వైరల్

Kidney Racket Busted in Vizag: విశాఖలో కిడ్నీ అమ్మితే రూ. 8. 5 లక్షలు, నా కిడ్నీ అమ్మేశారంటూ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

విశాఖపట్నంలో కిడ్నీ రాకెట్ వ్యవహారం కలకలం సృష్టించింది. కిడ్నీ రాకెట్‌ ఘటనపై విశాఖ కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. ఈ దారుణానికి పాల్పడిన తిరుమల ఆసుపత్రి రిజిస్ట్రేషన్‌, అనుమతులపై ఆరా తీస్తున్నారు.

Hyd Students Dies in US: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు హైదరాబాద్ విద్యార్థులు మృతి, స్వదేశానికి మృతదేహాలను తీసుకురాలేక అక్కడే సమాధి చేసిన సామాజిక కార్యకర్తలు

Hazarath Reddy

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.ఈ నెల 24న ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జాన్స్ బర్గ్ హైవేపై వెళుతున్న కారు అదుపుతప్పి ఓ ట్రాక్టర్ ట్రెయిలర్ పైకి దూసుకుపోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది.

BKU Farmer Movement Removed: మళ్లీ ఇంకోకటి, బీకేయూ రైతు ఉద్యమాలను 12వ తరగతి పుస్తకాల నుండి తొలగించిన కేంద్రం, మండిపడిన రాకేశ్‌ టికాయిత్‌

Hazarath Reddy

ఇప్పటికే మొఘల్ సామ్రాజ్యం, డార్విన్ జీవ పరిణామ సిద్దాంతాలను పాఠ్యాంశాల నుండి తొలగించిన కేంద్రం తాజాగా 1980వ దశకంలో భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) రైతు ఉద్యమాలకు సంబంధించిన అంశాలను 12వ తరగతి రాజనీతిశాస్త్ర పాఠ్య పుస్తకం నుంచి తొలగించింది. దీనిపై ప్రముఖ రైతు ఉద్యమకారుడు రాకేశ్‌ టికాయిత్‌ ధ్వజమెత్తారు.

Sanju Samson: అభిమానికి వచ్చిన కాల్‌ లిఫ్ట్ చేసి మాట్లాడిన రాజస్థాన్ కెప్టెన్, ఫ్యాన్స్‌తో సెల్ఫీలు తీసుకుంటుండగా ఆసక్తికర ఘటన

VNS

ఐపీఎల్‌లో (IPL) హోరాహోరీగా ఆడుతున్న క్రికెటర్లు..అప్పుడప్పుడు ఫ్యాన్స్‌తో చిల్ అవుతున్నారు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals), చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో అభిమానులతో సెల్ఫీలు దిగాడు రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson). ఆయనకు ఫ్యాన్స్‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

Advertisement

Fish Prasadam Distribution: చేప ప్రసాదం పంపిణీ మళ్లీ ప్రారంభం, జూన్‌ 9 ఉదయం 8 గంటల నుంచి జూన్‌ 10వ తేదీ ఉదయం 8 గంటల వరకు ఉచితంగా పంపిణీ

Hazarath Reddy

కరోనా వైరస్ కారణంగా మూడేళ్లపాటు నిలిచిపోయిన చేప ప్రసాదం పంపిణీని ఈ ఏడాది తిరిగి ప్రారంభిస్తున్నట్లు బత్తిని మృగశిర ట్రస్ట్‌ ప్రతినిధులు, బత్తిని కుటుంబసభ్యులు తెలిపారు.

Temple for Samantha: సమంత కోసం గుడి కడుతున్న వీరాభిమాని, సమంత వ్యాధి నుంచి కోలుకున్నందుకు మొక్కుబడి యాత్ర కూడా పూర్తి

Hazarath Reddy

గతేడాది మయోసైటిస్ వ్యాధి బారిన పడి ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీ అవుతున్న స్టార్ హీరోయిన్‌ సమంతకు ఫ్యాన్ గుడి కట్టిస్తున్నారు. ఏపీలోని బాపట్ల జిల్లా ఆలపాడుకు చెందిన సందీప్ సమంత బర్త్‌డేకు వినూత్నంగా గిఫ్ట్ ఇవ్వనున్నాడు.

AP Inter Result 2023: మే 24 నుంచి జూన్ 1 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు, రీవెరిఫికేషన్ కి మే 6 లోపు అప్లై చేసుకోవాలని తెలిపిన మంత్రి బొత్స

Hazarath Reddy

ఏపీలో ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులతో కలిసి ఫలితాలను విడుదల చేశారు. ఒకేసారి ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు విడుదల చేశారు. విద్యాశాఖ కేవలం 22 రోజుల వ్యవధిలో ఫలితాలు విడుదల చేసింది.

Chhattisgarh Naxal Attack: 2009 నుంచి నేటి దాకా ఛత్తీస్‌గఢ్‌‌లో నక్సల్స్ దాడి లిస్ట్ ఇదిగో, వందల మంది జవాన్లు మృతి, పూర్తి సమాచారంపై ఓ లుక్కేయండి

Hazarath Reddy

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని బస్తర్‌ జిల్లాలో మావోయిస్టులు (Maoists) ఘాతుకానికి పాల్పడ్డారు. దంతేవాడలో పోలీసుల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మందుపాతరతో పేలుడు జరిపారు. ఈ ఘటనలో 10 మంది పోలీసులు, డ్రైవర్‌ ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

Chhattisgarh Naxal Attack: మావోయిస్టులను ఏరిపారేయండి, సీఎం బఘేల్‌తో మాట్లాడిన హోం మంత్రి అమిత్ షా, కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందని వెల్లడి

Hazarath Reddy

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని బస్తర్‌ జిల్లాలో మావోయిస్టులు (Maoists) ఘాతుకానికి పాల్పడ్డారు. దంతేవాడలో పోలీసుల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మందుపాతరతో పేలుడు జరిపారు. ఈ ఘటనలో 10 మంది పోలీసులు, డ్రైవర్‌ ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించిన దృశ్యాలు భీతావహంగా ఉన్నాయి.

Chhattisgarh Blast: దంతెవాడలో పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు బాంబు దాడి, 10 మంది పోలీసులు మృతి, మార్గం మధ్యలో ఐఈడీని అమర్చిన నక్సల్స్‌

Hazarath Reddy

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో మావోయిస్టులు జరిపిన పేలుడులో పది మంది పోలీసులు, ఒక పౌరుడు మృతి చెందారని అధికారులు తెలిపారు. దంతేవాడ జిల్లాలోని అరన్‌పూర్ సమీపంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనంపై IED దాడి జరిగింది. ప్రాథమిక నివేదికల ప్రకారం ఐఈడీని నక్సల్స్‌ అమర్చారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Madhya Pradesh: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో దారుణం, ముగ్గురు చిన్నారులను బావిలో పడేసిన తల్లి, తను కూడా అదే బావిలో దూకి ఆత్మహత్య

Hazarath Reddy

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో దారుణ ఘ‌ట‌న జ‌రిగింది.ధార్ జిల్లాలోని ఒక బావిలో 2 మరియు 6 సంవత్సరాల మధ్య వయస్సు గల ముగ్గురు సోదరీమణుల మృతదేహాలు కనుగొన్నారు, వారి తల్లి కనిపించలేదని బుధవారం పోలీసులు తెలిపారు.

World Cup 2023: ప్రపంచకప్‌కు రిషబ్ పంత్ దూరం, రేసులో ఉన్న వికెట్ కీపర్లు వీళ్లే, భారత వికెట్ కీపర్‌గా ఎవరు ఉండాలనుకుంటున్నారు మరి

Hazarath Reddy

గతేడాది కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మెల్లగా కోలుకుంటున్న టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆరోగ్యంపై తాజాగా ఓ అప్ డేట్ వచ్చింది. పంత్ పూర్తిగా కోలుకోవడానికి మరో 9 నెలలు పట్టవచ్చని తెలుస్తోంది. అప్పటికి పంత్ కోలుకుంటే చాలా త్వరగా కోలుకున్నట్టేనని వైద్యులు చెబుతున్నారు

Advertisement

WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత వికెట్ కీపర్‌గా విశాఖ కుర్రాడు భరత్, రిషబ్ పంత్ స్థానంలో ఎన్నికైన కె.ఎస్‌.భరత్‌

Hazarath Reddy

భారత క్రికెట్ బోర్డు (BCCI) ఏప్రిల్ 25, మంగళవారం నాడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న WTC ఫైనల్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. అజింక్య రహానే జట్టులోకి తిరిగి రాగా, కేఎస్ భరత్ నిర్ణీత వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు.

