ఆంధ్ర ప్రదేశ్
Vanamahotsavam 2021: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన 'జగనన్న పచ్చ తోరణం - వన మహోత్సవం', మంగళగిరి ఎయిమ్స్ ప్రాంగణంలో మొక్కలు నాటిన సీఎం జగన్, రాష్ట్రంలో ప్రతిఒక్కరూ చెట్లు పెంచాలని పిలుపు
Team Latestlyరాష్ట్రంలో చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా జరగాలని పేర్కొనారు. ప్రతి ఒక్కరు చెట్లు పెంచాలని ప్రతిజ్ఞ చేయించారు. చెట్లు ఉంటే రాష్ట్రానికి చేకూరే ప్రయోజనాలను వివరిస్తూ ఏపిని పచ్చతోరణంలా మార్చాలని జగన్ పిలుపునిచ్చారు....
CM YS Jagan Review: తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి చేస్తూ ఇంగ్లీష్ విద్యా బోధన, ఈనెల 16న విద్యా కానుక, విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం వైయస్ జగన్, నూతన విద్యావిధానం స్కూళ్లను 6 రకాలుగా వర్గీకరణ
Hazarath Reddyఏపీలో స్కూళ్లలో విద్యార్థుల నిష్పత్తికి తగినట్లుగా టీచర్లను ఉంచాలని సీఎం ఆదేశించారు. టీచర్ల అనుభవం, బోధనలో వారికున్న నైపుణ్యాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో విద్యాశాఖపై బుధవారం సమీక్ష(CM YS Jagan Review on Education Department) నిర్వహించారు.
Corona in AP: ఏపీలో 20,184 మందికి ఇంకా కొనసాగుతున్న చికిత్స, కొత్తగా 2,442 కరోనా కేసులు నమోదు, 24 గంటల్లో 2,412 మంది కోలుకుని డిశ్చార్జ్, ఏపీలో ఇప్పటి వరకు 2,48,63,968 కరోనా నిర్థారణ పరీక్షలు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 85,822 మంది నమూనాలు పరీక్షించగా 2,442 కొత్త కేసులు (Corona in AP) నమోదయ్యాయి. 16 మంది మృతి (16 deaths in last 24 hours) చెందారు. కరోనా నుంచి నిన్న 2,412 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 20,184 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది.
Tokyo Olympics 2020: లవ్లీనా బొర్గోహెయిన్‌కు ఏపీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు, ఆమె పోరాడిన తీరు అద్భుతమని కొనియాడిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తొలి ఒలింపిక్స్‌లోనే కాంస్య పతకం సాధించిన భారత మహిళా బాక్సర్‌ లవ్లీనా
Hazarath Reddyటోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత మహిళా బాక్సర్‌ లవ్లీనా బొర్గోహెయిన్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పాల్గొన్న తొలి ఒలింపిక్స్‌లోనే పతకం గెలుపొందేందుకు ఆమె పోరాడిన తీరు అద్భుతమని కొనియాడారు.
AP Inter Supplementary Exams 2021: సెప్టెంబర్‌ 15 నుంచి 23 వరకు ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు, షెడ్యూల్‌ విడుదల చేసిన ఇంటర్మీడియెట్‌ విద్యామండలి, పరీక్ష ఫీజుకు చివరి తేది ఆగస్టు 17
Hazarath Reddyఏపీలో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు–2021 సెప్టెంబర్‌ 15 నుంచి 23 వరకు (AP Inter Supplementary Exams 2021) జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియెట్‌ విద్యామండలి మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది.
Devineni Uma: దేవినేని ఉమకు బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు, వారం రోజుల పాటు జైలులో గడిపిన టీడీపీ నేత
Hazarath Reddyమాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమకు బెయిల్‌ మంజూరైంది. కృష్ణా జిల్లా జి.కొండూరు పోలీస్‌స్టేషన్‌లో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తనపై కావాలనే అక్రమంగా కేసులు పెట్టారంటూ దేవినేని ఉమ హైకోర్టును (Andhra Pradesh High Court ) ఆశ్రయించారు.
Vizag Steel Privatisation: కుదిరితే అమ్మకం లేదంటే శాశ్వతంగా మూసివేత, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై రాజ్యసభలో కేంద్రం స్పష్టం, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్‌ కరాద్‌
Hazarath Reddyఉక్కు వంటి ప్రభుత్వరంగ సంస్థలను వీలైతే ప్రైవేటీకరించడం (Vizag Steel Privatisation), అలా కుదరని పక్షంలో వాటిని శాశ్వతంగా మూసివేయడం నూతన పబ్లిక్‌ సెక్టర్‌ విధానమని కేంద్రం స్పష్టం చేసింది.
