రాజకీయాలు

Rahul Night Party Video Row: రాహుల్ గాంధీ నైట్‌ క్లబ్‌ పార్టీ వీడియోపై స్పందించిన కాంగ్రెస్, ఫ్రెండ్‌ వివాహ వేడుకకు వెళ్లడం కూడా తప్పేనా అంటూ కౌంటర్

Hazarath Reddy

రాహుల్ గాంధీ నైట్‌ క్లబ్‌ పార్టీ వీడియో పై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. బీజేపీ విమర్శలకు కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి రణ దీప్ సూర్జేవాలా ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. రాహుల్‌ గాంధీ నైట్‌ క్లబ్‌ వీడియోలో తప్పేముందని?, ఫ్రెండ్‌ వివాహ వేడుకకు రాహుల్ నేపాల్ వెళ్లడం నేరమా? అని బీజేపీని సూటిగా ప్రశ్నించారు.

PM Modi Europe Tour: జర్మనీలో అడుగుపెట్టిన ప్రధాని మోదీ, మూడు రోజులపాటు జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్‌ దేశాల్లో పర్యటన, యూరప్‌ దేశాలతో సహకార స్ఫూర్తిని బలోపేతం చేయడమే లక్ష్యంగా టూర్

Hazarath Reddy

మూడు యూరోపియన్ దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీకి (PM Narendra Modi arrives in Germany) చేరుకున్నారు. సోమవారం నుంచి మూడు రోజులపాటు జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్‌ దేశాల్లో(PM Modi Europe Tour) పర్యటిస్తారు. యూరప్‌ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న వేళ అక్కడ పర్యటిస్తున్నట్టు ఒక ప్రకటనలో ఆయన అన్నారు.

KTR Comments Row: హైద‌రాబాద్‌లో క‌రెంట్ లేక జ‌న‌రేట‌ర్ మీద ఉన్నా..ఇది నేనెవ‌రితోనూ చెప్ప‌లేదే, కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన మంత్రి బొత్సా, ప‌క్క రాష్ట్రాల‌ను విమ‌ర్శించ‌డం మానుకోవాలని హితవు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరిగా రోడ్లు లేవని , కరెంట్ లేదని ..నీళ్లు కూడా లేవని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ (Minister KTR Comments Row) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వైసీపీ నేతలు వరుసగా కౌంటర్లు ఇస్తున్నారు. మంత్రి జోగి రమేష్ ఇప్పటికే కౌంటర్ ఇవ్వగా తాజాగా మంత్రి బొత్సా సత్యనారాయణ స్పందించారు.

Didi on Modi: ఫస్ట్ మాకు రావాల్సిన వాటా ఇవ్వండి! మోదీకి దీదీ కౌంటర్, చమురుపై 25 శాతం ఎక్కువ పన్ను మీరే వేస్తున్నారు, లెక్కలతో సహా ప్రధానికి ఘాటు సమాధానమిచ్చిన మమతా బెనర్జీ

Naresh. VNS

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamatha Benarjee) సైతం మోదీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోలు, డీజిల్‌, గృహోపకరణాల ధరల పెరుగుదల విషయాన్ని కేంద్రం రాష్ట్రాలకు వదిలేసిందని, రాష్ట్రాలు ధరలు తగ్గించాల్సి ఉంటుందని (Reduce Price) ప్రధాని చెప్పడం విడ్డురంగా ఉందని, ధరలు పెంచింది కేంద్రం మరి రాష్ట్రాలు రాష్ట్రాలు ఎలా తగ్గిస్తాయి? అంటూ మమతా బెనర్జీ దుయ్యబట్టారు

Advertisement

'Politics of Hate': మత విద్వేష రాజకీయాలు వెంటనే ఆపండి, మైనారిటీలను నిత్యం భయాందోళనకు గురిచేస్తున్నారంటూ.. ప్రధాని మోదీకి లేఖ రాసిన 100 మందికి పైగా మాజీ బ్యూరోక్రాట్లు

Hazarath Reddy

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవల జరిగిన మత హింస కేసులపై 100 మందికి పైగా మాజీ బ్యూరోక్రాట్లు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ప్రధాని మోడీ మౌనం వీడాలని..దేశంలో విద్వేష రాజకీయాలకు (Hate against minorities) ముగింపు పలకాలని వారంతా ఆ లేఖలో కోరారు. దేశంలోని రాజకీయ పరిస్థితుల గురించి ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా ద్వేషపూరిత రాజకీయాలకు' స్వస్తి పలకాలని కోరారు.

