రాజకీయాలు

JMI Standoff: దిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం సెగలు, జామియా వర్శిటీ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకం, వర్శిటీలోకి ప్రవేశించి విద్యార్థులపై పోలీసుల దాడి, అరెస్ట్‌కు నిరసనగా విద్యార్థుల ఆందోళనలతో 50 మంది విద్యార్థులను విడుదల చేసిన పోలీసులు

Vikas Manda

అయితే అనుమతి లేకుండానే పోలీసులు వర్శిటీలోకి ప్రవేశించి 50 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. నిరసనల్లో పాల్గొనని వారిపై కూడా దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. పోలీసుల చర్యను యూనివర్శిటీ వీసీ నజ్మా అఖ్తర్ ఖండించారు.

Biryani Seller: బిర్యాని అమ్మాడని చావబాదారు, కుల జాడ్యంలో కొట్టుమిట్టాడుతున్న గ్రేటర్ నోయిడా, కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు వేగవంతం

Hazarath Reddy

ప్రపంచం ఎంత ముందుకు వెళ్తున్నా కుల జాడ్యం(Casteism) మాత్రం వీడటం లేదు. దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో మళ్లీ ఈ కుల జాడ్యం పడగవిప్పింది. అక్కడ ఓ దారుణం చోటు చేసుకుంది.దళిత వ్యక్తి బిర్యానీ అమ్ముతున్నాడనే ఆగ్రహంతో కొందరు అతనిపై దాడి చేసి తీవ్రంగా కొట్టిన ఘటన కలకలం రేపింది. గ్రేటర్‌ నోయిడా(Greater Noida)లోని రబుపురాలో ఈ దాడి జరిగింది.

CAA Stir: రైల్వే స్టేషన్లకు నిప్పు, పశ్చిమబెంగాల్‌లో పౌరసత్వ బిల్లును నిరసిస్తూ మిన్నంటిన ఆందోళనలు, కఠిన చర్యలు తప్పవన్న మమతా బెనర్జీ, ఆందోళనకారుల ధాటికి పలు రైళ్లు రద్దు

Hazarath Reddy

అధికార పార్టీ బీజేపీ(BJP) ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (amended Citizenship Act) కొన్ని రాష్ట్రాల్లో నిప్పు రాజేస్తోంది. దీనిని వ్యతిరేకిస్తున్న ఆయా రాష్ట్రాల ప్రజలు రోడ్లపైకి ఎక్కుతున్నారు. ఆందోళనలు హింసాత్మకరూపంగా మారుతున్నాయి. ప్రధానంగా పశ్చిమబెంగాల్‌లో నిరసనలు మిన్నంటాయి.

BJP MP Car Attacked: బీజేపీ ఎంపీ కారుపై బాంబు దాడి, క్షేమంగా బయటపడిన బరాక్ పూర్ ఎంపీ అర్జున్ సింగ్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలే దాడికి పాల్పడ్డారంటూ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

పశ్చిమబెంగాల్(West Bengal)లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పౌరసత్వ బిల్లుకు నిరసనగా దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్న నేపథ్యంలో బీజేపీ ఎంపీపై(BJP MP) దాడి జరగడం అక్కడ ఉద్రిక్త పరిస్థితులను రాజేస్తోంది. బరాక్ పూర్ బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ (Barrackpore MP Arjun Singh) కారుపై గుర్తు తెలియని వ్యక్తులు ముందు ఇటుకలతో దాడి చేశారు. ఆ తర్వాత కారుకి సమీపంలో బాంబు విసిరారు.

Advertisement

Prashant Kishor: కేజ్రీవాల్‌తో జత కట్టిన ప్రశాంత్ కిషోర్, 2020లో ఆప్ విజయకోసం వ్యూహాలకు పదును, స్వాగతం పలికిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, పని చేసిన చోటల్లా గెలుపు బావుటా ఎగురవేస్తున్న పీకే టీం

Hazarath Reddy

ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) ఈ పేరు రాజకీయాల్లో తెలియని వారు ఉండరేమో.. 2014 ఎన్నికల సమయంలో మోడీ ప్రచార వ్యూహకర్తగా వ్యవహరించి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. మోడీ ప్రచారం కోసం అనేక వ్యూహాలు రచించి బీజేపీ(BJP) పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కీలక పాత్ర పోషించారు.