IPL 2023: రోహిత్ శర్మ నీవు ఫామ్‌లో లేవు, ఇక విరామం తీసుకుని మళ్లీ ఫ్రెష్షుగా రా, ముంబై ఇండియన్స్ కెప్టెన్ కు సూచించిన సునీల్ గవాస్కర్

Hazarath Reddy

ఐపీఎల్‌-2023 సీజన్‌లో ముంబై పేలవ ఫామ్ కొనసాగిస్తోంది. ప్రస్తుత సీజన్‌లో ముంబై ఏడు మ్యాచ్ లు ఆడగా మూడు మ్యాచ్ ల్లో మాత్రమే విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ సారధి రోహిత్‌ శర్మపై భారత మాజీ కెప్టెన్ సునీల్‌ గవాస్కర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

48 Drugs Fail Latest Quality Test: ఈ మందులతో జాగ్రత్త, మెడికల్ క్వాలిటీ టెస్ట్‌లో 48 రకాల మందులు విఫలమైనట్లు తెలిపిన CDSCO

Hazarath Reddy

సాధారణంగా ఉపయోగించే 48 మందులు క్లినికల్ క్వాలిటీ పరీక్షల్లో విఫలమయ్యాయి. కాల్షియం, ఫోలిక్ యాసిడ్, మల్టీవిటమిన్స్, యాంటీబయాటిక్స్, యాంటీ డయాబెటిక్, కార్డియోవాస్కులర్ మందులు ఇటీవల నాణ్యత పరీక్షలో విఫలమయ్యాయి.

Karnataka Polls 2023: వీడియో ఇదిగో, ఒకరిపై ఒకరు చేయి వేసుకుంటూ సరదాగా.. సీఎం బసవరాజు బొమ్మైతో కాంగ్రెస్ మాజీ సీఎం సిద్దరామయ్య కబుర్లు

Hazarath Reddy

కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య బెలగావి విమానాశ్రయంలో సిఎం బసవరాజ్ బొమ్మైని కలిశారు. ఇద్దరు ఒకరిపై ఒకరు చేయి వేసుకుని సరదాగా గడిపారు. ఎన్నికల వేళ వీరిద్దరూ ఇలా సరదాగా గడపడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..

Advertisement

Skill-Lync Layoffs: ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న మరో కంపెనీ, దూసుకొస్తున్న ఆర్థిక మాంధ్య భయాలతో ఉద్యోగులను తీసేస్తున్న ఎడ్‌టెక్ స్టార్టప్ స్కిల్-లింక్

Hazarath Reddy

ప్రపంచ స్థూల ఆర్థిక పరిస్థితుల మధ్య చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో కార్యకలాపాలను ఏకీకృతం చేసే పనిలో భాగంగా చెన్నైకి చెందిన ఎడ్‌టెక్ స్టార్టప్ స్కిల్-లింక్ ఉద్యోగులను తొలగించింది. ప్రస్తుతం కంపెనీలో 400 మంది దాకా ఉద్యోగులు ఉన్నారు.

Chandrababu Praises PM Modi: బీజేపీతో పొత్తుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, మోదీ విజన్ సూపర్ అంటూ ప్రశంసలు, రిపబ్లిక్ చర్చలో టీడీపీ అధినేత ఇంకా ఏమన్నారంటే..

Hazarath Reddy

జాతీయ మీడియా న్యూస్ ఛానల్స్‌ రిపబ్లిక్ టీవీ నిర్వహించిన చర్చా వేదికలో (Republic Summit) పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandra Babu) మోదీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఎన్ చంద్రబాబు నాయుడు బహిరంగంగానే గట్టిగా సమర్థించారు.

Aadhaar For Resident Foreigners: విదేశాల్లో ఉన్న భారతీయులు ఆధార్ కార్డుకు అర్హులే, సంవత్సరంలో 182 రోజులు ఇండియాలో ఉంటే చాలు

Hazarath Reddy

ఇండియా నివాసి అయి ఉన్న విదేశీయులు ఇప్పుడు ఆధార్ కార్డు పొందవచ్చు. దరఖాస్తు చేసిన తేదీ నుండి గత 12 నెలల్లో 182 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం భారతదేశంలో గడిపితే వీరు ఆధార్‌ కార్డుకు అర్హులు అని కేంద్రం ప్రకటించింది.

WhatsApp New Feature: వాట్సాప్ కొత్త ఫీచర్, ఒకే ఫోన్‌ నంబర్‌తో నాలుగు ఫోన్లలో వాట్సాప్‌ ఖాతాలు ఓపెన్ చేసుకోవచ్చు

Hazarath Reddy

వాట్సాప్‌ సరికొత్త ఫీచర్‌ను ప్రకటించింది. ఇకపై ఒకే ఫోన్‌ నంబర్‌తో నాలుగు ఫోన్లలో వాట్సాప్‌ ఖాతాను వినియోగించుకోవచ్చని వెల్లడించింది. ఇప్పటివరకు వాట్సాప్‌ అకౌంట్‌ను ఒక ఫోన్‌లో మాత్రమే యూజ్‌ చేసుకొనేందుకు అవకాశం ఉన్నది.

Advertisement
Advertisement