Politics

Samvidhaan Hatya Diwas: కేంద్రం సంచలన ప్రకటన, ఏటా జూన్ 25ని సంవిధాన్‌ హత్యా దివస్‌గా పాటించాలని పిలుపు, ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన రోజే అది..

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 1975 జూన్ 25న ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన రోజును ఇకపై ఏటా సంవిధాన్‌ హత్యా దినంగా పాటించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు జూన్ 25ను సంవిధాన్‌ హత్యా దివస్‌గా కేంద్రం ప్రకటించింది

Gudivada Amarnath on Chandrababu Govt: 30 రోజుల పాలనలోనే ఇంత మోసమా, చంద్రబాబుపై మండిపడ్డ వైసీపీ నేత గుడివాడ అమరనాథ్

Hazarath Reddy

ఎన్నికల ముందు చంద్రబాబు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15000 చొప్పున ఇస్తామని చెప్పారు. జీవో నెంబర్ 29లో పిల్లలను బడికి పంపే తల్లికి రూ.15000 వేలు ఇస్తామని చెప్పారు. దీనిపై తల్లుల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. చంద్రబాబు దీనిపై ఎందుకు ప్రకటన చేయలేదు.. ఉచిత ఇసుక అని చెప్పి అమ్ముకుంటున్నారు. అప్పుల మీద ప్రజలను తప్పు తోవ పట్టిస్తున్నారు.

Danam Nagender on BRS: వీడియో ఇదిగో, 15 రోజుల్లో బీఆర్‌ఎస్‌ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం అవడం ఖాయం, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వరుస పెట్టి కాంగ్రెస్‌లో చేరుతుండటంపై ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు మీడియాతో దానం నాగేందర్‌ మాట్లాడుతూ..‘రెండు రోజుల్లో మరో ఆరుగురు బీఆర్‌ఎస్‌ ఎంఎల్ఏలు కాంగ్రెస్‌లో చేరుతారు. పదిహేను రోజుల్లో బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసుకుంటాం.

Criminal Case Against YS Jagan: కస్టడీ సమయంలో తనపై హత్యాయత్నం జరిగిందంటూ రఘురామ రాజు ఫిర్యాదు, జగన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన గుంటూరు పోలీసులు

Hazarath Reddy

ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ పెట్టిన ఘటనలో గుంటూరు పోలీసుల మాజీ సీఎం జగన్ పై కేసును నమోదు చేశారు. సెక్షన్ 120బీ, 166, 167, 197, 307, 326, 465, 508 (34) కింద కేసు నమోదు చేశారు. రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుంటూరు జిల్లా నగరంపాలెం పీఎస్ లో కేసు నమోదయింది.

Advertisement

Arvind Kejriwal Gets Interim Bail: ఢిల్లీ మద్యం పాలసీ కేసు, సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌‌కు మధ్యంతర బెయిల్, కేసు విచారణ ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదిలీ

Hazarath Reddy

ఢిల్లీ మద్యం పాలసీ కేసు (Delhi excise policy case)లో ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ (AAP National Convener)‌, సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు సుప్రీంకోర్టు (Supreme Court) మధ్యంతర బెయిల్‌ (interim bail) మంజూరు చేసింది.

Arvind Kejriwal Granted Bail: కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌, అయినా జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి, ఎందుకంటే..

Hazarath Reddy

ఢిల్లీ మద్యం పాలసీ కేసు (Delhi excise policy case)లో ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ (AAP National Convener)‌, సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు సుప్రీంకోర్టు (Supreme Court) మధ్యంతర బెయిల్‌ (interim bail) మంజూరు చేసింది.

Talliki Vandanam Scheme: చంద్రబాబు మార్క్ మోసపూరిత రాజకీయం ఇదంటూ వీడియో షేర్ చేసిన వంగా గీత, ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15వేల ఆర్థిక సాయం అంటూ..

Hazarath Reddy

ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15వేల ఆర్థిక సాయం ఇస్తానని చెప్పి ప్రజల ఓట్లు వేయించుకొని అందల మెక్కి.. నేడు తల్లికి 15 వేల చొప్పున 'తల్లికి వందనం' అని నీ మోసపూరిత రాజకీయాలను మరోసారి బయటపెట్టావ్ చంద్రబాబు! అంటూ విమర్శలు గుప్పించారు.

