ఆంధ్ర ప్రదేశ్

AP CM Delhi Tour: రేపు ఢిల్లీకి ఏపీ సీఎం వైయస్ జగన్, హోమంత్రి అమిత్ షాతో భేటీ, పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం, కేంద్ర జలశక్తిమంత్రి గజేంద్ర షెకావత్‌ను కూడా కలిసే అవకాశం

Hazarath Reddy

గళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. కోవిడ్ 19 (COVID-19) వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ 5 (Lockdown 5) విధించడంతో పలు అంశాలపై కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షాతో (Home Minister Amit Shah) సీఎం జగన్‌ భేటీ కానున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో చేపట్టిన నివారణ చర్యలను, పెద్ద ఎత్తున నిర్వహించిన కరోనా పరీక్షల గురించి అమిత్‌ షాకు వివరించనున్నారు.

Covid-19 in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు, ఏపీలో 3,571కు చేరిన కోవిడ్-19 కేసుల సంఖ్య, తెలంగాణలో 2,698కి చేరిన కరోనా కేసులు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ (Covid-19 in Telugu States) చాపకిందు నీరులా విస్తరించుకుంటూ వెళుతోంది. లాక్ డౌన్ సడలింపులు ( Lockdown Relaxation) మరింతగా ఇచ్చిన నేపథ్యంలో కేసులు రొజు రోజుకు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో ( Telangana) రికార్డు స్థాయిలో ఒక్కరోజే 199 కేసులు రావడం అక్కడ ఆందోళన కరంగా మారింది. ఏపీలో (Andhra pradesh) తగ్గుముఖం పట్టిన కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. 418 కేసులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలవి కావడంతో ఆందోళనకరంగా మారింది. రాష్ట్రాల వారీగా చూస్తే..

Vijayawada Gang War: విజయవాడ గ్యాంగ్ వార్ కేసులో ఊహించని ట్విస్టు, ప్రతి ఒక్కరిపైనా రౌడీషీట్‌ తెరుస్తామని తెలిపిన డీసీపీ హర్షవర్థన్‌, దాడి ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

Hazarath Reddy

ప్రశాంతంగా ఉన్న ఏపీలోని విజయవాడలో కొందరు రౌడీ మూకల్లా రెచ్చిపోయారు. నడిరోడ్డుపై కత్తులతో వీరంగం సృష్టించారు. పటమట సెంటర్ లోని శ్రీనివాస్ నగర్ లో రెండు గ్రూపుల మధ్య వివాదం (Vijayawada Gang War) తలెత్తగా.. కత్తులు, కర్రలు, రాళ్లతో పరస్పర దాడులకు దిగారు. ఈ దాడిలో ఓ వర్గానికి నాయకత్వం వహిస్తున్న తోట సందీప్ (young man lost his life in the fight) మరణించారు. విజయవాడలోని (Vijayawada) ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అతను చికిత్స పొందుతూ మరణించాడు. మరో వర్గానికి నాయకత్వం వహిస్తున్న పండు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Telugu States Lockdown 5.0: తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు పరుగులు పెట్టనున్న బస్సులు, అంతరాష్ట్ర రాకపోకలపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోని ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలోని కంటైన్మెంట్‌ జోన్లలో జూన్‌ 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (TS CM KCR) ప్రకటించారు. ఇతర ప్రాంతాల్లో జూన్‌ 7వ తేదీవరకు లాక్‌డౌన్‌ (Lockdown 5.0) అమలులో ఉంటుందని తెలిపారు. రాత్రిపూట రాష్ట్రమంతటా కర్ఫ్యూ కొనసాగుతుందని చెప్పారు. లాక్‌డౌన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీచేసిన తాజా ఆదేశాల నేపథ్యంలో ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితర ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ చర్చించారు.

