రాజకీయాలు

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

Hazarath Reddy

బెంగళూరులోని నందిని లేఅవుట్‌లో మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి (Egg Attack On BJP MLA Munirathna) చేశారు.ఈ దాడికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు

Madhavaram Krishna Rao: ఆంధ్రోళ్లను వెళ్లిపో అంటూ అడ్డగోలుగా మాట్లాడానికి మీరు ఎవడ్రా, ప్రాంతీయ విద్వేష వ్యాఖ్యలు రెచ్చగొడితే సహించేది లేదని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వార్నింగ్

Hazarath Reddy

కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు(Madhavaram Krishna Rao) అధికార పార్టీ నేతల తీరుపై మండిపడ్డారు. ఆంధ్ర ప్రజల(People of Andhra Pradesh) మనోభావాలను దెబ్బతీసేలా...రాజధాని హైదరాబాద్(Hyderabad)నగరం ప్రశాంతతను భగ్నం చేసేలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడుతున్నారని విమర్శించారు.

Kambhampati Hari Babu: ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు, మిజోరం గవర్నర్‌గా వీకే సింగ్...5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లను నియమించిన కేంద్రం

Arun Charagonda

5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లను నియమించింది కేంద్ర ప్రభుత్వం. ముగ్గురిని ఒక రాష్ట్రం నుండి మరో చోటికి బదిలీ చేయగా ఇద్దరిని కొత్తగా నియమించింది. మిజోరం గవర్నర్‌గా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కంభంపాటి హరిబాబును ఒడిశా గవర్నర్‌గా కేంద్రప్రభుత్వం నియమించింది.

KA Paul Slams CM Revanth Reddy: వీడియో ఇదిగో, సీఎం రేవంత్ రెడ్డి ఒక సద్దాం హుస్సేన్ లాగా, ఒక గడాఫీ లాగా డిక్టేటర్ అయిపోయాడు, కేఎ పాల్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఒక సద్దాం హుస్సేన్ లాగా, ఒక గడాఫీ లాగా డిక్టేటర్ అయిపోయాడు. రేవంత్ రెడ్డి సంవత్సరం కాలంలో ఎప్పుడూ గొడవలే. ఒకరోజు రైతులతో గొడవ, బేడీలు వేయిస్తాడు.

Advertisement

Revanth Reddy-Allu Arjun Issue: అల్లు అర్జున్ వ్యవహారంలో కీలక మలుపు.. ఈ కేసుపై ఎవరూ మాట్లాడవద్దంటూ మంత్రులకు, పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు

Rudra

సినీ నటుడు అల్లు అర్జున్ - సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు, పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

Kancharla Chandrasekhar Reddy: వీడియో ఇదిగో, గాంధీ భవన్‌లో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, మాట్లాడేందుకు నిరాకరించిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్‌ మున్షీ

Hazarath Reddy

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్‌కు వచ్చి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్‌ మున్షీని కలిసేందుకు వెళ్ళారు. కాగా ఆమె ఈరోజు ఏఐసీసీ ఇన్చార్జ్ దీపా దాస్ మున్షీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నేపద్యంలో అక్కడికి వెళ్ళిన చంద్రశేఖర్ రెడ్డి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశారు

Rozgar Mela: రోజ్‌గార్ మేళా, 71 వేల మందికి నియామక పత్రాలు అందజేసిన ప్రధాని మోదీ, ఏడాదిన్న‌ర‌లో 10 ల‌క్ష‌ల ప‌ర్మ‌నెంట్ ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడి

Hazarath Reddy

రోజ్‌గార్ మేళాలో వర్చువల్ ఈవెంట్ ద్వారా రిక్రూట్ అయిన వారిని ఉద్దేశించి 71,000 మందికి పైగా అపాయింట్‌మెంట్ లెటర్‌లు ఇచ్చామని,ఏ ప్రభుత్వ ఉద్యోగాల హయాంలో ఇంతకు ముందెన్నడూ ఇలాంటి "మిషన్ మోడ్"లో కల్పించలేదని అన్నారు.

Sandhya Theatre Tragedy Row: పోలీస్ అధికారి మీడియా ముందు వీధి రౌడీ భాషలో ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతున్నారు, చర్యలు తీసుకోరా అంటూ ప్రశ్నించిన విష్ణు వర్థన్ రెడ్డి, ట్వీట్ ఇదిగో..

Hazarath Reddy

ఎవ్వరైనా సరే పోలీసులను నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని, తోలు తీస్తామని సస్పెండెడ్​ ఏసీపీ సబ్బతి విష్ణు మూర్తి హెచ్చరించారు. అల్లు అర్జున్​ డబ్బు మదంతో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఫైర్​ అయ్యారు. దీనిపై ఎక్స్ వేదికగా బీజేపీ నేత విష్ణు వర్థన్ రెడ్డి మండిపడ్డారు.

Advertisement

DK Aruna on Sandhya Theatre Tragedy: అల్లు అర్జున్ విషయాన్ని రాజకీయంగా రచ్చ చేస్తున్నారు, అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది ? సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడిన డీకే ఆరుణ

Hazarath Reddy

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై ఆమె స్పందించారు. అల్లు అర్జున్ విషయాన్ని రాజకీయంగా రచ్చ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. సినీ నటుడు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని బీజేపీ ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు.

Kadapa Mayor Suresh vs MLA Madhavi: వీడియో ఇదిగో, కుర్చీ కోసం టీడీపీ, వైసీపీ మధ్య వార్, కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో మరోసారి రచ్చరచ్చ

Hazarath Reddy

CM Revanth Reddy: రాళ్లకు, గుట్టలకు రైతు బంధు ఇద్దామా?, ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై క్లారిటీ

Arun Charagonda

సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసాపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్...ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నాం దీనికి కారణం బీఆర్ఎస్ పాపాత్ములే కారణం అని మండిపడ్డారు. రాళ్లకు, గుట్టలకు రైతు బంధు ఇద్దామా చెప్పాలన్నారు.