Sanjay Raut Warns Ally Congress: వీర సావర్కర్ గురించి తక్కువగా మాట్లాడితే సహించేది లేదు, ట్విట్టర్ వేదికగా విరుచుకుపడిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్, గాంధీ, నెహ్రూలాగే సావర్కర్ కూడా మహనీయుడే అన్న శివసేన

Hazarath Reddy

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Congress MP Rahul Gandhi) ‘రేప్ ఇన్ ఇండియా’ (Rape In India) వ్యాఖ్యలపై దేశంలో తీవ్ర దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు దేశాన్ని, మహిళల్ని అవమానపరిచే విధంగా ఉన్నాయని రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని అధికార పార్టీ బీజేపీ (BJP) డిమాండ్ చేస్తోంది. మహిళలపై అకృత్యాల్ని పెంచేదిగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని బీజేపీ ఫైర్ అవుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ మళ్లీ మరో వివాదంలో చిక్కుకున్నారు.

PM Modi Falls Down At Ganga Ghat: ప్రధాని మోడీకి తప్పిన ప్రమాదం, గంగానది మెట్లు ఎక్కుతూ జారి పడిన ప్రధాని, అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, గంగా అటల్ ఘాట్ వద్ద ఘటన

Hazarath Reddy

కాన్పూర్ (Kanpur) పర్యటనలో ప్రధాని మోడీకి (PM Modi) పెను ప్రమాదం తప్పింది. గంగానది (Ganga River) మెట్లు ఎక్కుతూ ప్రధాని జారీ పడ్డారు. అటల్ ఘాట్ వద్ద ఒక అడుగు తప్పి మెట్లపై పడిపోయారు అదృష్టవశాత్తు ఆయనకు గాయాలేం కాలేదు. వెంట ఉన్న సెక్యూరిటీ త‌క్ష‌ణ‌మే ఆయన్ను పైకి లేపారు.

'Bharat Bachao' Rally: దేశం తగలబడిపోతోంది, అధిక ధరలతో ప్రజలు అల్లాడిపోతున్నారు, ఇవేమి మోడీ-అమిత్‌షాలకు పట్టడం లేదు, ఇష్టమొచ్చినట్లుగా పాలన సాగిస్తున్నారు, భారత్ బచావో ర్యాలీలో సోనియా గాంధీ ఘాటు విమర్శలు

Hazarath Reddy

పౌరసత్వ సవరణ బిల్లుతో దేశం తగలిబడి పోతున్నా మోడీ-షాలకు(Modi-Shah) పట్టటం లేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi)ఘాటుగా విమర్శించారు.దేశంలో ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, అధిక ధరలతో ప్రజలు అల్లాడుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. అందుకు అసోం, ఇతర ఈశాన్యా రాష్ట్రాలే నిదర్శనమని ఆమె తెలిపారు.

Advertisement

Narendra Modi: పవిత్ర గంగానదిలో ప్రధాని మోడీ బోటు షికారు, గంగానది ప్రక్షాళన కోసం నమామి గంగ ప్రాజెక్టు చేపట్టిన మోడీ సర్కారు, చంద్రశేఖర్ ఆజాద్‌కు నివాళి అర్పించిన భారత ప్రధాని

Hazarath Reddy

భారత ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) పవిత్ర గంగానదిలో బోట్ రైడ్ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ కాన్పూర్‌లోని అటల్ ఘాట్(Atal ghat) వద్ద ప్రధాని వద్ద మోడీ సరదాగా షికారు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ బీజేపీ సీనియర్ నేతలతో పాటు ఎన్డీఏ(NDA) మిత్రపక్ష నేతలు మోడీ వెంట ఉన్నారు.

RGV vs Janasena Activists: వర్మను చంపేసిన జనసేన కార్యకర్తలు, దెయ్యమై మీ నేతను పట్టుకోవడానికి వస్తున్నా అంటున్న ఆర్జీవి, మీ మీద ఒట్టేసి చెబుతున్నా...ఆ ముగ్గురిని నేను ప్రేమిస్తున్నా, తనదైన స్టైల్లో కౌంటర్లు వేసిన రాంగోపాల్ వర్మ

Hazarath Reddy

నిత్యం వివాదాలు, వరుస సినిమాలతో వార్తల్లో నిలిచే క్రేజీ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ(Ramgopal varma) జనసేన కార్యకర్తలకు తనదైన స్టైల్లో కౌంటర్ వేశారు. ఈ మధ్య విడుదలైన అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కొందరి నేతలను టార్గెట్ చేసినట్లుగా ఉందని ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే. సెన్సార్ బోర్డు సైతం కొన్ని సీన్లను తీసివేసింది. అయితే ఈ సినిమాపై ఆగ్రహం చెందిన జనసేన కార్యకర్తలు వర్మను చంపేశారు.