PM Modi VC: పెట్రోల్ ధరలు పెరుగుదలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు, రాష్ట్ర ప్రభుత్వాల తీరే కారణమని మండిపాటు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ డ్యూటీ ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించిన ప్రధాని

Hazarath Reddy

దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi ) అన్ని రాష్ట్రాల ముఖ‍్యమంత్రులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో (PM Modi VC) పాల్గొన్నారు. దేశంలో కోవిడ్‌ సంక్షోభాన్ని ఎదుర్కొడానికి మనమంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

TRS Celebrates 21 Years: జాతీయే రాజకీయాలే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్లీనరీ, 22వ వడిలోకి అడుగుపెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి, రాజకీయ, ప్రభుత్వపరమైన అంశాలపై దిశానిర్దేశం చేయనున్న సీఎం కేసీఆర్

Hazarath Reddy

రాష్ట్రంలోని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ యుక్త వయసులోకి ప్రవేశిస్తోంది. నేటి (ఏప్రిల్‌ 27)తో 21 ఏళ్లు పూర్తి చేసుకొని, 22వ యేట అడుగు (TRS Celebrates 21 Years) పెట్టబోతోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌ మాదాపూర్‌ హైటెక్స్‌లో ప్రతినిధుల సభ (ప్లీనరీ) ( Hyderabad International Convention Centre (HICC) నిర్వహిస్తోంది.

Hanuman Chalisa Row: మీ దాదాగిరి ఇక్కడ చూపిస్తే అణిచివేస్తాం, బీజేపీపై మండిపడిన మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ థాక‌రే, మహా రాజకీయాల్లో కాక పుట్టిస్తున్న హ‌నుమాన్ చాలీసా అంశం

Hazarath Reddy

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ థాక‌రే భారతీయ జనతా పార్టీపై తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. హ‌నుమాన్ చాలీసా ప‌ఠించాల‌నుకుంటే (Hanuman Chalisa Row) ప‌ఠించాల‌ని, తమకు అభ్యంత‌రం లేద‌న్నారు. అయితే హ‌నుమాన్ చాలీసా మాటున దాదాగిరి చేస్తే మాత్రం స‌హించేది లేద‌ని సీఎం (CM Uddhav Thackeray) హెచ్చ‌రించారు. దాదాగిరిని ఎలా అణ‌చాలో త‌మ‌కు బాగా తెలుసంటూ ఫైర్ అయ్యారు.

Advertisement

Loudspeaker Row: మ‌హారాష్ట్ర రాజ‌కీయాల‌ను కుదిపేస్తున్న హ‌నుమాన్ చాలీసా ప‌ఠ‌నం, మోదీ ఇంటి ముందు హ‌నుమాన్ చాలీసా, న‌మాజ్ చ‌దువుతామ‌ని ఎన్సీపీ ప్రకటన

Hazarath Reddy

హ‌నుమాన్ చాలీసా ప‌ఠ‌నం ఇప్పుడు మ‌హారాష్ట్ర రాజ‌కీయాల‌ను కుదిపేస్తోంది. తాము సీఎం ఉద్ధ‌వ్ థాకరే ఇంటి ముందు హ‌నుమాన్ చాలీ ప‌ఠ‌నం చేస్తామ‌ని ఎంపీ న‌వ‌నీత్ రాణా దంప‌తులు పేర్కొనడంతో ఈ వివాదం ప్రారంభ‌మైంది. దీంతో ప్ర‌భుత్వం, హిందుత్వ‌వాదుల మ‌ధ్య తీవ్ర మాట‌ల యుద్ధం న‌డుస్తోంది.

