Health & Wellness

Coronavirus (COVID-19): బరువుంటే కరోనాతో ప్రమాదం, 26 అడుగుల దూరం వరకు కోవిడ్ వైరస్ ప్రయాణం, మహిళల కంటే పురుషులకే వైరస్‌ ముప్పు, రెండోసారి కరోనా సోకుతుందనే దానిపై ఇంకా వీడని సస్పెన్స్

Hazarath Reddy

కరోనావైరస్ ప్రపంచం మొత్తాన్ని కలవరపెడుతోంది. వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో ఇది (coronavirus disease (COVID-19) మరింతగా భయపెడుతోంది. దీనిపై శాస్ర్తవేత్తలు రోజుకొక కొత్త ఆసక్తిర విషయాన్ని ప్రకటిస్తున్నారు. తాజాగా మరొక వార్త బయటకు వచ్చింది. కోవిడ్‌–19 (Coronavirus (COVID-19) బారిన పడితే ఆరోగ్యకరమైన బరువు కలిగిన వారికన్నా అధిక బరువు కలిగిన వారు (Obesity) 48 శాతం ఎక్కువ మరణించే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్‌ నియమించిన శాస్త్రవేత్తల బృందం తెలిపింది.

BP Drugs Cuts Covid Death Risk: కరోనాకు బీపీ మందులతో చెక్, బ్లడ్ ప్రెషర్ రోగులకిచ్చే మందులు అద్భుతంగా పనిచేస్తున్నాయని లండన్‌ తాజా సర్వే ద్వారా వెల్లడి, కరోనా రోగుల శవ పరీక్షల్లో దిమ్మతిరిగే విషయాలు

Hazarath Reddy

కరోనా వైరస్‌కు ఇప్పటి వరకు మందు అయితే రాలేదు. కాని ఎవరికి వారే పలు రకాల సర్వేలతో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. తాజాగా కరోనా బారిన పడిన ‘హై బ్లడ్‌ ప్రెషర్‌’ రోగులకు బ్లడ్‌ ప్రెషర్‌ నివారణ మందులను (Blood pressure drugs) ఇవ్వడం వల్ల వారు అద్భుతంగా కరోనా వైరస్‌ బారి నుంచి కోలుకున్నారని (BP Drugs Cuts Covid Death Risk) లండన్‌లో నిర్వహించిన ఓ తాజా సర్వే తెలియజేస్తోంది.

Cancer Cases in India: దేశంలో నిశ్శబ్దంగా క్యాన్సర్ విజృంభణ, 2025 నాటికి క్యాన్సర్ కేసులు 15.7 ల‌క్ష‌ల‌కు పెరిగే అవ‌కాశం, ఐసీఎంఆర్‌ పరిశోధనలో వెల్లడి, పొగాకు వాడకమే కారణం

Hazarath Reddy

దేశంలో కరోనా మాటును పెద్ద ప్రమాదమే పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. కరోనా కేసులతో పాటు ఇతర వైరల్ వ్యాధులు దేశ ప్రజలకు నిదర లేకుండా చేస్తోంటో, తాజాగా క్యాన్సర్ (Cancer Cases in India) గురించి ఆందోళనకర విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బెంగ‌ళూరుకు చెందిన నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ ఇన్‌ఫ‌ర్మాటిక్స్ అండ్ రీసెర్చ్‌, భార‌తీయ వైద్య ప‌రిశోధ‌న మండ‌లి(ఐసీఎంఆర్‌) సంయుక్తంగా సంచలన నివేదిక‌ను విడుద‌ల చేశాయి.

COVID-19 Symptoms: కరోనా మిస్టరీ..లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్, రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండటమే కారణమా? కోవిడ్ వైరస్ మోతాదులో తేడానా ? అంతా మిస్టరీయే..

