రాజకీయాలు
MP Floor Test: కరోనా ఎఫెక్ట్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఈ నెల 26కి వాయిదా, అవిశ్వాస తీర్మానానికి రెడీ అంటున్న సీఎం కమల్ నాథ్‌, మాస్క్‌లతో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలు
Hazarath Reddyప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం మధ్యప్రదేశ్ అసెంబ్లీపై పడింది. అసెంబ్లీ ప్రారంభమైన కొద్ది సేపటికీ ఈ నెల 26వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. కాగా ఈ సమావేశాలకు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. వారు ఇంకా బెంగళూరులోని రిసార్ట్స్ లోనే ఉంటున్నారు. బీజేపీ శాసనసభ్యులు మాత్రం అందరూ హాజరయ్యారు. గురుగావ్ నుంచి వచ్చిన వీరు నేరుగా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.
YS Jagan Comments on COVID-19: బ్లీచింగ్ పౌడర్‌తో కరోనాను తరిమేయండి, ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలను ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు, కరోనా మాటలను వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్
Hazarath Reddyప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (CoronaVirus) వ్యాధిపై ఏపీ సీఎం జగన్ (AP CM YS jagan) సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ భయంకరమైన రోగం కాదని, అంతగా భయపడాల్సిన పని లేదన్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నయమవుతుందన్నారు. కరోనాతో మనుషులు చనిపోతున్నారని ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు. కరోనాకి మందు(మెడికేషన్) పారాసిటమాల్ ట్యాబ్లెట్ అని చెప్పిన సీఎం జగన్, బ్లీచింగ్ పౌడర్ తో కరోనా వైరస్ చనిపోతుందన్నారు.
AP CS Sahni Letter To SEC: ఏపీలో కరోనా లేదు, ఎన్నికలను యథాతథంగా కొనసాగించండి, ఎన్నికల సంఘానికి లేఖ రాసిన ఏపీ సీఎస్ నీలం సాహ్ని, గవర్నర్‌తో భేటీ కానున్న ఎన్నికల కమిషనర్‌
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికలను (AP Local Body polls) యథాతథంగా కొనసాగించాలని కోరతూ రాష్ట్ర ప్రధాన కార్యదర్మి నీలం సాహ్ని ఎన్నికల సంఘానికి లేఖ ( AP CS Neelam Sahni Letter) రాశారు. కరోనా వైరస్‌ సాకుతో ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా వేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఎస్ కోరారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధంగా ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.
AP CM Meets Governor: ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం, గవర్నర్‌ను కలిసిన ఏపీ సీఎం, ఎన్నికలు జరిపేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని విన్నపం, సీఎం వైయస్ జగన్‌పై చంద్రబాబు ఘాటు విమర్శలు
Hazarath Reddyఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా (Local Body Elections postponed) వేస్తున్నామని ఏపీ ఎన్నికల అధికారి రమేష్ కుమార్ (SEC Ramesh Kumar) ప్రకటించిన నేపథ్యంలో ఇది రాజకీయ వేడిని రాజేస్తోంది. అధికార పార్టీ (YSRCP), ప్రతిపక్ష పార్టీల (TDP) మధ్య దీనిపై వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో (Biswabhushan Harichandan) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) ఆదివారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
Madhya Pradesh Politics: కమల్ నాథ్ సర్కారుకు రేపే బల పరీక్ష, జైపూర్ నుంచి భోపాల్‌కు చేరుకున్న ఎమ్మెల్యేలు, బెంగుళూరులో ఉన్న మంత్రులను రాష్ట్రానికి పంపాలని అమిత్‌షాకు లేఖ రాసిన మధ్యప్రదేశ్ సీఎం
Hazarath Reddyమధ్యప్రదేశ్ రాజకీయాలు (Madhya Pradesh Politics) తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ప్రతిపక్షాలు, అధికారాన్ని నిలుకునేందుకు కాంగ్రెస్ పార్టీ (Congress Party) సర్వ శక్తుల ఒడ్డుతున్నాయి. రాజకీయంగా సంక్షోభంలోకి కూరుకుపోయిన కమల్ నాథ్ సర్కార్ (Kamal Nath Govt) సోమవారం బలపరీక్షను ఎదుర్కోనుంది. ఈ విషయాన్ని స్వయంగా మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ లాల్జీ టాండనే ప్రకటించారు.ఈ మేరకు గవర్నర్ టాండన్ స్పీకర్ నర్మదా ప్రసాద్ ప్రజాపతిని ఆదేశించినట్లు సమాచారం.
Coronavirus in India: కరోనా దెబ్బకు ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశాలు రద్దు, దేశంలో ఇప్పటికీ 83 కేసులు నమోదు, మహారాష్ట్రలో 19కి చేరిన కరోనా కేసులు, పబ్లిక్‌ మీటింగ్‌లపై కర్ణాటక ప్రభుత్వం నిషేదాజ్ఞలు
Hazarath Reddyకరోనా వైరస్ (Coronavirus) ప్రపంచదేశాలను వణికిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన రిపోర్ట్ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 5,417కు చేరింది. లక్షా 45 వేల 413 మంది కరోనా బాధితులు ఉన్నారు. 6 వేల 116 మందికి సీరియస్ గా ఉంది. కరోనా వైరస్ 139 దేశాలకు పాకింది. ఈ నేపథ్యంలో బెంగళూరులో తలపెట్టిన అఖిల్‌ భారతీయ ప్రతినిధి సభ సమావేశాలను రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) రద్దు చేసింది. ఈ నెల 15 నుంచి 17 వరకు బెంగళూరులో ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశాల నిర్వహణ తలపెట్టింది.
Krishnapatnam Node Tenders: ఏపీలో పుంజుకోనున్న పారిశ్రామిక రంగం, కృష్ణపట్నం నోడ్‌ పనులకు టెండర్లు, సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానున్న బెంగళూరు–చెన్నై పారిశ్రామిక కారిడార్‌ పనులు
Hazarath Reddyఏపీ పారిశ్రామిక విస్తరణలో భాగంగా బెంగళూరు–చెన్నై పారిశ్రామిక కారిడార్‌ (CBIC)లో భాగంగా ప్రతిపాదిత కృష్ణపట్నం నోడ్‌ (Krishnapatnam Node) పనులకు రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) శ్రీకారం చుట్టింది. సుమారు 13,882.9 ఎకరాల్లో ఉద్దేశించిన ఈ పారిశ్రామిక నోడ్‌లో రానున్న సెప్టెంబర్‌ నుంచి పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం (AP Govt) కార్యాచరణను సిద్ధంచేసింది. తొలిదశలో రూ.2,139 కోట్ల పెట్టుబడి అంచనాతో 3,090 ఎకరాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.
Rajya Sabha Polls: టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన, సీనియర్ నేత కే.కేశవరావుకు మరోసారి ఛాన్స్, మరో స్థానానికి సురేశ్ రెడ్డిని ఖరారు చేసిన సీఎం కేసీఆర్
Vikas Mandaటీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ సీటు దక్కించుకోవడం కోసం కేశవరావు, సురేశ్ రెడ్డిలతో పాటు పొంగులేటి శ్రీనివాస రెడ్డి గట్టి ప్రయత్నాలు చేశారు. హెటిరో సంస్థ అధినేత పార్థసారథి రెడ్డి, నమస్తే తెలంగాణ పత్రిక సీఎండీ దామోదర రావు, గ్యాదరి బాలుమల్లు తదితరులు కూడా పోటీపడ్డారు. నిజామాబాద్ మాజీ ఎంపీ, కేసీఆర్ కుమార్తె కవిత పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది.....
Rajinikanth: సీఎం కాబోయేది అతడే! పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన సూపర్ స్టార్ రజినీకాంత్, తనకు సీఎం పదవిపై వ్యామోహం లేదని వ్యాఖ్య
Vikas Mandaనేను ఎప్పుడూ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉండాలని అనుకోలేదు. వాస్తవానికి, నేను అసెంబ్లీలో కూర్చుని పాలనాపరమైన వ్యవహారాలు చక్కబెట్టడం లాంటి వాటిపై కూడా ఎప్పుడూ ఆలోచించలేదు. నేను పార్టీని ఏర్పాటు చేసి, ఆ పార్టీ అధినేతగా మాత్రమే వ్యవహరిస్తాను. అయితే....
YS Viveka Murder Case: ఏపీ పోలీసులపై అసంతృప్తి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన హైకోర్ట్, సాధ్యమైనంత త్వరగా కేసును ఛేదించాలని సూచన
Vikas Mandaదీంతో వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత ఈ కేసును సీబీఐకి అప్పగించాలని పిటిషన్ దాఖలు చేశారు, తమ పిటిషన్ లో 15 మంది నిందితుల పేర్లను పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై పలుమార్లు విచారణ చేపట్టిన హైకోర్ట్, తాజాగా సీబీఐకి విచారణకు ఆదేశించింది.....
Bandi Sanjay Kumar: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎంపీ బండి సంజయ్‌ను నియమించిన అధిష్ఠానం, ఈ నియామకం తక్షణం అమలులోకి వస్తుందని వెల్లడి
Vikas Mandaగత కొన్నాళ్లుగా రాష్ట్ర బీజేపీలో మార్పులు జరుగుతాయని పార్టీలో ఊహాగానాలు వచ్చాయి. రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉంటుందని ప్రచారం జరిగింది. అధ్యక్ష పదవి కోసం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేంధర్ తదితరులు పోటీలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఎవరు కాదు, మళ్ళీ కే. లక్ష్మణ్ నే కొనసాగిస్తారని కూడా ప్రచారం జరిగింది.....
Jyotiraditya Scindia Joins BJP: 'ఈ దేశం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల్లో సురక్షితంగా ఉంది'. బీజీపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా, ప్రధాని మోదీపై ప్రశంసలు
Vikas Mandaసీఎం కమల్ నాథ్ సర్కార్ కు అసెంబ్లీలో సంఖ్యా బలం 114 నుంచి 92కు పడిపోయింది. బీజేపీకి 107 ఎమ్మెల్యేల బలం ఉంది. మధ్యప్రదేశ్ ఏ పార్టీ అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 104 మంది ఎమ్మెల్యేల బలం అవసరం.....
TDP vs YSRCP: మాచెర్లలో టీడీపీ నేతలపై దాడి, వైసీపీ కార్యకర్తలే అని టీడీపీ ఆరోపణ, ఘటనను తీవ్రంగా ఖండించిన చంద్రబాబు, ఇదంతా టీడీపీ డ్రామా అని కొట్టిపారేసిన మంత్రి బొత్స సత్యనారాయణ
Vikas Mandaటీడీపీ ఆరోపణలు వైసీపీ నేతలు తిప్పికొట్టారు. టీడీపీ నేతలే కావాలని రెచ్చగొట్టి, దాడులకు ప్రేరేపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఏపి మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఈ దాడులు ఇదంతా టీడీపీ కుట్రగా అభివర్ణించారు.....
AP Politics: టీడీపీకి భారీ షాక్, వైసీపీలోకి వెల్లువలా చేరికలు, పులివెందులలో సతీష్ రెడ్డి టీడీపీకి రాజీనామా, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు వైసీపీ తీర్థం
Hazarath Reddyస్థానిక ఎన్నికలకు ముందే ఏపీలో టీడీపీకి (TDP) భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి అధికార పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. ఏపీ రాజకీయ ముఖచిత్రం (AP Politics) ఇప్పుడు పూర్తిగా హాట్ హాట్ గా సాగుతోంది. ముఖ్యంగా వైసీపీ (YSRCP) కంచుకోట పులివెందులలో (Pulivendula) అంతంతమాత్రంగా ఉన్న టీడీపీ ఇప్పుడు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.
Parimal Nathwani Meets AP CM: సీఎం జగన్‌తో పరిమల్‌ నత్వానీ, రాజ్యసభ అభ్యర్థిత్వం ఇచ్చినందుకు కృతజ్ఞతలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేస్తానని వెల్లడి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) నుంచి రాజ్యసభకు నామినేట్‌ అయిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ముఖేష్ అంబానీ సన్నిహితుడు, ఎంపీ పరిమల్‌ నత్వానీ మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని (Parimal Nathwani Meets AP CM) కలిశారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభ (Rajya Sabha) అభ్యర్థిత్వం ఇచ్చినందుకు సీఎం వైఎస్‌ జగన్‌కు నత్వానీ కృతజ్ఞతలు తెలిపారు.
MP Political Turmoil: సింధియా దెబ్బకు కాంగ్రెస్ విలవిల, కూలుతున్న కమల్ నాథ్ సర్కార్, రాజ్యసభకు జ్యోతిరాదిత్య సింధియా, పార్టీల బలబలాలు ఇవే
Hazarath Reddyమధ్యప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు (MP Political Turmoil) శరవేగంగా మారిపోతున్నాయి. కమల్ నాథ్ సర్కార్ ను (CM Kamal Nath) కూల్చడమే లక్ష్యంగా అక్కడి రాజకీయాలు ఊపందుకున్నాయి. తన వర్గం ఎమ్మెల్యేలతో బెంగళూరుకు మకాం మార్చిన కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా ప్రభుత్వ సంక్షోభానికి కేంద్ర బిందువుగా మారారు. నేడు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావడం, ఆ వెంటనే కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి.
Who Is Jyotiraditya Scindia: ఎవరీ జ్యోతిరాదిత్య సింధియా, ఎందుకు కమల్ నాథ్ సర్కార్‌ని వణికిస్తున్నాడు, బీజేపీతో సింధియాకు లింకేంటి?, సింధియా పూర్తి ప్రొఫైల్‌పై విశ్లేషణాత్మక కథనం
Hazarath Reddyమధ్యప్రదేశ్‌లో కమల్ నాథ్ సర్కార్‌ని ( MP Chief Minister Kamal Nath) భయపెడుతున్న ఒకే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఇప్పుడు జ్యోతిరాదిత్య సింధియానే (Jyotiraditya Scindia). సుస్థిరంగా ఉన్న కమల్ నాథ్ సర్కార్ ను కూల్చేందుకు తన ఎమ్మెల్యేలతో రెడీ అయ్యారు. ప్రధాని మోదీని (PM Modi) కలిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ సంక్షోభానికి తెరలేపారు. ఇంతకీ ఎవరీ సింధియా (Jyotiraditya Scindia Profie), బీజేపీకి (BJP) అతనికి ఉన్న లింకేంటి ? ఓ సారి చూద్దాం.
Madhya Pradesh Crisis: మధ్యప్రదేశ్ రాజకీయాల్లో మరో ట్విస్ట్, కాంగ్రెస్ పార్టీకి సింధియా రాజీనామా, కమల్ నాథ్ సర్కార్ పరిస్థితేంటి, బీజేపీ తదుపరి వ్యూహాం ఏంటీ ?
Hazarath Reddyమధ్యప్రదేశ్‌ రాజకీయం (Madhya Pradesh Crisis)మంగళవారం కొత్తమలుపు తిరిగింది. కాంగ్రెస్ పార్టీకి (Congress Party) సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) ఎట్టకేలకు పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి (Sonia Gandhi) పంపారు. 18 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యుడిగా ఉన్న తాను ఇప్పుడు పార్టీని వీడాల్సిన సమయం వచ్చిందని ఆ లేఖలో సింధియా పేర్కొన్నారు.
Madhya Pradesh Political Drama: సంక్షోభంపై షాకిచ్చిన కమల్ నాథ్ సర్కార్, రాజీనామా ప్రకటించిన 20మంది మంత్రులు, మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టాలని ముఖ్యమంత్రికి విన్నపం, రెబల్స్ దారెటు..?
Hazarath Reddyమధ్యప్రదేశ్‌లో బీజేపీ (BJP) ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. కర్ణాటక రాజధాని బెంగుళూరు (Bengaluru) కేంద్రంగా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ( Madhya Pradesh Political Drama) రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సారథ్యంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో తలెత్తిన సంక్షోభం (Madhya Pradesh Crisis) రోజు రోజుకు తీవ్రమవుతోంది.
Madhya Pradesh Govt Crisis: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నుంచి చేజారిపోనుందా? అవిశ్వాస తీర్మానపు వ్యూహంలో బీజేపీ, అత్యవసరంగా సోనియా గాంధీతో భేటీ అయిన మధ్యప్రదేశ్ సీఎం కమలనాథ్
Hazarath Reddyమధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ సర్కారుకి బీజేపీ రూపంలో పెద్ద ఎదురుదెబ్బ (MP Government Crisis) తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. అక్కడ అధికారంలో ఉన్న కమలనాథ్ సర్కారును (Kamal Nath Govt) కూలదోసేందుకు ప్రతిపక్ష బీజేపీ రెడీ అవుతోంది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించుకునేందుకు ముఖ్యమంత్రి కమల్‌నాథ్ (Madhya Pradesh Chief Minister Kamal Nath) అత్యవసరంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో (Sonia Gandhi) భేటీ అయ్యారు.