ వేదికగా స్పందించారు సీఎం చంద్రబాబు. ఆంధ్రుల అభిమాన కథానాయకుడు నందమూరి బాలకృష్ణ తన యాభై ఏళ్ళ నట ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.

R. Krishnaiah on Party Change Rumors: చివరి వరకు వైసీపీలోనే ఉండి బీసీల కోసం కొట్లాడతా, పార్టీ మార్పు రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య

Hazarath Reddy

వైసీపీకి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యత్వాలకు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజీనామా చేసిన సంగతి విదితమే. ఇక తెలంగాణకు చెందిన బీసీ సంఘం నేత ఆర్. కృష్ణయ్య కూడా వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన కూడా వైసీపీకి గుడ్ బై చెపుతారనే ప్రచారం జరుగుతోంది.

Advertisement
Advertisement