ఆంధ్ర ప్రదేశ్
Chandrababu Protest Row: చంద్రబాబు నిరసనకు అనుమతి లేదు, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పర్మిషన్ ఇవ్వడం కుదరదు, నోటీసులు జారీ చేశామని తెలిపిన తిరుపతి అర్భన్‌ ఎస్పీ అప్పలనాయుడు
Hazarath Reddyవైసీపీ ప్ర‌భుత్వ తీరును నిర‌సిస్తూ తిరుపతిలోని గాంధీ విగ్రహ కూడలిలో నిర‌స‌నకు టీడీపీ పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నిరసన కార్యక్రమంలో పాల్గొన‌డానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి (Tirupati airport) చేరుకోగా అక్క‌డ ఆయ‌న‌ను పోలీసులు అడ్డుకున్నారు.ఈ ఘటనపై తిరుపతి అర్భన్‌ ఎస్పీ అప్పలనాయుడు స్పందించారు.
Amit Shah Tirupathi Tour Cancelled: అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు, మార్చి 4న జరిగే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం వాయిదా, ముఖ్యమంత్రులతో మీటింగ్ ఎప్పుడు జరిగేదీ తర్వాత ప్రకటిస్తామని తెలిపిన అధికార వర్గాలు
Hazarath Reddyమార్చి 4, 5 తేదీల్లో దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశం తిరుపతిలో జరగాల్సి ఉంది. ఈ సమావేశంలో పాల్గొనాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భావించినా, తాజాగా ఆయన పర్యటన (Amit Shah Tirupathi Tour Cancelled) రద్దయింది.
AP Municipal Polls 2021: సమావేశం నుంచి టీడీపీ నేత వర్ల రామయ్యని బయటకు పంపించిన ఎస్ఈసీ, అఖిలపక్ష నేతలతో ముగిసిన నిమ్మగడ్డ భేటీ, మునిసిపల్ ఎన్నికలకు అన్ని పార్టీలు సహకరించాలని పిలుపు
Hazarath Reddyత్వరలో జరగనున్న ఏపీ మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో అఖిలపక్ష నేతలతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలపై (AP Municipal Polls 2021) అఖిలపక్ష నేతలతో ఎస్‌ఈసీ చర్చించారు.
AP Shocker: తోటలో అపస్మారక స్థితిలో యువతి, విజయనగరం జిల్లాలో దారుణ ఘటన, విచారణ చేపట్టిన పోలీసులు, శ్రీకాకుళం జిల్లాలో టైరు పేలి ఇద్దరు వ్యక్తులు మృతి
Hazarath Reddyశ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్‌ టైరుకు అధికంగా గాలి నింపడంతో ఆ టైరు పేలిపోయి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. శ్రీకాకుళం జిల్లా కొమనాపల్లి తిమడాం గ్రామానికి చెందిన బొమ్మాళి గోవిందరావు(42) ట్రాక్టర్‌ టైరు పంక్చర్‌ కావడంతో కొమనాపల్లిలోని దాసరి సూర్యనారాయణ (42) షాప్‌ వద్దకొచ్చాడు. టైర్‌కు పంక్చర్‌ వేసిన అనంతరం గాలి ఎక్కిస్తుండగా ఒక్కసారిగా (Tractor Tyre Exploding) పేలిపోయింది.
Andhra Pradesh Shocker: కర్నూలులో విషాదం, ఉల్లి పాయలు దొంగతనానికి వచ్చాడనుకుని వ్యక్తిని రైతులు చంపేశారు, తూర్పు గోదావరి జిల్లాలో గొర్రిఖండి కాలువలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి
Hazarath Reddyకర్నూలులో విషాద ఘటన చోటు చేసుకుంది. రైతులు కల్లాల్లో ఆరబోసిన ఉల్లి గడ్డలను దొంగిలించడానికి వచ్చాడనే నెపంతో (Andhra Pradesh Shocker) ఓ వ్యక్తిని పొలాల్లో ఉల్లి గడ్డలకు కాపలా కాస్తున్న రైతులు ( man was killed when farmers severely attacked) చంపేశారు.
Andhra Pradesh: వాలంటీర్లకు ఆదేశాలు జారీ చేసిన ఎస్ఈసీ, ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉండాలని ఉత్తర్వులు జారీ చేసిన నిమ్మగడ్డ, వాలంటీర్లను వినియోగిస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద చర్యలు
Hazarath Reddyఏపీలో త్వరలో మునిసిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎస్ఈసీ కీలక ఆదేశాలను జారీ చేసింది. రానున్న మున్సిపల్‌ ఎన్నికలను (Municipal Elections) దృష్టిలో పెట్టుకొని వార్డు వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
India Covid Updates: దేశంలో భారీ స్థాయిలో పెరుగుతున్న కోవిడ్ కేసులు, తాజాగా 16,752 మందికి కరోనా, మహారాష్ట్రలో కొత్తగా 8,623 మందికి కోవిడ్, తెలంగాణలో 176 మందికి కరోనా పాజిటివ్, ఏపీలో 118 మందికి కోవిడ్
Hazarath Reddyదేశంలో గత కొద్ది రోజులుగా నిత్యం 16వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24గంటల్లో 16,752 పాజిటివ్‌ కేసులు (India Covid Updates) నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,10,96,731కు పెరిగాయి.