Hazarath Reddy

కరోనావైరస్..ఈ ఏడాది ఈ పదం ఒక కల్లోలాన్నే రేపింది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలు కకావికలమయ్యాయి. వ్యాక్సిన్ కోసం అన్ని దేశాలు చకోర పక్షులా ఎదురుచూస్తున్నాయి. అయితే ఈ వైరస్ లక్షణాలు రాను రాను కొత్త కొత్తగా కనిపిస్తున్నాయి. చాలామందిలో ఈ వైరస్ లక్షణాలు (COVID-19 Symptoms) లేకుండానే పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. మరికొంత మందిలో స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయట. దాదాపు 40 శాతం కరోనావైరస్ రోగులకు (coronavirus infections) కోవిడ్ లక్షణాలు కనిపించడం లేదని ప్రముఖ పరిశోధకురాలు, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో అంటు వ్యాధి వ్యాధుల నిపుణురాలు మోనికా గాంధీ పేర్కొంది.

Advertisement

SFTS Virus in China: చైనాలో మరో ప్రమాదకర వైరస్, ఎస్ఎఫ్‌టీఎస్ దెబ్బకు ఏడు మంది మృతి, 60 మంది ఆస్పత్రిలో చేరిక, మ‌నుషుల ద్వారా వ్యాప్తి చెందుతుంద‌ని హెచ్చ‌రిక‌లు జారీ

Hazarath Reddy

కరోనావైరస్ కల్లోలం మరచిపోకముందే చైనాలో మరో భయంకరమైన వైరస్ ( Another Virus in China) వెలుగు చూసింది. ఈ ప్రమాదకర వైరస్ (SFTS Pandemic) ధాటికి అక్కడ ఏడుగురు ప్రాణాలు కోల్పోగా మ‌రో 60 మంది దీని బారిన ప‌డ్డారు. ఎస్ఎఫ్‌టీఎస్ (సివియ‌ర్ ఫీవ‌ర్ విత్ త్రామ్‌బోసిటోపెనియా సిండ్రోమ్) (Severe fever with thrombocytopenia syndrome) వైరస్‌గా పిలుస్తోన్న ఈ వైరస్ మ‌నుషుల ద్వారా వ్యాప్తి చెందుతుంద‌ని చైనా హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఈ మేర‌కు చైనా అధికారిక మీడియా గ్లోబ‌ల్ టైమ్స్‌ బుధ‌వారం క‌థనాన్ని వెలువ‌రించింది.

Salmonella Outbreak: అమెరికాను వణికిస్తున్న ఎర్ర ఉల్లిపాయ, యుఎస్, కెనడాలో పెరుగుతున్న సాల్మొనెల్లా కేసులు, ఎరుపు రంగు ఆనియన్స్ ద్వారా వ్యాధి వస్తుందని తెలిపిన సీడీసీ

Hazarath Reddy

అగ్రరాజ్యం అమెరికాకు ఇప్పుడు రెడ్ ఆనియన్స్ (Red Onions) చుక్కలు చూపిస్తోంది. కరోనాతో ఇప్పటికే వణికిపోతున్న అమెరికాకు (America) ఉల్లి రూపంలో మరో ప్రమాదం ఎదురవుతోంది. అమెరికాలో ఉల్లిపాయలు ఓ భయంకరమైన వ్యాధిని (Salmonella Outbreak) కలిగిస్తున్నాని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ(CDC) వెల్లడించింది. గత కొద్ది రోజులుగా అమెరికా, కెనడాలో (Canada) సాల్మొనెల్లా(ఫుడ్‌ పాయిజన్‌ కలిగించే బ్యాక్టీరియా) మహమ్మారి కేసులు ఎక్కువగా వెలుగు చేస్తున్నాయని సీడీసీ (Centers for Disease Control and Prevention) తెలిపింది.

GST on Sanitizers: శానిటైజ‌ర్ల‌పై 18 శాతం జీఎస్టీ ఎందుకంటే? అవి ఆల్కహాల్ ఉత్పత్తుల క్యాటగిరీలోకి వస్తాయట, ప్రకటనలో వివరించిన కేంద్ర ఆర్థిక శాఖ