Budget 2024: రానున్న బడ్జెట్లో బీహార్‌కు రూ. 30 వేల కోట్లు డిమాండ్ చేస్తున్నసీఎం నితీష్ కుమార్, మరి ఏపీ సీఎం చంద్రబాబు ఎంత డిమాండ్ చేస్తున్నారంటే..

Hazarath Reddy

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూటమిలో రెండవ అతిపెద్ద మిత్రుడు బీహార్ సీఎం నితీష్ కుమార్ తమ రాష్ట్రంలోని ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి ఈ సంవత్సరం భారత కేంద్ర బడ్జెట్ నుండి దాదాపు రూ. 30,000 కోట్లు ($3.6 బిలియన్లు) డిమాండ్ చేస్తున్నారని సమాచారం.

Advertisement

YSRCP Suspended PV Sidda Reddy: ఏరివేత మొదలు పెట్టిన జగన్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం, పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని నిర్థారణ

Hazarath Reddy

వైసీపీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్ధారెడ్డిపై వైసీపీ నాయకత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఇటీవలి ఎన్నికల్లో సిద్ధారెడ్డి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినట్టు గుర్తించారు.

AP Minister Satyakumar Reply To KTR: గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటే గుర్తుకు వచ్చేది కబ్జా-కలెక్షన్-కరప్షన్-కమీషన్లే...కేటీఆర్ కు ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఘాటైన రిప్లై..

sajaya

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఓటమి పై తెలంగాణా మాజీ మంత్రి కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రం సత్యకుమార్ స్పందించారు. ఆయన ఎక్స్ ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ను విమర్శించారు.

PM Modi Russia Visit: రష్యాలో ప్రధాని మోదీ కీలక ప్రకటన, తీవ్రవాదంపై నిప్పులు చెరిగిన భారత ప్రధాని, మన అభివృద్ధిని చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోందని వెల్లడి

Hazarath Reddy

తాను ఒక్కడినే ఇక్కడికి రాలేదని.. 140 కోట్ల మంది ప్రేమను తీసుకొచ్చానని తెలిపారు. భారతదేశ మట్టి వాసనను మోసుకొచ్చినట్లు చెప్పారు. ఇటీవలే మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణం చేశానన్న మోదీ.. మూడు రెట్లు వేగంగా పనిచేయాలని అప్పుడే నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

'Rahul Gandhi's Image as Doormat': రాహుల్‌ గాంధీ బొమ్మను డోర్‌ మ్యాట్‌గా వాడిన దేవాలయ నిర్వాహకులు, ప్రతిపక్షనేత హిందూ వ్యతిరేక వ్యాఖ్యలకు నిరసనగా చర్య, వీడియో ఇదిగో..

Hazarath Reddy

మహారాష్ట్రలోని ఓ దేవాలయం నిర్వాహకులు కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ బొమ్మను డోర్‌ మ్యాట్‌గా వాడుకోవడంతో వివాదం రేగింది. రాహుల్ గాంధీ హిందూ వ్యతిరేక వ్యాఖ్యలకు నిరసనగా ఆలయ నిర్వాహకులు ఈ చర్య తీసుకున్నారు. రాహుల్ గాంధీ ఫోటోను డోర్‌మేట్‌గా ఉపయోగిస్తున్నట్లు చూపించే వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

Advertisement

Ponnam Prabhakar: తామేమి అలగలేదని తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్‌, తోపులాట‌ను నిలువ‌రించేందుకు కొద్దిసేపు ఆగిన‌ట్లు వెల్లడి

Hazarath Reddy

హైదరాబాద్‌ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ వేడుకల‌కు హాజ‌రైన‌ మంత్రి పొన్నం ప్రభాకర్‌, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి కార్య‌క్ర‌మం కోసం చేసిన ఏర్పాట్లలో నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విష‌యం తెలిసిందే. ప్రొటోకాల్‌ పాటించడం లేద‌ని అలిగి ఆలయం బయటే కూర్చుండిపోయారు

YSR Jayanthi: వీడియో ఇదిగో, 2029లో ఏపీ సీఎంగా షర్మిల, దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ, సంచలన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ‘వైఎస్ఆర్ 75వ జయంతి’ కార్యక్రమంలో ఏపీ రాజకీయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2009 నుంచి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన వైఎస్ షర్మిల తండ్రి లాగే 2029 లో సీఎంగా అవుతారని వ్యాఖ్యానంచారు.

Free Sand Policy in AP: ఏపీలో ఉచిత ఇసుక ఖరీదు టన్నుకి రూ. 1394, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫ్లెక్సీలు, ఇదో కొత్త దందా అంటూ వైసీపీ మండిపాటు, ప్రభుత్వం స్పందన ఏంటంటే..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటైన టీడీపీ కూటమి ప్రభుత్వం తమ ఎన్నికల ప్రచారంలో జలకు ఉచితంగా ఇసుకను పంపిణీ చేస్తామని ప్రకటించిన సంగతి విదితమే. చంద్రబాబు సీఎం అయిన తర్వాత మాటను నిలబెట్టుకుంటూ ఉచిత ఇసుక విధానం తీసుకువచ్చారు. నిన్నటి నుంచి ఏపీ వ్యాప్తంగా ఉచిత ఇసుక పాలసీ అందుబాటులోకి వచ్చింది

YSR 75th Birth Anniversary: షర్మిలని గెలిపించడానికి కడపలో గల్లీగల్లీ తిరుగుతా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, జగన్‌ను ఉద్దేశించి తీవ్ర విమర్శలు

Hazarath Reddy

ఈరోజు చాలామంది వైఎస్ పేరు మీద అన్ని రకాల లబ్ధిని పొందారని విమర్శించారు. కానీ ఆయన ఆశయాలు మోసినప్పుడే వారసత్వం అవుతుందన్నారు. వైఎస్ ఆశయాలను మోసినవారినే వారసులుగా గుర్తించాలని... అది షర్మిల మాత్రమే అన్నారు.

Advertisement

Hemant Soren Wins Trust Vote: విశ్వాస పరీక్షలో నెగిన జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌, 45 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఈజీగా విక్టరీ

Hazarath Reddy

హేమంత్‌ సోరెన్‌ (Hemant Soren) జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా (Jharkhand CM) ఐదునెలల తర్వాత మరోసారి ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు రాష్ట్ర అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకున్నారు. రాంచీలోని రాష్ట్ర అసెంబ్లీ (Jharkhand Assembly)లో నిర్వహించిన‌ విశ్వాస ప‌రీక్షలో హేమంత్‌ సోరెన్‌ 45 మంది ఎమ్మెల్యేల ఓట్లతో విశ్వాస పరీక్షలో నెగ్గారు.

Telangana: 35 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు, రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్న కార్పొరేషన్‌ ఛైర్మన్లు, లిస్టు ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకంపై ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 35 మంది ఛైర్మన్లను నియమిస్తూ జీవో విడుదల చేశారు. మార్చి 15నే ఇందుకు సంబంధించి జీవో విడుదలైంది. అయితే, ఎన్నికల కోడ్‌ దృష్ట్యా ఆపి ఈరోజు తిరిగి విడుదల చేశారు.

Rahul Gandhi on YSR: వైఎస్ఆర్ బ‌తికి ఉంటే ఏపీ ప‌రిస్థితి మరోలా ఉండేది, రాహుల్ గాంధీ సంచలన వీడియో ఇదిగో, ఆయ‌న‌ను కోల్పోవ‌డం రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తీర‌ని లోటంటూ..

Hazarath Reddy

నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ప్ర‌త్యేకంగా ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ బ‌తికి ఉంటే ఏపీ ప‌రిస్థితి మ‌రోలా ఉండేద‌న్నారు.

YSR Jayanthi: దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 75వ జయంతి నేడు.. వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ భారతి నివాళులు

Rudra

దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 75వ జయంతి నేడు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌ జిల్లాలోని ఇడుపులపాయలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ భారతి నివాళులు అర్పించారు.

Advertisement
Advertisement