Ajay Mishra Returns To Jail: మళ్లీ జైలుకు వెళ్లిన కేంద్రమంత్రి కొడుకు, బెయిల్ రద్దుతో జైలుకు వెళ్లి లొంగిపోయిన అశిష్ మిశ్రా, సుప్రీంకోర్టు ఆదేశాలతో జైలుకెళ్లిన లఖింపూర్ ఖేరీ ఘటన ప్రధాన నిందితుడు

Naresh. VNS

ఆశిష్ మిశ్రా (Ashish Mishra) లొంగిపోయారు. సుప్రీంకోర్టు బెయిల్ రద్దు (bail) చేసిన క్రమంలో.. ఆయన ఆదివారం చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోయారు. లఖింపూర్ ఖేరీ (Lakhimpur Kheri) హింసాకాండలో ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడనే ఆరోపణలున్నాయి.

PK Meets KCR: కాంగ్రెస్‌లో చేరుతా కానీ, మీకోసం పనిచేస్తా! కేసీఆర్‌కు ప్రశాంత్ కిషోర్ ఆఫర్, రెండు రోజుల పాటూ సుదీర్ఘంగా ఇరువురి మధ్య చర్చలు

Naresh. VNS

సీఎం కేసీఆర్ తో ఆయన ఆదివారం లంచ్ చేశారు. వీరిద్దరి భేటీలో అనేక అంశాలపై సుధీర్ఘంగా చర్చ జరిగింది. జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ (CM KCR) ఆరా తీసినట్లు తెలుస్తోంది. వచ్చే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటనే దానిపై ఆయనతో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. కేంద్రంలో బీజేపీని (BJP) గద్దెదించేందుకు అవసరమైన అంశాలపై వారిద్దరి మధ్య చర్చ జరిగింది.

Hardik Patel on Congress: కాంగ్రెస్‌పై హార్ధిక్ పటేల్ తిరుగుబాటు, తనను పని చేసుకోనివ్వడం లేదని కీలక కామెంట్లు, అవసరమైతే పార్టీ మారుతానంటూ సంచలన వ్యాఖ్యలు

Naresh. VNS

గుజరాత్‌లోని (Gujrat) కాంగ్రెస్ నాయకత్వంతోనే తనకు సమస్య ఉందని, పార్టీలోని ఇతర నాయకులతో కాదని హార్ధిక్ పటేల్ అన్నాడు. పార్టీ నాయకత్వం ఎవరినీ పనిచేయనివ్వదని, ఎవరైనా పనిచేస్తుంటే అడ్డుకుంటారని విమర్శించాడు.

Advertisement

PM Modi Receives UK PM: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు స్వాగతం పలికిన ప్రధాని మోదీ, అద్భుత స్వాగతం పలికినందుకు భారత ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన బ్రిటన్‌ ప్రధాని

Hazarath Reddy

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాష్ట్రపతి భవన్‌లో గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా తనకు అద్భుత స్వాగతం పలికినందుకు మోదీకి బ్రిటన్‌ ప్రధాని ధన్యవాదాలు తెలిపారు.. ‘మా (భారత్- యూకే) మధ్య పరిస్థితులు ఇప్పుడున్నంత బలంగా, మంచిగా ఇంతకముందు ఉన్నాయని నేను అనుకోను’ అని బోరిస్ జాన్సన్ అన్నారు.

Electoral Trusts Donations: బీజేపీకి భారీగా డొనేషన్లు, ఏడాదిలో కమలం పార్టీకి రూ.212 కోట్లు విరాళాలు, మిగిలిన పార్టీలు అంతంతమాత్రమే

Naresh. VNS

భారతీయ జనతా పార్టీ మరో రికార్డు నెలకొల్పింది. ఒక్క ఏడాది అత్యధిక డొనేషన్లు (Donations) పొందిన రాజకీయ పార్టీగా బీజేపీ (BJP) కొత్త రికార్డు సృష్టించింది. గత ఏడాది రాజకీయ పార్టీలకు అందిన విరాళాల లెక్కలు చూస్తే దేశవ్యాప్తంగా 12 ప్రధాన పార్టీలకు మొత్తం రూ.258 కోట్ల వరకు విరాళాలు అందగా.. అందులో ఒక్క బీజేపీకే రూ.212 కోట్లు డొనేషన్లు (Donations) రాబట్టింది.

UK PM Boris Johnson India Visit: రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌ చేరుకున్న బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, భారత్‌- బ్రిటన్‌ వాణిజ్య, ప్రజా సంబంధాలపై కీలక చర్చలు జరిగే అవకాశం

Hazarath Reddy

రెండు రోజుల పర్యటనలో భాగంగా బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ భారత్‌ చేరుకున్నారు. లండన్‌ నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అడుగుపెట్టారు. ఆయనకు గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌, అధికారులు సాదర స్వాగతం పలికారు.

