ఆంధ్ర ప్రదేశ్

Nuclear Power Plant in AP: ఏపీలో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు, శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ వద్ద ఏర్పాటు చేయనున్నట్లు తెలిపిన కేంద్ర ప్రభుత్వం

Hazarath Reddy

ఏపీలో అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయన్నుట్లు కేంద్ర ప్రభుత్వం (Nuclear Power Plant in AP) ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ వద్ద అణు విద్యుత్ ప్లాంట్‌ ఏర్పాటుకు అమెరికాకు చెందిన వెస్టింగ్ హౌజ్ ఎలక్ట్రిక్ కంపెనీతో చర్చిస్తున్నట్లు తెలిపారు. 1,208 మెగావాట్ సామర్థ్యం కలిగిన 6 అణు రియాక్టర్లను ఏర్పాటు చేయనున్నారు. అన్ని రకాల అధ్యయనాల తర్వాతే కొవ్వాడ ప్రాంతాన్ని (kovvada atomic power plant) ఎంపిక చేసినట్లు తెలిపారు. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ సూచించిన అర్హతల ప్రకారమే కొవ్వాడ ఎంపిక జరిగిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

Polovaram Funds Row: పోలవరం అంచనా వ్యయాన్ని సవరించిన కేంద్రం, రూ.47,725.74 కోట్లకు ఒకే చేసిన కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బకాయి నిధులు త్వరలో విడుదల

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తూ వస్తున్న పోలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని (revise the estimated cost of Polavaram) కేంద్రం సవరించింది. 2017–18 ధరల ప్రకారం రూ.47,725.74 కోట్లకు సవరించేందుకు కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ( Gajendrasingh Shekhawat) గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫైలుపై సోమవారం ఆయన సంతకం చేసి కేంద్ర ఆర్థికశాఖకు పంపారు. కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ), కేంద్ర ఆర్థిక శాఖ ఏర్పాటు చేసిన రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌ కమిటీ(REC) ఇప్పటికే అంచనా వ్యయాన్ని సవరించేందుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ ఫైలుపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సంతకం చేయడంమే మిగిలి ఉంది.

Amaravati Land Deals Row: హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం, అమరావతి భూముల స్కాంలో ఏసీబీ దర్యాప్తును నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేయాలంటూ పిటిషన్

Hazarath Reddy

అమరావతి భూముల స్కాంలో ఏసీబీ దర్యాప్తును నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును (AP government has approached the Supreme Court) ఆశ్రయించింది. ఈ మేరకు సోమవారం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేయాలని ఈ పిటిషన్‌లో కోరింది. కేసు దర్యాప్తుపై స్టే విధించడం వల్ల కీలకమైన ఆధారాలను నిందితులు నాశనం చేసే అవకాశం ఉందని తన పిటిషన్‌లో పేర్కొంది.

Mudragada Padmanabham: సారీ..నేను రాలేను, కాపు ఉద్యమానికి నాయకత్వం వహించలేనని తెలిపిన ముద్రగడ పద్మనాభం, జేఏసీ నేతల అభ్యర్థనను తిరస్కరించిన మాజీ మంత్రి

Hazarath Reddy

కాపులకు బీసీ రిజర్వేషన్లు సాధించేందుకు చేపట్టిన ఉద్యమం నుంచి పక్కకు తప్పుకున్నట్టు ఇప్పటికే ప్రకటించిన మాజీమంత్రి, ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను (Mudragada Padmanabham) సోమవారం కాపు జేఏసీ నేతలు కలిశారు.మళ్లీ మీరే ఉద్యమ నేతగా (Kapu reservation movement) కొనసాగాలంటూ ఈ సందర్భంగా వారు ముద్రగడను కోరారు. అయితే జేఏసీ నేతల అభ్యర్థనను ఆయన సున్నితంగా తిర్కసరించారు. కాపు ఉద్యమంలోకి తాను వచ్చేది లేదని (I can't lead Kapu reservation movement) ముద్రగడ పద్మనాభం మరోమారు స్పష్టం చేశారు.

Advertisement

AP Coronavirus Update: నందిగామ వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా, రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన కేసులు, తాజాగా 6,235 మందికి కరోనా, యాక్టివ్‌గా 74,518 కేసులు, 5,410కు చేరిన మరణాలు

Hazarath Reddy

ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,235 కరోనా కేసులు (AP Coronavirus Update) నమోదయ్యాయి. ఇప్పటివరకు ఏపీలో 6,31,749కి కరోనా కేసులు (COVID-19 cases) చేరాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు కరోనాతో 51 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 5,410 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో 74,518 యాక్టివ్ కేసులున్నాయి. ఈ రోజు వరకు కరోనా నుంచి కోలుకుని 5,51,821 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 51.60 లక్షల కరోనా టెస్టుల నిర్వహించారు.

Status Quo Continues on AP Capital: ఏపీ రాజధాని తరలింపు, అక్టోబరు 5 వరకు స్టేటస్ కోను పొడిగించిన ఏపీ హైకోర్టు, అంశాల వారీగా పిటిషన్ల విచారణ జరపాలని నిర్ణయం

Hazarath Reddy

పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల (Three Capitals) నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. దీనిని వ్యతిరేకిస్తూ హైకోర్టులో చాలామంది పిటిషన్లు వేశారు. ఈ నేపథ్యంలో అమరావతి నుంచి ఏపీ రాజధాని తరలింపుపై గతంలో ఇచ్చిన స్టేటస్ కోను హైకోర్టు అక్టోబరు 5 వరకు (Status Quo Continues on AP Capital) పొడిగించింది. రాజధాని పిటిషన్లపై నేడు విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు (Andhra Pradesh high court) తదుపరి విచారణను అక్టోబరు 5కి వాయిదా వేసింది. ఇకపై అంశాల వారీగా పిటిషన్ల విచారణ జరపాలని ఈ సందర్భంగా న్యాయస్థానం నిర్ణయించింది.

AP Police Seva App: ఏపీ సర్కారు మరో సంచలనం, దేశంలో తొలిసారిగా ఏపీ పోలీస్ శాఖ యాప్ లాంచ్, 87 సర్వీసులు యాప్ ద్వారా అందుబాటులోకి

Hazarath Reddy

AP Covid Report: కరోనాని ఆపేది ఇంట్లో మాస్కులే, రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన కేసులు, తాజాగా 7,738 మందికి కరోనా, 5 లక్షలు దాటిన డిశ్చార్జ్ కేసులు, 5,359కు చేరిన మరణాల సంఖ్య

Hazarath Reddy

ఏపీలో గడిచిన 24 గంటల్లో 10,608 మంది కరోనా వైరస్‌ (AP Covid Report) బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కరోనా విజేతల సంఖ్య 5,41,319కు చేరుకుంది. నిన్న ఒక్కరోజు 70,455 శాంపిళ్లను పరీక్షించగా, 7,738 మందికి కరోనా పాజిటివ్‌గా (COVID19 positive cases) తేలింది. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్‌ టెస్టుల సంఖ్య 51,04,131కు చేరుకోగా, మొత్తంగా కరోనా బాధితుల సంఖ్య 6,25,514కు (Coronavirus) చేరింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ఆదివారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది

Advertisement

YSRCP Supports New Farm Bills: వ్యవసాయ బిల్లులకు వైసీపీ మద్దతు, రైతులు ముందుగానే ధర నిర్ణయించుకునే అవకాశం, మార్కెట్ కమిటీల నియంతృత్వానికి తెరపడుతుందని తెలిపిన వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి

Hazarath Reddy

రాజ్యసభలో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు(YSRCP Supports New Farm Bills) ఇచ్చింది. కొత్తగా వచ్చిన బిల్లులతో రైతులకు స్వేచ్ఛ లభించి, దళారీ వ్యవస్థకు ముగింపు లభిస్తుందని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సభలో జరిగిన వ్యవసాయ బిల్లులపై చర్చలో విజయసాయి రెడ్డి (YCP MP Vijaya Sai Reddy) మాట్లాడుతూ.. పంటలకు ముందుగానే ధర నిర్ణయం వల్ల రైతులకు ప్రయోజనం జరుగుతుందన్నారు. దళారీల ఆగడాల నుంచి రైతులకు విముక్తి కలుగుతుందని పేర్కొన్నారు. మార్కెట్ కమిటీల నియంతృత్వానికి తెరపడుతుంది.

AP High Court: కోర్టుకు వచ్చే ముందు ప్రభుత్వానికి వినతి పత్రం తప్పనిసరి, సంబంధిత అధికారులను ఆశ్రయించకుండా డిమాండ్‌ ఆఫ్‌ జస్టిస్‌ కోసం వేసే పిటిషన్లను విచారించబోమని తెలిపిన ఏపీ హైకోర్టు

Hazarath Reddy

ఎవరైనా హైకోర్టులో పిటిషన్ వేయాలనుకుంటే సంబంధిత అధికారులకు (authorities) వినతిపత్రం ఇచ్చి వారి అభిప్రాయం పరిగణలోకి తీసుకున్న తరువాతనే హైకోర్టు (AP High Court) గడప తొక్కాలని ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఫలానా వ్యవహారంపై ‘నిర్దిష్టమైన ఆదేశం’(మాండమస్‌) ఇవ్వాలని అభ్యర్థిస్తూ కోర్టుకి వచ్చే ముందు.. పిటిషనర్‌ ఆ అంశంపై అధికారులకు తప్పనిసరిగా వినతిప త్రం సమర్పించాలని హైకోర్టు తేల్చి చెప్పింది.

AP Covid Report: ఏపీలో కరోనాపై గుడ్‌న్యూస్, పెరుగుతున్న రికవరీ రేటు, తగ్గుతున్న కేసుల సంఖ్య, తాజాగా 8,218 కేసులు, 10,820 మంది డిశ్చార్జ్‌‌, రాష్ట్రంలో 5,30,711కు చేరుకున్న కోవిడ్ రికవరీ కేసుల సంఖ్య

Hazarath Reddy

ఏపీ రాష్ట్రంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో 10,820 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్‌‌తో (AP Covid Report) కోవిడ్‌ విజేతల సంఖ్య 5,30,711కు చేరుకుంది. గత 24 గంటల్లో 74,595 శాంపిళ్లను పరీక్షించగా, 8,218 మందికి కరోనా పాజిటివ్‌గా (Coronavirus (COVID-19) cases) తేలింది. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్‌ టెస్టుల సంఖ్య 50,33,676కు చేరుకోగా, మొత్తంగా కరోనా బాధితుల సంఖ్య 617776కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 81763 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

AP Grama Sachivalayam Exam: నిమిషం లేట్ అయినా నో ఎంట్రీ, రేపటి నుంచి సచివాలయ పోస్టుల భర్తీ పరీక్షలు, ఏడు రోజుల పాటు 14 రకాల రాతపరీక్షలు

Hazarath Reddy

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఆదివారం నుంచి రాతపరీక్షలు (AP Grama Sachivalayam Exam) మొదలు కానున్నాయి. ఈసారి మొత్తం 16,208 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏడు రోజుల పాటు రోజుకు రెండేసి చొప్పున మొత్తం 14 రకాల రాతపరీక్షలను (AP Grama Sachivalayam 2020) నిర్వహించనున్నారు. రోజూ ఉదయం పది గంటలకు, మధ్యాహ్నం రెండున్నర గంటలకు పరీక్షలు ప్రారంభమవుతాయి. గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల భర్తీకి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు.

Advertisement

TDP MLA Vasupalli Ganesh: విశాఖలో టీడీపీ షాక్, వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, విశాఖను ఆర్థిక రాజధానిగా స్వాగతిస్తున్నామని తెలిపిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే

Hazarath Reddy

విశాఖలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే టీడీపీ నేత వాసుపల్లి గణేష్‌ (TDP MLA Vasupalli Ganesh) వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ రోజు ఏపీ ముఖ్యమత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే, టీడీపీ నేత వాసుపల్లి గణేష్‌ కలిశారు. శనివారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో తన కుమారులతో కలిసి ఆయన ...ముఖ్యమంత్రితో భేటీ (MLA Vasupalli Ganesh Meets CM YS Jagan Mohan Reddy) అయ్యారు. ఎమ్మెల్యే కుటుంబంతో పాటు వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా సీఎంను కలిసినవారిలో ఉన్నారు.

