ఆంధ్ర ప్రదేశ్
Goldman Konda Vijay: శ్రీశైలం మల్లన్న సన్నిధిలో హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ కొండ విజయ్.. 5 కేజీల బంగారంతో స్వామివారి దర్శనం
Arun Charagondaశ్రీశైలం మల్లన్నసేవలో పాల్గొన్నారు హైదరాబాద్కు చెందిన గోల్డ్ మ్యాన్ కొండ విజయ్(Goldman Konda Vijay).
Auto Driver Dies by Suicide: వీడియో ఇదిగో, ఫైనాన్స్ కంపెనీ వేధింపులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య, ఒక్క నెల గడువు అడిగినా ఇవ్వని యాజమాన్యం
Hazarath Reddyఏపీలోని కృష్ణా జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గుడివాడ మండలం మోటూరులో ఫైనాన్స్ కంపెనీ వేధింపులతో ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు. విస్తార్ ఆటో ఫైనాన్స్ కంపెనీ నుంచి రావి సత్తిబాబు(35) అనే ఆటో డ్రైవర్ రూ.7.80 లక్షలు రుణంగా తీసుకున్నాడు. ప్రతి నెలా సరైన సమయానికే వాయిదాలు చెల్లిస్తూ వచ్చాడు.
Tirupati: తిరుపతిలో కుళ్లిన చికెన్ విక్రయాలు.. దుకాణాన్ని సీజ్ చేసిన అధికారులు, పది రోజుల పాటు ఫ్రిజ్లో ఉంచిన చికెన్ అమ్ముతున్నారని స్థానికుల షాక్
Arun Charagondaతిరుపతి(Tirupati)లో కుళ్లిన చికెన్ విక్రయాలు(Chicken Shop) జరుగుతున్న షాప్ను సీజ్ చేశారు అధికారులు.
Dwaraka Tirumala Rao: యూనిఫామ్ ఉండదంటేనే ఏదోలా ఉంది, వీడ్కోలు పరేడ్లో భావోద్వేగానికి గురైన డీజీపీ ద్వారకా తిరుమలరావు, నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ వీడ్కోలు పరేడ్ ను మంగళగిరిలోని ఆరో బెటాలియన్ మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ పరేడ్ కు రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారులందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా ద్వారకా తిరుమలరావు (Dwaraka Tirumala Rao) పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
Producer Vedaraju Passes Away: టాలీవుడ్ లో విషాదం.. ఈ ఉదయం కన్నుమూసిన నిర్మాత వేదరాజు టింబర్
Rudraటాలీవుడ్ లో విషాదం నెలకొన్నది. నిర్మాత వేదరాజు టింబర్ (54) కన్నుమూశారు. ఈ ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. వేదరాజు గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో ఆయన బాధపడుతున్నారు.
Parliament Budget Session From Today: నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు.. నేడు రాష్ట్రపతి ప్రసంగం.. 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మల
Rudraపార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు.
SI Dies By Suicide: తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ లో ఘటన
Rudraపశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో దారుణం జరిగింది. తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ ఏజీఎస్ మూర్తి బలవన్మరణానికి పాల్పడ్డారు.
Leopard Spotted Again In Tirumala: తిరుమల సర్వదర్శనం టోకెన్ల జారీ కౌంటర్ దగ్గర చిరుత, భయాందోళనలో భక్తులు
VNSతిరుమల క్షేత్రంలో చిరుత (Leopard) సంచరిస్తున్నది. శిలాతోరణం వద్ద గురువారం సాయంత్రం సమయంలో చిరుత సంచారాన్ని భక్తులు గమనించారు. ఒక్కసారిగా దగ్గరలోనే చిరుత ఉండడం చూసి భయాందోళనకు గురయ్యారు. పలువురు భక్తులు వెంటనే దగ్గరలో ఉన్న వారికి సమాచారం అందించడంతో అందరూ అప్రత్తమయ్యారు.
YSRCP Fees Poru: ఫిబ్రవరి 5న వైఎస్సార్సీపీ ఫీజుపోరు, రాష్ట్రవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చిన జగన్ పార్టీ, చంద్రబాబు పాలనలో విద్యార్థులు కూలీలుగా మారుతున్నారని మండిపాటు..
Hazarath Reddyప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇవ్వకపోవడంతో విద్యార్థులు రోడ్డున పడ్డారు. తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక అల్లాడిపోతున్నారు. వైఎస్ జగన్ విద్యార్థులకు అండగా నిలిచారు. కానీ చంద్రబాబు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా మోసం చేశారు.
Peddireddy Ramachandra Reddy: సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు పెద్ద గుండు సున్నా పెట్టారు, చంద్రబాబు సర్కారుపై మండిపడిన పెద్దిరెడ్డి, ఏడు నెలల్లో రూ.1.19లక్షల కోట్లు అప్పు చేశారని వెల్లడి
Hazarath Reddyచంద్రబాబు పాలనపై పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు పెద్ద గుండు సున్నా పెట్టారు అని మండిపడ్డారు.
WhatsApp Governance in Andhra Pradesh: ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం, తొలి దశలో 161 సర్వీసులు అందుబాటులోకి, వాట్సాప్ నంబర్ 95523 00009 ద్వారా సేవలు పొందవచ్చు
Hazarath Reddy161 పౌర-కేంద్రీకృత సేవలను అందించే వాట్సాప్ గవర్నెన్స్ సర్వీస్ మన మిత్రను ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ గురువారం ఇక్కడ ప్రారంభించారు. పత్రాల సేకరణ కోసం అనేకసార్లు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం నుండి ఈ సర్వీస్ (WhatsApp governance Programme) ప్రజలను రక్షించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
AP Intermediate Exams: ఇంటర్ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. యథాతథంగా మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం
Arun Charagondaఇంటర్ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలు(AP Intermediate Exams) యథాతథంగా నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం(AP Government).
Actor Rana Daggubati: అమ్మమ్మ పాడె మోసిన నటుడు రానా దగ్గుబాటి... అంత్యక్రియలకు హాజరైన దగ్గుబాటి సురేష్, వీడియో ఇదిగో
Arun Charagondaఅమ్మమ్మ పాడె మోశారు నటుడు రానా దగ్గుబాటి(Actor Rana Daggubati). తణుకు మాజీ శాసనసభ్యులు వై.టి రాజా తల్లి, పారిశ్రామికవేత్త యలమర్తి నారాయణ చౌదరి సతీమణి భార్య రాజేశ్వరి మృతి చెందింది.
Road Accident Video: షాకింగ్ వీడియో ఇదిగో, బెంగుళూరులో రన్నింగ్ బస్సు ఎక్కుతూ చక్రాల కింద పడి తెలుగు విద్యార్థిని మృతి
Hazarath Reddyబెంగుళూరులో రన్నింగ్ బస్సు ఎక్కుతూ ప్రమాదవశాత్తూ చక్రాల కింద నలిగి తెలుగు విద్యార్థిని మౌనిక మృతి చెందింది. ఏపీలోని సత్యసాయి జిల్లా రోద్దం మండలానికి చెందిన మౌనిక బెంగుళూరులో కంప్యూటర్ ట్రైనింగ్ తీసుకుంటోంది. కూడలి వద్ద ఆగి ఉన్న బస్సు ఎక్కేందుకు మౌనిక వెళ్తుడంగా గ్రీన్ సిగ్నల్ పడింది
Andhra Pradesh Horror: దారుణం, రూ.కోటి రూపాయల ఇన్సూరెన్స్ డబ్బు వస్తుందనే ఆశతో సొంత చెల్లిని చంపిన అన్న, వీడియో ఇదిగో..
Hazarath Reddyఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా(Prakasham Dist) పొదిలి మండలం కాటూరివారిపాలెంలో ఇన్సూరెన్స్ డబ్బుల(Insurance Money) కోసం సొంత చెల్లిని.. అన్న అతికిరాతకంగా హత్య చేశాడు. రూ.కోటి రూపాయల డబ్బు వస్తుందనే ఆశతో ఈ దారుణానికి పాల్పడ్డాడు.
Harish Kumar Gupta: ఏపీ డీజీపీగా హరీష్కుమార్ గుప్తా నియామకం, ఈ నెల 31న పదవీవిరమణ చేయనున్న ప్రస్తుత డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీష్కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 31న ప్రస్తుత డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు పదవీవిరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో హరీష్కుమార్ గుప్తాను తదుపరి డీజీపీగా నియమించారు
Anantha Venkatarami Reddy: ఫిర్యాదు కోసం పోలీస్ స్టేషన్కి వెళితే గుడ్డలిప్పి పోలీసులు దారుణంగా కొట్టారు, అడిగినందుకు జర్నలిస్ట్లను రైలు పట్టాలపై పడుకోబెడతామంటారా అంటూ అనంత వెంకటరామిరెడ్డి మండిపాటు
Hazarath Reddyమీడియా ప్రతినిధులకు ఎమ్మెల్యే జయరాం వార్నింగ్ ఇవ్వడం దుర్మార్గం. వార్తలు రాసే జర్నలిస్టు లను రైలు పట్టాలపై పడుకోబెతారా? ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆగడాలు మితిమీరి పోతున్నాయి. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై గుంతకల్లు పోలీసులు దాడి చేశారు.
MLA Gummanur Jayaram: అడ్డగోలు వార్తలు రాస్తే రైలుపట్టాలపై పడుకోబెట్టి చంపేస్తా..జర్నలిస్టులకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వార్నింగ్, వీడియో ఇదిగో
Arun Charagondaఅడ్డగోలు వార్తలు రాస్తే రైలుపట్టాలపై పడుకోబెట్టి చంపేస్తా..జర్నలిస్టులకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం(MLA Gummanur Jayaram) వార్నింగ్ ఇచ్చారు.
Telangana - AP MLC Elections: ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, నేటి నుండే అమల్లోకి రానున్న ఎన్నికల కోడ్
Arun Charagondaతెలంగాణ , ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు(Telangana MLC Elections).. ఏపీలో రెండు పట్టభద్రుల, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి షెడ్యూల్(AP MLC Elections) విడుదలైంది.
Republic Day Parade 2025: రిపబ్లిక్ డే పరేడ్ 2025 అవార్డులు.. టాప్ 3లో ఉత్తరప్రదేశ్, త్రిపుర, ఆంధ్రప్రదేశ్, వివరాలివే
Arun Charagondaరిపబ్లిక్ డే పరేడ్ 2025 వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మార్చ్ నిర్వహించాయి.