రాజకీయాలు

Akbaruddin Owaisi: అక్బ‌రుద్దీన్ ఓవైసీకి నాంప‌ల్లి కోర్టులో ఊర‌ట, రెండు కేసులను కొట్టివేసిన న్యాయస్థానం, ఓవైసీ విద్వేష‌పూరిత ప్ర‌సంగాలు చేసిన‌ట్లు ఆధారాలు చూప‌లేద‌ని పేర్కొన్న కోర్టు

Hazarath Reddy

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీకి నాంప‌ల్లి కోర్టులో ఊర‌ట ల‌భించింది. అక్బరుద్దీన్ పై నమోదైన రెండు కేసులను కోర్టు కొట్టివేసింది. నిజామాబాద్, నిర్మ‌ల్‌లో అక్బరుద్దీన్ మున్సిపల్ ఎన్నికల బహిరంగ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఆయనపై అప్పట్లో రెండు కేసులు నమోదయ్యాయి.

West Bengal: పశ్చిమ బెంగాల్‌లో మ‌రోసారి హింస, బీజేపీ అభ్య‌ర్థి అగ్నిమిత్ర‌పై దాడి, టీఎంసీ కార్య‌క‌ర్త‌లే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపణ

Hazarath Reddy

ఉప ఎన్నిక జరుగుతున్న వేళ పశ్చిమ బెంగాల్‌లో మ‌రోసారి హింస చెల‌రేగింది. అస‌న్‌సోల్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం కోసం ఇవాళ ఉప ఎన్నికలో బీజేపీ అభ్య‌ర్థిగా అగ్నిమిత్ర పౌల్ పోటీ చేస్తున్నారు. త‌న వాహ‌న‌శ్రేణిలో ఓ బూత్‌ను ప‌రిశీలించేందుకు వ‌చ్చిన అగ్నిమిత్ర‌పై దాడి జ‌రిగింది.

Telangana: నన్ను జైలుకు పంపే దమ్మున్న మగాడెవడో రండి, ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రానికి 24 గంట‌ల డెడ్‌లైన్ విధించిన సీఎం కేసీఆర్, రేపు మ‌ధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ భేటీ

Hazarath Reddy

కేంద్రంపై పోరాటానికి తెలంగాణ ప్ర‌జులు, రైతులు సిద్ధంగా ఉన్నార‌ని, తాడోపేడో తేల్చుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ (CM K Chandrashekar Rao) తేల్చిచెప్పారు. కేంద్రానికి 24 గంట‌ల డెడ్‌లైన్ విధించారు కేసీఆర్. 24 గంట‌ల్లోపు ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం (24-Hour Deadline to Narendra Modi Govt) ఓ నిర్ణ‌యం తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

YS Jagan Cabinet 2.0: టూరిజం శాఖా మంత్రిగా రోజా, జలవనరుల శాఖ మంత్రిగా అంబటి రాంబాబు, వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాణి, ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపులు, పూర్తి వివరాలు ఇవే..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ కొత్త మంత్రులకు శాఖాల కేటాయింపు జరిగింది. సోమవారం ఉదయం మొత్తం 25 మంది మంత్రులుగా (YS Jagan Cabinet 2.0) ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వెంటనే మంత్రులకు శాఖలు (Andhra Pradesh Cabinet Revamped) కేటాయించారు.

Advertisement

Sucharitha Quits Assembly: ఎమ్మెల్యే పదవికి సుచరిత రాజీనామా, సీఎం జగన్ వెంటే కొనసాగుతానని వెల్లడి, మాజీ హోం మంత్రి బాటలో పలువురు అసంతృప్త ఎమ్మెల్యేలు

Hazarath Reddy

ఏపీలో మంత్ర వర్గ పునర్వ్యవస్థీకరణ వ్యవహారం.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో (YSRCP) ప్రకంపనలను సృష్టిస్తోంది. పదవులను కోల్పోయిన నాయకులు రాజీనామా బాట పట్టారు. కేబినెట్ బెర్త్‌పై ఆశలు పెట్టుకుని, అవి అందకపోవడం వల్ల నిరాశకు గురైన ఎమ్మెల్యేలు సైతం అసంతృప్తితో రగిలిపోతున్నారు.

Andhra Pradesh: ఇకపై జగన్‌ గ్యారేజీలో పనిచేస్తాం, అసంతృప్తి జ్వాలలు త్వరలోనే సర్దుకుంటాయి, రాష్ట్ర, పార్టీ భవిష్యత్‌ కోసం సీఎం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తామని తెలిపిన మాజీ మంత్రులు

Hazarath Reddy

ఏపీలో కొత్త మంత్రి వర్గం కొలువు తీరింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీరామారావు తరువాత రాష్ట్రంలో ఏపీ సీఎం జగన్‌ బడుగు, బలహీన, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీలు రాజకీయం, ఆర్థిక, సామాజికంగా ఎదగాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని తాజా మాజీ మంత్రి కొడాలి నాని ( Kodali Nani) అన్నారు.

TRS Dharna in Delhi: ధాన్యం సేక‌ర‌ణ‌పై ఢిల్లీలో టీఆర్ఎస్ దీక్ష, రైతుల ప‌క్షాన కేసీఆర్ చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇస్తామని తెలిపిన రాకేశ్ తికాయ‌త్, దీక్ష వేదిక‌గా టీఆర్ఎస్ త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌

Hazarath Reddy

ధాన్యం సేక‌ర‌ణ‌పై ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా టీఆర్ఎస్ దీక్ష (TRS Dharna in Delhi) చేప‌ట్టింది. రైతుల ప‌క్షాన ప్ర‌జాప్ర‌తినిధుల నిర‌స‌న దీక్ష పేరుతో ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా టీఆర్ఎస్ పార్టీ చేప‌ట్టిన దీక్ష‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ( CM KCR), రాకేశ్ తికాయ‌త్ హాజ‌ర‌య్యారు

Sanjay Raut: ముంబైని కేంద్ర పాలిత ప్రాంతం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు, సంచలన వ్యాఖ్యలు చేసిన శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్

Hazarath Reddy

శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్.. కేంద్ర ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ పార్టీ (Bharatiya Janata Party) దేశ ఆర్థిక రాజధాని ముంబైని కేంద్ర పాలిత ప్రాంతం చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని ఆరోపించారు. ఈ మేర‌కు కొంద‌రు కేంద్ర హోంశాఖ‌కు ఓ ప్రెజెంటేష‌న్ కూడా ఇచ్చిన‌ట్లు తెలుస్తోంద‌న్నారు.

Advertisement

AP Cabinet Dissolved: ఆ ఐదారుగురు ఎవ‌రు? ఏపీలో హాట్ టాఫిక్‌గా మారిన కొడాలి నాని వ్యాఖ్యలు, ప‌ద‌వుల‌తో పాటు కాన్వాయ్‌ల‌నూ వ‌దిలేసిన 24 మంది మంత్రులు, సీఎం జగన్ స్పందన ఇదే

Hazarath Reddy

ఏపీ కేబినెట్‌లో మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసిన 24 మంది వైసీపీ ఎమ్మెల్యేలు (Andhra Pradesh Cabinet dissolved) ఇంటికి వెళ్లే సంద‌ర్భంగా త‌మ‌కు ప్ర‌భుత్వం కేటాయించిన కాన్వాయ్‌ల‌ను కూడా వ‌దిలేసి బ‌య‌లుదేరారు. ఈ మేర‌కు కాసేప‌టి క్రితం అమ‌రావ‌తి ప‌రిధిలోని ఏపీ స‌చివాల‌యంలో కీల‌క స‌న్నివేశం క‌నిపించింది.

AP Cabinet Dissolved: మంత్రిగా తనకు అవకాశాలు తక్కువని తెలిపిన కొడాలి నాని, అయిదారుగురు మంత్రులు కేబినెట్‌లో కొనసాగే అవకాశం, ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడి

Hazarath Reddy

ఏప్రిల్‌ 11న మంత్రి వర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరిస్తున్న (Andhra Pradesh Cabinet dissolved) నేపథ్యంలో కేబినెట్‌లోని 24 మంది మంత్రులు రాజీనామా (all ministers submit resignation letters)చేశారు. మంత్రులంతా రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు అందజేశారు.

AP Cabinet Dissolved: ఏపీలో మూకుమ్మడిగా 24 మంది మంత్రుల రాజీనామా, ఏపీ సీఎం నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని తెలిపిన కొడాలి నాని, ఏప్రిల్‌ 11న కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం

Hazarath Reddy

మరో రెండు సంవత్సరాల్లో రాబోయే ఎన్నికలకు సన్నద్దం అయ్యేందుకు ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగుతుంది.ఇందులో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఏప్రిల్‌ 11న మంత్రి వర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరిస్తున్న (Andhra Pradesh Cabinet dissolved) నేపథ్యంలో కేబినెట్‌లోని 24 మంది మంత్రులు రాజీనామా (all ministers submit resignation letters)చేశారు.

Corruption Case: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అరెస్ట్, మ‌నీలాండ‌రింగ్ కేసులో అనిల్ దేశ్‌ముఖ్‌‌ను అరెస్ట్ చేసిన సీబీఐ, ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ తిరస్కరించిన బాంబే హైకోర్టు

Hazarath Reddy

మ‌హారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను అవినీతి కేసులో సీబీఐ బుధ‌వారం అరెస్ట్ చేసింది. అంత‌కుముందు దేశ్‌ముఖ్ వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి కుంద‌న్ షిండే, కార్య‌ద‌ర్శి సంజీవ్ ప‌ల్నాడెను క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్ స‌చిన్ వ‌జేను డిస్మిస్ చేశారు. ఇక బాంబే హైకోర్టు అనిల్ దేశ్‌ముఖ్ పిటిష‌న్‌ను స్వీక‌రించేందుకు తిర‌స్క‌రించింది.

Advertisement

Patra Chawl Land Scam Case: శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్‌కు ఈడీ షాక్, వెయ్యి కోట్ల పట్రా చాల్ భూ కుంభకోణానికి సంబంధించి రౌత్ రూ. 11 కోట్ల ఆస్తుల‌ను అటాచ్ చేసిన ఈడీ

Hazarath Reddy

శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్‌కు ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు షాకిచ్చారు. ఆమె భార్య‌కు చెందిన దాదాపు 11 కోట్ల ఆస్తుల‌ను ఈడీ అటాచ్ చేసింది. అయితే ఈ 11 కోట్ల‌లో 9 కోట్లు రౌత్ కుమారుడు ప్రవీణ్ రౌత్‌కు సంబంధించిన‌వి కాగా… 2 కోట్లు సంజ‌య్ రౌత్ భార్య‌కు సంబంధించిన‌వి.

Hyderabad vs Bengaluru: హైదరాబాద్ vs బెంగుళూరు, డీకే శివకుమార్ మంత్రి కేటీఆర్ మధ్య ఐటీ గురించి ఆసక్తికర ఛాలెంజ్ చర్చ

Hazarath Reddy

మంత్రి కేటీఆర్‌, క‌ర్నాట‌క కాంగ్రెస్ చీఫ్ డీకే శివ‌కుమార్ మ‌ధ్య ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆస‌క్తికర చ‌ర్చ జ‌రిగింది. బెంగుళూరులో మౌళిక స‌దుపాయాలు స‌రిగా లేవ‌ని కొన్ని రోజుల క్రితం ఖాతాబుక్ సీఈవో త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఫిర్యాదు చేశారు.

MP Vijayasai Reddy: కాంగ్రెస్ పార్టీ వల్లే రాజ్యసభలో అడుగుపెట్టాను, మా మీద తప్పుడు కేసులు బనాయించడం వల్లే ఇక్కడకు వచ్చానంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఛలోక్తి

Hazarath Reddy

కాంగ్రెస్‌ పార్టీ ఆనాడు మా మీద తప్పుడు కేసులు బనాయించడం వల్లనే నేను రాజ్యసభకు (I was able to come to the Rajya Sabha because of the Congress) రాగలిగానని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (MP Vijayasai Reddy) ఛలోక్తి విసిరారు.

Bihar CM Nitish Kumar: మద్యం తాగే వాళ్లు భారతీయులే కాదు, వారంతా మహా పాపులు, అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసిన బీహార్ సీఎం నితీష్ కుమార్

Hazarath Reddy

మద్యం తాగే వాళ్లు అసలు భారతీయులే కాదని వారంతా మహా పాపులు అని బీహార్ సీఎం నితీష్ కుమార్ (Bihar CM Nitish Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ‍్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.బీహార్‌లో మద్యపాన నిషేధం కొనసాగుతున్న విషయం విదితమే.

Advertisement

Tamil Nadu: స్టాలిన్ సర్కారుకు సుప్రీంకోర్టులో చుక్కెదురు, వన్నియార్‌ కమ్యూనిటీకి కేటాయించిన 10.5 శాతం అంతర్గత రిజర్వేషన్‌ చట్టం రద్దు చేసిన అత్యున్నత ధర్మాసనం

Hazarath Reddy

తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాకిచ్చింది. వన్నియార్‌ కమ్యూనిటీకి కేటాయించిన 10.5 శాతం అంతర్గత రిజర్వేషన్‌ చెల్లదని, ఇందుకోసం రూపొందిచిన చట్టాన్ని రద్దు చేస్తూ గురువారం ఆదేశాలు ఇచ్చింది. ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందంటూ తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది.

Violence At Kejriwal Home: కేజ్రీవాల్ ఇంటి గేటు మీదకు ఎక్కిన బీజేపీ ఎంపీ, సీఎం ఇంటి దగ్గర బీజేపీ విధ్వంసం, కేజ్రీవాల్‌ను చంపాలని బీజేపీ యత్నించిందని ఆప్ ఆరోపణ, సీఎం ఇంటి గేటుకు కాషాయరంగు పూసిన నిరసనకారులు

Naresh. VNS

ఢిల్లీలో బీజేపీ (BJP) కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. సీఎం కేజ్రీవాల్ ఇంటి మీద దాడికి పాల్పడ్డారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాపై (The Kashmir Files) కేజ్రీవాల్ కామెంట్లను వ్యతిరేకిస్తూ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఆధ్వర్యంలో కార్యకర్తలు, కేజ్రీవాల్ ఇంటిపై దాడికి దిగారు. ఆయన ఇంటి ఎదుట బూమ్‌ బారియర్‌ను పగులగొట్టారు. అంతేకాదు కేజ్రీవాల్ ఇంటి గేటు మీద కాషాయ రంగును చల్లారు.

MLA Taraprasad Bahinipati: అసెంబ్లీలో స్పీకర్‌పైకి కుర్చీ ఎత్తిన ఒడిశా కాంగ్రెస్ ఎమ్మెల్యే, గనుల అక్రమాలపై స్పీకర్ వాయిదా తీర్మానం తిరస్కరించడంతో కుర్చీని పైకిలేపిన తారాప్రసాద్‌ బహినిపాటి

Hazarath Reddy

రాష్ట్రంలో జరుగుతున్న గనుల అక్రమాలపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తారాప్రసాద్‌ బహినిపాటి (MLA Taraprasad Bahinipati ) చర్చను చేపట్టాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే దానిని స్పీకర్‌ ఎస్‌ఎన్‌ పాత్రో తిరస్కరించారు. దీంతో మండిపడిన ఎమ్మెల్యే తారాప్రసాద్‌ స్పీకర్‌ పోడియం ముందున్న కుర్చీని పైకిలేపి (Odisha Congress MLA Taraprasad Bahinipati Lifts Chair ) ఎత్తేశాడు.

Bengal CM Mamata Banerjee: బీజేపీని గద్దె దించడానికి అందరం ఏకమవుదాం, ప్రతిపక్షాలకు, బీజేపీ రహిత రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాసిన బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ

Hazarath Reddy

కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని, ఈ విష‌యంలో పోరాటం చేప‌ట్టేందుకు అన్ని పార్టీలు క‌లిసి రావాల‌ని ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు, వివిధ రాష్ట్రాల సీఎంల‌కు బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ లేఖ రాశారు. ఆదివారం ఆ లేఖ‌ను రిలీజ్ చేశారు.

Advertisement
Advertisement