రాష్ట్రీయం

Skill Development Scam Case: చంద్రబాబుకు రెండు కోర్టుల్లో చుక్కెదురు, బాబు పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు, బెయిల్, కస్టడీ పిటిషన్ల విచారణను అక్టోబర్ 5కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు

Hazarath Reddy

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి జెల్లో రిమాండ్ ఖైదీగా టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్న సంగతి విదితమే. తాజాగా ఆయన బెయిల్ పిటిషన్ కోసం ఏసీబీ కోర్టులో దరఖాస్తు చేసుకున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో చంద్రబాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పొడిగింపు పిటిషన్ లపై విచారణను ఏసీబీ కోర్టు అక్టోబర్ 5వ తేదీకి వాయిదా వేసింది.

TSPSC Group-1 Prelim Exam: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష మళ్లీ నిర్వహించండి, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థంచిన తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌

Hazarath Reddy

తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సమర్ధించింది. ప్రిలిమ్స్ రద్దును సవాల్‌ చేస్తూ ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

Amaravati Inner Ring Road Case: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసు, హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన నారా లోకేష్‌

Hazarath Reddy

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం కేసులో తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న లోకేష్‌ తరపున న్యాయవాదులు హైకోర్టులో ఈ పిటిషన్‌ వేసినట్లు తెలుస్తోంది

Skill Development Scam Case: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వచ్చే వారానికి వాయిదా, పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు విముఖత చూపిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టి

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీపై సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది. పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టి విముఖత చూపించారు.ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో (Supreme court) చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ వచ్చే వారానికి వాయిదా వేస్తూ సుప్రీంకోర్ట్ నిర్ణయం తీసుకుంది

Advertisement

Chandrababu Arrest Row: వీడియో ఇదిగో, చంద్రబాబు త్వరగా బయటకు రావాలంటూ చర్చిలో ప్రార్థనలు చేసిన నారా భువనేశ్వరి, బ్రాహ్మణి

Hazarath Reddy

రాజమండ్రి లూధరన్ చర్చిలో నారా భువనేశ్వరి, బ్రాహ్మణి బుధవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చంద్రబాబు ఏ తప్పు చేయలేదని, దేవుడి దీవెనలు, ఆశీస్సులతో ఆయన త్వరలోనే బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వీడియో ఇదిగో..

Road Accident Video: షాకింగ్ వీడియో షేర్ చేసిన వీసీ సజ్జనార్, సరదా కోసం స్కిట్లు చేస్తే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి జాగ్రత్త అంటూ హెచ్చరిక

Hazarath Reddy

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఎండిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సజ్జనార్ రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణపై అధికారులకు ఆదేశాలను జారీ చేయడంతో పాటు ఆయన కూడా ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు.

TS TET Result 2023 Out: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET 2023) ఫలితాల విడుదలయ్యాయి.. బుధవారం ఉదయం 10 గంటలకు ఈ ఫలితాలను టెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి విడుదల చేశారు.ఫలితాలు వెబ్‌సైట్‌లో https://tstet2023results.cgg.gov.in/tstet2023pkgr1510.results అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

Andhra Pradesh: గుంటూరు నుంచి తిరుపతికి హెలీకాప్టర్ ద్వారా గుండె తరలింపు, ఓ వ్యక్తి ప్రాణం నిలిపేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్న సీఎం వైఎస్ జగన్

Hazarath Reddy

ఓ వ్యక్తి ప్రాణం నిలిపేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గుంటూరులో ప్రమాదవశాత్తూ బ్రెయిన్ డెడ్ అయిన 18 ఏళ్ల కట్టా కృష్ణ అనే యువకుడి అవయవాలు దానం చేసేందుకు అతని కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు.

