Politics

Phalke Award to Rajinikanth: రజినీ కాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, తలైవాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ; త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు

Team Latestly

తమిళనాడు ఎన్నికలకు మరో ఐదు రోజులు ఉందనగా, నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ కు అత్యున్నత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ దిల్లీలోని తన నివాసం నుంచి ఈ ప్రకటన చేశారు.....

'No Interest Rate Cut': ఎన్నికల ఎఫెక్ట్? చిన్న మొత్తాల పొదుపుపై వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, పాత వడ్డీరేట్లే యధాతథంగా కొనసాగుతాయని నిర్మలా సీతారామన్ వెల్లడి

Team Latestly

చిన్న మొత్తం పొదుపు పథకాలైన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు లేదా ఎన్ఎస్సి మరియు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లేదా పిపిఎఫ్ నుండి పథకాల వడ్డీ రేట్లపై కోతలు విధిస్తున్నట్లు కేంద్రం బుధవారం సాయంత్రం చేసిన ప్రకటన విస్మయంతో పాటు, పలు వర్గాల ప్రజలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. వడ్డీ రేట్ల కోత ద్వారా దేశంలోని కోట్ల మంది మధ్య తరగతి....

Brazil Political Crisis: చరిత్రలో తొలిసారి..ఆర్మీ,నేవీ,ఎయిర్‌ఫోర్స్ ద‌ళాధిప‌తుల మూకుమ్మడి రాజీనామాలు, కరోనా కల్లోలంతో బ్రెజిల్‌లో రాజకీయ సంక్షోభం, కోవిడ్ నియంత్ర‌ణ‌లో అధ్య‌క్షుడు బొల్స‌నారో విఫలమయ్యారని ఆరోపణలు

Hazarath Reddy

బ్రెజిల్‌ దేశాన్ని కరోనా వణికిస్తోంది. పరిస్థితి చేయిదాటిపోయింది. ఈ నేపథ్యంలో అక్కడ రాజ‌కీయ సంక్షోభం నెల‌కొన్న‌ది. ఆ దేశ త్రివిధ ద‌ళాధిప‌తులు మూకుమ్మడి రాజీనామా చేశారు.

Karnataka Sex CD Case: బీజేపీ ఎమ్మెల్యే సెక్స్ సీడీ కేసులో కీలక మలుపు, ఏసీఎంఎం కోర్టు జడ్జి ఎదుట వాంగ్మూలాన్ని ఇచ్చిన బాధిత యువతి, ఏకాకిగా మిగిలిన మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహొళి, ఎప్పుడైనా అరెస్ట్ అయ్యే అవకాశం

Hazarath Reddy

కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహొళి రాసలీలల సీడీ కేసులో (Karnataka Sex CD Case) కీలక మలుపు చోటు చేసుకుంది. 28 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న యువతి అనేక నాటకీయ పరిణామాల మధ్య నిన్న మధ్యాహ్నం ఏసీఎంఎం కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరై వాంగ్మూలాన్ని ఇచ్చింది.

Advertisement

West Bengal: మాజీ క్రికెటర్ అశోక్ దిండాపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి, మొయినా బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న అశోక్ దిండా

Hazarath Reddy

మాజీ క్రికెటర్, మొయినాకు బిజెపి అభ్యర్థి అశోక్ దిండాపై మొయినాలో గుర్తు తెలియని వ్యక్తులపై దాడి చేశారు. ఎవరు దాడి చేశారనే దానిపై ఇంకా సమాచారం లేదు పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ అధికార ప్రతిపక్షాల మధ్య వ్యక్తిగత దూషణలు, దాడులు తారా స్థాయికి చేరాయి.

YSRCP MLA Ambati Rambabu: టీడీపీ అంతమయ్యే దినోత్సవం, బాబు మళ్లీ అధికారంలోకి రావడం కల మాత్రమే, పవన్ కళ్యాణ్ ఎక్కడ గెలిచి సీఎం అవుతాడు, తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

Hazarath Reddy

టీడీపీ పార్టీపై, దాని అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాదు.. అంతర్ధాన దినోత్సవంలా కనిపించిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు (YSRCP MLA Ambati Rambabu) అన్నారు.

Tamil Nadu Assembly Elections 2021: తమిళనాడు సీఎం అక్రమసంతానం వ్యాఖ్యలపై క్షమాపణ కోరిన డీఎంకే నేత రాజా, రాజకీయంగా మాత్రమే విమర్శలు చేశానంటూ వెల్లడి, వ్యక్తిగత దూషణలతో దూసుకుపోతున్న తమిళనాడు రాజకీయాలు

Hazarath Reddy

తమిళనాడు ముఖ్యమంత్రి పళనీస్వామికి డీఎంకే నాయకుడు ఎ రాజా ఎట్టకేలకు క్షమాపణలు (DMK leader A Raja apologises) చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలపై సీఎం పళనీస్వామి బావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టిన ఒక రోజు తర్వాత రాజా క్షమాపణలు చెప్పారు. ‘‘నేను పళనీస్వామిపై చేసిన వ్యాఖ్యలపై పళనీస్వామి ఏడుస్తున్నట్లు చూసి చాలా బాధపడ్డాను’’ అని రాజా పేర్కొన్నారు.

Nagarjuna Sagar By-Poll 2021: వేడెక్కిన సాగర్ ఉప ఎన్నిక, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌, కాంగ్రెస్ అభ్యర్థిగా కుందూరు జానారెడ్డి, ఇంకా అభ్యర్థిని ప్రకటించని బీజేపీ

Hazarath Reddy

నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గతేడాది డిసెంబర్‌లో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక (Nagarjuna Sagar By-Poll 2021) అనివార్యమైంది. నాగర్జున సాగర్‌ ఉప ఎన్నికకు టీఆర్‌​ఎస్‌ పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. నోముల నర్సింహయ్య (Nomula Narsimhaiah) కుమారుడు భగత్‌కు టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇచ్చింది.

Advertisement

Tirupati By-Election 2021: తిరుపతిలో ఫ్యాను గెలుపు తధ్యమా..మెజార్టీ ఎంత ఉండబోతోంది? అధికార ప్రతిపక్షాల మధ్య పేలుతున్న మాటల తూటాలు, వీడియోలు 7557557744 నంబర్‌కు వాట్సాప్ చేస్తే అకౌంట్‌లో పదివేలు వేస్తామనంటున్న అచ్చెన్నాయుడు, నామినేషన్లు దాఖలు చేసిన మూడు పార్టీల అభ్యర్థులు

Hazarath Reddy

వైసీపీకి ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు రావంటూ వైసీపీ నేతలు ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే వెంటనే తమకు సమాచారం అందించాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తమ పార్టీ శ్రేణులకు సూచించారు. వైసీపీకి ఓటు వేయకపోతే పథకాలు రావంటూ భయపెట్టే వాలంటీర్ల ఆగడాలను బయటపెట్టాలని అన్నారు.

Amit Shah on Elections 2021: పశ్చిమబెంగాల్‌లో 200 సీట్లలో బీజేపీ గెలుపు, తొలి విడత ఎన్నికల్లో 30 స్థానాల్లో 26 మావే, అసోంలో 47 స్థానాల్లో 37 బీజేపీ గెలుస్తుంది, ధీమా వ్యక్తం చేసిన హోం మంత్రి అమిత్ షా

Hazarath Reddy

తొలి విడతగా పశ్చిమబెంగాల్, అసోంలో శనివారం జరిగిన ఎన్నికల్లో మెజారిటీ సీట్లను (Amit Shah on Elections 2021) బీజేపీ గెలుచుకుంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. పశ్చిమబెంగాల్‌లో 200కు పైగా సీట్లు బీజేపీ గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. బెంగాల్‌లో పోలింగ్ జరిగిన 30 స్థానాల్లో బీజేపీ 26 సీట్లు గెలుచుకుటుందని, అసోంలో 47 స్థానాల్లో 37 సొంతం చేసుకుంటుదని చెప్పారు

Assembly Elections 2021: రెండు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి పోలింగ్, పశ్చిమ బెంగాల్‌లో 79.79 శాతం, అస్సాంలో 72.14 శాతం పోలింగ్ నమోదు, కలకలం రేపుతున్న దీదీ ఆడియో, ఎన్నికల వేళ రాజకీయ దాడులతో అట్టుడికిన బెంగాల్

Hazarath Reddy

పశ్చిమ బెంగాల్, అస్సాంలో శాసనసభ తొలి దశ ఎన్నికలు (Assembly Elections 2021) శనివారం జరిగాయి. చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్టు అధికారులు తెలిపారు. రెండు రాష్ట్రాల్లోనూ రికార్డు స్థాయిలో పోలింగ్ (Polling for first phase ends in Assam, Bengal)జరగడం విశేషం. అసోంలో సాయంత్రం 6 గంటల సమయానికి 72.14 శాతం పోలింగ్ నమోదు కాగా, పశ్చిమబెంగాల్‌లో ఊహించని విధంగా 79.79 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం (Election Commission) ప్రకటించింది.

BJP MLA Arun Narang: రైతుల ఆగ్రహం, కొత్త చట్టాలకు మద్దతుగా మాట్లాడిన ఎమ్మెల్యేను గుడ్డలు ఊడదీసి తరిమికొట్టిన రైతులు, ఎమ్మెల్యే అరుణ్‌ నారంగ్‌‌పై దాడిని ఖండించిన సీఎం అమరీందర్ సింగ్, బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశాలు

Hazarath Reddy

రైతులు ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు విచక్షణా రహితంగా దాడి (BJP MLA Restrained by Protesters in Muktsar) చేశారు. ఎమ్మెల్యేను పరుగులు పెట్టించారు. అక్కడ పోలీసులు ఉన్నా కూడా రైతులు వినకుండా ఎమ్మెల్యేను చితకబాదారు. తమకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.

Advertisement

PM Modi Bangladesh Tour: 130 కోట్ల భారతీయుల ప్రేమను మోసుకొచ్చా, మ‌తువ తెగ‌ల‌తో సమావేశమైన భారత ప్రధాని, ప్రేమ‌, శాంతిని రెండు దేశాలు కాంక్షిస్తున్నాయ‌ని తెలిపిన నరేంద్ర మోదీ

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోదీ రెండో రోజు పర్యటన బంగ్లాదేశ్‌లో (PM Modi Bangladesh Tour) కొనసాగుతోంది. రెండో రోజు పర్యటనలో భాగంగా ఆయన మతువా సముదాయం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని వెంట జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ ధోవ‌ల్‌, విదేశాంగ కార్య‌ద‌ర్శి హ‌ర్ష‌వ‌ర్ద‌న్ కూడా ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.

Chittagong Police Fire: బంగ్లాలో ప్రధాని మోడీకి నిరసన సెగలు, పోలీసుల కాల్పుల్లో నలుగురు మృతి, బంగ్లాదేశ్‌ స్వాతంత్రం కోసం జైలుకు వెళ్లానని తెలిపిన భారత ప్రధాని, బంగ‌బంధు షేక్ ముజ్బీర్ రెహ్మాన్‌కు నివాళి

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోదీకి బంగ్లాదేశ్‌లో నిరసన సెగ (violent protesters) తగిలింది. నరేంద్ర మోదీ పర్యటనకు నిరసనగా కొందరు ఆందోళనలు చేశారు. ఈ సందర్భంగా భద్రతా బలగాలు దాడి చేయడంతో (Chittagong Police Fire) నలుగురు మృతిచెందారు.

Neelam Sahni: తిరుపతి ఉప ఎన్నికల్లో కుడి చేతి వేలికి సిరా, ఏపీ కొత్త ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని, ఈ నెల 31తో ముగియనున్ను నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం, వచ్చే నెల 17న తిరుపతికి ఉప ఎన్నిక

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్రప్రభుత్వ ప్రతిపాదనకు నీలం సాహ్ని పేరును (Andhra Pradesh new SEC) గవర్నర్ బీబీ హరిచందన్ ఆమోదించారు. ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar) స్థానంలో సాహ్ని పదవీ బాధ్యతలు తీసుకుంటారు

Assembly Elections 2021 Phase 1: బెంగాల్ కోట ఎవరిది? అస్సాంలో పాగా వేసేదెవరు, బెంగాల్‌లో 30, అస్సాంలో 47 స్థానాలకు తొలి దశలో ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం ఆరుగంటల వరకు ఓటింగ్

Hazarath Reddy

తూర్పు భారతదేశంలో ఉన్న అతి పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన బెంగాల్లోనూ, పక్కనే ఉన్న అసోంలోనూ (Assam Phase 1) శనివారం తొలిదశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. బెంగాల్‌లో 30, అస్సాంలో 47 స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం ఆరుగంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది.

Advertisement

PM Modi Bangla Tour: 'బంగబంధు బ్రతికి ఉంటే బంగ్లాదేశ్ మరో స్థాయిలో ఉండేది'! బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న భారత ప్రధాని, కోవిడ్19 వ్యాప్తి తర్వాత నరేంద్ర మోదీ చేస్తున్న మొదటి విదేశీ పర్యటన ఇదే

Team Latestly

శుక్రవారం ఉదయం ఢాకా విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సాదర స్వాగతం పలికారు. తొలిరోజు షెడ్యూల్ లో భాగంగా బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఎకె అబ్దుల్ మోమెన్ మధ్యాహ్నం 3:15 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. అనంతరం మధ్యాహ్నం....

Bharat Bandh: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నేడు 'భారత్ బంద్'కు పిలుపునిచ్చిన రైతు సంఘాలు, పలు రాష్ట్రాల్లో నిలిచిపోయిన రవాణా సేవలు, ఆంధ్రప్రదేశ్ లో సంపూర్ణంగా కొనసాగుతున్న బంద్

Team Latestly

కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని నెలలుగా దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు శుక్రవారం 'భారత్ బంద్'కు పిలుపునిచ్చారు. రైతు సంఘాల యూనియన్ 'సమ్యుక్త్ కిసాన్ మోర్చా' ఇచ్చిన 12 గంటల భారత్ బంద్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా బంద్ శుక్రవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది....

Who Is Justice NV Ramana?: తదుపరి సీజేగా జస్టిస్ ఎన్‌వీ రమణ,కేంద్రానికి సిఫారసు చేసిన జస్టిస్ ఎస్ఏ బొబ్డే, రాష్ట్రపతి ఆమోదముద్ర తర్వాత ప్రమాణ స్వీకారం చేసే అవకాశం, అన్నీ కుదిరితే 2022 ఆగస్టు 26 వరకు ఆయన పదవిలో..

Hazarath Reddy

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్‌వీ రమణ బాధ్యతలు స్వీకరించేందుకు మార్గం సుగమమవుతోంది. ఆయనే తన వారసుడని ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎస్ఏ బొబ్డే సిఫారసు చేశారు. జస్టిస్ బోబ్డే ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన వారసుడి పేరును (Chief Justice of India) సిఫారసు చేయాలని ప్రభుత్వం సీజేఐని కోరిన సంగతి తెలిసిందే. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ శుక్రవారం జస్టిస్ బాబ్డేకు ఓ లేఖ రాసినట్లు విశ్వసనీయ సమాచారాన్ని ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ వెల్లడించింది.

Tamil Nadu Polls: బట్టలు ఉతికి..గిన్నెలు తోమిన ఏఐఏడిఎంకె ఎమ్మెల్యే అభ్యర్థి కతిరావన్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచిన కతిరావన్

Hazarath Reddy

తమిళనాట అసెంబ్లీ ఎ‍న్నికల ప్రచారం జోరందుకుంది. పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు పలు విధాలుగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా నాగపట్నం అసెంబ్లీ (Nagapattinam assembly) నియోజకవర్గం ఏఐఏడిఎంకె అభ్యర్థి తంగా కతిరావన్ బహిరంగంగా బట్టలు ఉతికి సంచలనం (AIADMK candidate impresses voters) సృష్టించారు. ఈ ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తే తన నియోజక వర్గంలో ‘అమ్మప్రభుత్వం’ ప్రతీ ఇంటికి ఒక వాషింగ్ మెషీన్‌ను ఇస‍్తుందని హామీ ఇచ్చారు. చురుకైన స్థానిక నేతగా పేరొందిన కతివారన్‌ తొలిసారి మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచారు. నాగ‌ప‌ట్ట‌ణంలో ప్రచారానికి వెళ్లిన సమయంలో ఒక మహిళ బట్టలు ఉతుకుతూ(washing cloths to indicate manifesto assurance) కనిపించింది. అంతే రంగంలోకి దిగిన కతిరావన్‌ బట్టలు తాను ఉతుకుతానని ఆమెను కోరారు.మొదటలో మొహమాటంతో కాస్త సంశయించిన ఆ మహిళ చివరికి ఆయన చేతికి దుస్తులు ఇవ్వక తప్పలేదు.

Advertisement
Advertisement