Corona Vaccine for TTD Employees: టీటీడీ ఉద్యోగులకు కరోనా వ్యాక్సిన్, 2021-22 సంవత్సరానికి రూ.2937 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్‌, టీటీడీ పాలక మండలి సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి
Hazarath Reddyతిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు కరోనా వ్యాక్సిన్‌ వేయాలని (Corona Vaccine TTD Employees) నిర్ణయించినట్లు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఎంపిక చేసిన ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మార్చి 1 నుంచి వ్యాక్సినేషన్‌ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Anusha Murder Case Update: అనూష హత్య కేసులో నిందితుడి అరెస్ట్, బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం, దిశా, పలు చట్టాల కింద కేసులు నమోదు, కేసు వివరాలను వెల్లడించిన ఎస్పీ విశాల్‌ గున్ని
Hazarath Reddyపీలోని గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థిని కోట అనూష హత్య కేసులో (Anusha Murder Case Updates) నిందితుడు విష్ణువర్థన్‌రెడ్డిని గుంటూరు రూరల్‌ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శుక్రవారం నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి, హత్య కేసు వివరాలను ఎస్పీ విశాల్‌ గున్ని (SP Vishal Gunny) వెల్లడించారు. పోలీసులు నిందితుడు విష్ణువర్ధన్‌పై దిశా, పలు చట్టాల కింద కేసులను నమోదు చేశారు.
Case Files against JC Prabhakar Reddy: టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు, మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో కోడ్ ఉల్లంఘించిన జేసీ ప్రభాకర్‌రెడ్డి, క్రికెట్‌ కిట్లను పంపిణీ చేస్తూ పట్టుబడిన వైనం
Hazarath Reddyమున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో యువతను ప్రలోభాలకు గురి చేసేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించడమే కాకుండా ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం పట్ల 188, 171–ఇ–హెచ్, సెక్షన్ల కింద టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై శుక్రవారం రాత్రి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు (Case Files against JC Prabhakar Reddy) నమోదైంది.
PSLV-C51: 2021లో తొలి హిట్ వైపు ఇస్రో గురి, పీఎస్‌ఎల్వీ సీ – 51 కౌంట్‌డౌన్ స్టార్ట్, అమెజానియా – 01 అనే ఉపగ్రహంతో పాటు మరో 18 చిన్న తరహా ఉపగ్రహాలు రోదసిలోకి, ఆదివారం ఉదయం 10.24కు పీఎస్‌ఎల్వీ సీ – 51 నింగిలోకి
Hazarath Reddyనింగిలోకి విజయవంతంగా ఉపగ్రహాలను పంపుతూ ప్రపంచదేశాలకు సవాల్ విసురుతున్న ఇస్రో 2021లో తొలి విక్టరీని సాధించేందుకు రెడీ అయింది. పీఎస్‌ఎల్వీ సీ – 51ను నింగిలోకి పంపేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.
Covid Updates: భారీగా పెరుగుతున్న కేసులు, మార్చి 31 వరకు కోవిడ్ నిబంధనలు పొడిగింపు, కొవాగ్జిన్ కోసం భారత్‌తో బ్రెజిల్ ఒప్పందం, దేశంలో తాజాగా 16,488 మందికి కోవిడ్, తెలంగాణాలో కొత్తగా 178 కరోనా కేసులు, ఏపీలో 96 మందికి కరోనా
Hazarath Reddyకోవిడ్ నిబంధనలను మార్చి 31 వరకు కేంద్ర ప్రభుత్వం (Covid Rules) పొడిగించింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ.. మహమ్మారి నుంచి పూర్తి స్థాయిలో బయటపడేందుకు పూర్తి నిఘా అవసరమని... ఈ నేపథ్యంలో కోవిడ్ నిబంధనల అమలును పొడిగిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
Visakhapatnam Port Trust: విశాఖ పోర్టులో కీలక పరిణామం, రూ. 30,000 కోట్ల అవగాహన ఒప్పందాలపై ప్రభుత్వ సంస్థలతో సంతకం, విశాఖపట్నం పోర్టు, హెచ్‌పీసీఎల్‌ మధ్య రూ.26,264 కోట్ల అవగాహన ఒప్పందం
Hazarath Reddyమార్చి 2 నుండి వర్చువల్ మోడ్‌లో జరగనున్న మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2021 కి (Maritime India Summit 2021) ముందు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ (విపిటి) (Visakhapatnam Port Trust) సుమారు 30,000 కోట్ల రూపాయల విలువైన అవగాహన ఒప్పందాలను పోర్ట్ నేతృత్వంలోని పరిశ్రమలు మరియు ప్రభుత్వ సంస్థలతో సంతకం చేసింది
AP's COVID19 Bulletin: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 82 కరోనా కేసులు నమోదు, 611 కి చేరిన ఆక్టివ్ కేసుల సంఖ్య, రాష్ట్రంలో 61 శాతానికి పైగా పూర్తైన రెండో డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్
Team Latestlyఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో 61 శాతం పైగా హెల్త్ కేర్ వర్కర్లకు రెండో మోతాదు వ్యాక్సిన్ డోస్ పంపిణీ పూర్తయినట్లు ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. గురువారం నాటికి 1,20,443 మంది హెల్త్ కేర్ సిబ్బంది రెండో డోస్ వ్యాక్సిన్ అందుకున్నట్లు .....
Vizag Steel Plant Privatization Row: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవైటీకరణ ప్రక్రియలో మరో ముందడుగు? ప్రైవేటీకరణ సాధ్యాసాధ్యాలపై అధ్యయన కమిటీని నియమించిన కేంద్రం, ఆందోళనలు లెక్కచేయకుండా పనులు మరింత వేగవంతం!
Team Latestlyవిశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించే దిశగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పలు మంత్రిత్వ శాఖలతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆర్థిక, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారులతో అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు....
JAC Member Tries to Hit BJP Leader: బీజేపీ నేతపై చెప్పుతో దాడి, ఆ ఛానలే దాడి చేసిన వ్య‌క్తిపై ఫిర్యాదు చేయాలని తెలిపిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, టీడీపీ పాత్ర ఉందని తెలిపిన బీజేపీ పార్టీ ఎంపి జివిఎల్ నరసింహారావు
Hazarath Reddyఓ ఛానల్ లైవ్ డిబేట్ సంధర్భంగా ఇరు పార్టీల నేతలు దూషించుకున్నారు. ఈ దూషణల పర్వం కాస్తా కొట్టుకునే దాకా వెళ్లింది. అమరావతి పరిరక్షణ సమితి జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడు కోలికపుడి శ్రీనివాస రావు మంగళవారం అమరావతిలో ఏబీఎన్ టెలివిజన్ చర్చ సందర్భంగా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణు వర్ధన్ రెడ్డిని తన పాదరక్షలతో దాడి (JAC member Tries to Hit BJP Leader) చేయడానికి ప్రయత్నించారు. ఈ దాడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Vinukonda Road Mishap: తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం, వినుకొండ వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన మినీ లారీ, ముగ్గురు మృతి, 20 మందికి గాయాలు, అందరూ రోజు వారీ కూలీలే..
Hazarath Reddyగుంటూరు జిల్లాలొ ఘోర రోడ్డు ప్రమాదం (Vinukonda Road Mishap)చోటు చేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ముగ్గురి బతుకులు తెల్లారిపోగా.. మరో 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. మంగళవారం తెల్లవారు జామున గుంటూరు జిల్లా వినుకొండ రూరల్‌ మండలం అందుగుల కొత్తపాలెం వద్ద ఓ మినీ లారీ అదుపుతప్పి చెట్టును బలంగా (Three killed in road mishap in Guntur) ఢీకొట్టింది.
COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్‌పై ఎలాంటి భయాలు అక్కర్లేదు, దేనికైనా యంత్రాంగం సిద్ధంగా ఉందన్న రాష్ట్ర ఆరోగ్య శాఖ; రాష్ట్రంలో కొత్తగా 70 కోవిడ్ కేసులు నమోదు
Team Latestly3 టి - (ట్రేసింగ్, టెస్టింగ్ అండ్ ట్రీటింగ్) స్ట్రాటజీని రాష్ట్రంలో కట్టుదిట్టంగా అమలు చేస్తూ ఏపి ఆరోగ్యశాఖ సమర్థవంతగా కోవిడ్ మహమ్మారిపై పోరాడి విజయం సాధించింది. ఈ క్రమంలో కోవిడ్‌ యొక్క సెకండ్ వేవ్ వచ్చినా ఎదుర్కోవటానికి తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ...
AP Cabinet Meeting Highlights: ఈబీసీ మహిళలకు మూడేళ్లకు రూ. 45 వేల ఆర్థిక సాయం, అమరావతికి సంబంధించి కీలక నిర్ణయం, ఈ ఏడాది నవరత్నాల పథకాలకు మంత్రి వర్గ ఆమోదం, కేబినెట్‌ భేటీలో ఏపీ సీఎం తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశం ముగిసింది. సచివాలయం మొదటి బ్లాక్‌ సమావేశ మందిరంలో మంగళవారం కొనసాగిన కేబినెట్‌ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌, మంత్రులు కొడాలి నాని, ఆదిమూలపు సురేష్‌, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గతంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు (AP Cabinet Meeting Highlights) కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
Durga Temple Employees Suspended: కనకదుర్గమ్మ గుడిలో అవినీతి కొండలు, 13 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసిన దేవాదాయశాఖ, అవినీతి అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన ఏసీబీ
Hazarath Reddyవిజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ గుడిలో అవినీతికి పాల్పడిన 13 మంది ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇంద్రకీలాద్రిపై (Kanaka Durgamma Temple) అక్రమాల నిధి ఇంటి దొంగల పనే అని ఏసీబీ నివేదిక తేల్చింది.