ఆంధ్ర ప్రదేశ్

JD Laxmi Narayana Political Party: సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ సంచ‌ల‌న నిర్ణ‌యం, నూత‌న రాజ‌కీయ పార్టీ పేరు, జెండా ఆవిష్క‌ర‌ణ‌, పార్టీ ప్ర‌ధాన ఎజెండా ఇదే!

VNS

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొత్త రాజకీయ పార్టీ (Political Party) ఏర్పాటైంది. సీబీఐ మాజీ జాయింట్‌ డైరక్టర్‌ లక్మీ నారాయణ (Laxmi Narayana) కొత్త పార్టీని ప్రకటించారు. తన పార్టీకి ‘జై భారత్‌ నేషనల్‌ పార్టీ’ (Jai Bharat National Party) అని నామకరణం చేశారు

Road Accident In Prakasam: ప్ర‌కాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం, ఆటోను ఢీకొట్టిన కారు, అక్క‌డికక్క‌డే న‌లుగురు మృతి

VNS

కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు, ఆటోలో ఉన్న మరో ఇద్దరు మెత్తం నలుగురు దుర్మరణం చెందారు. మృతులను(కారులో ప్రయాణిస్తున్న వారు) గుంటూరుకు చెందిన నాగేశ్వరరావు రావు, వెంకటేశ్వర్లు.. ఆటోలో ప్రయాణిస్తున్న మార్కాపురంకు చెందిన మాబు(ఆటో డ్రైవర్), దుపాడుకు చెందిన అభినయ్(11) గా గుర్తించారు. ఈ నలుగురు స్పాట్ లోనే ప్రాణాలు విడిచారు

Andhra Pradesh: నారా లోకేశ్‌పై సీఐడీ మరో పిటిషన్, స్కిల్‌ స్కాం కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు ఉన్నాయని ఏసీబీ కోర్టుకు తెలిపిన సీఐడీ

Hazarath Reddy

టీడీపీ నేత నారా లోకేష్ వ్యాఖ్యలపై ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ మెమో దాఖలు చేసింది. లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆధారాలతో సహా ఏసీబీ కోర్టుకు సీఐడీ అందజేసింది. కాగా యువగళం‌ ముగింపు సందర్బంగా పలు మీడియా ఛానెళ్ల ఇంటర్వ్యూలలో లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు స్కిల్‌ స్కాం కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యానించారని మొమోలో పేర్కొంది.

CM Jagan Review on COVID: కోవిడ్‌ కొత్త వేరియంట్‌ జేఎన్‌-1 వ్యాప్తి, ముందస్తు చర్యలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం జగన్, ఏపీలో రెండు కోవిడ్ కేసులు

Hazarath Reddy

దేశంలో కోవిడ్‌ కొత్త వేరియంట్‌ జేఎన్‌-1 వ్యాప్తి ఆందోళనకరంగా మారుతున్న నేపథ్యంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Andhra Pradesh CM YS Jagan Mohan Reddy) సమీక్ష నిర్వహించారు. ముందస్తు చర్యలపై దృష్టిపెట్టాలని సీఎం (CM Jagan) ఆదేశించారు.

Advertisement

COVID in AP: రాజమండ్రిలో తొలి కరోనా కేసు, ఏలూరులో మరో కేసు నమోదు, కొత్త వేరియంట్ నేపథ్యంలో జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు శాంపిల్స్

Hazarath Reddy

ఏపీలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తొలి కోవిడ్‌ కేసు నమోదైంది. 85 ఏళ్ల మహిళకు కోవిడ్ సోకినట్టు సమాచారం. శాంపిల్‌ను జీనోమ్ సీక్వెన్స్ ల్యాబ్‌కు అధికారులు పంపించారు.అలాగే ఏలూరులో కరోనా మరో కేసు నమోదైంది. కొత్త వేరియంట్ నేపథ్యంలో ఆరుగురికి ర్యాoడమ్ టెస్టులు చేసిన వైద్యులు.. ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వైద్యుడికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారించారు.

Coronavirus in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలవరం, ఏపీలో రెండు, తెలంగాణలో ఆరు కేసులు నమోదు, హైదరాబాద్‌లో ఇద్దరు చిన్నారులకు కోవిడ్

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో ‘కొత్త’ కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. ఏపీలో తాజాగా రెండు కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో 925 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 6 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 19కి చేరింది.

AP Assembly: జూన్ 16తో ఏపీ అసెంబ్లీ గడువు ముగింపు.. కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడి.. సొంత జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులను బదిలీ చెయ్యాలని ఆదేశం

Rudra

వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్‌ సహా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాలకు భారత ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.

South Central Railway: పెద్ద పండుగ సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లాలనుకుంటున్నవారికి గుడ్‌ న్యూస్.. 20 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. పూర్తి వివరాలు ఇదిగో

Rudra

పెద్ద పండుగ సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లాలనుకుంటున్నవారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృ1ష్టిలో ఉంచుకొని 20 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.

Advertisement

EC Visit to AP: ఏపీలో ఎన్నిక‌ల కోలాహ‌లం షురూ, ఏర్పాట్ల‌పై ప‌ర్య‌టించ‌నున్న కేంద్ర ఎన్నిక‌ల సంఘం అధికారులు

VNS

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు (AP Elections) మరికొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం (CEC) అధికారులు రెండు రోజుల పర్యటన కోసం శుక్రవారం ఏపీకి రానున్నారు. ఏపీలో పర్యటించనున్న ఎన్నికల సంఘం అధికారుల బృందంలో సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితేశ్ వ్యాస్‌, డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ హిర్దేశ్‌ కుమార్‌ ఉన్నారు.

Pension Increased in Andhra Pradesh: అవ్వాతాతలకు జగన్ గుడ్ న్యూస్, పెన్షన్‌ మొత్తాన్ని రూ.3000లకు పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం అవ్వాతాతలకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో పెన్షన్‌ మొత్తాన్ని రూ.3000లకు పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, జనవరి ఒకటో తేదీ నుంచి పెరిగిన పెన్షన్‌ అమలులోకి రానుంది. ఈ మేరకు గురువారం ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.

CM Jagan on TDP & Janasena: ఖర్చు చేసే ప్రతీ రూపాయి భావితరాల కోసమే, పేదలకు ఈ స్థాయిలో దేశంలో ఏ ప్రభుత్వం ఖర్చుచేయలేదని తెలిపిన సీఎం జగన్

Hazarath Reddy

గిట్టని వాళ్లు జగన్‌ దుబారా చేస్తున్నాడంటూ మాట్లాడుతున్నారు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా పేదలకు ఈ స్థాయిలో ఖర్చుచేయలేదు. ఖర్చు చేసే ప్రతీ రూపాయి భావితరాల కోసమే’’ అని సీఎం పేర్కొన్నారు.

Volunteer Salaries Hike: ఏపీ వాలంటీర్లకు గుడ్ న్యూస్, జనవరి నుంచి జీతం అదనంగా రూ.750 పెంచుతున్నట్లు ప్రకటించిన మంత్రి కారుమూరి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లకు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు శుభవార్త చెప్పారు. వచ్చే నెల నుంచి వాలంటీర్ల జీతం పెంచుతున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు కానుకగా మంత్రి ఈ ప్రకనట చేశారు.

Advertisement

Happy Birthday Jagan: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు, పాల్గొన్న పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు హాజరయ్యారు.

Happy Birthday Jagan: సీఎం జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, ట్వీట్స్ ఇవిగో..

Hazarath Reddy

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా సీఎం జగన్‌ను విష్ చేశారు. సీఎం జగన్ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు

Happy Birthday Jagan: వీడియో ఇదిగో, పుట్టిన రోజు సందర్భంగా మొక్కను నాటిన సీఎం జగన్, రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు

Hazarath Reddy

సీఎం జగన్‌ పుట్టిన రోజు పురస్కరించుకుని గురువారం రెండు తెలుగు రాష్ట్రా­లతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో భారీఎ­త్తున సేవా కార్యక్రమాలను వైఎ­స్సార్‌సీపీ శ్రేణులు చేపట్టాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని నియో­జకవర్గాల్లో మొక్కలు నాటడంతో పాటు అన్న­దానం, వస్త్రదానాలు చేస్తున్నారు.

Happy Birthday Jagan: జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు, సోషల్ మీడియాను ఊపేస్తున్న #HBDYSJagan హ్యాష్ ట్యాగ్, వెల్లువెత్తుతున్న జన్మదిన శుభాకాంక్షలు

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పుట్టిన రోజు నేడు. సోషల్ మీడియా వేదికగాను ప్రముఖులంతా జగన్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు.ఈ నేపథ్యంలోనే ఎక్స్ (ట్విట్టర్) లో #Andhrapradesh, #HBDYSJagan హ్యాష్ ట్యాగ్ లు ట్రెండ్ అవుతున్నాయి. ప్రముఖులంతా ఏపీ ముఖ్యమంత్రికి ఈ హ్యాష్ ట్యాగ్ ద్వారా శుభాకాంక్షలు చెబుతున్నారు. వీడియోలతో హోరెత్తిస్తున్నారు.

Advertisement

TDP Yuvagalam Navasakam: ఒక్క ఛాన్స్ ఇస్తే ఆంధ్రా 30 ఏళ్లు వెన‌క్కు వెళ్లింది, రాబోయేది టీడీపీ-జ‌న‌సేన ప్ర‌భుత్వ‌మేన‌న్న చంద్ర‌బాబు

VNS

వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌గా మారేందుకు కృషి చేస్తామని అన్నారు. ఏపీలో ధరలు విఫరీతంగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో అధికారం కోసం కాదని, . ముఖ్యమంత్రి పదవుల కోసం తపించడం లేదని, రాష్ట్రంలో ఖూనీ చేయబడ్డ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు జత కడుతున్నామని పేర్కొన్నారు.

TTD: తిరుమ‌ల వెళ్లేవారికి అల‌ర్ట్! స‌ర్వ‌ద‌ర్శనం టోకెన్లు ర‌ద్దు చేసిన టీటీడీ, ఈ నెల 22 నుంచి వైకుంఠ‌ద్వార ద‌ర్శ‌న టోకెన్లు

VNS

డిసెంబ‌రు 23న వైకుంఠ ఏకాదశి, 24న వైకుంఠ ద్వాదశి సంద‌ర్భంగా డిసెంబ‌రు 22న శ్రీవారి దర్శనానికి సంబంధించి తిరుప‌తిలో మంజూరు చేసే స‌ర్వద‌ర్శనం టైంస్లాట్ టోకెన్లను ర‌ద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. భ‌క్తులు తిరుమ‌ల‌(Tirumala) లో వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా స‌ర్వద‌ర్శనంలో శ్రీ‌వారిని ద‌ర్శించుకోవ‌చ్చని సూచించారు.

Telangana Assembly Session 2023: కాళేశ్వరంపై సీఎం రేవంత్, హరీష్‌ రావు మధ్య మాటల యుద్ధం, వెంటనే సెట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని హరీష్ రావు డిమాండ్

Hazarath Reddy

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు (BRS MLA Harish Rao) మధ్య మాటల యుద్ధం నడిచింది. కాళేశ్వరంపై వెంటనే సెట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని.. నిప్పులో కాల్చితేనే బంగారం విలువ తెలుస్తుందని ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు.

Jagananna Videshi Vidya Deevena: జగనన్న విదేశీ విద్యాదీవెన, అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ.41.59 కోట్లు విడుదల చేసిన సీఎం జగన్, ఆయన ఏమన్నారంటే..

Hazarath Reddy

జగనన్న విదేశీ విద్యాదీవెన, సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహక నిధులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM Jagan Mohan Reddy) బుధవారం విడుదల చేశారు. అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ. 41.59 కోట్ల నిధులను.. (Jagananna Videshi Vidya Deevena) సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి జమచేశారు.

Advertisement
Advertisement