Advertisement

AP Lockdwon 5.0: చంద్రబాబు,నారా లోకేశ్‌లపై కేసు నమోదు, లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించారంటూ నందిగామ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చిన ఓ న్యాయవాది, వారిద్దరితో పాటు మరికొందరిపై కేసులు

Hazarath Reddy

కోవిడ్-19 వ్యాప్తి నియంత్రణకు(COIVD-19) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను (Lockdown) విధించిన సంగతి తెలిసిందే. ఆ లాక్‌డౌన్ నిబంధనల్లో భాగంగా ప్రధానంగా భౌతికదూరం, మాస్కుల వినియోగం తప్పనిసరిగా పాటించాల్సిందే. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ నిబంధనలను చంద్రబాబు, లోకేశ్‌లు ఉల్లంఘించారంటూ (violating lockdown rules) ఓ న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగామ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

YSR Pension Kanuka: వైఎస్సార్ పెన్షన్‌ కానుక, జూన్ నెల పెన్సన్లను ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు అందిస్తున్న వాలంటీర్లు, రాష్ట్ర వ్యాప్తంగా 58.22 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ పెన్షన్‌ కానుక (YSR Pension Kanuka) పంపిణీ ప్రారంభమయింది. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు (volunteers) ఉదయం ఆరు గంటల నుంచే ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లను (Social security pensions) అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 58.22 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,421.20 కోట్లు విడుదల చేసింది. 2,37,615 మంది వాలంటీర్లు పెన్షన్ల పంపిణీలో నిమగ్నమయ్యారు. కరోనా నేపథ్యంలో బయోమెట్రిక్‌కు బదులు పెన్షనర్ల ఫోటోలను జియో ట్యాగింగ్ చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. లాక్‌డౌన్‌ వల్ల ఇతర ప్రాంతాల్లో ఉన్న పొర్టబిలిటీ ద్వారా పెన్షన్లు అందజేస్తున్నారు.

Southwest Monsoon: ప్రజలకు తీపి కబురు, జూన్ 10న తెలుగు రాష్ట్రాలను తాకనున్న నైరుతి రుతుపవనాలు, రెండు రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశం

Hazarath Reddy

దేశంలో నైరుతి రుతుపవనాలు (Southwest monsoon) చురుగ్గా కదులుతున్నాయని, జూన్‌9, 10 తేదీల్లో తెలుగు రాష్ట్రాలను (Telugu States) అవి పలకరించనున్నాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, మాల్దీవులు, కొమోరిన్‌ ప్రాంతాలకు ఈ రుతుపవనాలు విస్తరించాయి. రాగల 48 గంటల్లో ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో జూన్‌ 1వ తేదీకి కేరళ తీరాన్ని తాకనున్న రుతుపవనాలు.. జూన్‌ 9, 10 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించనున్నట్లు తెలిపారు.

AP COVID-19 Report: 6 రాష్ట్రాల నుంచి వచ్చేవారిపై గట్టి నిఘా, ఏపీలో గత 24 గంటల్లో 33 మందికి కోవిడ్ -19 పాజిటివ్‌, రాష్ట్రంలో 2874కి చేరిన కేసులు సంఖ్య

Hazarath Reddy

ఏపీలో కరోనా కేసులు (AP COVID-19 Report) తగ్గుముఖం పడుతున్నాయి. ఏపీ కరోనా కేసుల తాజా బులెటిన్‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది. గత 24 గంటల్లో విదేశాల నుంచి వచ్చిన వారిని కలుపుకుని 33 మంది కోవిడ్ -19 పాజిటివ్‌గా తేలారు. 79 మంది కోవిడ్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. కరోనా బారిన పడి కర్నూల్ జిల్లాలో ఒకరు చనిపోయారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 2874 కేసులలో (COVID 19 Cases) 2037మంది డిశ్చార్జ్ కాగా, 60 మంది మరణించారు. ప్రస్తుతం 777 మంది చికిత్స పొందుతున్నారు.

Advertisement

MLA Ambati Rambabu: హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం, నిమ్మగడ్డ కేసుపై న్యాయ‌ నిపుణుల‌తో సంప్రదింపులు జ‌రుపుతున్నామ‌ని తెలిపిన ఎమ్మెల్యే అంబటి రాంబాబు

Hazarath Reddy

నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్‌ను (nimmagadda ramesh kumar) రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా తిరిగి నియమించాలంటూ హైకోర్టు (AP High Court) ఇచ్చిన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దీనిపై సుప్రీంకోర్టుకు (Supreme Court) వెళ‌తామ‌ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు (MLA Ambati Rambabu) అన్నారు. నెల రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయ‌గా ఈసీ నిమ్మగడ్డ రమేష్ పదవిని కోల్పోయారని, ఆయన స్థానంలో జస్టిస్ కనగరాజ్ నియమించినట్లు ఆయన వెల్లడించారు.