Irrigation Projects in AP: జలకళ.. ప్రాజెక్టుల కోసం రానున్న ఐదేళ్లలో రూ. 96550 కోట్లు ఖర్చు చేయనున్న ఏపీ ప్రభుత్వం, కొత్త ప్రాజెక్టులకు రూ.72458 కోట్లు ఖర్చు పెట్టాలని సీఎం జగన్ ఆదేశాలు

Hazarath Reddy

ఏపీ రాష్ట్రంలో సాగునీటి రంగానికి చెందిన ప్రాజెక్ట్‌లు లక్ష్యం మేరకు పూర్తి చేసేందుకు వైయస్ జగన్ సర్కారు (YS Jagan Govt) ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్ లు (Irrigation Projects in AP) లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయడంతో పాటు కొత్తవాటి కోసం మొత్తం ఐదేళ్లలో కనీసం రూ. 96550 కోట్లు వ్యయం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

Road Cess on Fuel in AP: ఆంధ్రప్రదేశ్‌లో వాహనదారులకు ఝలక్, పెట్రోల్ మరియు డీజిల్‌పై పన్ను విధిస్తూ ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం, రోడ్డు అభివృద్ధి పనుల కోసమేనని వెల్లడి

Team Latestly

ఇటీవల కాలంగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ దెబ్బతిన్నాయని, ఈ సెస్ ద్వారా సమకూరే నిధులను రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి వినియోగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.....

AP's COVID Update: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 8,096 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 6,09,558కు చేరిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 5244కు పెరిగిన కరోనా మరణాలు

Team Latestly

నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 11,803 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 5,19,891 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 84,423 ఆక్టివ్ కేసులు ఉన్నాయని....

Advertisement

AP's COVID Report: ఆంధ్రప్రదేశ్‌లో 6 లక్షలు దాటిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో కొత్తగా మరో 8,702 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 5177కు పెరిగిన కరోనా మరణాలు

Team Latestly

నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 10,712 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 5,08,088 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 88,197 ఆక్టివ్ కేసులు ఉన్నాయని....

Telangana Liberation Day 2020: విలీనమా.. విమోచనమా? తెలంగాణ భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన కేటీఆర్, తెలంగాణ ప్రాంతంలో ఈరోజుకున్న విశిష్టత తెలుసుకోండి

Team Latestly

సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రాంతానికి నిజమైన స్వాతంత్య్ర దినోత్సవంగా, నిజాం పాలను అంతమొందిన సందర్భంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా చెప్తారు. అయితే అది విమోచనం కాదు, భారతదేశంలో విలీనమైన రోజు మాత్రమే అని మరొక 'రాజకీయ' వాదన....

AP Coronavirus: గుడ్ న్యూస్.. ఏపీలో భారీగా పెరుగుతున్న డిశ్చార్జ్ కేసులు, తాజాగా 10,845 మంది డిశ్చార్జ్‌, 24 గంటల్లో 8,835 కొత్త కేసులు, 64మంది మృతితో 5,105కి చేరిన మరణాల సంఖ్య

Hazarath Reddy

ఏపీలో గడిచిన 24 గంటల్లో 10,845 మంది కరోనా (AP Coronavirus) నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,97,376కి (AP Corona Updates) చేరినట్టు వైద్యారోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. బుధవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 48,06,879 టెస్టులు పూర్తయ్యాయి. గడిచిన 24 గంటల్లో 75,013 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వీరిలో 8,835 మందికి పాజిటివ్‌గా తేలింది.

MP Balli Durga Prasad Rao Dies: తిరుపతి ఎంపీ కన్నుమూత, కరోనాతో చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన బల్లి దుర్గాప్రసాద్ రావు‌, గుండెపోటు రావడంతో తిరిగిరాని లోకాలకు, సంతాపం తెలిపిన ఏపీ సీఎం జగన్

Hazarath Reddy

తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌(64) బుధవారం కరోనాతో పాటు గుండెపోటు రావడంతో (MP Balli Durga Prasad Dies) కన్నుమూశారు. ఇటీవల కరోనా వైరస్‌ బారిన పడిన ఆయన చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతుండగా బల్లి దుర్గాప్రసాద్‌కు (Tirupati MP Balli Durga Prasad) తీవ్ర గుండెపోటు రావడంతో ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు. దుర్గాప్రసాద్‌ మరణంతో ఆయనకుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బల్లి దుర్గాప్రసాద్‌ హఠాన్మరణం పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement