Politics

Telangana RTC Strike @ Day 43: సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదు! నిరవధిక నిరాహార దీక్షకు దిగిన అశ్వత్థామ రెడ్డి, అరెస్ట్ చేసేందుకు ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు, ఖండించిన సీపీఐ నేత నారాయణ

Vikas Manda

ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి (Ashwatthama Reddy) ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. హైదరాబాద్, ఎల్బీ నగర్ లోని హస్తినాపురం కాలనీలో గల ఆయన ఇంటి వద్దకు పోలీసులు చేరుకున్నారు. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు....

Maharashtra Politics: మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలకు ఆస్కారం లేదు, ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం, ఐదేళ్ల పాటు తమదే అధికారమని వెల్లడించిన శరద్ పవార్

Vikas Manda

శివసేన- ఎన్సీపీ- కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పక్షంలో శివసేన - హిందుత్వ భావజాలమే ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందా? అని ఒక జర్నలిస్ట్ ప్రశ్నించినపుడు.....

Ayodhya Dispute: మసీదు నిర్మాణం కోసం ఎలాంటి ప్రత్యామ్నాయ భూమి, విరాళాలు అంగీకరించం. న్యాయపరమైన హక్కుల కోసం పోరాడతాం: జమియత్ ఉలామా-ఇ-హింద్

Vikas Manda

చోటులో మసీదు నిర్మాణం మినహా అందుకు ప్రత్యామ్నాయం ఈ ప్రపంచంలోనే ఏదీ లేదు. ఏ ముస్లిం వర్గానికి కూడా 'బదులు' అనేది సమ్మతం కాదు అని జమియత్ ఉలామా-ఇ-హింద్ ప్రెసిడెంట్ అర్షద్ మదానీ వ్యాఖ్యానించారు....

TSRTC Strike at Day 42: విలీనంపై ఆర్టీసీ జేఏసీ వెనక్కి తగ్గినా, ప్రభుత్వం చర్చలకు ముందుకు వచ్చేనా? 42వ రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె

Vikas Manda

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అనే ప్రధాన డిమాండ్ తో ఆర్టీసీ జేఏసీ గత అక్టోబర్ నెలలో సమ్మెకు పిలుపునిచ్చింది. ఆ సమయంలో ప్రభుత్వం ముగ్గురు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లతో ఒక కమిటీ వేసి చర్చలకు పిలిచింది. అయితే, విలీనం చేస్తామని లిఖితపూర్వక హామీ ఇస్తేనే సమ్మె ....

Advertisement

Devineni Avinash: టీడీపీకి దేవినేని అవినాష్ రాజీనామా, ఏపీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి, గత ఎన్నికల్లో గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ, వైసీపీ అభ్యర్థి కొడాలి నాని చేతిలో ఓటమి

Hazarath Reddy

టీడీపీ యువనేత దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి రాజీనామా లేఖను పంపారు. వెంటనే వైసీపీ జాయిన్ అయ్యారు. తాడేపల్లిలోని వైసీపీ క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో దేవీనేని అవినాష్ వైసీపీ కండువా కప్పుకున్నారు.

Musharraf Says ‘Laden Our Hero’: పాక్ ప్రజలకు ఒసామా బిన్ లాడెన్ హీరో, సంచలన వ్యాఖ్యలు చేసిన పర్వేజ్ ముషారఫ్, భారత్ సైన్యంపై పోరాట కోసం పాక్‌లో శిక్షణ పొందిన కశ్మీరీలు, వీడియో విడుదల చేసిన పాక్ నేత

Hazarath Reddy

పాకిస్తాన్ మాజీ నియంత పర్వేజ్ ముషారఫ్ మరోసారి తన బుద్ధిని చూపించారు. కరడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌ తమ హీరో అని పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే విషయంలో పాకిస్తాన్‌ వైఖరిని ఈ విధంగా ముషారఫ్‌ బహిర్గతం చేశారు.

Farmers Protest In Maharashtra: మహారాష్ట్రలో రైతుల నిరసనలు, దెబ్బతిన్న పంటతో రోడ్డెక్కిన రైతులు, రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నం, రైతులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించిన పోలీసులు

Hazarath Reddy

మహారాష్ట్ర పరిస్థితి రోజురోజుకు దయనీయమవుతోంది. నిన్నటిదాకా రాజకీయాలు మహాను కుదిపేస్తూ ఇప్పుడు రైతు సమస్య ఆ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తోంది. రాష్ట్రపతి పాలనతో ఉన్న మహారాష్ట్ర ఇప్పుడు రైతుల ధర్నాలతో దద్దరిల్లుతోంది. అక్కడ రైతులు రోడ్లెక్కారు.

Karnataka Politics: తీర్పు వచ్చిన కొద్ది గంటలకే..కాషాయం కండువా కప్పుకున్న 15 మంది కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలు, బీజేపీ నుంచి ఉప ఎన్నికల్లో పోటీ, డిసెంబర్ 5న ఉప ఎన్నికలు

Hazarath Reddy

ఉప ఎన్నికల్లో పోటీ చేయవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన కొద్ది గంటల్లోనే కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలు కాషాయ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించి అనర్హత వేటుకు గురైన 17 మంది కాంగ్రెస్, జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేల్లో 15 మంది కర్ణాటక సీఎం బీఎస్ యడ్డ్యూరప్ప సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

Advertisement

Sabarimala Case Verdict: శబరిమల కేసుపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం, కేసును ఏడుగురు సభ్యులున్న రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసిన అత్యున్నత న్యాయస్థానం, శబరిమలలో భద్రత కట్టుదిట్టం

Hazarath Reddy

కేరళ(Kerala)లోని శబరిమల అయ్యప్ప ఆలయం(Sabarimala Ayyappa Temple)లోకి మహిళల ప్రవేశంపై గతంలో ఇచ్చిన తీర్పును పున:పరిశీలించాలంటూ సుప్రీం కోర్టు (Supreme Court)లో దాఖలైన పిటిషన్ సహా, మరో 65 పిటిషన్లపై ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టింది. శబరిమల కేసులో దాఖలైన రివ్యూ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం(Sabarimala Verdict) తీసుకుంది.

Chandrababu Hunger Strike: ఏపీలో ఇసుక రాజకీయం, ఓ వైపు వారోత్సవాలు, మరోవైపు దీక్షలు, ఇసుక కొరతగా నిరసనగా చంద్రబాబు దీక్ష, ఇసుక దోపిడీ జరిగింది మీ పాలనలోనే అన్న ఏపీ సర్కారు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం ఇసుక (AP Sand Crisis Politics) చుట్టూ తిరుగుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వం ఇసుక వారోత్సవాలకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తుంటే మరో వైపు ఇసుక కొరతకు నిరసనగా ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు (TDP chief Chandrababu) దీక్షకు దిగారు. టీడీపీ (Telugu Desam Party) అధినేత చంద్రబాబు విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్ వద్ద 12గంటల నిరసన దీక్షకు దిగారు. ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది.

Sabarimala & Rafale: మూడు కీలక తీర్పులు నేడే, శబరిమల, రాఫేల్, చౌకీదార్ చోర్ హై పిటిషన్లపై తుది తీర్పు, శబరిమలలో భద్రత కట్టుదిట్టం, అందరి కళ్లు ఈ తీర్పు పైనే..

Hazarath Reddy

య తీర్పు( historic verdict on the Ayodhya )ను వెలువరించిన సుప్రీంకోర్టు (Supreme Court ) రాజ్యాంగ ధర్మాసనం నేడు మరో మూడు కీలక తీర్పులను(Sabarimala & Rafale Review Petitions) ఇవ్వనుంది. వీటిలో ఒకటి హిందువుల మత విశ్వాసానికి చెందిన శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలకు ప్రవేశం కల్పించే అంశం కాగా. మిగతా రెండు రాజకీయ దుమారం రేపిన రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారానికి సంబంధించినవి, వీటితో పాటు రాఫేల్‌ ఒప్పందం విషయంలో ప్రధాని మోడీపై రాహుల్‌ చౌకీదార్ చోర్ హై అంటూ చేసిన వ్యాఖ్యలు. ఈ మూడు పిటిషన్లపై దేశ అత్యన్నత న్యాయస్థానం తుది తీర్పును ఇవ్వనుంది.

JNU Students Protest: ఫీజుల పెంపుపై గర్జించిన జెఎన్‌యూ విద్యార్థులు, ఆందోళనలతో అట్టుడికిన వర్శిటీ, పాక్షికంగా వెనక్కి తగ్గిన జెఎన్‌యూ పాలక మండలి, ఆందోళన విరమించేది లేదని తేల్చిచెప్పిన స్టూడెంట్స్ యూనియన్

Vikas Manda

మెస్ ఛార్జీలు, ఇతర సదుపాయాలు మరియు సెక్యూరిటీ డిపాజిట్‌కు సంబంధించి ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ నేపథ్యంలో ఆందోళన విరమించేది లేదని జవహర్‌లాల్ నెహ్రూ స్టూడెంట్స్ యూనియన్...

Advertisement

Telangana RTC Strike -High Court: ఆర్టీసీ సమ్మెపై విచారణ ఈనెల 18కి వాయిదా,  రోజులు గడుస్తున్నా ఏమి తేల్చలేకపోతున్న ఉన్నత న్యాయస్థానం, ఇబ్బందులు పడుతున్న సామాన్య జనం

Vikas Manda

గత 40 రోజులుగా ఆర్టీసీ సమ్మె జరుగుతున్నా సమ్మెపై హైకోర్ట్ ఎటూ తేల్చలేకపోతుంది. అక్టోబర్ 6న ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. అక్టోబర్ 9-10 నుంచి విచారణ ప్రారంభమైంది....

AP GOVT Sensational Decision: ఇసుక అక్రమ రవాణా చేస్తే రూ.2లక్షలు జరిమానా, రెండేళ్లు జైలు శిక్ష, ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం, ఇసుక వారోత్సవాలపై పలు సూచనలు, ఈ నెల14 నుంచి ఇసుక వారోత్సవాలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఈ మధ్య రాజకీయాస్త్రంగా మారిన ఇసుక కొరతపై ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.ఈ నిర్ణయంతో అన్ని వార్తలకు ఒకేసారి చెక్ పెట్టారు. ఇసుక కొరతకు కారణమవుతున్న ఇసుక అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఎవరైనా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే రూ. 2లక్షలు జరిమానా, 2ఏళ్ల జైలు అంటూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

Kawasi Lakhma: మా రోడ్లన్నీ హేమమాలిని చెంపల మాదిరిగా ఉంటాయి, చత్తీస్‌ఘడ్ మంత్రి కవాసీ లఖ్మా వివాదాస్పద వ్యాఖ్యలు, మండిపడుతున్న బీజేపీ నేతలు, గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి

Hazarath Reddy

సీనియర్ కాంగ్రెస్ లీడర్, చత్తీస్‌గఢ్‌కు చెందిన ఎక్సైజ్ మంత్రి కవాసీ లఖ్మా (Chhattisgarh Minister Kawasi Lakhma) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. మ్తారీ జిల్లాలోని కుర్ద్ డెవలప్ మెంట్ బ్లాక్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కవాసీ లక్మా తన నియోజకవర్గంలోని రోడ్లను హేమామాలినీ(actress Hema Malini) చంపలతో పోల్చారు.

TSRTC Strike at Day 40: హైకోర్ట్ ప్రతిపాదనపై విముఖత వ్యక్తం చేసిన తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీపై అత్యున్నత స్థాయి కమిటీ అవసరం లేదని అఫిడఫిట్ దాఖలు, ప్రైవేటీకరణ అంశంపై హైకోర్టులో విచారణ

Vikas Manda

నేటితో ఆర్టీసీ సమ్మె 40వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని హైకోర్ట్ చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించలేవని, ఇక ఆఖరి ప్రయత్నంగా సమస్య పరిష్కారం కొరకు మరియు సమ్మె చట్ట విరుద్ధమా, కాదా?...

Advertisement

Rafale,Chowkidar Chor Hai Verdicts: రాఫెల్‌ రివ్యూ పిటిషన్‌పై రేపు కీలక తీర్పు, చౌకీదార్ చోర్ హై పిటిషన్ పై కూడా తీర్పు వచ్చే అవకాశం, ఇప్పటికే దీనిపై సారీ చెప్పిన రాహుల్ గాంధీ

Hazarath Reddy

భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ (Chief Justice of India Ranjan Gogoi )సారథ్యంలోని సుప్రీంకోర్టు (Supreme Court )ధర్మాసనం వచ్చే వారంలో 3 రోజుల్లో 3 కీలకమైన తీర్పులు ఇవ్వనుంది. రేపు రాఫెల్ రివ్యూ పిటిషన్ల(Rafale review petitions)కు సంబంధించి తీర్పును వెలువరించనుంది.

Karnataka Disqualified MLAs Case Verdict: కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలపై సుప్రీం సంచలన తీర్పు, ఆ 17 మందికీ ఉపఎన్నికల్లో పోటీకి గ్రీన్ సిగ్నల్, డిసెంబర్ 5న ఉప ఎన్నికలు

Hazarath Reddy

కర్ణాటకలో 17 మంది రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్‌ (Disqualified Karnataka MLAs' Case )పై సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పు వెలువరించింది. వారిపై అనర్హత వేటు వేస్తూ జూలైలో నాటి అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. అయితే వీరంతా 2023 వరకు సభాకాలం ముగిసేదాకా (current assembly ends in 2023) ఎన్నికల్లో పోటీ చేయరాదంటూ స్పీకర్ విధించిన నిషేధాన్ని కొట్టేసింది.

SC's Vital Verdicts Today: ఈ రోజు మరో రెండు చారిత్రాత్మక తీర్పులు, ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్ వస్తుందా..రాదా అనే దానిపై తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు, కర్ణాటక ఎమ్మెల్యేల అనర్హత కేసుపై కూడా కీలక తీర్పు

Hazarath Reddy

అయోధ్య భూవివాదం కేసులో గత శనివారం చరిత్రాత్మక తీర్పునిచ్చిన దేశ అత్యున్నత న్యాయస్థానం బుధవారం మరో రెండు కీలక అంశంలో తీర్పునివ్వడానికి సిద్ధమైంది. ప్రజల చేతుల్లో పాశుపతాస్త్రంగా భావించే సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ యాక్ట్) పరిధిలోకి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కార్యాలయాన్ని తీసుకురావాలా? వద్దా? అనే అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో జస్టిస్‌లు ఎన్ వీ రమణ, డీ వై చంద్రచూడ్, దీపక్ గుప్తా, సంజీవ్ ఖన్నాతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తీర్పు వెలువరించనున్నది.

Hawala Racket: దక్షిణాదిన హవాలా దందా, రూ.3,300 కోట్ల స్కాం వెలుగులోకి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగం కేంద్రంగా హవాలా స్కామ్, ప్రకటన విడుదల చేసిన సీబీడీటీ

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా హవాలా స్కాం వెలుగులోకి వచ్చింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగానికి చెందిన ప్రధాన కార్పోరేట్ సంస్థలకు లింక్ ఉన్న భారీ హవాలా రాకెట్‌(hawala racket)ను ఆదాయపు పన్ను విభాగం (Income Tax Department)బయటకు తీసుకువచ్చింది.

Advertisement
Advertisement