Nimmagadda Ramesh Kumar: జగన్ సర్కారుకు మళ్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్‌‌ను కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వానికి (AP Govt) హైకోర్టులో మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్‌‌ను (Nimmagadda Ramesh Kumar) కొనసాగించాలని ఉన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఆయనను తొలగిస్తూ జగన్ సర్కార్ (Jagan Govt) ఇచ్చిన ఆర్డినెన్స్‌‌ను హైకోర్టు (AP High Court) కొట్టేసింది. ఆర్టికల్ 213 ప్రకారం ఆర్డినెన్స్ తెచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. నిమ్మగడ్డ తొలగింపు కోసం తెచ్చిన ఆర్డినెన్స్ ను కొట్టివేసింది.

Andhra Pradesh High Court: లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదు చేయాలన్న ఏపీ హైకోర్టు

Hazarath Reddy

లాక్‌డౌన్‌ నిబంధనలు (lockdown violations) ఉల్లంఘించారంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు (Chandrababu), నారా లోకేష్‌తో (Nara Lokseh) పాటు మరికొందరు అయిదుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై (YCP MLAS)హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ ముగిసింది. దాదాపు మూడుగంటల పాటు వాదనలు విన్న న్యాయస్థానం (Andhra Pradesh High Court) చివరకు తీర్పును వెలువరించింది. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించే వారెవరైనా కేసులు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

TTD Properties Row: టీటీడీ ఆస్తులను అమ్మే ప్రసక్తే లేదు, ముగిసిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం, పలు కీలక నిర్ణయాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

Hazarath Reddy

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి (Tirumala Tirupati Devasthanam Board) సమావేశం ముగిసింది.ఈ సమావేశంలో టీటీడీ పాలక మండలి (TTD Board) కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా టీటీడీ భూములు (TTD Properties) విక్రయించొద్దని నిర్ణయం తీసుకుంది. అలాగే టీటీడీ ఆస్తులు, కానుకలు విక్రయించకూడదని నిర్ణయించింది. ఆంధ్రపదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి అనుణంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. టీటీడీ భూములు, ఆస్తులు ఎట్టి పరిస్థితిల్లో అమ్మేదిలేదని స్పష్టం చేశారు. టీటీడీ ధర్మకర్తల మండలి గురువారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో సమావేశమైంది.

Advertisement

Mana Palana-Mee Suchana Day 4: పెద్ద నగరాలతో విశాఖ మాత్రమే పోటీ పడగలదు, మన పాలన-మీ సూచన డే 4 కార్యక్రమంలో ఏపీ సీఎం వైయస్ జగన్, ఏపీలో పెట్టుబడులపై కియా కీలక ప్రకటన

Hazarath Reddy

హైదరాబాద్‌, బెంగళూరులాంటి మహా నగరాలతో పోటీపడే సత్తా విశాఖకు మాత్రమే ఉందని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Ap Cm YS Jagan) తెలిపారు. విశాఖలో (Vizag) స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం అత్యున్నతస్థాయి ఇంజినీరింగ్‌ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే మౌలిక సదుపాయాల విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) ప్రత్యేక బలం ఉందని పేర్కొన్నారు.

COVID-19 in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో 5 వేలకు చేరువలో కరోనా కేసులు, తెలంగాణలో కొత్తగా 107 కేసులు నమోదు, ఏపీలో తాజాగా 54 కోవిడ్-19 కేసులు

Hazarath Reddy

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ కేసులు (COVID-19 in Telugu States) పెరిగిపోతున్నాయి. ఏపీ, తెలంగాణలో 5 వేలకు చేరువలో కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో రికార్డు స్థాయిలో 107 కొత్త కేసులు నమోదు కాగా ఏపీలో 54 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కేసులు సంఖ్య 2098కు చేరుకోగా ఏపీలో 2841కి చేరుకున్నాయి. రెండు రాష్ట్రాల కరోనా కేసులను కలుపుకుంటే 4939గా ఉన్నాయి.