KTR On Rythu Bharosa: రుణమాఫీపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే క్లారిటీ లేదు, 100 శాతం రుణమాఫీ అయిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా...ప్రభుత్వానికి సవాల్ విసిరిన కేటీఆర్

Arun Charagonda

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసాపై చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సీఎం 100శాతం రుణమాఫీ అంటాడు.. ఎమ్మెల్యేలు 70శాతం రుణమాఫీ అంటున్నారు...మీ ఎమ్మెల్యేలకు కనీసం ట్రైనింగ్ అయినా ఇవ్వండని చురకలు అంటించారు కేటీఆర్. ఏ ఒక్క ఊర్లో అయినా 100 శాతం రుణమాఫీ జరిగినట్లు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సవాల్ విసిరారు. సీఎం రేవంత్ ...కొండారెడ్డిపల్లి పోదామా కొడంగల్ పోదామా సిరిసిల్ల పోదామా చెప్పాలన్నారు.

Advertisement

Hyderabad Traffic Restrictions: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు, ఎల్బీ స్టేడియం పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు..వేడుకల్లో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడకలను నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియం పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.

PM Modi to Visit Kuwait: 43 ఏళ్ల తర్వాత భారత్ నుంచి కువైట్ పర్యటనకు ప్రధాని, రెండు రోజుల పాటు ప్రధానమంత్రి మోదీ పర్యటన, చివరిసారిగా 1981లో పర్యటించిన ఇందిరాగాంధీ

Hazarath Reddy

డిసెంబరు 21 నుంచి రెండు రోజుల పాటు కువైట్‌లో పర్యటించనున్నారు ప్రధాని మోదీ.43 ఏళ్లలో తొలిసారిగా భారత ప్రధాని చేపట్టబోతున్న పర్యటన ఇది. చివరిసారిగా ఇందిరా గాంధీ 1981లో పర్యటించారు

Formula E Race Case: వీడియో ఇదిగో, తెలంగాణ ప్రభుత్వం మీద లండన్‌లో ఫార్ములా-ఈ కంపెనీ కేసు వేసింది, హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

తెలంగాణ ప్రభుత్వం మీద లండన్‌లో ఫార్ములా-ఈ కంపెనీ కేసు వేసిందని హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్థాంతరంగా ఇది రద్దు చేయడం వల్ల మాకు నష్టం జరిగిందని ఫార్ములా- ఈ వాళ్లు లండన్‌లో కేసు వేశారు.. రేపు వాళ్ళు అక్కడ కేసు గెలిస్తే రాష్ట్రానికి భారం.

One Nation One Election: జమిలి బిల్లు కోసం జేపీసీలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మొత్తం 31 మందితో కూడిన జేపీసీ జాబితా ఇదిగో..

Hazarath Reddy

జమిలి బిల్లు కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో తాజాగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చోటు దక్కింది. ఈ జేపీసీ కమిటీలో రాజ్యసభ నుంచి 12మందికి చోటు కల్పించింది.

Advertisement

Pawan Kalyan: వీడియో ఇదిగో, OG OG అని అరిస్తే పనులు జరగవు, అభిమానులకు చురకలు అంటించిన పవన్ కళ్యాణ్, సినిమాల మోజులో పడి హీరోలకు జేజేలు కొట్టి మీ జీవితంలో బాధ్యతలు మర్చిపోతున్నారని వెల్లడి

Hazarath Reddy

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిమానులకు చురకలు అంటించారు. ‘‘నన్ను పని చేసుకోనివ్వండి.. నేను బయటికొస్తే నా మీద పడిపోతే నేను ఏ పని చేయలేను. ఓజీ ఓజీ అని అరిస్తే పనులు జరగవు. సినిమాల మోజులో పడి హీరోలకు జేజేలు కొట్టి మీ జీవితంలో బాధ్యతలు మర్చిపోతున్నారు.

BRS Vs Congress: అసెంబ్లీలో దాడి ఎవరు చేశారో మీరే చూడండి అంటూ వీడియో షేర్ చేసిన కాంగ్రెస్ పార్టీ, ఫార్ములా ఈ-కార్ రేసింగ్ అంశంపై రచ్చ

Hazarath Reddy

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ ఈవెంట్ లో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, నేటి అసెంబ్లీ సమావేశంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ అంశంపై చర్చకు బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు.

Om Prakash Chautala Dies: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా కన్నుమూత, సంతాపం తెలిపిన ప్రధాని మోదీ

Hazarath Reddy

హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా తన 89వ ఏట మరణించడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా చాలా సంవత్సరాలు రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు మరియు చౌదరి దేవి లాల్ జీ యొక్క పనిని నిరంతరం ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అతని కుటుంబ సభ్యులకు మరియు మద్దతుదారులకు సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు.

Om Prakash Chautala Dies: గుండెపోటుతో హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా కన్నుమూత, 1989 నుంచి 2005 వరకు హర్యానాకు ఐదుసార్లు సీఎంగా పనిచేసిన చౌతాలా

Hazarath Reddy

హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు. గురుగ్రావ్ లోని తన నివాసంలో కార్డియాక్ అరెస్ట్ తో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అధినేత (ఐఎన్ఎల్ డీ) చీఫ్ చనిపోయారని ఐఎన్ఎల్ డీ వర్గాలు తెలిపాయి.

Advertisement
Advertisement