'Bharat Bachao' Rally: నా పేరు రాహుల్ సావర్కర్ కాదు, రాహుల్ గాంధీ, రేప్ ఇన్ ఇండియా వ్యాఖ్యలపై సారీ చెప్పే ప్రసక్తే లేదు, వాళ్లే క్షమాపణ చెప్పే రోజు వస్తుంది, భారత్ బచావో ర్యాలీలో బీజేపీపై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ

Hazarath Reddy

భారత్ బచావో ర్యాలీలో(Bharat Bachao Rally) కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) నిప్పులు చెరిగారు. బీజేపీ(BJP) నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా విమర్శించారు. 'భారత్ బచావో' ర్యాలీలో పాల్గొని ఆయన మాట్లాడారు. 'రేప్ ఇన్ ఇండియా (Rape in India) వ్యాఖ్యలపై నేను క్షమాపణ చెప్పాలని నిన్న పార్లమెంటులో బీజేపీ డిమాండ్ చేసింది.

'Bharat Bachao' Rally: భారత్ బచావో ర్యాలీ, ప్రధాని మోడీపై సమరభేరి మోగించిన కాంగ్రెస్ పార్టీ, మహిళలకు భద్రత లేకుండా పోయింది, బీజేపీపై నిప్పులు చెరిగిన ప్రియాంకా గాంధీ వాద్రా, ఢిల్లీలో భారీ ర్యాలీకి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు

Hazarath Reddy

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ (Congress) పిలుపునిచ్చిన 'భారత్ బచావో' ర్యాలీకి(Bharat Bachao Rally) వేలాదిగా ప్రజలు తరలివస్తున్నారు. ఢిల్లీ(Delhi)లోని రామ్‌లీలా గ్రౌండ్స్‌( Ramlila Maidan) వేదికగా ఈ ర్యాలీ జరుగుతోంది. కాగా మోడీ (PM Modi) ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ పార్టీ భారత్ బచావో ర్యాలీకి పిలుపునిచ్చింది.

Advertisement

Supreme Court: 2019 లోక్‌సభ ఎన్నికల్లో అవకతవకలు, ఎన్నికల కమిషన్‌కు సుప్రీం నోటీస్, 349 లోక్‌సభ నియోజకవర్గాల్లో భారీ వ్యత్యాసం అంటూ పిటిషన్, దాఖలు చేసిన ఏడీఆర్‌,కామన్‌ కాజ్‌ స్వచ్ఛంద సంస్థలు

Hazarath Reddy

2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో (17th Lok Sabha Election)బీజేపీ(BJP) అఖండ మెజార్టీ సాధించి రెండో సారి అధికారం చేపట్టిన సంగతి విదితమే. అయితే ఈ ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ పరిశీలించిన సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్(Election Commission)కి నోటీసులు జారీ చేసింది.

Amaravathi Capital Change Issue: ఏపీ రాజధాని అమరావతే, రాజధానిని అమరావతి నుంచి తరలించే ప్రసక్తే లేదు, అసెంబ్లీలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణ

Hazarath Reddy

గత కొద్ది రోజులుగా సస్పెన్స్ క్రియేట్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని (Andhra pradesh Captial) అంశంపై జగన్ సర్కార్ (YS Jagan GOVT) క్లారిటీ ఇచ్చింది. ఏపీ రాజధానిగా అమరావతి (Amaravathi) ఉంటుందని దానిని ఎక్కడికి తరలించబోమని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అమరావతిని మారుస్తున్నారా ? అని మండలిలో టీడీపీ (TDP) సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి బొత్స సత్యానారాయణ (Minister Botsa Satyanarayana) లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

Arvind Kejriwal: ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం,'బాలికలతో అసభ్యంగా ప్రవర్తించం', ప్రతి రోజూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో బాలురతో ప్రతిజ్ఞ చేయించాలంటున్న ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌

Hazarath Reddy

దేశంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్న క్రమంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ (Delhi) ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు మానవత్వంతో మెలిగేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

One Year Of TRS GOVT: 88 నుంచి సెంచరీ వైపు దూసుకెళ్లిన కేసీఆర్, ఏడాది పాలన అంతా వ్యూహాల మయమే, ఎత్తుకు పై ఎత్తులతో దూకుడు, గులాబి అధినేత ఏడాది పాలనపై విశ్లేషణాత్మక కథనం

Hazarath Reddy

తెలంగాణా సీఎం (Telangana CM)గా కేసీఆర్ (KCR) రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తి అయింది. ఉద్యమపార్టీగా 2014 ఎన్నికల్లో పోటీ చేసి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ నేతృత్వంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ (TRS), 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో ఘనవిజయాన్ని సాధించి మరోసారి అధికారాన్ని చేపట్టింది. టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు (K Chandrasekhar Rao) నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి(Telangana Rashtra Samithi) గత ఎన్నికల్లో 88 స్థానాల్లో విజయభేరి మోగించింది.

Advertisement

AP Assembly Approves Disha Act Bill: మహిళలపై అత్యాచారం చేస్తే ఇకపై ఉరిశిక్షే, శాసనసభలో ఏపీ దిశ బిల్లుకు అమోదం, 4 నెలల విచారణ సమయాన్ని కేవలం 21 రోజుల్లో పూర్తి చేసేలా బిల్లు

Hazarath Reddy

మహిళల భద్రతకు ఉద్దేశించిన ఏపీ దిశ యాక్టు (AP disha Act) కు శాసనసభ ఆమోదం లభించింది. ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశం(Assembly session)లో ఈ బిల్లును ఆమోదిస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. అంతకుముందు, హౌస్ లో బిల్లును హోం శాఖ మంత్రి సుచరిత(home minister sucharitha) ప్రవేశపెట్టారు.

'Rape In India' Remark: రాహుల్ రేప్ ఇన్ ఇండియా వ్యాఖ్యలపై దద్దరిల్లిన పార్లమెంట్, క్షమాపణ చెప్పాలని పట్టుబడిన అధికార పార్టీ, క్షమాపణ ప్రసక్తే లేదన్న రాహుల్ గాంధీ, అలా అనడానికి కారణం తెలుసుకోండి అంటున్న కాంగ్రెస్ ఎంపీ

Hazarath Reddy

భారతదేశం(India)లో జరుగుతున్న రేప్‌లపై కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై లోక్ సభ(Lok Sabha)లో దుమారం చెలరేగింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన రేప్ ఇన్ ఇండియా(Rape In India)వ్యాఖ్యలు దేశాన్ని అవమానపరిచే విధంగా ఉన్నాయని వెంటనే రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు.

AP Assembly Session: ఉన్నాది ముఖ్యమంత్రి అయితే ఇలానే ఉంటుందన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు, దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అయిదవ రోజు రచ్చరచ్చగా మారిన అసెంబ్లీ సమావేశాలు

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ సమావేశాలు(Ap Assembly session) నేడు ఐదో రోజుకు చేరుకున్నాయి. కాగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య (TDP vs YSRCP) మాటల తూటాలు పేలుతున్నాయి. సభ ప్రారంభంలోనే అధికార, విపక్ష సభ్యుల మధ్య నిన్న అసెంబ్లీ ముందు జరిగిన ఘటనపై తీవ్ర వాగ్వాదం జరిగింది. అధికార పార్టీ తరఫున పేర్ని నాని, బుగ్గన రాజేంద్రనాథ్ తదితరులు మాట్లాడుతూ, మార్షల్స్ తో అనుచితంగా ప్రవర్తించిన చంద్రబాబు (Chandra babu)క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టారు.

Anti-CAB Protests: పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ అట్టుడుకుతున్న అస్సాం మరియు ఈశాన్య రాష్ట్రాలు, రైల్వే స్టేషన్లకు నిప్పు, సైన్యాన్ని మోహరించిన కేంద్రం, ఆందోళన చెందవద్దని ప్రధాని మోదీ హామి

Vikas Manda

అస్సాంలో తీవ్రస్థాయిలో జరుగుతున్న నిరసనల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టంపై అస్సాం మరియు ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావొద్దని తెలిపారు....

Advertisement
Advertisement