PK Meeting With Sonia: కాంగ్రెస్ బలోపేతంపై సుధీర్ఘ సమావేశం, సోనియా సహా సీనియర్ నేతలో 6 గంటల పాటూ ప్రశాంత్ కిశోర్ మీటింగ్, పాల్గొన్న కాంగ్రెస్ సీఎంలు

Naresh. VNS

ప్రజల విశ్వాసం తిరిగి పొందేవిధంగా కాంగ్రెస్ (Congress)పార్టీ అడుగులు వేస్తోంది. సంస్థాగతంగా పార్టీనిబలోపేతం చేయడంతో పాటు..అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన అన్ని విషయాలపై అధిష్టానం కసరత్తు చేస్తుంది. ఈక్రమంలో గత పది రోజులుగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా (Sonia) ఆధ్వర్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.

Advertisement

Telangana: టీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు వ్యాఖ్యలపై స్పందించిన గవర్నర్ తమిళిసై, పాత వీడియోలతో సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేశారని.. తన వ్యాఖ్యలను తప్పుగా వక్రీకరించారని ఆవేదన

Hazarath Reddy

తనపై తెలంగాణ ప్రభుత్వం, మంత్రులు చేస్తున్న విమర్శలపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ మరోసారి స్పందించారు. ప్రభుత్వాన్ని రద్దు చేస్తానని తాను ఏనాడూ అనలేదని, రాజకీయం చేస్తున్నారని అనవసరంగా తనను విమర్శిస్తున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలను తప్పుగా వక్రీ కరించారని గవర్నర్ తమిళిసై అన్నారు.

Prashant Kishor:ప్రశాంత్ కిషోర్‌కు సోనియా బంపర్ ఆఫర్, కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ కోరిన సోనియా, 2024 ఎన్నికల మ్యాప్ రూపొందించడం, పొత్తులపై సోనియాకు వివరించిన పీకే

Naresh. VNS

ప్రశాంత్ కిషోర్‌ను (Prashant Kishor) కాంగ్రెస్ తమ పార్టీలో చేరాలని కోరినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ప్రశాంత్ కుమార్ అందించిన వివరణాత్మక ప్రజెంటేషన్ పార్టీ అధిష్టానానికి సమర్పించారు.

AAP Gopal Italia: సమయం వృథా చేసుకోకుండా ఆప్‌లో చేరండి హార్దిక్‌ పటేల్‌, ఆప్‌ గెలుపునకు సహకరించండని సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ చీఫ్ గోపాల్ ఇటాలియా

Hazarath Reddy

గుజరాత్‌ పాలిటిక్స్‌లో సంచలన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ఇంద్రనీల్ రాజ్‌గురు.. ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరారు. ఇదిలా ఉండగా.. గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్‌ పటేల్‌ హస్తం పార్టీని వీడుతున్నారనే వార్తల నేపథ్యంలో తమ పార్టీ(ఆప్‌)లో చేరాలని ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ చీఫ్ గోపాల్ ఇటాలియా కోరారు.

Jitan Ram Manjhi: రాముడి అసలు దేవుడే కాదు, సంచలన వ్యాఖ్యలు చేసిన బీహార్‌ మాజీ సీఎం జితిన్‌ రాం మాంఝీ, తుల‌సీదాస్‌, వాల్మీకి తమ రాతల్లో చొప్పించారని ఆసక్తికర వ్యాఖ్య‌లు

Hazarath Reddy

రాముడి విషయంలో బీహార్‌ మాజీ సీఎం జితిన్‌ రాం మాంఝీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాముడు అసలు దేవుడే కాదని సంచలన కామెంట్స్‌ చేశారు. అంతటితో ఆగకుండా.. రాముడు అనే పేరు కేవలం ఓ పాత్ర మాత్రమేనని అన్నారు. ఆ పాత్ర‌ను తుల‌సీదాస్‌, వాల్మీకి త‌మ త‌మ రాత‌ల్లో చొప్పించార‌ని ఆసక్తికర వ్యాఖ్య‌లు చేశారు.

Advertisement
Advertisement