Corona in AP: ఆనందయ్య మందుపై హైకోర్టులో విచారణ వాయిదా, ఏపీలో తాజాగా 1,546 మందికి కరోనా పాజిటివ్‌, రాష్ట్రంలో ప్రస్తుతం 20,170 యాక్టివ్ కేసులు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ లో గడిచిన 24 గంటల్లో ఏపీలో 69,606 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,546 మందికి కరోనా పాజిటివ్‌గా (New Covid-19 cases) నిర్థారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 18 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,428 కు చేరింది.
AP Open School Exams Cancelled: ఏపీ ఓపెన్ స్కూల్ పది, ఇంటర్‌ పరీక్షలు రద్దు, ఉత్తర్వులు జారీ చేసి పాఠశాల విద్యాశాఖ, రెగ్యులర్ విద్యార్థుల తరహాలోనే ఓపెన్ స్కూల్ విద్యార్థులనూ పాస్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడి
Hazarath Reddyకరోనావైరస్ కారణంగా 2021 విద్యా సంవత్సరానికి ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు (AP Open School Exams Cancelled) చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 2021 జూలైలో బోర్డు పరీక్షలు రాసేందుకు ఫీజు చెల్లించిన, నమోదు చేసుకున్న విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్టుగా పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
CM Jagan Review on IT: ఏపీలో 4530 డిజిటల్‌ లైబ్రరీలు, ఆగస్టు 15న పనులు ప్రారంభించాలని అధికారులకు ఏపీ సీఎం ఆదేశాలు, కంప్యూటర్‌ పరికరాల కోసం దాదాపుగా రూ.140 కోట్లకు పైగా ఖర్చు చేయనున్న ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyఐటీ, డిజిటల్‌ లైబ్రరీలపై సీఎం జగన్‌ సమీక్ష (CM Jagan Review on IT) నిర్వహించారు. వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామాలకు సామర్ధ్యం ఉన్న ఇంటర్నెట్‌ను తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
Delimitation of Assembly Constituencies: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఇప్పట్లో లేదు, 2031 తర్వాతనే చేపడతామని తెలిపిన కేంద్రం, ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన (Delimitation of Assembly Constituencies) 2031 తర్వాతే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మంగళవారం లోక్‌సభలో ప్రశ్న లేవనెత్తారు
YS Viveka Murder Case: వైయస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు, సునీల్‌ కుమార్‌ యాదవ్‌ను గోవాలో అరెస్ట్ చేసిన సీబీఐ, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కొనసాగుతున్న విచారణ
Hazarath Reddyమాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case) దర్యాప్తులో సీబీఐ వేగం పెంచింది. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైయస్ వివేకానంద రెడ్డి హత్య అనుమానితుడు పులివెందులకు చెందిన సునీల్‌ కుమార్‌ యాదవ్‌ను గోవాలో సీబీఐ అరెస్ట్‌ (CBI Arrests Sunil Yadav) చేసింది.
Visakha Steel Plant Privatization: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగదన్న కేంద్రం, ప్రైవేటీకరణపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని ఏపీ హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ పోరాట కమిటీ ధర్నా
Hazarath Reddyవిశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై (Visakha Steel Plant Privatization) పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అలాగే ప్రైవేటీకరణపై కేంద్రం (Cetnral government) దాఖలు చేసిన కౌంటర్‌కు రిప్లై దాఖలు చేస్తామని, ఇందుకు కొంత గడువునివ్వాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనకు హైకోర్టు సానుకూలంగా స్పందించింది.
Andhra Pradesh: మామతో పడుకోమన్న శాడిస్ట్ భర్త, నీవు రాకుంటే నీ రెండేళ్ల కూతురుతో పడుకుంటానన్న కీచక మామ, ఆ దుర్మార్గుల నుంచి రక్షణ కల్పించాలని స్పందన కార్యక్రమంలో అర్బన్‌ ఎస్పీని వేడుకున్న బాధిత మహిళ
Hazarath Reddyగుంటూరు జిల్లాలో తిరుగుబోతు భర్త.. కీచక మామల నుంచి నాకు నా కుమార్తెకు రక్షణ కల్పించాలని ఓ మహిళ పోలీసులను (Woman Complaint her Uncle Sexual Harassment) వేడుకుంది. గుంటూరు అర్బన్‌ ఎస్పీ స్పందన కార్యక్రమం (Guntur Urban SP in spandana Program) నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది.