Advertisement

Telangana Assembly Elections 2023: రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు, మహేశ్వరం టికెట్ కోసం రూ. 10 కోట్లతో పాటు 5 ఎకరాల భూమి తన పేర రాయించుకున్నాడని అంటున్న కొత్త మనోహర్ రెడ్డి

Hazarath Reddy

మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం రేవంత్ రెడ్డి బడంగ్‌పేట మేయర్ చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి వద్ద 10 కోట్లు తీసుకొని 5 ఎకరాల భూమి రాయించుకున్నాడు అంటూ కాంగ్రెస్ పార్టీ నేత కొత్త మనోహర్ రెడ్డి మీడియా సాక్షిగా చెప్పారు. ఈ విషయం సీనియర్ నాయకుడు వీ. హనుమంత రావు సైతం చెప్పారని.. సమయం వచ్చినపుడు అన్ని సాక్ష్యాలతో బైట పెడతా అంటున్న మనోహర్ రెడ్డి.

KCR Health Update: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అస్వస్థత, వారం రోజులుగా వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్న కేసీఆర్, ప్రత్యేక వైద్యబృందంతో చికిత్స

VNS

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) స్వల్ప అస్వస్థతకు (Fever) గురయ్యారు. కేసీఆర్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రగతి భవన్ లోనే కేసీఆర్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. యశోద ఆసుపత్రి వైద్య బృందం పర్యవేక్షణలో ఆయన ఉన్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్ (CM KCR Illness) కోలుకుంటారు వైద్యులు తెలిపారు.

Nara Lokesh: ఢిల్లీ వచ్చి అరెస్టు చేసే సత్తా లేని చెత్త కేసు నాపై పెట్టించాడు, యువగళం పేరు వింటేనే సైకో జగన్ గజగజలాడుతున్నారన్న నారా లోకేశ్

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ యువనేత నారా లోకేశ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యువగళం పేరు వింటేనే సైకో జగన్ గజగజలాడుతున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు. తన పాదయాత్ర ప్రారంభం కాకూడదని జీవో 1 తెచ్చినా... యువగళం ఆగలేదని, జనగళమై గర్జించిందని అన్నారు.

AP Assembly Session 2023 Day 4: అసెంబ్లీలో ఫైబర్‌ నెట్‌ స్కామ్‌పై చర్చ, చంద్రబాబు హయాంలో రూ. 114 కోట్లు కొట్టేశారని తెలిపిన మంత్రి గుడివాడ అమరనాథ్

Hazarath Reddy

అసెంబ్లీలో ఫైబర్‌ నెట్‌ స్కామ్‌పై చర్చ సందర్భంగా మంత్రి గుడివాడ అమరనాథ్ మాట్లాడుతూ..చంద్రబాబు హయాంలో ఏపీ ఫైబర్‌ నెట్‌ స్కామ్‌లో రూ. 114 కోట్లు కొట్టేశారని తెలిపారు.

Advertisement

Telangana: సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా కానుక, 2023 కంపెనీ లాభాల్లో కార్మికులకు 32శాతం వాటా చెల్లించేలా కీలక ఆదేశాలు

Hazarath Reddy

సింగరేణి కార్మికులు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంస్థ సాధించిన లాభాల్లో 32శాతం వాటా చెల్లించేందుకు నిర్ణయించిన సీఎం కేసీఆర్‌.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి రూ.2,222 కోట్ల రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది.

CM Jagan in Action: వై నాట్ 175తో పాటుగా జగన్ మరో కొత్త వ్యూహం, వై ఏపీ నీడ్స్‌ జగన్‌ స్లోగన్‌తో ప్రజల్లోకి వెళ్లాలని నేతలకు, కార్యకర్తలకు పిలుపు

Hazarath Reddy

ఏపీలో వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు 175 సీట్లు గెలవాలనే లక్ష్యంతో పని చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి పార్టీ నేతలకు సూచించారు

Kodali Nani on Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్‌పై కొడాలి నాని సెటైర్ల వీడియో ఇదిగో, కొట్టండి, జైల్లో పెట్టండి, నిరూపించండి అన్న లోకేష్‌ ఎక్కడ అంటూ సెటైర్లు

Hazarath Reddy

లోకేష్‌ మా పేర్లు రెడ్‌బుక్‌లో రాస్తున్నాడని.. మేము లోకేష్‌ పేరు చిత్తు కాగితాల్లో కూడా రాయమని మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. కొట్టండి, జైల్లో పెట్టండి, నిరూపించడండి అన్న లోకేష్‌.. ఇప్పుడు బెయిల్‌ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడని దుయ్యబట్టారు

Andhra Pradesh: వీడియో ఇదిగో, భార్యపై బ్లేడుతో దాడి చేసిన భర్త, ప్రాణాలను పణంగా పెట్టి మహిళ‌ను కాపాడిన కానిస్టేబుల్

Hazarath Reddy

ఏలూరు శివారులోని వట్లూరు రైల్వే ట్రాక్ పై ఒక యువకుడు తన భార్యను బ్లేడ్ తో దాడి చేస్తున్నాడు. సమాచారం తెలుసుకున్న సదరు కానిస్టేబుల్ రైల్వే ట్రాక్ పైకి వెళ్లి చాకచక్యంగా భర్త చేతుల్లో నుంచి భార్యను రక్షించాడు. ఒక వైపు యువకుడి చేతుల్లో బ్లేడ్, మరోవైపు రైల్వే ట్రాక్ పై ట్రైన్, అయినా సరే ప్రాణాలను లెక్కచేయకుండా భార్యను, భర్తను రక్షించిన కానిస్టేబుల్

Advertisement

Delhi Liquor Scam Case: ఢిల్లీ మద్యం కేసు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ నవంబర్‌ 20కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

Hazarath Reddy

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఢిల్లీ మద్యం కేసులో ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ నవంబర్‌ 20కు వాయిదా పడింది. అక్టోబర్‌ 18న పీఎంఎల్‌ఏ కేసులకు సంబంధించి ప్రత్యేక ధర్మాసనం విచారణ ఉందన్న జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌.. ఆ తర్వాతే దీనిపై విచారణ చేపడతామని తెలిపారు.

KTR on Chandrababu Arrest: వీడియో ఇదిగో, చంద్రబాబు అరెస్ట్‌తో మాకేమి సంబంధం, ధర్నాలు ఇక్కడ కాకుండా అక్కడే చేసుకోమని చెప్పానని తెలిపిన మంత్రి కేటీఆర్

Hazarath Reddy

చంద్రబాబు అరెస్ట్ మీద తెలంగాణ భవన్‌లో మీడియాతో కేటీఆర్‌ మాట్లాడారు. హైదరాబాద్‌లో ర్యాలీకి అనుమతి ఎందుకు ఇవ్వలేదని లోకేష్‌ తనకు ఫోన్‌ చేసి అడిగినట్లు పేర్కొన్నారు. ఇది ఏపీలోని రెండు రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశమైతే ఇక్కడ ర్యాలీలు చేయడం ఏంటని ప్రశ్నించినట్లు తెలిపారు

Amaravati Ring Road Case: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా నారా లోకేష్, ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన సీఐడీ

Hazarath Reddy

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ బాబు పేరును చేర్చింది ఏపీ సీఐడీ. ఏ14గా పేరు చేర్చి విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు మాజీ మంత్రి నారాయణ, లింగమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన వ్యాపారవేత్తలతో పాటు పలువురిని సీఐడీ నిందితులుగా పేర్కొన్న సంగతి తెలిసిందే.

Andhra Pradesh Shocker: వీడియో చూస్తే వణుకు పుట్టడం ఖాయం, వినాయకుని చూసేందుకు వచ్చి కరెంట్ షాక్‌తో గిలగిల కొట్టుకుని మృతి చెందిన బాలుడు

Hazarath Reddy

నరసరావుపేట పట్టణం చంద్రబాబు నాయుడు కాలనీకి చెందిన బాలుడు నరసరావుపేటలోని వినాయకుని నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా సత్తెనపల్లి రోడ్లో గల రంగా బొమ్మ మీద వినాయకుని చూసేందుకు వచ్చిన బాలుడు విద్యుత్ షాక్ తగిలింది.

Advertisement
Advertisement