రాష్ట్రీయం

Ganesh Visarjan 2024: చార్మినార్ వద్ద బురఖాతో యువతి, అసలు నిజం ఇదిగో, తల్లిదండ్రుల చూస్తారనే భయంతో బుర్ఖా ధరించి చార్మినార్ వద్దకు వచ్చిన హిందూ అమ్మాయి

Hazarath Reddy

మీడియా, సోషల్ మీడియా ద్వారా వ్యాపించిన విద్వేషానికి గురైన యువతి, యువకుడును హైదరాబాద్ పోలీసులు రక్షించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా ఒక హిందూ అమ్మాయి చార్మినార్ వద్దకు వచ్చింది, తల్లిదండ్రుల చూస్తారనే భయంతో బుర్ఖా ధరించి హిందూ అబ్బాయితో కలిసి వచ్చింది

Telangana High Court On BRS Office: బీఆర్ఎస్‌కు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు, నల్గొండ బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చాల్సిందేనని ఆదేశాలు, ఫైన్ కూడా విధించిన న్యాయస్థానం

Arun Charagonda

నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూల్చాల్సిందేనని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్రమ నిర్మాణం కావడంతో అధికారులు నోటీసులు ఇవ్వగా దీనిని సవాల్ చేస్తూ క్రమబద్దీకరణకు అవకాశం ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ నేతలు.

AP New Liquor Policy: గీతకార్మికులకు మద్యం దుకాణాల కేటాయింపులో 10శాతం రిజర్వేషన్లు, గుడ్ న్యూస్ అందించిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

ఏపీ గీత కార్మికులకు (Geetha workers) ప్రభుత్వం గుడ్‌న్యూస్‌(Good News) చెప్పింది. రాబోయే మద్యం నూతన పాలసీ (New Policy) లో గీతకార్మికులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు మంత్రి వర్గ సబ్‌ కమిటీ వెల్లడించింది.

Vijayawada Floods: విజయవాడ వరద బాధితులకు ప్రతి ఇంటికి రూ. 25 వేలు పరిహారం, చంద్రబాబు ప్రకటించిన పరిహారం పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

విజయవాడలో వరదలకు పూర్తిగా నష్టపోయిన ప్రతి ఇంటికి రూ.25 వేలు, మొదటి అంతస్తులో ఉండేవారికి రూ.10 వేలు, ఇళ్లల్లో నీళ్లు వచ్చిన బాధితులకు రూ. 10 వేలు, చిరువ్యాపారులకు రూ. 25 వేలు అందజేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

Advertisement

IPS Trainees To Telugu States: ఏపీ, తెలంగాణకు ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయించిన కేంద్రం, లిస్ట్ ఇదే!

Arun Charagonda

తెలుగు రాష్ట్రాలకు ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయించింది కేంద్రం. ఏపీకి దీక్ష (హరియాణా), బొడ్డు హేమంత్ (ఏపీ), మనీశా వంగల రెడ్డి (ఏపీ), సుస్మిత (తమిళనాడు) కేటాయించగా తెలంగాణాకు మనన్ భట్ (జమ్ము కశ్మీర్), సాయి కిరణ్‌ (తెలంగాణ), రుత్విక్ సాయి కొట్టే (తెలంగాణ), యాదవ్ వసుంధర (ఉత్తర్ ప్రదేశ్‌)ను కేటాయించింది.

CM Revanth Reddy: ఎంఎస్‌ఎమ్‌ఈ పాలసీని విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, హాజరైన మంత్రులు..వీడియో ఇదిగో

Arun Charagonda

హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో MSME పాలసీ-2024 ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. సీఎం రేవంత్‌ రెడ్డి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నూతన విధానాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Ayodhya Ram Temple: అయోధ్య బాలరాముడికి కేజీ బంగారం, 13 కిలోల వెండితో ధనస్సు, భద్రాచలంలో ప్రత్యేక పూజలు చేయించిన తెలంగాణ భక్తులు

Arun Charagonda

అయోధ్య రాముడికి 13 కిలోల వెండి, ఒక కేజీ బంగారం తో తయారుచేసిన ధనస్సును గిఫ్ట్‌గా అందించనున్నారు తెలంగాణకు చెందిన భక్తుడు చల్లా శ్రీనివాసరావు. ఈ ధనస్సుకు దేశ వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో పూజలు చేస్తున్న క్రమంలో ఇవాళ భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో పూజలు నిర్వహించారు

Andhra Pradesh Shocker: ఏలూరులో దారుణం, విద్యార్థినులపై వార్డెన్ భర్త లైంగిక దాడి, ఫోటో షూట్‌ పేరుతో బయటకు తీసుకెళ్లి లైంగిక దాడి..విద్యార్థినుల ఆందోళన

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు స్వామి దయానంద సరస్వతి హాస్టల్‌లో దారుణం చోటు చేసుకుంది. ఫోటోషూట్ పేరుతో విద్యార్థినులను బయటకు తీసుకెళ్లి హాస్టల్ వార్డెన్ ఫణిశ్రీ భర్త శశికుమార్ లైంగికదాడికి పాల్పడ్డాడని విద్యార్థినులు ఆందోళన బాట పట్టారు. కాళ్లు, చేతులు కట్టేసి అత్యాచారాలకు పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Stray Dog ​​Attack: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై వీధి కుక్క దాడి, తీవ్ర గాయాలు..సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు..

Arun Charagonda

కడప జిల్లా కమలాపురంలో నాయి బ్రహ్మణ కాలనీలో కలకలం చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారిపై వీధి కుక్క దాడి చేసింది. ఈ దాడిలో చిన్నారికి గాయలు కాగా సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.

KTR on CM Revanth Reddy: ఢిల్లీ బాసుల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు విమానాలు ఎక్కే ప‌నిలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ, సెటైర్ వేసిన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కంప్యూట‌ర్ల‌ను క‌నిపెట్ట‌డం, మ‌ళ్లీ వాటిని ఆవిష్క‌రించ‌డంలో సీఎం బిజీగా ఉన్నార‌ని పేర్కొన్నారు. దీంతో పాటు ఢిల్లీ బాసుల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు విమానాలు ఎక్కే ప‌నిలో నిమ‌గ్న‌మై ఉన్నార‌ని కేటీఆర్ విమ‌ర్శించారు.

New Liquor Policy in AP: ఏపీలో లాటరీ ద్వారా మద్యం షాపుల లైసెన్సులు కేటాయింపు, ముందుగా 3,396 దుకాణాలు నోటిఫై, కీలక నిర్ణయం దిశగా ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 కంటే ముందున్న మద్యం విధానాన్నేచంద్రబాబు సర్కారు తిరిగి ప్రవేశపెట్టనునుంది. ఈ కొత్త పాలసీ ద్వారా (New Liquor Policy in AP) మద్యం రిటైల్‌ వ్యాపారం (Retail liquor outlets) మొత్తం ప్రైవేటుకే అప్పగించనున్నారు.

Clash In Jagtial BJP: జగిత్యాల బీజేపీలో వర్గపోరు, వినాయక నిమజ్జనం సందర్భంగా కొట్టుకున్న బీజేపీ నేతలు..వీడియో ఇదిగో

Arun Charagonda

జగిత్యాల జిల్లా బీజేపీలో మరోసారి వర్గపోరు భగ్గుమంది. మంగళవారం వినాయక నిమజ్జనం సందర్భంగా జగిత్యాలలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి భోగ శ్రావణికి నిమజ్జన కార్యక్రమంలో చేదు అనుభవం ఎదురైంది. శ్రావణిని అడ్డుకున్నారు బీజేపీ నేత ముదుగంటి రవీందర్ రెడ్డి. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది

Advertisement

Ganesh Visarjan 2024: రెండవ రోజు కొనసాగుతున్న గణేష్‌ వి​గ్రహాల నిమజ్జనం, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కాకుండా రోడ్‌ను క్లియర్ చేస్తున్న పోలీసులు, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

హైదరాబాద్‌లో గణేష్‌ వి​గ్రహాల నిమజ్జనం కార్యక్రమం రెండో రోజు కొనసాగుతోంది. నిమజ్జనం కోసం హుస్సేన్‌సాగర్‌ వద్దకు వేలాదిగా విగ్రహాలు తరలి వస్తున్నాయి. ఇప్పటికే విగ్రహాలు నిమజ్జనం కోసం క్యూలోనే ఉన్నాయి. పెద్ద విగ్రహాలు సైతం ఇంకా నిమజ్జనం కాలేదు.

Andhra Pradesh: రోగికి అదుర్స్ సినిమా చూపిస్తూ అరుదైన సర్జరీ చేసిన వైద్యులు, మత్తు ఇవ్వకుండానే మెదడులోని కణితి తొలగింపు, కాకినాడ జీజీహెచ్ డాక్టర్ల అద్భుతం...

Arun Charagonda

కాకినాడలోని సర్వజన ఆసుపత్రి లో అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. రోగి తన చేతులతో ట్యాబ్‌ పట్టుకుని సినిమా చూస్తూ ఉండగానే డాక్టర్లు ఆమె తలలోని కణితిని విజయవంతంగా తొలగించారు.

Ganesh Visarjan 2024: వీడియో ఇదిగో, డ్రోన్‌తో బాల గణపతి విగ్రహం నిమజ్జనం, పోలీసులు అనుమతించకపోవడంతో కొత్తగా ఆలోచించిన కడియపు లంక చిన్నారులు

Hazarath Reddy

తూర్పుగోదావరి జిల్లాలో డ్రోన్‌తో బాల గణపతి విగ్రహ నిమజ్జనం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జిల్లాలోని కడియం మండలం కడియపు లంక గ్రామంలో పలువురు చిన్నారులు బాల గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి తొమ్మిది రోజుల పాటు పూజలు చేశారు.

Telangana Arogya Mithras Strike: తెలంగాణలో సమ్మెకు దిగిన ఆరోగ్య మిత్ర సిబ్బంది, డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్లుగా గుర్తించాలని డిమాండ్

Arun Charagonda

తెలంగాణలో ఆరోగ్యశ్రీ సిబ్బంది సమ్మెకు దిగారు. ఆరోగ్యమిత్రలను డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అలాగే జీవో నెం. 60 ప్రకారం నెలకు రూ.22,750 వేతనం చెల్లించాలని, ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరిస్తే వెంటనే విధుల్లో చేరుతామని తెలిపారు.

Advertisement

Bengaluru Shocker: వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద నగ్నంగా శత్రువును పరిగెత్తించిన రౌడీ షీటర్, అరెస్ట్ చేసిన బెంగుళూరు పోలీసులు

Hazarath Reddy

కడుబు అనే పేరుమోసిన రౌడీ షీటర్ అయిన పవన్ గౌడను ఈ తెల్లవారుజామున బెంగళూరు సిటీ పోలీసులు పారిపోయే ప్రయత్నంలో కాల్చారు. ఇటీవల తన ప్రత్యర్థిని నగ్నంగా చేసి వీధుల్లో పరుగెత్తించండంతో పాటుగా గౌడ పలు నేరాలకు పాల్పడ్డాడు.

Andhra Pradesh: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కొట్టుకున్న ఇరువర్గాలు, 17 మందికి గాయాలు, అడ్డుకున్న కానిస్టేబుల్‌పై దాడి...వీడియో

Arun Charagonda

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో పాత కక్షలు భగ్గుమన్నాయి. క్రిస్టియన్ పేటలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరుగగా 17 మందికి గాయాలు అయ్యాయి. అడ్డుకోవటానికి వెళ్ళిన కానిస్టేబుల్ మీద దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

New UPI Fraud: కొత్త తరహా యూపీఐ మోసం, పొరపాటున యూపీఐకి డబ్బు వచ్చిందని మెస్సేజ్, తిరిగి పంపించామో అంతే..పోలీసుల అలర్ట్

Arun Charagonda

రోజురోజుకు సైబర్ కేటుగాళ్లు పంజా విసరుతునే ఉన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి ఏదో రూపంలో క్రైమ్‌కు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా కొత్త తరహా యూపీఐ మోసానికి తెరలేపారు. పొరపాటున గూగుల్ పే కి కొంత డబ్బు వచ్చిందంటూ అమౌంట్ నంబర్ తో కూడిన మెసేజ్ పంపిస్తారు.

Hyderabad Ganesh Immersion: లక్షకు పైగా గణనాథులను నిమజ్జనం చేసినట్లు ప్రకటించిన జీహెచ్‌ఎంసీ, అత్యధికంగా మూసాపేట ఐడీఎల్ చెరువులోనని వెల్లడి, ప్రశాంతంగా సాగుతున్న గణేష్ నిమజ్జనం

Arun Charagonda

తెలంగాణలోని జంట నగరాలైన సికింద్రాబాద్ - హైదరాబాద్‌లో వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం వరకు గణేష్ నిమజ్జన కార్యక్రమం పూర్తి కానుంది. ఇక ఇప్పటివరకు 1లక్ష 2510 గణనాధులను నిమజ్జనం చేసినట్లు ప్రకటించారు జీహెచ్‌ఎంసీ అధికారులు.

Advertisement
Advertisement