వార్తలు
Sri Lanka Win By 110 Runs: కీలక మ్యాచ్ లో చేతులెత్తేసిన టీమిండియా, మూడో వన్డేలో భారీ తేడాతో శ్రీలంక విజయం, 2-0 తేడాతో సిరీస్ లంక కైవసం
VNSటాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకు ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో, పాతుమ్ నిస్సాంక అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. మొదటి వికెట్కు 89 పరుగులు జోడించారు. హాఫ్ సెంచరీకి ఐదు పరుగుల దూరంలో అక్షర్ పటేల్ బౌలింగ్లో పంత్ క్యాచ్ అందుకోవడంతో నిస్సాంక ఔట్ అయ్యాడు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, పోలీసులు డబ్బుతో పాటు ఫోన్ లాక్కున్నారంటూ ట్రాన్స్ ఫార్మర్ ఎక్కి ఓ వ్యక్తి హల్ చల్
Hazarath Reddyతన ఫోన్ పోలీసులు తీసుకున్నారని ట్రాన్స్ ఫార్మర్ ఎక్కిన వ్యక్తి హల్ చల్ చేశాడు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద మావుళ్ళు అనే వ్యక్తి ట్రాన్స్ ఫార్మర్ ఎక్కి స్థానికులను భయభ్రాంతలకు గురి చేశాడు. తన సెల్ ఫోన్, డబ్బులు పోలీసులు తీసుకున్నారంటూ అవి ఇస్తేగాని దిగనంలూ మావుళ్ళు డిమాండ్ చేశారు. పోలీసులు అతన్ని బతిమాలి క్రిందకు దించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
Mr Bachchan Trailer: మళ్లీ రిపీట్ అవుతున్న మిరపకాయ్ కాంబినేషన్, ఆగస్ట్ 15న రచ్చ లేపనున్న మిస్టర్ బచ్చన్
VNSపీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను ఇండిపెండెన్స్ కానుకగా ఆగష్టు 15న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Andhra Pradesh Horror: ఏపీలో ఆగని హత్యలు, చీరాలలో నడిరోడ్డుపై యువకుడిని కత్తితో దారుణంగా పొడిచి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు, వీడియోలు ఇవిగో..
Hazarath Reddyకారులో వచ్చిన గుర్తు తెలియని కొందరు యువకులు బైకును అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. వెంటనే కత్తితో దాడి చేయగా రోడ్డుపై రక్తపు గాయలతో పడివున్న ఆరిఫ్ ను చీరాల ప్రభుత్వ వైద్యాశాలకు తరలించారు. అప్పటికే యువకుడు మృతిచెందారు.
Road Accident in Tirumala: వీడియో ఇదిగో, తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం, నుజ్జునుజ్జు అయిన ఇద్దరి మృతదేహాలు
Hazarath Reddyతిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఘాట్ చివరి రోడ్డుపై చివరి మలుపు వద్ద ద్విచక్క వాహనం అదుపుతప్పడంతో దానిపై వెళుతున్న ఇద్దరు కిందపడ్డారు. కిందపడ్డ వారిపై నుంచి వెనకనుంచి వస్తున్న బస్సు వెళ్లడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదం కారణంగా ఘాట్ రోడ్డులో భారీగా ట్రాపిక్ జాం అయింది. ఈ ప్రమాదంలో మృతదేహాలు నుజ్జునుజ్జు అయ్యాయి.
Pendem Dorababu Resigns YSRCP: వైసీపీకి షాకిచ్చిన ఇద్దరు నేతలు, పిఠాపురంలో పెండెం దొరబాబు రాజీనామా, అనంతపురంలో పైలా నర్సింహయ్య గుడ్ బై
Hazarath Reddyపిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాజకీయ స్వలాభం కోసం కాదని, పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఇక అనంతపురం జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నర్సింహయ్య తన పదవికి రాజీనామా చేశారు.
Jagan Disproportionate Assets Case: జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ నవంబర్ 11కు వాయిదా, రఘురామపై సుప్రీంకోర్టు సీరియస్, సీబీఐపై అసహనం
Hazarath Reddyమాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) అక్రమాస్తుల కేసు విచారణ నవంబర్ 11కు వాయిదా (Adjourn) పడింది. జగన్ అక్రమాస్తుల ( Illegal assets ) కేసులపై గతంలో ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్పై బుధవారం సుప్రీంకోర్టులో జస్టిస్ సంజీవ్ ఖన్నా (Justice Sanjeev Khanna ) నేతృత్వంలో విచారణ జరిగింది.
YS Jagan's Security Row: దేవాన్స్కు ఆరుమంది సెక్యూరిటీని పెట్టారు, మరి జగన్కు భద్రత వద్దని ఎందుకంటున్నారు ? ఏదైనా జరిగితే కూటమి ప్రభుత్వానిదే బాధ్యత అని మండిపడిన అంబటి రాంబాబు
Hazarath Reddyహైదరాబాద్లో చంద్రబాబు ఇంటి ముందు ఇప్పటికీ ప్రవేశం లేదని ఆయన గుర్తుచేశారు. కానీ వైఎస్ జగన్ ఇంటి ముందు రోడ్డును తెరిచి జనాలను పంపిస్తున్నారని అన్నారు. చంద్రబాబు మనుమడు దేవాన్ష్కు కూడా ఆరుగురు సెక్యూరిటీని ఎలా పెట్టారని ప్రశ్నించారు. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
GVMC Standing Committee Elections: గ్రేటర్ విశాఖలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్, స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం
VNSవిశాఖపట్నం జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ (GVMC Standing Committee Elections) ఎన్నికల్లో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో కూటమి (NDA) ఘన విజయం సాధించింది. 10కి 10 స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. కూటమి అభ్యర్థులే గెలుపొందారు. కూటమి కార్పొరేటర్లు 60 ఓట్లు సాధించారు.
Telangana Politics: బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు, తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై కోర్టులో దావా వేస్తామని వెల్లడి
Hazarath Reddyబీజేపీలో బీఆర్ఎస్ విలీనం లేదు. తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
YS Jagan's Security Row: భద్రత కుదింపుపై హైకోర్టులో జగన్ పిటిషన్, బుల్లెట్ప్రూఫ్ వాహనాన్ని రీప్లేస్ చేస్తామని తెలిపిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyతన భద్రతా కుదింపుపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్పై ఇవాళ విచారణ జరిగింది.జగన్ భద్రత విషయంలో రాజీ పడొద్దని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మధ్యాహ్నాం తిరిగి వాదనల సమయంలో అడ్వొకేట్ జనరల్ వివరణ ఇస్తూ.. ‘‘స్పేర్ పార్ట్స్ కు ఆర్డర్ ఇచ్చాం అవి ఇంకా రాలేదు.
National Handloom Day: చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 33శాతం రిజర్వేషన్లు, అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తెలిపిన సీఎం చంద్రబాబు, జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyజయవాడలో జాతీయ చేనేత దినోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. స్టాళ్లలో ఉత్పత్తులు పరిశీలించి చేనేత కార్మికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన సతీమణి భువనేశ్వరికి రెండు చీరలు కొనుగోలు చేశారు. చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 33శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించారు.
AP Cabinet Meeting: స్థానిక ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా పోటీ చేయవచ్చు, చట్ట సవరణ బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం
Hazarath Reddyస్థానిక ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే అనర్హత వేటు నిబంధన ఎత్తివేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నిబంధన ఎత్తివేసేలా చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టనున్నారు.
AP Cabinet Meeting Highlights: వైద్య కళాశాలల్లో అదనపు పోస్టుల మంజూరుకు క్యాబినెట్ ఆమోదం, మరో 380 పోస్టులు భర్తీకి గ్రీన్ సిగ్నల్
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. మంత్రివర్గం సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పార్థసారథి మీడియాతో కేబినెట్ భేటీ అంశాలను వివరించారు.
AP Cabinet Meeting Highlights: పట్టాదారు పాసు పుస్తకాల నుండి జగన్ ఫోటో ఔట్, ప్రభుత్వ అధికారిక రాజముద్రతో కొత్త పాసు పుస్తకాల పంపిణీ
Hazarath Reddyసర్వే రాళ్లపై జగన్ బొమ్మ, పేరు తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజముద్ర ఉన్న కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి నిర్ణయం తీసుకుంది. రీ సర్వేపై క్యాబినెట్లో రెవెన్యూశాఖ నోట్ సమర్పించింది.
New Liquor Policy in AP: ఏపీలో అక్టోబర్1 నుండి కొత్త మద్యం పాలసీ, అత్యంత తక్కువ ధరకే బ్రాండెడ్ మద్యం,మంత్రి పార్థసారథి వీడియో ఇదిగో..
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. మంత్రివర్గం సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పార్థసారథి మీడియాతో కేబినెట్ భేటీ అంశాలను వివరించారు. రాష్ట్రంలో అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం విధానం అమలు చేస్తామన్నారు.
AP Cabinet Meeting Highlights: మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం, తక్కువ ధరకే నాణ్యమైన మద్యం, ఏపీ క్యాబినెట్ సమావేశం హైలెట్స్ ఇవిగో..
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. మంత్రివర్గం సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పార్థసారథి మీడియాతో కేబినెట్ భేటీ అంశాలను వివరించారు.
PM Modi on Vinesh Phogat Disqualification: వినేశ్.. మీరు ఛాంపియన్లలో ఛాంపియన్, వినేశ్ ఫోగాట్ అనర్హత వేటుపై స్పందించిన ప్రధాని మోదీ, ఇంకా ఏమన్నారంటే..
Hazarath Reddyవినేష్, వినేష్, మీరు ఛాంపియన్లలో ఛాంపియన్! మీరు భారతదేశానికి గర్వకారణం మరియు ప్రతి భారతీయునికి స్ఫూర్తి. ఈరోజు ఎదురుదెబ్బ బాధిస్తుంది. నేను మీరు అనుభవిస్తున్న వైరాగ్య భావ పదాలు నాకు తెలుసు
Rahul Gandhi on Vinesh Phogat Disqualification: దేశం మొత్తం మీ వెంటే ఉంది వినేశ్, రాహుల్ గాంధీ ట్వీట్ ఇదిగో, నువ్వు ఎప్పుడూ దేశం గర్వించేలా చేశావంటూ విషెస్
Hazarath Reddyప్రపంచ ఛాంపియన్ రెజ్లర్లను ఓడించి ఫైనల్స్కు చేరిన భారత్కు గర్వకారణమైన వినేష్ ఫోగట్ సాంకేతిక కారణాలతో అనర్హత వేటు పడటం దురదృష్టకరం.ఈ నిర్ణయాన్ని భారత ఒలింపిక్ సంఘం గట్టిగా సవాలు చేస్తుందని, దేశ పుత్రికకు న్యాయం చేస్తుందని మేము పూర్తి ఆశిస్తున్నాము
Anand Mahindra on Vinesh Phogat Disqualification: నోనోనో.. ఇది ఓ పీడకల అయితే బాగుండు, వినేశ్ ఫోగట్ అనర్హత వేటుపై ఆనంద్ మహీంద్రా ట్వీట్ ఇదిగో..
Hazarath Reddyపారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ఊహించని షాక్ తగిలింది. స్వర్ణపతక రేసు ఆశలు రేపిన భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. అధిక బరువు కారణంగా మహిళల 50 కేజీల రెజ్లింగ్కు అనర్హురాలు అయ్యింది. ఈ అంశం ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.