ఆంధ్ర ప్రదేశ్

AP's COVID Update: ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్న 4.96 లక్షల కోవిషీల్డ్ డోసులు, టీకా పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు, రాష్ట్రంలో మరో 197 కరోనా కేసులు నమోదు

Team Latestly

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జనవరి 16న కోవిడ్ -19 వ్యాక్సిన్ పంపిణీకి రాష్ట్ర ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే పుణెలోని సీరమ్ సంస్థ నుంచి రాష్ట్రానికి సుమారు 4,96,680 వ్యాక్సిన్ మోతాదుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ చేరుకుంది....

Jagananna Amma Vodi: ప్రతి గ్రామానికీ అండర్‌ గ్రౌండ్‌ ఇంటర్నెట్‌ కేబుల్‌, మూడేళ్లలో 100 శాతం అక్షరాస్యతే లక్ష్యం, అమ్మఒడి వద్దనుకుంటే ల్యాప్‌టాప్ ఆప్సన్, అమ్మఒడి కార్యక్రమంలో ఏపీ సీఎం వైయస్ జగన్

Hazarath Reddy

పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల అమలుకు పెద్ద పీఘ వేస్తున్నారు. ఇప్పటికే అనేక పథకాలను ప్రవేశపెట్టిన ఏపీ సీఎం అమ్మఒడి పథకం (Jagananna Amma Vodi) ద్వారా పేద పిల్లల చదువుకు అండగా నిలుస్తున్నారు.

Covishield Vaccine: తెలుగు రాష్ట్రాల్లో భద్రంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్, ఏపీలో గన్నవరంకు..తెలంగాణలో కోఠి ఆరోగ్య కార్యాలయానికి చేరుకున్న వ్యాక్సిన్లు, రేపు జిల్లాలకు కోవిడ్ వ్యాక్సిన్ల పంపిణీ

Hazarath Reddy

దేశవ్యాప్తంగా వివిధ నగరాలకు కోవిడ్‌ వ్యాక్సిన్లు చేరుకున్నాయి. ఇప్పటికే న్యూఢిల్లీ, ముంబయి, చెన్నై, అహ్మదాబాద్‌కు చేరుకుంది. అలాగే మన తెలుగు రాష్ట్రాలకు కూడా కోవిషీల్డ్ వ్యాక్సిన్లు చేరుకున్నాయి. తెలంగాణలో హైదరాబాద్ లోని కోఠి ఆరోగ్య కార్యాలయానికి ఈ వ్యాక్సిన్లు (Covishield Vaccine) చేరుకోగా ఏపీలో గన్నవరం శీతలీకరణ కేంద్రానికి ఈ వ్యాక్సిన్లు చేరుకున్నాయి.

AP Local Body Elections Row: ఎస్ఈసీ నిమ్మగడ్డకు షాకిచ్చిన హైకోర్టు, ఎన్నికల షెడ్యూల్‌ రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఏపీ హైకోర్టు, రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవీ సాయి ప్రసాద్‍ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న ఎస్ఈసీ

Hazarath Reddy

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ (Nimmagadda Ramesh Kumar) విడుదల చేసిన పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ ని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు పంచాయతీ రద్దు చేసింది. కాగా పంచాయతీ ఎన్నికలపై ఎస్‌ఈసీ‌ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (AP government) కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సోమవారం హైకోర్టు (AP High Court) ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది.

Advertisement

Amma Vodi: జగనన్న అమ్మ ఒడి డబ్బులు విడుదల, రెండో దఫా మొత్తం రూ.6,673 కోట్లను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, రాష్ట్రంలో చదువుల విప్లవం తీసుకొచ్చామని తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి

Hazarath Reddy

నవరత్నాల హామీల్లో అత్యంత కీలకమైన ‘జగనన్న అమ్మ ఒడి’ (JAGANANNA AMMAVODI) రెండో ఏడాది చెల్లింపులను నెల్లూరులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 44,48,865 మంది తల్లుల ఖాతాల్లో 15 వేల రూపాయల చొప్పున రూ.6,673 కోట్లు జమ చేస్తున్నారు.

Anantapur Shocker: అక్రమ సంబంధం, నీ మరదల్ని చంపేశా వెళ్లి చూసుకో అంటూ బావకి ఫోన్, అనంతపురంలో విషాద ఘటన, అనాధలైన ఇద్దరు పిల్లలు

Hazarath Reddy

ఏపీలో అనంతపురం నగరంలో అక్రమ సంబంధం మహిళ హత్యకు దారి తీసింది. ఆ మహిళ హత్యతో ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు.