Corona in Andhra Pradesh: ఏపీలో కొత్తగా 1,546 కేసులు నమోదు, 15 మంది మృతి, 1,968 మంది కోలుకుని డిశ్చార్జ్, ప్రస్తుతం రాష్ట్రంలో 20,582 యాక్టివ్‌ కేసులు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 59,641 పరీక్షలు నిర్వహించగా.. 1,546 కేసులు నిర్ధారణ (Corona In Andhra pradesh) అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,67,113 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
CM YS Jagan Review: రెండు నెలలపాటు మరింత అప్రమత్తంగా ఉండాలి, ఆర్టీపీసీఆర్‌ టెస్టులు మాత్రమే చేయండి, కోవిడ్ సమీక్షలో అధికారులతో ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి
Hazarath Reddyపెళ్లిళ్ల సీజన్‌లో పెద్ద ఎత్తున ప్రజలు ఒక చోటకు వచ్చే అవకాశాలున్నాయి. కోవిడ్‌ విస్తరణకు దారితీసే అవకాశాలున్నాయి. శుభకార్యాల్లో వీలైనంత తక్కువ మంది ఉండేలా చూడాలి. పెళ్లిల్లో 150 మంది మాత్రమే ఉండాలి.
Krishna Water Dispute: కృష్ణా జలాల వివాదం, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించిన సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, తాను రెండు రాష్ట్రాలకు చెందిన వ్యక్తినని తెలిపిన భారత ప్రధాన న్యాయమూర్తి
Hazarath Reddyకృష్ణా జలాల వివాదంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా జలవివాదంపై (Krishna Water Dispute) తాను తీర్పు చెప్పలేనని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ (CJI Ramana) వ్యాఖ్యానించారు. కృష్ణా జలాల వివాదాన్ని మధ్యవర్తిత్వం (Amicable Settlement) ద్వారా పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సూచించారు.
AP Shocker: అమ్మాయిలు, ఆంటీలే టార్గెట్, ఫేస్‌బుక్ ద్వారా అర్థ నగ్నఫోటోలతో బ్లాక్ మెయిల్, ఆ తర్వాత వారిని అనుభవించి డబ్బు, నగలతో పరార్, నిందితుడిని ఎట్టకేలకు అరెస్ట్ చేసిన కడప పోలీసులు
Hazarath Reddyరాష్ట్ర వ్యాప్తంగా పలు దొంగతనాలకు పాల్పడిన ప్రొద్దుటూరు గీతాశ్రమం వీధికి చెందిన చెన్నుపల్లి ప్రసన్నకుమార్‌ అలియాస్‌ ప్రశాంతిరెడ్డి, అలియాస్‌ రాజారెడ్డి, అలియాస్‌ టోనీ (23) అనే కిలాడీ దొంగను శనివారం సాయంత్రం చౌటపల్లి రోడ్డులో పోలీసులు అరెస్ట్‌ ( Man wanted in several Theft cases arrested) చేశారు.
Corona in Andhra: ఏపీలో స్థిరంగా కేసులు, తాజాగా 2,287 మందికి కరోనా, 18 మంది మృతి, 2430 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్, ప్రస్తుతం రాష్ట్రంలో 21,019 యాక్టివ్‌ కేసులు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 85,856 పరీక్షలు నిర్వహించగా.. 2,287 కేసులు నిర్ధారణ (Corona In Andhra pradesh) అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,65,567 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
Andhra Pradesh: గోదావరిలో దూకి కుటుంబం మొత్తం ఆత్మహత్య, చిన్నారి మృత దేహాన్ని గుర్తించిన పోలీసులు, మిగతా డెడ్ బాడీల కోసం గాలింపు, వాట్సప్‌ గ్రూపుల్లో హల్‌చల్‌ చేస్తున్న మృతుడి భార్య చనిపోకముందు రాసిన లేఖ
Hazarath Reddyపశ్చిమ గోదావరి జిల్లా ఆచంట దగ్గర విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని యలమంచిలి మండలం చించివాడ వంతెన వద్ద గోదావరిలో (Godavari River) దూకి దంపతులు సహా ఇద్దరు పిల్లలు ఆత్మహత్య (family-commits-suicide) చేసుకున్నారు.