రాష్ట్రీయం

Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షాలకు రోడ్డు మీదకు వస్తున్న మొసలి పిల్లలు, చింతల బస్తిలో నాలా నుండి బయటకు వచ్చిన చిన్న మొసలి పిల్ల వీడియో ఇదిగో..

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షానికి కడ్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల బస్తిలోని ఓ నాలా నుండి బయట పడ్డ చిన్న మొసలి పిల్ల. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారుల కోసం ఎదురుచూస్తున్న పోలీసులు.

Andhra Pradesh: జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు, టీడీపీ అగ్ర నేతలతో సహా 26 మందికి హైకోర్టు నోటీసులు, పిటిషన్‌పై విచారణ నాలుగు వారాలకు వాయిదా

Hazarath Reddy

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ తర్వాత పిటిషన్‌లను విచారించిన జడ్జిలపై సోషల్ మీడియా వేదికగా పలు దూషణలు పర్వం కొనసాగిన సంగతి విదితమే. ఈ మేరకు ఏపీ హైకోర్టులో ఇవాళ క్రిమినల్‌ కంటెంప్ట్‌ పిటిషన్‌పై విచారణ జరిగింది.

Andhra Pradesh: రహదారి భద్రత కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం,రూ.50 కోట్ల రివాల్వింగ్ ఫండ్‌ ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు

Hazarath Reddy

ఏపీ రాష్ట్రంలో రహదారి భద్రత కోసం రూ.50 కోట్ల రివాల్వింగ్ ఫండ్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రహదారి ప్రాజెక్టుల అంచనాలో 2 శాతం రహదారి భద్రతా నిధికి జమ చేయాలని ఆయన స్పష్టం చేశారు.

AP Assembly Session 2023: ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా, జీపీఎస్, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్‌తో సహా పలు కీలక బిల్లులకు ఆమోదం

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అయిదోరోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. సభలో పలు కీలక బిల్లులు ఆమోదం పొందాయి. ఇక శాసన మండలిలో పలు కీలక బిల్లులు ఆమోదం పొందాయి.

Advertisement

Telangana Rains: తెలంగాణకు ఎల్లో అలెర్ట్‌, రాగల మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం, బంగాళాఖాతంలో ఇప్పటికే ఏర్పడిన అల్పపీడనం

Hazarath Reddy

రాగల మూడురోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం నుంచి శనివారం వరకు ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది

Hyderabad Rains: అకస్మాత్తుగా హైదరాబాద్‌లో భారీ వర్షం, పలు చోట్ల ట్రాఫిక్ జామ్, ఇంటికి వెళ్లే వారు అలర్ట్‌గా ఉండాలని పోలీసులు సూచన

Hazarath Reddy

హైదరాబాద్ లో భారీ వర్షం దంచి కొడుతోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షంతో పాటు రోడ్డులన్నీ జలమయమయ్యాయి. ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, దిల్‌షుక్‌ నగర్, మలక్ పేట, చార్మినార్, బేగంపేట, అమీర్ పేట, కూకట్ పల్లి, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

Khairatabad Ganesh Immersion: ఖైరతాబాద్‌ వినాయకుడు నిమజ్జనం పూర్తి వివరాలు ఇవిగో, ఈ రోజు అర్థరాత్రి 12 గంటలకు మహా గణపతికి చివరి పూజ

Hazarath Reddy

మహాగణపతి నిమజ్జనానికి హైదరాబాద్ నగరం సిద్ధమైంది. హుస్సేన్‌సాగర్‌తో పాటు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో దాదాపు 100 చోట్ల గణేష్ నిమజ్జనాలు జరగనున్నాయి. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ క్రేన్లు, జేసీబీలు, టిప్పర్లతోపాటు వేలాదిమంది సిబ్బందిని ఏర్పాటు చేసింది.

Skill Development Scam Case: చంద్రబాబుకు రెండు కోర్టుల్లో చుక్కెదురు, బాబు పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు, బెయిల్, కస్టడీ పిటిషన్ల విచారణను అక్టోబర్ 5కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు

Hazarath Reddy

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి జెల్లో రిమాండ్ ఖైదీగా టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్న సంగతి విదితమే. తాజాగా ఆయన బెయిల్ పిటిషన్ కోసం ఏసీబీ కోర్టులో దరఖాస్తు చేసుకున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో చంద్రబాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పొడిగింపు పిటిషన్ లపై విచారణను ఏసీబీ కోర్టు అక్టోబర్ 5వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement

TSPSC Group-1 Prelim Exam: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష మళ్లీ నిర్వహించండి, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థంచిన తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌

Hazarath Reddy

తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సమర్ధించింది. ప్రిలిమ్స్ రద్దును సవాల్‌ చేస్తూ ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

Amaravati Inner Ring Road Case: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసు, హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన నారా లోకేష్‌

Hazarath Reddy

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం కేసులో తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న లోకేష్‌ తరపున న్యాయవాదులు హైకోర్టులో ఈ పిటిషన్‌ వేసినట్లు తెలుస్తోంది

Skill Development Scam Case: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వచ్చే వారానికి వాయిదా, పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు విముఖత చూపిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టి

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీపై సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది. పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టి విముఖత చూపించారు.ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో (Supreme court) చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ వచ్చే వారానికి వాయిదా వేస్తూ సుప్రీంకోర్ట్ నిర్ణయం తీసుకుంది

Chandrababu Arrest Row: వీడియో ఇదిగో, చంద్రబాబు త్వరగా బయటకు రావాలంటూ చర్చిలో ప్రార్థనలు చేసిన నారా భువనేశ్వరి, బ్రాహ్మణి

Hazarath Reddy

రాజమండ్రి లూధరన్ చర్చిలో నారా భువనేశ్వరి, బ్రాహ్మణి బుధవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చంద్రబాబు ఏ తప్పు చేయలేదని, దేవుడి దీవెనలు, ఆశీస్సులతో ఆయన త్వరలోనే బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వీడియో ఇదిగో..

Advertisement

Road Accident Video: షాకింగ్ వీడియో షేర్ చేసిన వీసీ సజ్జనార్, సరదా కోసం స్కిట్లు చేస్తే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి జాగ్రత్త అంటూ హెచ్చరిక

Hazarath Reddy

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఎండిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సజ్జనార్ రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణపై అధికారులకు ఆదేశాలను జారీ చేయడంతో పాటు ఆయన కూడా ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు.

TS TET Result 2023 Out: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET 2023) ఫలితాల విడుదలయ్యాయి.. బుధవారం ఉదయం 10 గంటలకు ఈ ఫలితాలను టెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి విడుదల చేశారు.ఫలితాలు వెబ్‌సైట్‌లో https://tstet2023results.cgg.gov.in/tstet2023pkgr1510.results అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

Andhra Pradesh: గుంటూరు నుంచి తిరుపతికి హెలీకాప్టర్ ద్వారా గుండె తరలింపు, ఓ వ్యక్తి ప్రాణం నిలిపేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్న సీఎం వైఎస్ జగన్

Hazarath Reddy

ఓ వ్యక్తి ప్రాణం నిలిపేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గుంటూరులో ప్రమాదవశాత్తూ బ్రెయిన్ డెడ్ అయిన 18 ఏళ్ల కట్టా కృష్ణ అనే యువకుడి అవయవాలు దానం చేసేందుకు అతని కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు.

Telangana Assembly Elections 2023: రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు, మహేశ్వరం టికెట్ కోసం రూ. 10 కోట్లతో పాటు 5 ఎకరాల భూమి తన పేర రాయించుకున్నాడని అంటున్న కొత్త మనోహర్ రెడ్డి

Hazarath Reddy

మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం రేవంత్ రెడ్డి బడంగ్‌పేట మేయర్ చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి వద్ద 10 కోట్లు తీసుకొని 5 ఎకరాల భూమి రాయించుకున్నాడు అంటూ కాంగ్రెస్ పార్టీ నేత కొత్త మనోహర్ రెడ్డి మీడియా సాక్షిగా చెప్పారు. ఈ విషయం సీనియర్ నాయకుడు వీ. హనుమంత రావు సైతం చెప్పారని.. సమయం వచ్చినపుడు అన్ని సాక్ష్యాలతో బైట పెడతా అంటున్న మనోహర్ రెడ్డి.

Advertisement

KCR Health Update: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అస్వస్థత, వారం రోజులుగా వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్న కేసీఆర్, ప్రత్యేక వైద్యబృందంతో చికిత్స

VNS

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) స్వల్ప అస్వస్థతకు (Fever) గురయ్యారు. కేసీఆర్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రగతి భవన్ లోనే కేసీఆర్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. యశోద ఆసుపత్రి వైద్య బృందం పర్యవేక్షణలో ఆయన ఉన్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్ (CM KCR Illness) కోలుకుంటారు వైద్యులు తెలిపారు.

Nara Lokesh: ఢిల్లీ వచ్చి అరెస్టు చేసే సత్తా లేని చెత్త కేసు నాపై పెట్టించాడు, యువగళం పేరు వింటేనే సైకో జగన్ గజగజలాడుతున్నారన్న నారా లోకేశ్

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ యువనేత నారా లోకేశ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యువగళం పేరు వింటేనే సైకో జగన్ గజగజలాడుతున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు. తన పాదయాత్ర ప్రారంభం కాకూడదని జీవో 1 తెచ్చినా... యువగళం ఆగలేదని, జనగళమై గర్జించిందని అన్నారు.

AP Assembly Session 2023 Day 4: అసెంబ్లీలో ఫైబర్‌ నెట్‌ స్కామ్‌పై చర్చ, చంద్రబాబు హయాంలో రూ. 114 కోట్లు కొట్టేశారని తెలిపిన మంత్రి గుడివాడ అమరనాథ్

Hazarath Reddy

అసెంబ్లీలో ఫైబర్‌ నెట్‌ స్కామ్‌పై చర్చ సందర్భంగా మంత్రి గుడివాడ అమరనాథ్ మాట్లాడుతూ..చంద్రబాబు హయాంలో ఏపీ ఫైబర్‌ నెట్‌ స్కామ్‌లో రూ. 114 కోట్లు కొట్టేశారని తెలిపారు.

Telangana: సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా కానుక, 2023 కంపెనీ లాభాల్లో కార్మికులకు 32శాతం వాటా చెల్లించేలా కీలక ఆదేశాలు

Hazarath Reddy

సింగరేణి కార్మికులు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంస్థ సాధించిన లాభాల్లో 32శాతం వాటా చెల్లించేందుకు నిర్ణయించిన సీఎం కేసీఆర్‌.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి రూ.2,222 కోట్ల రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది.

Advertisement
Advertisement