Covid Updates: దేశంలో కొత్తగా 18,645 కోవిడ్ కేసులు నమోదు, తెలంగాణలో 351 మందికి కరోనా పాజిటివ్, ఏపీలో తాజాగా 199 కోవిడ్ పాజిటివ్ కేసులు

Hazarath Reddy

దేశంలో గడిచిన 24 గంటల్లో 18,645 కరోనా పాజిటివ్‌ కేసులు (New Covid numbers in India) నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసులు 1,04,50,284కు (Covid numbers in India) పెరిగాయి. కొత్త వైరస్‌ నుంచి 19,299 మంది కోలుకొగా.. ఇప్పటి వరకు 1,00,75,950 మంది డిశ్చార్జి అయ్యారు.

Jagananna Amma Vodi: అమ్మఒడి 11న యధాతథంగా జరుగుతుంది, విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది, ష్‌ స్పష్టం చేసిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

Hazarath Reddy

ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందుకు ప్రభుత్వ పథకాలను వెంటనే ఆపివేయాలని ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దీనిపై స్పందించింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ‘జగనన్న అమ్మఒడి’ పథకం (Jagananna Amma Vodi) రెండో విడత కార్యక్రమం ఈనెల 11న యథాతథంగా జరుగుతుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ (Education MInister adimulapu suresh) స్పష్టం చేశారు.

Advertisement

AP Local Body Elections: సంక్షేమ పథకాలు ఆపేయండి, కొత్త సర్క్యులర్‌ జారీ చేసిన ఎన్నికల సంఘం, ఎస్ఈసీ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేసిన జగన్ సర్కారు, హౌస్‌ మోషన్ పిటిషన్ దాఖలు, సోమవారం విచారణకు..

Hazarath Reddy

ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ పంచాయితీ ఎన్నికల నిర్వహణ ఉత్తర్వుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (YS Jagan Government) హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. శనివారం హైకోర్టులో (AP High Court) హౌస్‌ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా..అది సోమవారం విచారణకు రానుంది.

AP Local Body Elections 2021: ప్రజల ప్రాణాలే ముఖ్యం, ఎన్నికలు నిర్వహించలేం.. కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియలో అధికారులు బిజీ, ఎస్ఈసీ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేయనున్న ఏపీ ప్రభుత్వం, ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ

Hazarath Reddy

హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం... హౌస్ మోషన్‌కు సిద్ధమైంది. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కారణంగా ఎన్నికల నిర్వహణ సాధ్యంకాదని ప్రభుత్వం వాదించనున్నట్టు తెలుస్తోంది. హైకోర్టుకు నేటి నుంచి సెలవులు కావడంతో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది.

AP's COVID Update: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 319 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 2,832గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య, యూకే స్ట్రెయిన్ కట్టడి కోసం కఠిన నిబంధనల అమలుకు మార్గదర్శకాలు జారీ

Team Latestly

గడిచిన ఒక్కరోజులో ఎక్కువగా కృష్ణా జిల్లా నుంచి 46, చిత్తూరు నుంచి 44 మరియు గుంటూరు జిల్లా నుంచి 39 కొత్త కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు....

COVID in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 295 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 2,822గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య, వ్యాక్సిన్ పంపిణీకి అని ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం

Team Latestly

వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. సంక్రాంతి కంటే ముందే వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. కోవిడ్ టీకాకి సంబంధించిన ఎలాంటి సందేహాలు ఉన్నా, 104కి ఫోన్ చేయాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు....

Advertisement

AP Covid Report: ఏపీలో తాజాగా 289 మందికి కోవిడ్ పాజిటివ్, ముగ్గురు మృతి, 8,80,981కి చేరుకున్న మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య, 428 మంది కొవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 51,207 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 289 మందికి పాజిటివ్ (AP Covid Report) అని నిర్ధారణ అయింది.

Special Assistance to States: గుడ్ న్యూస్..ఏపీకి రివార్డును ప్రకటించిన కేంద్రం,కేంద్రీకృత సంస్కరణల్లో మూడిండిని పూర్తిచేసి మొదటి వరసలో నిలిచిన ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు, రెండు రాష్ట్రాలకు రూ. 1004 కోట్ల రివార్డు

Hazarath Reddy

ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్దేశించిన నాలుగు పౌరుల కేంద్రీకృత సంస్కరణల్లో మూడింటిని పూర్తి చేసిన మొదటి రాష్ట్రాలుగా మధ్యప్రదేశ్ మరియు ఆంధ్రప్రదేశ్ నిలిచాయి. హర్షం వ్యక్తం చేసిన కేంద్రం ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు రివార్టును (additional financial assistance) ప్రకటించింది. పౌర సేవల సంస్కరణల్లో నాలుగింట మూడు అమలు చేసినందుకుగాను రివార్డును (Special Assistance to States) అందిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది.

Justice Arup Goswami: ఏపీ హైకోర్టు సీజేగా అరూప్‌ గోస్వామి ప్రమాణం, జస్టిస్‌ గోస్వామిచే ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, హాజరయిన సీఎం వైయస్ జగన్, ఏపీ కొత్త సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ తదితరులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అరూప్‌ గోస్వామి (AP High Court Chief Justice) ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్‌ గోస్వామిచే రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సీజేగా గోస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.

CM YS Jagan Review: చరిత్రలో నిలిచిపోయేలా కాలనీలు, కలెక్టర్లు సవాల్‌గా తీసుకోవాలి, స్పందన కార్యక్రమంలో ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం ప్రారంభ అంశంపై జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించిన ఏపీ సీఎం వైయస్ జగన్

Hazarath Reddy

స్పందన కార్యక్రమంలో భాగంగా ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Review) ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం ప్రారంభ అంశంపై జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం ప్రారంభం కార్యక్రమం జనవరి 20 వరకూ కొనసాగించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Sankranthi Holidays in AP: ఏపీలో 8 రోజుల పాటు సంక్రాంతి సెలవులు, జనవరి 11 న అమ్మ ఒడి రెండవ విడత కార్యక్రమం, విద్యారంగంలో ఏపీని నంబర్ వన్‌గా నిలుపుతామని తెలిపిన విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్

Hazarath Reddy

ఆంధప్రదేశ్‌లో సంక్రాంతి సెలవుల తేదీలను ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. రాష్ట్రంలో ఆరు రోజుల పాటు సంక్రాంతి సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఈ నెల 12 నుంచి 17 వరకు సెలవులు ఉండనున్నట్లు పేర్కొంది. 9న రెండవ శనివారం...10వ తేదీ ఆదివారం కావడంతో మరో రెండు రోజులు సెలవులు (Sankranthi Holidays in AP) కలిసిరానున్నాయి. దీంతో మొత్తం 8 రోజులు సెలవులు వచ్చాయి.

Ramateertham Temple: సోము వీర్రాజు అరెస్ట్, రామతీర్థంలో సెక్షన్‌ 30 అమల్లోకి, ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పని సరి, రాముని విగ్రహ ధ్వంసం ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశించిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

శ్రీరాముడి విగ్రహ ధ్వంసం ఘటన అనంతర పరిణామాలతో అట్టుడికిపోతున్న విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలో (Ramateertham Temple Incident) ఆంక్షలను విధించారు. రామతీర్థం పరిసరాల్లో సోమవారం సెక్షన్‌ 30ను రెవెన్యూ యంత్రాంగం విధించింది

AP Covid Report: ఏపీలో అత్యంత తక్కువగా కేసులు నమోదు, తాజాగా 128 మందికి కోవిడ్ పాజిటివ్, ముగ్గురు మృతితో 7,118కి చేరుకున్న మరణాల సంఖ్య, 2,943 మందికి కొనసాగుతున్న చికిత్స

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 29,714 కరోనా పరీక్షలు నిర్వహించగా 128 మందికి పాజిటివ్ (AP Covid Report) అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 21 కేసులు గుర్తించారు. తూర్పు గోదావరిలో 19, కృష్ణా జిల్లాలో 15, గుంటూరు జిల్లాలో 15, కర్నూలు జిల్లాలో 12 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 1, పశ్చిమ గోదావరి జిల్లాలో 3, ప్రకాశం జిల్లాలో 3 కేసులు (Coronavirus) నమోదయ్యాయి.

Bandi Sanjay: వైసీపీ మూటా ముల్లె సర్దుకునే రోజు దగ్గర పడింది, బైబిల్‌ పార్టీ కావాలో..భగవద్గీత పార్టీ కావాలో తిరుపతి ప్రజలే తేల్చుకోండి, ఏపీ ప్రభుత్వం మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్

Hazarath Reddy

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (Telangana BJP chief Bandi Sanjay) ఏపీ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. త్వరలో తిరుపతి పార్లమెంట్ కు ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో (Tirupati Bypoll) బైబిల్‌ పార్టీ కావాలో..? భగవద్గీత పార్టీ కావాలో..? తిరుపతి ప్రజలే తేల్చుకోవాలంటూ పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement