News

Big Shock to YSRCP: వైఎస్సార్సీపీకి బిగ్ షాక్, రాజీనామాకు సిద్ధ‌మైన ఇద్ద‌రు రాజ్య‌స‌భ స‌భ్యులు, మ‌రికొంద‌రు కూడా అదే బాట‌లో ఉన్న‌ట్లు జోరుగా ప్ర‌చారం

VNS

ఏపీలో వైసీపీకి (YCP) వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పార్టీ నేతలు తమదారితాము చూసుకుంటున్నారు. తాజాగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ (Mopidevi Venkata Ramana), బీద మస్తాన్‌రావు (Beeda Masthan Rao) తమ పదవులకు రాజీనామా చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు రాజ్యసభ చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్కర్‌ వారికి అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు.

UP Digital Media Policy: ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పోస్టు పెడితే జీవిత‌ఖైదు, అనుకూలంగా ప్ర‌చారం చేస్తే రూ. 8 లక్ష‌లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్స‌ర్ల‌కు బంపర్ ఆఫ‌ర్

VNS

సోషల్‌ మీడియాలో దేశ వ్యతిరేక పోస్టులు పెట్టేవారికి మూడేళ్ల నుంచి జీవితఖైదు (Life Sentence) వరకు శిక్ష విధించేలా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త డిజిటల్‌ మీడియా పాలసీని (UP Digital Media Policy) రూపొందించింది. అభ్యంతరకర, అసభ్య పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొంది. ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించే వారికి నెలవారీ భారీ నగదు ప్రోత్సాహకాలను ప్రకటించింది.

HYDRA Notices: సీఎం రేవంత్ రెడ్డికి హైడ్రా షాక్, ఏకంగా ఆయ‌న సోదరుడికే నోటీసులు, దుర్గం చెరువు కాల‌నీలో నోటీసులు అందుకున్న‌వారిలో ప‌లువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు

VNS

హైడ్రా (Hydra)దూకుడు కొన‌సాగుతోంది. చెరువులు, కుంట‌ల‌ను ఆక్ర‌మించి కట్టుకున్న నిర్మాణాల‌పై కొర‌డా ఝ‌లిపిస్తోంది. ఎవర్నీ వ‌ద‌ల‌కుండా నోటీసులు ఇస్తున్నారు హైడ్రా అధికారులు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి (M Revanth Reddy) సోద‌రుడు ఉంటున్న ఇంటికి కూడా నోటీసులు అంటించారు.

Telugu Language Day 2024 Wishes: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మీ స్నేహితులకు ఫోటో గ్రీటింగ్స్ రూపంలో శుభాకాంక్షలు తెలపండిలా..?

sajaya

అమెరికాలో సైతం తెలుగు భాష రెండవ అతిపెద్ద విదేశీ భాషగా హిందీ తో సమానంగా పేరు తెచ్చుకుంది. ఇక భారతదేశంలో హిందీ తర్వాత అత్యధిక మంది మాట్లాడే భాషగా తెలుగు భాషకు పేరు ఉంది. నేడు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మేము బంధుమిత్రులకు శుభాకాంక్షలు ఇక్కడ పేర్కొన్న ఫోటో గ్రీటింగ్స్ ద్వారా తెలపండి.

Advertisement

Telugu Basha Dinotsavam 2024 Wishes: మీ బంధు మిత్రులకు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయండిలా..

sajaya

ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన భాషల్లో ఒకటైన తెలుగు భాషకు లేడు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రముఖ తెలుగు రచయిత గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.

ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకులు విడుదల, అగ్రస్థానంలో కొనసాగుతున్న జో రూట్, 6, 7, 8 ర్యాంకుల్లో కొన‌సాగుతున్న టీమిండియా ప్లేయర్లు

Vikas M

అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి (ఐసీసీ) టెస్టు ర్యాంకుల‌ను విడుద‌ల చేసింది. ఇందులో ముగ్గురు టీమిండియా బ్యాట‌ర్లు టాప్‌-10లో చోటు ద‌క్కించుకున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ 751 పాయింట్ల‌తో ఆరో స్థానంలో ఉండగా, భార‌త యువ సంచ‌ల‌నం య‌శ‌స్వి జైస్వాల్ (740) ఒక స్థానం మెరుగుప‌ర‌చుకుని ఏడో ర్యాంక్ ద‌క్కించుకున్నాడు.

Dawid Malan Retires: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఇంగ్లండ్ స్టార్ క్రికెట‌ర్‌ డేవిడ్ మలన్, ఫ్రాంచైజీ క్రికెట్‌పై దృష్టి పెట్టనున్నట్లుగా వార్తలు

Vikas M

ఇంగ్లండ్ స్టార్ క్రికెట‌ర్‌ డేవిడ్ మలన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. 2017లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఈ ఎడమచేతి వాటం స్టార్, అత్యంత తక్కువ కాలంలోనే ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెం. 1 స్థానం ద‌క్కించుకున్నాడు. చాలా కాలంపాటు అగ్ర‌స్థానంలో కొన‌సాగాడు. 2022లో ఇంగ్లండ్ టీ20 ప్రపంచ కప్ విజేతగా నిల‌వ‌డంలో మలన్ కీరోల్ పోషించాడు.

Zaheer Khan: ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ మెంటార్‌గా జ‌హీర్ ఖాన్, ముంబైని వదిలేసిన టీమిండియా మాజీ పేసర్

Vikas M

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) మెంటార్‌గా టీమిండియా మాజీ పేస్ బౌలర్ జ‌హీర్ ఖాన్ ఎంపికైన‌ట్లు ఆ ఫ్రాంచైజీ తాజాగా అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఒక వీడియోను విడుద‌ల చేసింది.

Advertisement

Pushpa 2 New Poster: పుష్ప-2 నుంచి అదిరిపోయే పోస్టర్, రెడ్ కలర్ బ్యాక్ గ్రౌండ్ తో దుమ్మురేపుతున్న అల్లు అర్జున్ లుక్..

Vikas M

పుష్ప-2: ది రూల్' చిత్రం మరో 100 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది అంటూ మేకర్స్ నేడు అప్ డేట్ ఇచ్చారు. ఈ ఏడాది డిసెంబరు 6న థియేటర్లలో రిలీజ్ కానుంది అంటూ పేర్కొన్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ కొత్త పోస్టర్ ను కూడా పంచుకున్నారు. రెడ్ కలర్ బ్యాక్ గ్రౌండ్ తో ఉన్న ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ సీరియస్ నెస్ ను చూడొచ్చు.

Uttar Pradesh Shocker: ఇదేం విచిత్రం.. చనిపోయిన చెల్లెలి కోసం ఏకంగా ప్రభుత్వ పాఠశాలలోనే సమాధిని నిర్మించిన అన్నలు, ఇద్దర్ని అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు

Vikas M

కౌశాంబిలోని ఆషాడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సమాధిని నిర్మిస్తున్నారనే ఆరోపణలపై ఇద్దరు సోదరులు మహ్మద్ కాసిమ్ మరియు మహ్మద్ హషీమ్‌లను ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆగస్టు 27న అరెస్టు చేశారు.

US: దారుణం, పిల్లల ముందే పెంపుడు కుక్కను కాల్చిన పోలీస్ అధికారి, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ 5,000 మందికి పైగా ప్రజలు ఆన్‌లైన్ పిటిషన్‌పై సంతకం

Hazarath Reddy

డావెన్‌పోర్ట్, అయోవా పోలీసు అధికారి, ఏతాన్ బాక్‌గా గుర్తించబడి, ఆగస్ట్ 21న కుక్కను దాని యజమానులు మరియు వారి చిన్నపిల్లల ముందు ఘోరంగా కాల్చి చంపిన తర్వాత విచారణలో ఉన్నారు. నార్త్ పైన్ స్ట్రీట్ 800 బ్లాక్ సమీపంలో కంచెను దూకేందుకు ప్రయత్నిస్తున్న నాలుగు దూకుడు కుక్కల నివేదికపై బాక్ స్పందించారు.

When Is Ganesh Chaturthi 2024? గణేష్ చతుర్థి 2024 ఎప్పుడు? ఈ పండుగ తేదీలు, శుభ ముహూర్తం మరియు ఆచారాలను తెలుసుకోండి

Vikas M

గణేష్ చతుర్థి 2024: వినాయక చతుర్థి లేదా గణేష్ ఉత్సవ్ అని కూడా పిలువబడే గణేష్ చతుర్థి.. గణేశుని జన్మదినాన్ని జరుపుకునే హిందూ పండుగ. గణేశుడిని జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టానికి దేవుడుగా భావిస్తారు.

Advertisement

Wanaparthy : వనపర్తిలో రోడ్డు ప్రమాదం, ప్రైవేట్ బస్సు ఢీకొని ఇద్దరు మృతి, అతివేగమే కారణం!

Arun Charagonda

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వనపర్తి డిపో కి చెందిన ప్రైవేట్ బస్సు ఢీకొని ఇద్దరు మృతి చెందగా ద్విచక్ర వాహనం అతివేగంతో వెళ్లడం తోనే ప్రమాదం జరిగినట్లు గా ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

Viral Video: వీడియో ఇదిగో, కదులుతున్న రైలు ఎక్కుతూ మధ్యలో ఇరుక్కుపోయిన ప్యాసింజర్, వెంటనే అలర్ట్ అయి కేకలు వేసిన RPF కానిస్టేబుల్, తర్వాత ఏమైందంటే..

Hazarath Reddy

75 ఏళ్ల వృద్ధుడైన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కదిలే రైలు- ప్లాట్‌ఫారమ్ మధ్యలో ఇరుక్కుపోయాడు. వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) కానిస్టేబుల్, అక్కడి ప్రయాణికుల సాయంతో అతన్ని రక్షించారు ఈ ఘటన తిరుచ్చి రైల్వే జంక్షన్ వద్ద చోటు చేసుకుంది.

Andhra Pradesh: నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో 342 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత, జ్వరం కడుపునొప్పితో పాటు వాంతులు, విరేచనాలు, గత 3 రోజుల్లో 800 మందికి అనారోగ్యం

Hazarath Reddy

ఏలూరు జిల్లాలోని నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో మంగళవారం ఒక్కరోజే 342 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. గడిచిన 3 రోజులుగా సుమారు 800 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆ విద్యార్థులు జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు.

12 Industrial Smart Cities: దేశంలో కొత్తగా 12 స్మార్ట్ సిటీలు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం, రూ.28,602 కోట్ల నిధులు కేటాయింపు, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ అంటే..

Hazarath Reddy

బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ సమావేశం జరిగింది. దేశంలో కొత్తగా 12 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేసేలా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్‌ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. దేశంలో 12 గ్రీన్‌ ఫీల్డ్‌ స్మార్ట్‌ సిటీలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Advertisement

12 Industrial Smart Cities: కడప, కర్నూలు జిల్లాల్లో కొత్తగా స్మార్ట్ సిటీలు, దేశంలో కొత్తగా 12 స్మార్ట్ సిటీలు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం, తెలంగాణలో ఎక్కడంటే..

Hazarath Reddy

బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ సమావేశం జరిగింది. దేశంలో కొత్తగా 12 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేసేలా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.

YSRCP: మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా జోగి రమేష్, పెనమలూరు ఇన్‌చార్జ్‌గా దేవభక్తుని చక్రవర్తి, ఉత్తర్వులు జారీ చేసిన వైసీపీ పార్టీ

Hazarath Reddy

రెండు నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌ల నియామిస్తూ వైఎస్సార్‌సీపీ ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా జోగి రమేష్, పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా దేవభక్తుని చక్రవర్తిలను నియమించారు.

Andhra Pradesh Cabinet Meeting: ఏపీలో రివర్స్‌ టెండరింగ్‌ విధానం రద్దు, పాత విధానంలోనే టెండర్ల ప్రతిపాదనకు చంద్రబాబు సర్కారు గ్రీన్ సిగ్నల్, క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవిగో..

Hazarath Reddy

ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని మంత్రివర్గం రద్దు చేసింది.

Patna: వీడియో ఇదిగో, సెల్ఫీ తీసుకుంటూ వంతెన మీద నుంచి గంగా నదిలో పడిపోయిన యువతి, అదృష్టవశాత్తూ అక్కడే సిబ్బంది ఉండటంతో ప్రాణాలతో బయటకు

Hazarath Reddy

పాట్నాలో జరిగిన ఒక ఆశ్చర్యకరమైన సంఘటనలో, మహాత్మా గాంధీ సేతు వంతెనపై సెల్ఫీ తీసుకుంటున్న 24 ఏళ్ల మహిళ ఆగస్టు 28న సుమారు 15 అడుగుల ఎత్తు నుండి గంగా నదిలోకి పడిపోయింది. ప్రమాదవశాత్తూ నదిలో పడిపోవడం వీడియోలో బంధించబడింది. ఆమె నదిలో పడిపోయి సహాయం కోసం కేకలు వేసింది.

Advertisement
Advertisement