ఆంధ్ర ప్రదేశ్

AP Municipal Election Results 2021: ఫ్యాన్ హోరులో కొట్టుకుపోయిన టీడీపీ, బీజేపీ-జనసేన, జగన్ సర్కారుకు ఏకపక్ష విజయాన్ని కట్టబెట్టిన ఓటర్లు, విజయవాడ, గుంటూరు, విశాఖ, కర్నూలు, ఇంకా పలు జిల్లాల్లో వైసీపీదే ఆధిక్యం

Hazarath Reddy

మున్సిపల్‌ ఎన్నికల చరిత్రలో వైఎస్సార్‌సీపీ ఏకపక్ష విజయాన్ని సాధించింది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం ( AP Municipal Election Results 2021) కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అన్ని చోట్ల విజయభేరి మోగించింది. అన్ని జిల్లాల్లోనూ వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతుంది. ఫ్యాన్‌ దూకుడును అందుకోలేక టీడీపీ, బీజేపీ, జనసేన వెనుకబడిపోయాయి.

YSRCP MLA Ambati Rambabu: ప్రజలు మూడు రాజధానులకు జై కొట్టారు, ప్రతిపక్షాలకు ఇక పనే లేదు, మునిసిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు

Hazarath Reddy

దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్, సొంత పుత్రుడు లోకేష్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో టీడీపీ తుక్కు తుక్కుగా ఓడిపోయిందని, రాష్ట్రంలో ఈ దెబ్బతో టీడీపీ కనుమరుగైపోయిందని అంబటి రాంబాబు తెలిపారు.

AP Municipal Poll Results 2021: గుంటూరులో వైసీపీదే హవా, విజయవాడ కార్పొరేషన్‌లో 19 డివిజన్లలో వైసీపీ విజయం, ఒంగోలుతో సహా 5 కార్పోరేషన్లు అధికార పార్టీ కైవసం, తాడిపత్రి ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ, ఏపీ మునిసిపల్ పోలింగ్ లైవ్ అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి

Hazarath Reddy

ఏపీ మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించే దిశగా దూసుకువెళుతోంది. చాలా చోట్ల కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో క్లీన్‌స్వీప్‌ దిశగా అధికార పార్టీ ముందుకు వెళుతోంది. అన్ని జిల్లాల్లోనూ వైఎస్సార్‌సీపీ తన హవా కొనసాగిస్తోంది. ఇక ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న గుంటూరులోనూ అధికార పార్టీనే ఆధిపత్యం సాధించింది.

AP Municipal Poll Results 2021: దూసుకుపోతున్న వైసీపీ, ప్రతిచోటా ఆధిక్యంలో జగన్ సర్కారు, డోన్‌ మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ కైవసం, కనిగిరి మున్సిపాలిటీలో వైసీపీ క్లీన్ స్వీప్, కొవ్వూరు మునిసిపాలిటీ వైసీపీ ఖాతాలోకి..

Hazarath Reddy

ఏపీ మునిసిపల్ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. కౌంటింగ్ ఆరంభం నుంచి వైసీపీ ఆధిక్యత కనపరుస్తూ వస్తోంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా ముందుగా లెక్కించిన పోస్టల్‌ బ్యాలెట్‌ల్లో వైఎస్ఆర్‌సీపీదే ఆధిక్యం సాధించింది. ప్రకాశం జిల్లాలోని మున్సిపాలిటీల్లో వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతుంది.

Advertisement

Gollapali Road Accident: నూజివీడులో ఆటోను ఢీకొట్టిన లారీ, ఆరుగురు అక్కడికక్కడే మృతి, తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసిన వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపిన మంత్రి

Hazarath Reddy

ఏపీలో కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నూజివీడు దగ్గర కూలీలతో వెళ్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం (Gollapali Road Accident) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా..మరో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి.

AP Municipal Election Results 2021: ఆ మూడు స్థానాల పైనే అందరి కన్ను, ఏపీలో మొదలైన పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు, మరి కొద్ది గంటల్లో ఫలితాలు, ఏలూరు మినహా అన్ని స్థానాలకు కౌంటింగ్

Hazarath Reddy

ఏపీలో పురపాలక ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభమైంది. 10 నుంచి 11 గంటల మధ్య తొలి ఫలితం (AP Municipal Election Results 2021) వెలువడనుంది. సాయంత్రం ఆరు గంటల్లోగా అన్ని చోట్లా ఫలితాలు (municipal corporations, municipalities/nagar panchayats) వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే విశాఖల మాత్రం కొంచెం ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

AP Covid Report: ఏపీలో మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు, తాజాగా 175 మందికి కరోనా పాజిటివ్, ఇద్దరు మృతితో 7,182కి చేరుకున్న మరణాల సంఖ్య, 8,91,563కి చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య

Hazarath Reddy

ఏపీలో మరోసారి 100కి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 40,448 కరోనా పరీక్షలు నిర్వహించగా 175 మందికి కరోనా పాజిటివ్ (AP Corona Cases) అని నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 40 కొత్త కేసులు వెల్లడి కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 31 కేసులు గుర్తించారు. కృష్ణా జిల్లాలో 24, విశాఖ జిల్లాలో 20 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

Tirupati By Election: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీనుంచి తప్పుకున్న జనసేన, బీజేపీ అభ్యర్థికి మద్దతు, ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ హఠాన్మరణంతో అనివార్యమైన ఉప ఎన్నిక, సిట్టింగ్ సీటు నిలబెట్టుకునేందుకు అధికార పార్టీ కుస్తీలు

Hazarath Reddy

తిరుపతి పార్లమెంట్ పరిధిలో చిత్తూరు జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలు, నెల్లూరు జిల్లాలో నాలుగు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ ఏడు స్థానాలు వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. కాబట్టి ఉప ఎన్నికలో గెలుపు నల్లేరుపై నడకేనని అధికార పార్టీ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు.

Advertisement

AP Municipal Polls 2021 Counting: కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్, హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రెండు చోట్ల కౌంటింగ్ నిలిపివేత, రేపు 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీలకు ఓట్ల లెక్కింపు, విస్తృత ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం

Hazarath Reddy

ఏపీలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, నగర పంచాయతీలకు ఈ నెల 10న ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు (మార్చి 14) ఓట్ల లెక్కింపు (AP Municipal Polls 2021 Counting) చేపట్టనున్నారు. 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్, చిలకలూరిపేట మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు నిలిపివేశారు.హైకోర్టు తుది తీర్పు తర్వాతే ఆ రెండు చోట్ల కౌంటింగ్ చేపట్టనున్నారు.

India Coronavirus: దేశంలో మళ్లీ కరోనా కల్లోలం, పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్, స్కూళ్లు మూసివేత, మళ్లీ వణుకుతున్న మహారాష్ట్ర, ఏపీలో వ్యాక్సిన్ తీసుకున్న వృద్ధుడు మృతి, తెలంగాణలో పెరుగుతున్న కేసులు, తాజాగా దేశంలో 24,882 మందికి కరోనా

Hazarath Reddy

దేశంలో గత 24 గంటల్లో 24,882 మందికి కరోనా నిర్ధారణ అయింది. కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... 19,957 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,13,33,728కు (India Coronavirus) చేరింది.గడచిన 24 గంట‌ల సమయంలో 140 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,58,446కు పెరిగింది.

Indian Railways: రైల్వేశాఖ మరో తీపి కబురు, విజయవాడ నుంచి కొత్తగా 12 స్పెషల్ ట్రైన్స్, ఇప్పటికే 110 రైళ్లు విజయవాడ మీదుగా ప్రయాణం, ఏప్రిల్‌ 1 నుంచి కొత్తగా 12 రైళ్లు ప్రారంభమవుతాయని తెలిపిన రైల్వే శాఖ

Hazarath Reddy

ఏపీ నుంచి రైలు ప్రయాణం చేసే వారికి శుభవార్త, కరోనా కారణంగా రద్దయిన పలు రైళ్లు మళ్లీ పట్టాలెక్కుతున్నాయి. తాజాగా ఏపీ లో విజయవాడ నుంచి మరో 12 రైళ్లను (12 new Special passenger trains) పునరుద్ధరించనున్నారు. ఇప్పటికే విజయవాడ (vijayawada) మీదుగా రోజూ 110 రైళ్లు తిరుగుతున్నాయి.

AP's COVID19 Report: ఆంధ్రప్రదేశ్‌లో తొలి కరోనా కేసు నమోదై నేటికి ఏడాది, రాష్ట్రంలో మళ్లీ కోరలు చాస్తున్న కోవిడ్, ఇటీవల కాలంలో తొలిసారిగా 200 దాటిన పాజిటివ్ కేసులు

Team Latestly

ఆంధ్రప్రదేశ్‌లో తొలి కరోనా కేసు నమోదై నేటికి సరిగ్గా ఏడాదవుతోంది. గతేడాది 2020, మార్చి 12న ఇటలీ నుంచి నెల్లూరు వచ్చిన ఓ వ్యక్తికి కరోనా ఉందని తేలడంతో రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదయింది. ఆ తర్వాత వారానికే మరొకటి, అలా వైరస్ ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందింది.....

Advertisement

COVID19 in AP: తాడేపల్లిగూడెం మునిసిపల్ కార్యాలయంలో కోవిడ్ కలకలం, సుమారు 10 మంది అఫీసర్లకు సోకిన వైరస్, ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 174 కరోనా కేసులు నమోదు

Team Latestly

చిత్తూరు జిల్లాలోనే గడిచిన ఒక్కరోజులో అత్యధికంగా 60 కోవిడ్19 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 26, విశాఖ నుంచి 23 మరియు గుంటూరు జిల్లా నుంచి 12 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మునిసిపల్ కార్యాలయంలో 10 మంది ఉద్యోగులకు కోవిడ్ సోకడం కలకలం రేపుతోంది....

Kollu Ravindra Arrest: టీడీపి నేత కొల్లు రవీంద్ర అరెస్ట్, బెయిల్‌పై విడుదల; అరెస్టును తీవ్రంగా ఖండించిన చంద్రబాబు, బీసీల పట్ల జగన్ ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆగ్రహం

Team Latestly

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బుధవారం మచిలిపట్నంలో పోలీసు సిబ్బంది విధులకు అంతరాయం కలిగించారనే అభియోగంపై మాజీ మంత్రి, టిడిపి నాయకుడు కొల్లు రవీంద్రను మచిలిపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు....

AP Municipal Elections 2021: ప్రశాంతంగా ముగిసిన ఏపీ మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌, మొత్తం 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలకు ఎన్నికలు, మధ్యాహ్నం 3 గంటల వరకు 53.57 శాతం పోలింగ్‌ నమోదు

Hazarath Reddy

ఏపీ మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు. క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు. మొత్తం 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీల్లో ( AP Municipal Elections 2021) సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 53.57 పోలింగ్‌ శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈనెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.

AP Municipal Polls 2021: బిర్యాని ప్యాకెట్లలో ముక్కు పుడకలు, పడమట లంకలో ఓటు వేసిన పవన్ కళ్యాణ్, విశాఖపట్నంలో ఓటేసిన విజయసాయి రెడ్డి, ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయని తెలిపిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ

Hazarath Reddy

ఉదయం 11 గంటల వరకు కృష్ణా జిల్లా- 32.64 శాతం, చిత్తూరు జిల్లా-30.12 శాతం, ప్రకాశం జిల్లా-36.12 శాతం, వైఎస్సార్‌ జిల్లా -32.82 శాతం, నెల్లూరు జిల్లా-32.67 శాతం, విశాఖ జిల్లా-28.50 శాతం, కర్నూలు జిల్లా -34.12 శాతం, గుంటూరు-33.62 శాతం, శ్రీకాకుళం-24.58 శాతం, తూర్పుగోదావరి-36.31శాతం, అనంతపురం-31.36 శాతం, విజయనగరం-31.97 శాతం, పశ్చిమ గోదావరి-34.14 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు వెల్లడించారు.

Advertisement

AP Municipal Elections 2021: ఓటు వేసేందుకు గుర్తింపు కార్డు అడుగుతున్నారా, 18 ప్ర‌త్యామ్నాయ ఫోటో గుర్తింపు కార్డుల‌లో ఏద‌యినా చూపించవచ్చని తెలిపిన ఎన్నికల కమిషన్

Hazarath Reddy

ఆంధ్రప్రదేవ్ మున్నిపల్ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మొదలయింది. అయితే ఓటర్లు ఓటు వేసేందుకు ఏం గుర్తింపు కార్డులు తీసుకువెళ్లాలనే దానిపై చాలామందికి అనుమానాలు ఉన్నాయి. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. ఓటర్ జాబితాలో పేరున్న వారంతా.. ఓటర్ ఐడీ అందుబాటులో లేకున్నా ఓటు వేయవచ్చని స్పష్టం చేసింది.

Covid Vaccinaton: వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ముగ్గురు మృతి, ముంబై, పశ్చిమబెంగాల్‌, ఏపీలోని చిత్తూరులో ఒక్కొక్కరు చొప్పున మృతి, బెంగుళూరులో 103 ఏళ్ల మహిళకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ తొలి డోసు, కరోనా లేదని నకిలీ రిపోర్ట్‌ సృష్టించిన కుటుంబంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

Hazarath Reddy

ఏపీలో చిత్తూరు జిల్లాలోని పాలసముద్రంకు చెందిన పట్రాజు జగదమ్మ(52) మధుమేహంతో బాధపడుతోంది. మూడో విడతలో శనివారం ఆమె స్థానిక పీహెచ్‌సీలో టీకా తీసుకుంది. ఈ క్రమంలో ఆమెకు జ్వరం రావడంతో మంగళవారం సాయంత్రం పీహెచ్‌సీలో చూపించారు. పరిస్థితి విషమించడంతో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.

AP Municipal Polls 2021: ఏపీలో పుర, నగర పాలక పంచాయతీల్లో ప్రారంభమైన ఎన్నికల పోలింగ్‌, ఏలూరు కార్పొరేషన్‌, చిలకలూరిపేట మున్సిపాలిటీల్లో ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Hazarath Reddy

ఏపీలోని పుర, నగర పాలక పంచాయతీల్లో ఎన్నికల పోలింగ్‌ (Municipal Elections Polling) ప్రారంభమైంది. ఏలూరు కార్పొరేషన్‌, చిలకలూరిపేట మున్సిపాలిటీల్లో ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటలకు వరకు పోలింగ్‌ జరుగుతుంది.

AP Covid Updates: భారీ ఊరట..ఏపీలో గత 24 గంటల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు, తాజాగా 118 మందికి పాజిటివ్, 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 38 మందికి కోవిడ్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 45,079 కరోనా పరీక్షలు నిర్వహించగా 118 మందికి పాజిటివ్ (AP Covid Updates) అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 38 మందికి కరోనా సోకినట్టు వెల్లడైంది. కృష్ణా జిల్లాలో 21, విశాఖ జిల్లాలో 15 పాజిటివ్ కేసులు (Coronavirus Report in AP) నమోదయ్యాయి.

Advertisement
Advertisement