Hazarath Reddy

ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజ‌ర్లు (Hand sanitizers) ఆల్క‌హాల్ ఉత్ప‌త్తుల క్యాట‌గిరీలోకి వ‌స్తాయ‌ని, అందుకే వాటిపై 18 శాతం జీఎస్టీ వ‌సూలు (18% GST on alcohol-based sanitizers) చేయ‌నున్న‌ట్లు అథారిటీ ఫ‌ర్ అడ్వాన్స్ రూలింగ్‌(AAR) పేర్కొన్న‌ది. గోవాకు చెందిన స్ప్రింగ్‌ఫీల్డ్ ఇండియా డిస్టిల్ల‌రీస్ వేసిన పిటిష‌న్‌పై ఏఏఆర్ (GST-Authority for Advance Rulings (AAR) ఈ స్ప‌ష్ట‌త‌నిచ్చింది. అయితే ఈ జీఎస్టీ ఎందుకంటే.. శానిటైజర్లు అన్నవి.. సబ్బులు, యాంటీ బ్యాక్టీరియల్‌ ద్రావకాలు, డెట్టాల్‌ మాదిరే ఇన్ఫెక్షన్‌ కారకాలను నిర్మూలించేవని, కనుక వీటిపై 18 శాతం జీఎస్‌టీ అమలవుతుందని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.

COVID19 Kit: తెలంగాణలో ఇంటి వద్దకే కరోనా కిట్, హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి ప్రభుత్వం తరఫున ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ

Team Latestly

ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు సమీప ప్రభుత్వ వైద్యశాల నుంచి ఐసొలేషన్‌ కిట్‌ ను నేరుగా సిబ్బంది ఇంటికెళ్లి అందజేస్తుంది. ఇంట్లో ఒకరి కంటే ఎక్కువ మంది ఉన్నా కూడా బాధితులందరికీ కిట్లను ఇస్తారు...

Advertisement

Unknown Pneumonia Alert: మరో కొత్త వైరస్ బాంబును పేల్చిన చైనా, అంతుచిక్కని వైరస్‌తో న్యుమోనియా సోకి కజకిస్థాన్‌లో వందలాది మంది మృత్యువాత, జాగ్రత్తగా ఉండాలని చైనీయులకు డ్రాగన్ కంట్రీ హెచ్చరిక

Hazarath Reddy

ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ (unknown pneumonia) విలమతాండవం చేస్తున్న నేపథ్యంలో తాజాగా మరో కొత్త వైరస్ ప్రపంచాన్ని భయపెడుతోంది. చైనా సరిహద్దు దేశం కజకిస్థాన్‌లో (Kazakhstan) అంతుపట్టని వ్యాధితో వందలాది మంది మృత్యువాత పడుతున్నందున జాగ్రత్తగా ఉండాలని చైనా ప్రజలను హెచ్చరించింది. గుర్తుతెలియని వైరస్‌ సోకి న్యుమోనియాతో (pneumonia) గత నెలలో దాదాపు 600 మంది మరణించినట్లు వెల్లడించింది. కోవిడ్‌-19 కంటే అత్యంత ప్రమాదకరమైన ఈ వైరస్‌ వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆ దేశంలో నివసిస్తున్న చైనీయులను (China warns citizens) హెచ్చరించింది.

COVID-19 Vaccine: ఆగష్టు 15 లోపు కోవిడ్ వ్యాక్సిన్; మానవ ట్రయల్స్ పట్ల టెస్టింగ్ సెంటర్లకు ఐసీఎంఆర్ డెడ్‌లైన్ విధించడం పట్ల విమర్శలు, వివరణ ఇచ్చుకున్న కౌన్సిల్

Team Latestly

నికల్ ట్రయల్స్ ను వేగవంతం చేయమని ఐసీఎంఆర్ దేశంలోని నిర్ధేషిత ఆరోగ్య కేంద్రాలకు లేఖలు రాయడం పట్ల నిపుణుల నుంచి విమర్శలు వెలువెత్తాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి తేవడంలో అంతతొందరెందుకు...

COVID19 in India: భారత్‌లో 4 లక్షలు దాటిన కోవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో అత్యధికంగా 15,413 కేసులు నమోదు, కోవిడ్ చికిత్సకు 'ఫాబిఫ్లూ' ఔషధం సిద్ధం చేసిన గ్లెన్‌మార్క్ సంస్థ

Team Latestly

మరోవైపు, రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులతో భయాందోళనలో ఉన్న ప్రజలకు ఒక పెద్ద ఊరటనిచ్చేలా కోవిడ్‌-19 చికిత్సకు ఔషధం తయారు చేసినట్టు భారత్‌కు చెందిన గ్లెన్‌మార్క్‌ ఫార్మాసూటికల్‌ కంపెనీ ప్రకటించింది. ‘ఫవిపిరవర్‌’ అనే యాంటీ వైరల్‌ డ్రగ్ కరోనా‌ చికిత్సకు బాగా పనిచేస్తోందని, దీనిని ‘ఫాబిఫ్లూ’ అనే బ్రాండ్‌ పేరు‌తో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు ముంబైకి చెందిన గ్లెన్‌మార్క్‌ సంస్థ తెలిపింది.....

Happy Summer 2020: ఇకపై పగలు ఎక్కువ, రాత్రులు తక్కువ, హ్యాపీ సమ్మర్ సీజన్ 2020 వచ్చేసింది, జూన్ 21 నుంచి సెప్టెంబర్ 22 వరకు కొనసాగనున్న సమ్మర్ సీజన్

Hazarath Reddy

నాలుగు సమశీతోష్ణ సీజన్లలో వేసవి అనేది చాలా హాటెస్ట్ సీజన్ గా (Happy Summer 2020) చెప్పవచ్చు. ఇది (Summer Season) వసంత రుతువు తరువాత అలాగే శరదృతువు ముందు వస్తుంది. ఈ వేసవికాలంలో సూర్యోదయం, సూర్యాస్తమయంలో పలు మార్పులు సంభవిస్తాయి. రోజులు చాలా ఎక్కువ అనిపిస్తాయి. రాత్రులు తక్కువగానూ పగలు ఎక్కువగా ఉంటుంది. కాలం గడుస్తున్న కొద్ది పగలు తగ్గిపోయి రాత్రి ఎక్కువ అవుతుంది. కాగా వేసవి ప్రారంభ తేదీ (Happy Summer 2020 Dates) వాతావరణం, సంప్రదాయం మరియు సంస్కృతి ప్రకారం మారుతుంది. ఉత్తర అర్ధగోళంలో వేసవి ఉన్నప్పుడు, ఇది దక్షిణ అర్ధగోళంలో శీతాకాలంతో విరుద్ధంగా ఉంటుంది. ఈ సీజ్ జూన్ 21న ప్రారంభమై సెప్టెంబర్ 22 వరకు ఉంటుంది.

Advertisement

How to Clean Sofa: మీరు కూర్చునే సోఫాలో ఎన్నో హానికారక క్రిములకు నిలయం కావొచ్చు! సోఫాల శుభ్రతపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టండి, సోఫాలను ఈ విధంగా శుభ్రపరుచుకోండి

Team Latestly

రోజంతా ఎక్కువ సేపు గడిపేది, వర్క్ ఫ్రోమ్ హోమ్ చేస్తూ కొద్దిసేపు విశ్రాంతి తీసుకునేది, ఇంట్లో చిన్న పిల్లలుంటే ఆడుకునేది ఈ సోఫాలపైనే. ఈ లాక్డౌన్ విధించినప్పట్నించీ చాలా ఇళ్లలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ అంటూ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లలో సినిమాలను చూస్తూ సోఫాలకే...

Regulatory Farming Policy: ప్రజలు బలవర్ధకమైన ఆహారాన్ని తినాలి, అలాంటి పంటలనే రైతులు సాగుచేయటం అలవాటు చేసుకోవాలి: నియంత్రిత వ్యవసాయంపై సమీక్షలో సీఎం కేసీఆర్

Team Latestly

ప్రజలు ఏది పడితే అది తింటున్నారు తప్ప, బలవర్థకమైన ఆహారం తినడం లేదని, అలాంటి ఆహారాన్ని తినేలా ప్రోత్సహించాలని, అలాంటి పంటలు పండించాలని సిఎం చెప్పారు...

Tips to Live With COVID-19: వైరస్‌తో కలిసి ఎలా జీవించాలో పంచ సూత్రాలను విడుదల చేసిన భారత ప్రభుత్వం, ఈ చిట్కాలు పాటిస్తే వైరస్ సోకే ముప్పు నుంచి బయటపడొచ్చు

Team Latestly

జనజీవనం మళ్లీ సాధారణ స్థితికి దాదాపు వచ్చేయడంతో ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ ముప్పును తప్పించుకొని ఎలా బ్రతకడం నేర్చుకోవాలో చెబుతూ భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ కె. విజయ్ రాఘవన్‌ను ఉటంకిస్తూ ప్రభుత్వం ఐదు చిట్కాలను విడుదల చేసింది....

Heat wave in India: ఎండలు బాబోయ్ ఎండలు, మరో 3 రోజులు పాటు నిప్పుల వానలా ఎండ, ప్రజలెవరూ బయటికి రావొద్దని అధికారుల సూచన

Hazarath Reddy

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా మరో రెండు మూడు రోజులపాటు వేడిగాలులు (Heat waves in India), ఉక్కపోత కొనసాగుతాయని విశాఖ వాతావరణ కేంద్రం సోమవారం వెల్లడించింది. పలు చోట్ల నిప్పుల వానలా ఎండ (Heat waves) కాస్తుందని తెలిపింది. రాజస్థాన్‌ ఎడారి, మధ్యప్రదేశ్‌ ప్రాంతాల నుంచి వాయవ్య దిశగా వీస్తున్న వేడిగాలులతో కొన్ని రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయి ప్రజలను హడలెత్తిస్తున్నాయి.

Advertisement

Guidelines for Travelers: సోమవారం నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం, ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ

Team Latestly

నిబంధనల ప్రకారం ముందుగా ఎలాంటి కరోనా లక్షణాలను లేనివారినే ప్రయాణానికి అనుమతిస్తారు. అయినప్పటికీ ప్రయాణికులు వారివారి గమ్యస్థానాలకు చేరిన తర్వాత 14 రోజుల పాటు తమ ఇంట్లో లేదా మరెక్కడైనా తమ సొంత ఖర్చులతోనే స్వీయ నిర్బంధంలో ఉండాలి. ఈలోగా...

Heat Wave Warning: వడగాడ్పుల ముప్పు, ఈ నెల 25న రోహిణి కార్తె ప్రవేశం, ఈ మూడు రోజులు ఎండలతో జాగ్రత్తగా ఉండాలని తెలిపిన వాతావరణ శాఖ

Hazarath Reddy

రాష్ట్రంలో ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ (IMD) బుధవారం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో వడగాడ్పుల ముప్పు పొంచి ఉందని తెలిపింది. రాయలసీమతోపాటు కోస్తాంధ్రలోనూ ఎండలు భగ్గుమంటాయని (Heat Wave Warning) తెలిపింది. ఈ నెల 25వ తేదీ ఉదయం రోహిణి కార్తె ప్రవేశించనుంది.

Dental Procedures: డెంటల్ క్లినిక్స్‌పై కరోనా ప్రభావం, అత్యవసరమైతే తప్ప సాధారణ దంత చికిత్సలకు అనుమతి లేదు, లాక్‌డౌన్ 4లో దంత వైద్యానికి సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసిన వైద్య, ఆరోగ్య శాఖ

Team Latestly

కరోనావైరస్ వ్యాప్తి ప్రధానంగా నోరు, ముక్కు, కళ్లతో ముడిపడి ఉంటుంది కాబట్టి దంత పరీక్షలు నిర్వహించడం ద్వారా కోవిడ్-19 వ్యాప్తి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ తదుపరి మార్గదర్శకాలు జారీ చేసేవరకు అన్ని రకాల దంత చికిత్సలను వాయిదా వేయాలని....

Telangana COVID19 Status: తెలంగాణలో 69 శాతం కోలుకున్న కరోనా బాధితులు, యాక్టివ్ కేసుల సంఖ్య 4 వందల లోపే; లాక్డౌన్ సడలింపుల వల్ల మరింత అప్రమత్తంగా ఉండాలన్న వైద్య, ఆరోగ్య శాఖ

Team Latestly

లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన నేపధ్యంలో రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున వలస కార్మికులు, ప్రయాణీకులు వస్తున్నారు. మొదట విదేశాలనుండి వచ్చిన వారివల్ల, తరువాత మర్కజ్ తో వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరిగింది, ఇప్పుడు మైగ్రంట్స్ వల్ల ఆ ప్రమాదం ఉంది....

Advertisement
Advertisement