ఆంధ్ర ప్రదేశ్
Corona in AP: చిత్తూరులో ఒక్కసారిగా పెరిగిన కేసులు, కొత్తగా ఏపీలో 765 కేసులు నిర్ధారణ, ప్రస్తుతం రాష్ట్రంలో 10,357 యాక్టివ్‌ కేసులు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 45,481 పరీక్షలు నిర్వహించగా.. 765 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,52,763 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఒక్కరోజు వ్యవధిలో కొవిడ్‌ బారినపడి 9 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 14,204కి చేరింది.
Chandrababu Prajayatra: ప్రజాయాత్రకు సిద్దమవుతున్న చంద్రబాబు, వస్తున్నా.. మీకోసం యాత్ర తొమ్మిదేళ్లు పూర్తి అయిన సందర్భంగా కీలక ప్రకటన
Hazarath Reddyఏపీ రాష్ట్రంలో వైసీపీ పరిపాలనను నిరసిస్తూ త్వరలో ఒక ప్రజాయాత్రను చేపట్టబోతున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Prajayatra) ప్రకటించారు. గతంలో తాను చేపట్టిన ‘వస్తున్నా.. మీకోసం’ యాత్రకు తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు.
Corona in AP: ఏపీలో కొత్తగా 865 కరోనా కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో 172 కొత్త కేసులు నమోదు, అత్యల్పంగా శ్రీకాకుళం, కర్నూలు జిల్లాలలో 4 కేసులు
Hazarath Reddyఏపీలో గడచిన 24 గంటల్లో 50,304 కరోనా పరీక్షలు నిర్వహించగా, 865 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 172 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 168, గుంటూరు జిల్లాలో 117 కేసులు వెల్లడయ్యాయి.
AP Shocker: జ్వరంతో ఉన్నా..బాలికను వదలని కామాంధుడు, ఇంజక్షన్‌ ఇవ్వాలంటూ ఆస్పత్రిలో అత్యాచారం, నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు
Hazarath Reddyఅనతంపురం జిల్లా పుటపర్తి దగ్గర కొత్తచెరువు పట్టణంలోని షిర్డిసాయి క్లినిక్‌లో శుక్రవారం దారుణ ఘటన జరిగింది. జ్వరానికి చికిత్స కోసం వచ్చిన ఓ బాలికపై ఆర్‌ఎంపీ సహాయకుడు అత్యాచారానికి (nine year old girl molested in RMP clinic i) పాల్పడ్డాడు.
Clean Andhra Pradesh: క్లీన్‌ ఆంద్రప్రదేశ్‌ వైపు ఏపీ అడుగులు, జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్, 100 రోజులపాటు క్లీన్‌ ఆంద్రప్రదేశ్‌ (క్లాప్‌)–జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం
Hazarath Reddyఏపీలో గ్రామీణ, పట్టణ, నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందించడమే లక్ష్యంగా రూపొందించిన ‘క్లీన్‌ ఆంద్రప్రదేశ్‌ (క్లాప్‌)–జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాన్ని (CLAP programme) గాంధీ జయంతి సందర్భంగా శనివారం విజయవాడ బెంజి సర్కిల్‌ వద్ద సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Andhra Pradesh CM YS Jagan Mohan Reddy) లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా 4,097 డస్ట్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.
Lal Bahadur Shastri Jayanti 2021: గాంధీ, శాస్త్రిలకు ట్విట్టర్ ద్వారా ఘనంగా నివాళి అర్పించిన ఏపీ సీఎం వైయస్ జగన్, వారి సేవలను కొనియాడిన ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyనేడు జాతిపిత మహత్మాగాంధీ 152వ జయంతి, మాజీ ప్రధానమంత్రి లాల్‌ బహదూర్‌ శాస్త్రి 117వ జయంతిని పురస్కరించుకొని.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శాస్త్రి సేవలను స్మరించుకున్నారు.
Corona in AP: ఏపీలో కొత్తగా 809 మందికి కరోనా, అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 161 కరోనా కేసులు, ఇంకా 11,142 మందికి కొనసాగుతున్న చికిత్స
Hazarath Reddyఏపీలో గడచిన 24 గంటల్లో 1000కి దిగున కరోనా పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. 56,463 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారిలో 809 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 161 కరోనా కేసులు వెల్లడి కాగా, చిత్తూరు జిల్లాలో 153, నెల్లూరు జిల్లాలో 115 కేసులు గుర్తించారు.
Pawan Kalyan Slams YSRCP: వచ్చే ఎన్నికల్లో జనసేనదే విజయం, విశాఖలో నన్ను గెలిపించి ఉంటే విశాఖ ఉక్కు కోసం పోరాడేవాడిని, అధికార పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాణ్
Hazarath Reddyగుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన విస్తృతస్థాయి సమావేశం జరిగింది. పార్టీ నేతలతో భేటీ అనంతరం పవన్‌ కల్యాణ్‌ ( Pawan Kalyan Slams YSRCP) మాట్లాడారు. తాను హీరోను కాదని, నటుడు అవ్వాలని తనకు కోరిక లేదని పలు సందర్భాల్లో చెప్పానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు.
Corona in AP: కరోనాతో తగ్గుతున్న మనిషి ఆయుష్షు, ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం పరిశోధకుల తాజా పరిశోధనలో వెల్లడి, ఏపీలో కొత్తగా 1,084 మందికి కోవిడ్, కరోనాతో సహ జీవనం తప్పదంటున్న డబ్ల్యూహెచ్‌వో
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 57,345 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,084 మందికి కరోనా (Corona in AP) పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లో కరోనా బారిన పడి 13 మంది మృత్యువాత (Covid Deaths) పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 14,163 కు చేరింది.
Andhra Pradesh: యూట్యూబ్ వీడియో చూసి అద్దం ముక్కతో గొంతు కోసుకున్న బాలిక, చికిత్స పొందుతూ మృతి, తూర్పు గోదావరిలో విషాద ఘటన, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు
Hazarath Reddyఏపీలో తూర్పు గోదావరి ఘటనలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల గొడవల మధ్య ఓ బాలిక అద్దం ముక్కతో తన గొంతు కోసుకుని (13-year-old Girl slits throat) ఆత్మహత్య చేసుకుంది.
Weather Report: గులాబ్ మరచిపోకముందే మరో అల్పపీడనం, రాగల 48 గంటల్లో ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం, గులాబ్‌ తుపాను నుంచి కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్
Hazarath Reddyవాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్‌ తీరంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న 24 గంటల్లో బలపడనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు (heavy rain for next two days) కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Andhra Pradesh: మిరాకిల్..ఆరు కాళ్లు, రెండు తలలతో జన్మించిన దూడ, కాసేపటికే మృతి, కడపలో పంది పిల్ల ఆకలి తీర్చిన ఆవు
Hazarath Reddyకొన్ని సార్లు చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. అలాంటి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వింతగా మారుతూ ఉంటాయి. తాజాగా ఏపీలో అలాంటి సంఘటనే చోటు చేసుకుంది.
Corona in AP: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు, కొత్తగా 771 మందికి కరోనా, ప్రస్తుతం 11,912 యాక్టివ్ కోవిడ్ కేసులు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 45,592 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 771 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 8 మంది మృత్యువాతపడ్డారు.
Cyclone Gulab: తెలుగు రాష్ట్రాలను వణికించిన గులాబ్ తుఫాన్, తెలంగాణలో 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు వాయిదా, అన్నీ ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లకు సెలవు, ఉత్తరాంధ్రపై తీవ్ర ప్రభావం చూపిన సైక్లోన్ గులాబ్
Hazarath Reddyగులాబ్ తుపాను ఎఫెక్ట్‌తో తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad MD) అధికారులు ప్రకటించారు. హైదరాబాద్ సహా పలు జిల్లా్ల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని తెలిపారు.
By-Polls 2021: తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్‌ 30న ఉపఎన్నికలు, తెలంగాణలోని హుజురాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్‌ నియోజకవర్గాలకు బై పోల్స్, నవంబర్‌ 2న కౌంటింగ్‌
Hazarath Reddyరెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. తెలంగాణలోని హుజురాబాద్‌ (Huzurabad Bypoll 2021), ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్‌ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్‌ 30న (By-poll Scheduled On October 30) ఈ రెండు నియోజక వర్గాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది.
Cyclone Gulab: తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్, అవసరమైతే బయటకు రావాలని ఐఎండీ సూచన, గులాబ్‌ తుపాన్ ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
Hazarath Reddyకళింగపట్నం వద్ద తీరాన్ని దాటిన గులాబ్‌ తుపాను తీవ్రత తగ్గి వాయుగుండంగా బలహీన పడిందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌కు 65 కిలోమీటర్లు, తెలంగాణలోని భద్రాచలానికి 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం (IMD) తెలియజేసింది.
Corona in AP: ఏపీలో అత్యంత తక్కువగా 618 కేసులు నమోదు, 1,178 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్, రాష్ట్రంలో ప్రస్తుతం 2,482 యాక్టివ్ కేసులు
Hazarath Reddyఏపీలో గడచిన 24 గంటల్లో 38,069 కరోనా పరీక్షలు నిర్వహించగా, 618 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు (122), నెల్లూరు (100) జిల్లాలను మినహాయిస్తే మిగిలిన అన్ని జిల్లాల్లో వందకు లోపే రోజువారీ కేసులు నమోదయ్యాయి.
YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో కీలక పరిణామం, నార్కో పరీక్షలకు అంగీకరించిన నిందితుడు మున్నా, వీటిని నిర్వహించేందుకు సీబీఐ అధికారులకు అనుమతి ఇచ్చిన పులివెందుల కోర్టు
Hazarath Reddyమాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతుండగా, కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో (YS Viveka Murder Case) కీలక అనుమానితుడిగా భావిస్తున్న మున్నా నార్కో పరీక్షలకు అంగీకరించాడు. మేజిస్ట్రేట్ ఎదుట తన సమ్మతి తెలిపాడు. దాంతో పులివెందుల కోర్టు (Pulivendula court ) అతడికి నార్కో పరీక్షలు నిర్వహించేందుకు సీబీఐ అధికారులకు అనుమతి ఇచ్చింది.
CM YS Jagan VC: తుఫాన్ వల్ల ఎవరైనా మరణిస్తే వెంటనే రూ. 5 లక్షల పరిహారం ఇవ్వండి, సహాయక శిబిరాల్లో ఆహారం, నీరు నాణ్యంగా ఉండేలా చూడండి, గులాబ్‌ తుపాను, అనంతర పరిస్థితులపై పలు జిల్లాల కలెక్టర్లతో సీఎం వైయస్ జగన్ సమీక్ష
Hazarath Reddyరాష్ట్రం మీద విరుచుకుపడిన గులాబ్‌ తుపాను, అనంతర పరిస్థితులపై (post-hurricane conditions) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తుపాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష (CM YS Jagan Video Conference with District Collectors ) చేపట్టారు.