AP DGP Damodar Goutam Sawang: ఫేక్ వార్తలపై పోలీసుల డేగ కన్ను, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠినచర్యలు తప్పవు, సైబర్‌ క్రైం వింగ్‌లో సోషల్‌ మీడియా నేరాల నియంత్రణ, పర్యవేక్షణకు మరో వింగ్, మీడియాతో డీజీపీ గౌతం సవాంగ్

Hazarath Reddy

ఫేక్ వార్తలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఏపీ డీజీపీ (AP DGP Damodar Goutam Sawang) కీలక వ్యాఖ్యలు చేశారు. సమాచార, ప్రసార మధ్యమాల నియంత్రణ చట్టం పరిధిలో ఉండాలని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ (Damodar Goutam Sawang) అన్నారు. ప్రింట్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచురణలు, ప్రసారాలు చేసేవారు, అభిప్రాయాలు వ్యక్తీకరించేవారు నియంత్రణ పాటించకపోతే అట్టి వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

Mana Palana-Mee Suchana Day 3: ఇంగ్లీష్ మీడియంపై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం, విద్యా వ్యవస్థపై మూడో రోజు మన పాలన-మీ సూచన కార్యక్రమం, పలు విషయాలను ప్రసావించిన ఏపీ సీఎం

Hazarath Reddy

మన పాలన-మీ సూచన కార్యక్రమం (Mana Palana-Mee Suchana Day 3) మూడో రోజులో భాగంగా నేడు విద్యారంగంపై (Education Sector) తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష (Ap Cm YS Jagan Review)నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో నాడు-నేడు (Nadu-Nedu), ఇంగ్లిష్‌ మీడియం (English Medium) విద్య, అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చించారు. విద్యారంగ నిపుణులు, లబ్ధిదారులతో సీఎం వైఎస్‌ జగన్‌ ముఖాముఖి నిర్వహించారు. ఈ సంధర్భంగా ఏపీ సీఎం పలు విషయాలను మాట్లాడారు.

Advertisement

AP High Court: చంద్రబాబుపై దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యంపై విచారణ రేపటికి వాయిదా, ఆ 49 మందిపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు పెట్టి, నోటీసులు జారీ చేయాలన్న ఏపీ హైకోర్టు

Hazarath Reddy

ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు (Chandrababu) కరోనావైరస్ లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించటంపై దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) బుధవారం విచారణ జరిపింది. బాబు లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించటంపై (Lockdown Violation) సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారా? లేదా? అని న్యాయస్థానం పిటిషనర్‌ను ప్రశ్నించింది. గతంలో ఇలాంటి కేసును నేరుగా హైకోర్టు విచారణకు స్వీకరించిందని పిటిషనర్‌ హైకోర్టు దృష్టికి తీసుకురాగా.. ఐదుగురు ఎమ్మెల్యేల కేసుతోపాటు చంద్రబాబునాయుడు కేసును కూడా రేపు(గురువారం) విచారిస్తామని హైకోర్టు తెలిపింది.

TDP Mahanadu: వైయస్ జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, టీడీపీ మహానాడులో విమర్శలు ఎక్కుపెట్టిన చంద్రబాబు, టీడీపీ కార్యాలయానికి కోవిడ్ 19 నోటీసులు పంపించిన ఏపీ సర్కారు

Hazarath Reddy

తొలిరోజు సమావేశంలో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకంటే ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ అధినేత చంద్రబాబు, పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, నారా లోకేష్, చిన రాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అయ్యన్నపాత్రుడు, వర్ల రామయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం విశాఖ ఎల్జీ పాలిమర్స్ మృతులు, ఇటీవల చనిపోయిన పార్టీ కార్యకర్తలకు మహానాడు వేదిక ద్వారా తమ సంతాపం తెలియజేశారు.

COVID-19 in AP: ఏపీలో తాజాగా 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 1913 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్, 2787కి చేరిన మొత్తం కోవిడ్ 19 కేసుల సంఖ్య

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో కొత్తగా 68 కరోనా పాజిటివ్‌ కేసులు (AP Coronavirus) నమోదవగా, ఒకరు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య (Covid 19 in AP) 2787కి చేరింది. ఈ ప్రాణాంతక వైరస్‌తో ఇప్పటివరకు మొత్తం 58 మంది మరణించారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 816 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, 1913 మంది బాధితులు కోలుకున్నారు.

Moderate Rainfall in AP: ఏపీలో 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు, కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతు పవనాలు వచ్చే అవకాశం

Hazarath Reddy

వచ్చే మూడు రోజులు ఏపీలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం(Moderate Rainfall in AP) ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల 24 గంటలలో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రాన్ని ఆనుకొని ఉన్న బంగాళాఖాతం మధ్య ప్రాంతాలలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతు పవనాలు వచ్చే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. దక్షిణ చత్తీస్‌గఢ్ నుంచి ఇంటీరియర్ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, దీంతో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంలో ఈ రోజు, రేపు, ఎల్లుండి అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement