రాజకీయాలు

Karimnagar Corporation Election Results: దూసుకుపోతున్న కారు, నాలుగు స్థానాల్లో ఘన విజయం, 19 స్థానాల్లో ముందంజ, కాంగ్రెస్ రెండు స్థానాల్లో, బిజేపీ ఎనిమిది స్థానాల్లో ఆధిక్యం, కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

Hazarath Reddy

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో (Karimnagar Municipal Corporation) ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 60 డివిజన్లు ఉండగా.. ఇప్పటికే 2 స్థానాలను అధికార టీఆర్‌ఎస్ (TRS) ఏకగ్రీవంగా గెలుచుకుంది. 20, 37 డివిజన్లలోని టీఆర్ఎస్ అభ్యర్థులు తల రాజేశ్వరి, చల్లా స్వరూప రాణీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 58 డివిజన్లలో నాలుగు సీట్లను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మిగతా పార్టీలు ఇంకా ఖాతాలు ఓపెన్ చేయలేదు.

AP Assembly Special Sessions: శాసన మండలి రద్దు, తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఏపీ సీఎం, అసెంబ్లీ సమావేశాలను బాయ్‌కాట్ చేసిన టీడీపీ, గవర్నర్, స్పీకర్‌కు లేఖ రాసిన టీడీపీ శాసన సభా పక్షం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో (Andhra Pradesh Assembly) రాష్ట్ర శాసన మండలిని రద్దు చేయాలన్న తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నేడు శాసనసభ సమావేశం ప్రారంభమైన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ( CM YS Jagan) మండలిని రద్దు చేసే తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి ప్రతిపాదించిన తీర్మానంపై సభ చర్చకు చేపట్టింది.

AP Legislative Council Cancellation: ఏపీ శాసనమండలి రద్దుకు ఏకగ్రీవ తీర్మానం, సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ క్యాబినెట్, అసెంబ్లీకి రానున్న ఏపీ శాసనమండలి రద్దు బిల్లు, తరువాత ప్రాసెస్ ఏంటీ ?

Hazarath Reddy

ఏపీ క్యాబినెట్ (AP Cabinet) సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ శాసనమండలిని రద్దు (AP Legislative Council Cancellation) చేస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మొదటిది పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు (CRDA Cancellation) బిల్లులను శాసనమండలి వ్యతిరేకించి సెలక్ట్ కమిటీకి (Selection committee) పంపిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

Karimnagar Corporation Election Results: కరీంనగర్ కింగ్ ఎవరు? గులాబీ జెండా ఎగరవేస్తామంటున్న టీఆర్ఎస్, కాషాయపు రెపరెపలు చూడమంటున్న బీజేపీ, రౌండ్ల వారీగా సాగుతున్న ఓట్ల లెక్కింపు

Hazarath Reddy

తెలంగాణా కరీంనగర్‌ కింగ్ (Karimnagar) ఎవరు కాబోతున్నారనేది మరి కొద్ది సేపట్లో తేలిపోనుంది. ఉదయం 7గంటల నుంచి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌ (Karimnagar Municipal Corporation)ఎన్నికల కౌంటింగ్ పక్రియ ప్రారంభం అయ్యింది. కరీంనగర్ కార్పొరేషన్‌ పరిధిలోని మొత్తం 58 డివిజన్లకు సంబంధించిన కౌంటింగ్ జరుగుతోంది.

Advertisement

AP Cabinet Meeting: ప్రారంభమైన ఏపీ మంత్రివర్గ సమావేశం, శాససమండలి ఉంటుందా..ఊడుతుందా..? మరికొద్ది సేపట్లో తేలిపోనున్న శాసనమండలి భవితవ్యం

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం (AP Cabinet) కొద్ది సేపటి క్రితమే సమావేశమైంది. శాసనమండలి రద్దుపై (AP Legislative Council Cancellation) ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం. మండలి భవితవ్యంపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్‌ నిర్ణయం తర్వాత అసెంబ్లీలో దీనిపై చర్చించి, ఆ తర్వాత ఈ అంశంపై తీర‍్మానం చేయనుంది.

CAA Row-Pinarayi Vijayan: సీఏఏని ఎట్టి పరిస్థితుల్లో అమలు కానివ్వం, సీఏఏను వ్యతిరేకిస్తూ భారీ ఎత్తున మానవహారం, రిపబ్లిక్ డే వేళ కేంద్రంపై మండిపడిన కేరళ సీఎం పినరయి విజయన్

Hazarath Reddy

రిపబ్లిక్ డే (Republic Day 2020) వేళ కేరళ సీఎం పినరయి విజయన్ సీఏఏపై కీలక వ్యాఖ్యలు చేశారు.కేంద్రం అమలు చేయాలని చూస్తున్న పౌరసత్వసవరణ చట్టంను (Citizenship Amendment Act) ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించేది లేదని కేరళ సీఎం పినరయి విజయన్‌ (Pinarayi Vijayan) అన్నారు.

Biswabhusan Harichandan: మూడు రాజధానులపై ఏపీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు, అభివృద్ది, అధికార వికేంద్రీకరణతోనే అన్నీ సాధ్యమన్న బిశ్వభూషణ్ హరిచందన్, జాతీయజెండాను ఆవిష్కరించిన ఏపీ గవర్నర్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో (Andhra Pradesh) భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు (India Republic Day 2020) ఘనంగా జరిగాయి. విజయవాడ (Vijayawada)ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ వేడుకలు అంబరాన్ని తాకాయి. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, (Biswabhusan Harichandan) ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు.

CM KCR Press Meet: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం, దేశంలోని పరిస్థితులు, రాష్ట్రంలోని స్థితిగతులపై సుదీర్ఘ వివరణ ఇచ్చిన సీఎం కేసీఆర్, ప్రెస్ మీట్ సమగ్ర కథనం

Vikas Manda

రెవెన్యూ ఉద్యోగులను 'తొలగించము' అని స్పష్టం చేశారు, దుష్ప్రచారాలు నమ్మొద్దు. అయితే రెవెన్యూ ఉద్యోగులు తమని తాము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎంత కడుపుమండితే రైతులు పెట్రోల్ డబ్బాలతో వస్తారు? అవినీతిలో నెంబర్ 1 రెవెన్యూ శాఖ...

Advertisement

Delhi Assembly Elections 2020: ప్రజా క్షేత్రంలో ఢిల్లీ సీఎం అట్టర్ ఫ్లాప్, విరుచుకుపడిన అమిత్ షా, అరవింద్ కేజ్రీవాల్‌పై ఏకంగా 88 మంది అభ్యర్థుల పోటీ, ఢిల్లీలో కొత్తగా పుట్టుకొచ్చిన విచిత్ర పార్టీలు

Hazarath Reddy

ఫిబ్రవరి 8న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Assembly Elections) గెలుపు కోసం అన్ని పార్టీల అధినేతలు దేశ రాజధానిలో పాగా వేసారు. రోడ్ షోలలో మాటాల తూటాలను పేలుస్తున్నారు. ఈ సారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2020 లో ప్రధానంగా బీజేపీ, ఆప్ పార్టీల మధ్యనే పోటీ ( BJP vs AAP) నడుస్తోందని తెలుస్తోంది.

AP Capital Fight: టీడీపీ-వైసీపీ కార్యకర్తల ఫైట్, దిష్టి బొమ్మల దహనంతో మండిపోతున్న ఏపీ, అమరావతే రాజధాని అంటున్న టీడీపీ శ్రేణులు, మూడు రాజధానులు కావాల్సిందే అంటున్న వైసీపీ శ్రేణులు

Hazarath Reddy

ఏపీలో ఇప్పుడు రాజధాని మార్పు అంశం వేడిని రేకెత్తిస్తోంది. ఏపీ రాజధాని అంశం కాస్తా వైసీపీ టీడీపీ శ్రేణులు వార్ గా (YCRCP vs TDP)మారింది. అసెంబ్లీలో ఆమోదం పొందిన వికేంద్రీకరణ బిల్లు, ( There Capitals) సీఆర్డీఏ బిల్లును (CRDA Bill) శాసనమండలిలో టీడీపీ (TDP) అడ్డుకోవడంతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Bhainsa Municipality: భైంసా మున్సిపాలిటీ ఎంఐఎం కైవసం, బీజేపీతో జరిగిన హోరాహోరీ పోరులో పైచేయి సాధించిన మజ్లిస్ పార్టీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు గల్లంతు

Vikas Manda

గత ఎన్నికల్లోనూ భైంసా మున్సిపాలిటీని గెలుచుకున్న ఎంఐఎం, ఈసారి కూడా అదే ఫలితాన్ని రిపీట్ చేసి పట్టు నిలుపుకుంది. అయితే ఇక్కడ పట్టులేని బీజేపీ అనూహ్యంగా 9 వార్డులను గెలుచుకుంది....

Mood Of The Nation Survey: దేశంలో 4 వ బెస్ట్ సీఎంగా ఏపీ సీఎం వైయస్ జగన్, మొదటి వరసలో యోగి ఆదిత్యానాథ్, పాపులర్ నాయకుల్లో ప్రధాని మోడీదే అగ్రస్థానం, ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్స్‌ సర్వేలో వెల్లడి

Hazarath Reddy

దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన అతికొద్ది మంది ముఖ్యమంత్రుల జాబితాలో (best performing chief ministers) ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) టాప్ టెన్ లిస్టులో చోటు సంపాదించారు. ప్రముఖ వార్తా సంస్థ ఇండియా టుడే మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌ (Mood Of The Nation 2019) పేరిట జాతీయ స్థాయిలో ఈ నెలలో నిర్వహించిన పోల్‌ సర్వేలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 4 వ స్థానం దక్కింది.

Advertisement

CM KCR Press Meet Update: మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్, 90 శాతం పైగా గెలుపుతో గులాబీ పార్టీ సత్తా,  మరికాసేపట్లో సీఎం కేసీఆర్ మీడియా సమావేశం

Vikas Manda

ఇంతటి ఘనవిజయం కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతగా మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మాట్లాడనున్నారు.....

Telangana Municipal Election Results 2020: తెలంగాణలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్, దూకుడు మీదున్న టీఆర్ఎస్, ఇప్పటికే పలుచోట్ల గెలుపు, మధ్యాహ్నం నాటికి పూర్తి ఫలితాలు

Vikas Manda

ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 134 కేంద్రాలలోని 2,559 టేబుల్ల వద్ద 1,370 బృందాలు ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. ఫలితాలు ఇప్పుడిప్పుడే వెలువడుతున్నాయి....

BJP MLA Bihari Lal Nokha: మిడతల బుట్టతో అసెంబ్లీకి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే, రైతుల గోడు పట్టించుకోవాలంటూ వినతి, మిడతలతో రాజస్థాన్‌లో భారీ స్థాయిలో పంటలు నాశనం, రెండు దశాబ్దాలలో ఇదే మొదటిసారి అంటున్న రైతులు

Hazarath Reddy

బిజెపి ఎమ్మెల్యే బిహారీ లాల్ నోఖా (Bihari Lal Nokha) శుక్రవారం రాజస్థాన్ అసెంబ్లీకి ఒక మిడతల బుట్టతో (Basket of Locusts) వెళ్లారు. ఇటీవల కాలంలో పాకిస్థాన్‌లో ( Pakistan) ఎడారి ప్రాంతం నుంచి భారీ స్థాయిలో వచ్చిన మిడతలు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలలోని పంటలపై దాడి చేశాయి. దీంతో రైతులకు (Farmers) తీవ్ర నష్టం వాటిల్లింది. లక్షల హెక్టార్లలో పంట నాశనమైంది. దీంతో ఎమ్మెల్యే బిహారీ రైతుల ఆవేదనను అద్దం పట్టేందుకు మిడతలతో అసెంబ్లీకి వచ్చారు. నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

AP Cabinet: శాసన మండలి ఉంటుందా..ఊడుతుందా ?, జనవరి 27 న ఏపీ కేబినెట్‌ భేటీ, బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపలేదన్న శాసనమండలి స్పీకర్, టీడీపీ అసత్య ప్రచారాలు చేస్తుందని వెల్లడి

Hazarath Reddy

ఏపీ శాసనమండలి (AP Legislative Council) రద్దు చేయాలనే వార్తలు ఊపందుకున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ (AP Government) నిర్ణయం ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. ఈ వార్తలకు తెరదించేందుకు దీనిపై ఓ స్పష్టత ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి (AP Cabinet) జనవరి 27 న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) అధ్యక్షతన సోమవారం ఉదయం 9.30 గంటలకు ఈ కేబినెట్‌ భేటీ జరగనుంది.

Advertisement

Three Capital Petitions: బిల్లులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు, విచారణకు స్వీకరించడం సాధ్యం కాదని వెల్లడి, తదుపరి విచారణ ఫిబ్రవరి 26 కి వాయిదా

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం (AP Government) తీసుకువచ్చిన పాలనా వికేంద్రీకరణ (Three Capitals) , సీఆర్డీఏ (CRDA) ఉపసంహరణ బిల్లులపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు (AP High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుత దశలో వాటిని విచారణకు స్వీకరించడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది.

AP Legislative Council: ఏపీ శాసనమండలి రద్దుకు దారులు ఏంటీ..?,ఎవరెవరు ఆమోద ముద్ర వేయాలి..?,దేశంలో ఏయే రాష్ట్రాల్లో ఉంది, ఎన్ని చోట్ల రద్దైంది..?,ఏపీ శాసనమండలి ఎప్పుడు ప్రారంభమైది,దాని చరిత్ర ఏమిటీ..? ఆంధ్రప్రదేశ్ శాసనమండలిపై ప్రత్యేక కథనం

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన వికేంద్రీకరణ బిల్లు, అలాగే ఇతర బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందినా ఏపీ శాసనమండలిలో అవి ఆమోదం పొందలేదు. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీ‌ఏ బిల్లును ఏపీ శాసనమండలి వ్యతిరేకించడమే కాకుండా దాన్ని సెలక్ట్ కమిటీకి పంపాల్సిందిగా శాసన మండలి ఛైర్మెన్ ఎంఎ షరీఫ్ నిర్ణయం తీసుకున్నారు. తనకు ఉన్న విశేష అధికారాలతోనే వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి సిఫార్స్ చేశానని ఏపీ శాసనమండలి ఛైర్మన్‌ షరీఫ్‌ అన్నారు.

‘Enemy’ Properties - Amit Shah: రూ.లక్ష కోట్ల ఆదాయం లక్ష్యంగా శత్రు ఆస్తుల అమ్మకం, హోమంత్రి అమిత్ షా నాయకత్వంలో అమ్మకాలను పర్యవేక్షించనున్న మంత్రుల బృందం, ప్రత్యేకంగా ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్‌, ఇంతకీ ఏమిటీ ఈ శత్రు ఆస్తుల అమ్మకం?

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ((PM Modi Govt) సరికొత్త వ్యూహాంతో ముందుకు వెళుతోంది. ఈ వ్యూహం ద్వారా దేశానికి రూ.లక్ష కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా భారతదేశంలోని శత్రువుల ఆస్తులను(Enemy properties) అమ్మేయడానికి కేంద్ర ప్రభుత్వం (Central Govt)సిద్ధమవుతోంది.

Karimnagar Corporation Polls 2020: కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్‌కు ప్రారంభమైన పోలింగ్, 58 డివిజన్లకు ఎన్నికలు, మరో మూడు చోట్ల రీపోలింగ్ ప్రారంభం, రేపే ఫలితాలు

Vikas Manda

కౌంటింగ్ మరియు ఫలితాల వెల్లడి జనవరి 27న జరుగుతుంది. మరోవైపు ఈనెల 22న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కొన్నిచోట్ల టెండర్ ఓట్లు పోలయ్యాయని గుర్తించిన ఎన్నికల సంఘం, ఆయా కేంద్రాలలో ఈరోజు రీపోలింగ్ నిర్వహిస్తోంది...

Advertisement
Advertisement