ఆంధ్ర ప్రదేశ్

Dhulipalla Narendra Kumar: రాజమండ్రి సెంట్రల్ జైలుకు టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర, సంగం డెయిరీలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు, సెక్షన్ 408, 409, 418, 420, 45, 471, 120బీ కింద కేసులు నమోదు చేసిన ఏసీబీ

Hazarath Reddy

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ను (TDP Leader, Ponnur Former MLA Dhulipalla Narendra) అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అరెస్టు చేసిన సంగతి విదితమే. ఏసీబీ కోర్టు (ACB Court) ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో శనివారం రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు (Central Prison in Rajahmundry) తరలించారు.

AP Covid Update: ఏపీలో సెకండ్ వేవ్ కల్లోలం, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అన్నీ బంద్, తాజాగా 11,698 మందికి కోవిడ్ నిర్ధారణ, 37 మంది మృత్యువాత, 24 గంటల్లో 4,421 మంది డిశ్చార్జ్

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 50,972 కరోనా పరీక్షలు నిర్వహించగా 11,698 మందికి పాజిటివ్ (Andhra Pradesh reports 11,698 fresh Covid cases) అని నిర్ధారణ అయింది. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 1,641 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు (1,581), చిత్తూరు (1,306), అనంతపురం (1,066) జిల్లాల్లోనూ వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు గుర్తించారు.

AP Shocker: తాగుబోతు కొడుకు వేధింపులు, తట్టుకోలేక చంపేసిన తల్లిదండ్రులు, అనంతపురం జిల్లా అమడగూరు మండలంలోని మద్దెమ్మగుడిపల్లిలో ఘటన, కేసు నమోదు చేసిన పోలీసులు

Hazarath Reddy

తాగుబోతు కొడుకు పెట్టే వేధింపులు భరించలేక కన్న తల్లిదండ్రులే కొడుకును హతమార్చిన విషాద ఘటన (drunkard son was brutally killed by his parents) అనంతపురం జిల్లా (Anantapur District) అమడగూరు మండలంలోని మద్దెమ్మగుడిపల్లిలో చోటు చేసుకుంది.

IPS Officer P.V. Sunil Kumar: ఏపీలో ఉచిత వ్యాక్సిన్, నెల జీతాన్ని విరాళంగా ప్రకటించిన ఐపీఎస్ ఆఫీసర్ పీ.వీ. సునీల్ కుమార్, మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా టీకాలు వేయనున్న ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం 18 ఏళ్లు పైబడిన వారికి ఉచిత వ్యాక్సిన్ అందిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఖజానాపై భారం భారీగా పడనుంది. అయితే పలువురు స్వచ్ఛందంగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తమ మద్దతు ప్రకటిస్తున్నారు. వారి జీతాల్లో కొంత భాగాన్ని ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమానికి వినియోగించేందుకు ఏపీ ప్రభుత్వానికి అందిస్తున్నారు.

Advertisement

AP Bagged 17 Panchayat Awards: దుమ్మురేపిన ఏపీ పంచాయితీ వ్యవస్థ, దేశ స్థాయిలో 17 అవార్డులు కైవసం, దేశవ్యాప్తంగా 74 వేల గ్రామ పంచాయతీలు పోటీ, ఎక్కువ అవార్డులు వచ్చిన నాలుగో రాష్ట్రం ఏపీ

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం మరో ఘనతను సాధించింది. గ్రామీణ ప్రాంతాల్లో ‘స్థానిక పాలనా పరిస్థితుల’ ఆధారంగా ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవార్డులలో (National Panchayat Awards 2021) ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌ ఏకంగా 17 అవార్డులను (AP Bagged 17 Panchayat Awards) దక్కించుకుంది. పంచాయతీరాజ్‌ దినోత్సవం (National Panchayat Day) సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శనివారం ఈ అవార్డులను ప్రదానం చేశారు.

One Crore to AP CM Relief Fund: కోవిడ్ నియంత్రణ కోసం సీఎం సహాయనిధికి రూ.1.33 కోట్ల విరాళం, సీఎం వైయస్ జగన్‌కు చెక్కును అందజేసిన వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు, ఏపీలో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్

Hazarath Reddy

విరాళం ఇచ్చిన వారిలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన పలు సంస్థలు, ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. విరాళానికి సంబంధించిన చెక్కులను సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు(Kurasala Kannababu) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి (CM YS Jagan) అందజేశారు.

COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో సెకండ్ వేవ్ టెర్రర్, 10 లక్షలు దాటిన కోవిడ్ కేసులు, ఒక్కరోజులోనే 11 వేల పాజిటివ్ కేసులు, 38 మరణాలు నమోదు, రాష్ట్రంలో 74 వేలకు పెరిగిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభన తీవ్రస్థాయిలో ఉంది. రాష్ట్రంలో గతంలో కంటే కరోనా నిర్ధారణ పరీక్షలు తక్కువగా చేస్తున్నా, గతంలో కంటే మించిన స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.....

Andhra Pradesh: 18 ఏళ్ల పైబడిన వారందరికీ ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత వ్యాక్సిన్; కేసులు పెరుగుతున్న దృష్ట్యా శనివారం నుంచి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధింపు

Team Latestly

కోవిడ్ టీకాల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి ప్రారంభం కాబోయే మూడో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా 18 ఏళ్ల పైబడిన అందరికీ ఏపీలో ఉచితంగా టీకా అందజేయనున్నట్లు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా....

Advertisement

COVID in AP: ఆంధ్రప్రదేశ్‌లో 10 వేల మార్కును దాటిన రోజూవారీ పాజిటివ్ కేసుల సంఖ్య, గురువారం ఒక్కరోజే 10,759 కోవిడ్ కేసులు నమోదు, ఈ ఏడాదిలో ఇదే అత్యధికం

Vikas Manda

Coronavirus in Andhra Pradesh: ఏపీలో 24 గంటల్లో 38 మంది కరోనాతో మృతి, కొత్తగా 9,716 కోవిడ్ కేసులు నమోదు, శ్రీకాకుళంలో అత్యధికంగా 1444 కేసులు నమోదు, అత్యల్పంగా వెస్ట్ గోదావరిలో 106 కేసులు

Hazarath Reddy

ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కేసుల పెరుగుదలతో పాటుగా మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 39,619 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 9,716 కేసులు నిర్థారణ (AP coronavirus) అయ్యాయి. గత 24 గంటల్లో 38 మంది ప్రాణాలు కోల్పోయారు.

AP coronavirus: ఏపీలో పెరుగుతున్న మరణాలు, తాజాగా 38 మంది కరోనాతో మృతి, 24 గంటల్లో 9,716 కోవిడ్ కేసులు నమోదు, 60,208కు చేరుకున్న యాక్టివ్ కేసుల సంఖ్య, ఇప్పటివరకు 7,510 మరణాలు

Hazarath Reddy

ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కేసుల పెరుగుదలతో పాటుగా మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 39,619 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 9,716 కేసులు నిర్థారణ (AP coronavirus) అయ్యాయి.

Andhra Pradesh: అందరి ముందు ఫ్యాంట్ విప్పి తనిఖీ, అవమానభారం తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య, చీరాల ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో విషాద ఘటన, కళాశాల ఎదుట ఆందోళన చేపట్టిన విద్యార్థులు

Hazarath Reddy

చీరాల్లోని ఓ ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో విషాద ఘటన చోటు చేసుకుంది. పరీక్షకు స్లిప్పులు తెచ్చాడని పాలిటెక్నిక్‌ విద్యార్థిని అందరి ముందు తనిఖీల పేరుతో ఫ్యాంట్ విప్పి అవమానించడంతో తీవ్ర మనస్తాపం చెంది ఓ విద్యార్థి రైలు కిందపడి బలవన్మరణానికి (Polytechnic student commits suicide) పాల్పడ్డాడు.

Advertisement

Lord Hanuman Birth Place: తిరుమలలోని అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలం, ఆంజనేయుని జన్మస్థానంపై ఆధారాలు ప్రకటించిన టీటీడీ, వేంకటాచలానికి అంజనాద్రితోపాటు 20 పేర్లు ఉన్నాయని తెలిపిన జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ ఆచార్య మురళీధరశర్మ

Hazarath Reddy

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుమలే హనుమంతుని జన్మస్థానమని..దీనిని ఆధారాలతో సహా రామనవమి రోజు ప్రకటిస్తామని టీటీడీ (Tirumala Tirupati Devasthanams) ప్రకటించిన సంగతి విదితమే. కాగా నేడు హన్మంతుడి జన్మస్థలంపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధారాలను (TTD Released Proofs on Lord Hanuman Birth Place) ప్రకటించింది.

Ontimitta Ramalayam: ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవస్థానం మూసివేత, భక్తులు లేకుండా ఏకాంతంగా కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు, మే 15 వరకు ఆలయం మూసివేస్తున్నట్లు ప్రకటించిన టీటీడీ

Hazarath Reddy

ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ( Sri Kodanda Rama Swamy temple) ప్రారంభమయ్యాయి. ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకూ ఒంటిమిట్ట కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు (vontimitta kodandarama swamy alayam) ఏకాంతంగా జరగనున్నాయి. ఈనెల 26న సీతారాముల కళ్యాణం భక్తులు లేకుండానే జరగనుంది.

CM YS Jagan Sri Rama Navami Wishes: రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్, కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సీతారాముల కళ్యాణాన్నివేడుకగా జరుపుకోవాలని సూచన

Hazarath Reddy

శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజలందరికి నవమి శుభాకాంక్షలు (CM YS Jagan Sri Rama Navami Wishes) తెలియజేశారు. ప్రజలు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ.. సీతారాముల కళ్యాణాన్ని ప్రజలు వేడుకగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

AP Covid Bulletin: విజయవాడలో కరోనాతో ఒకే కుటుంబంలో 4గురు మృతి, ఒక్కరోజులోనే 35 మందిని బలి తీసుకున్న కోవిడ్, రాష్ట్రంలో తాజాగా 8,987 మందికి కరోనా, ట్యాక్సీ, బస్సు డ్రైవర్లు వ్యాక్సిన్‌ తప్పనిసరిగా తీసుకోవాలని కోరిన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి

Hazarath Reddy

ఏపీలో ఒక్కరోజు వ్యవధిలో 35 మందిని (Covid Deaths) బలి తీసుకుంది. అదే సమయంలో గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 37,922 కరోనా పరీక్షలు నిర్వహించగా 8,987 మందికి పాజిటివ్ (AP Covid Bulletin) అని నిర్ధారణ అయింది.

Advertisement

Devineni Uma Morphed Videos: టీడీపీ నేత దేవినేని ఉమ ఇంటికి సీఐడీ అధికారులు, ఇప్పటికే చీటింగ్‌ కేసు నమోదు చేసిన కర్నూలు సీఐడీ పోలీసులు, ఏపీ సీఎం వైయస్ జగన్ మీద మార్ఫింగ్ వీడియోని ట్వీట్ చేసిన మాజీ మంత్రి

Hazarath Reddy

మంగళవారం సీఐడీ బృందం గొల్లపూడిలోని దేవినేని ఉమా ఇంటికి చేరుకునేసరికి ఆయన పరారయ్యారు. ఫోన్‌ కూడా స్విచ్ఛాఫ్‌ చేశారు. కుటుంబ సభ్యులను ప్రశ్నించగా ఎక్కడికి వెళ్లారో తమకు తెలియదంటుని తెలిపారు.

N. Chandrababu Naidu Birthday: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు, శుభాకాంక్షలు తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్, ధన్యవాదాలు తెలిపిన ఏపీ ప్రతిపక్ష నేత

Hazarath Reddy

ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలిపారు.

YSR Sunna Vaddi Scheme: రూ.128.47 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం నిధులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, రైతులు, రైతు కూలీల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన ఏపీ సీఎం

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం రైతులకు మరో కానుకను అందించింది. రుణం తీసుకుని దాన్ని ఏడాది లోపు తిరిగి చెల్లించిన రైతులందరికీ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద కట్టిన వడ్డీని నేరుగా వారి అకౌంట్లో జమ చేసింది.

AP Covid Update: ఏపీలో మాస్క్ ధరించకపోతే రూ.100 జరిమానా, ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం, కరోనా నియంత్రణకు కోవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు, తాజాగా 5,963 మందికి కరోనా, 27 మంది మృతి

Hazarath Reddy

ఏపీలో మాస్క్ ధరించకపోతే భారీ జరిమానా విధించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించేలా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో రూ. 100 జరిమానా విధించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కొవిడ్ పరిస్థితులపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

Advertisement
Advertisement