ఆంధ్ర ప్రదేశ్
10th Class Exams: పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్ట్ ఆదేశాలు, రేపటి పరీక్ష మాత్రం యధాతథం
Vikas Mandaపరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిని అత్యవసర పిటిషన్ గా విచారణకు స్వీకరించిన హైకోర్ట్ ప్రస్తుతానికి మార్చి 23- మార్చి 30 వరకు ఉన్న పది పరీక్షలను వాయిదా వేయాలని ఆదేశాలు జారీ చేసింది.....
Coronavirus Outbreak in India: తెలంగాణలో 18, ఆంధ్రప్రదేశ్‌లో 3 కలిపి దేశవ్యాప్తంగా 206కు చేరిన కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య, మహారాష్ట్రలో విజృంభిస్తున్న వైరస్
Vikas Mandaప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు గురువారం నాటికి 2 లక్షలు దాటాయి, ఇక వీరిలో 85 వేల మంది కోలుకున్నట్లు సమాచారం. అయితే వైరస్ బారినపడి ఇప్పటికి 9,800 మంది ప్రాణాలు కోల్పోయారు.....
AP Politics: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ ప్రాణాలకు ముప్పుందా? రాష్ట్రపతి పాలన విధించాలంటున్న తెలుగు దేశం నాయకులు, ఈసీ లేఖ పట్ల ప్రభుత్వం సీరియస్
Vikas Mandaవ్యవస్థలు నిర్వీర్యం చేసే నేతలు, మనమేం చెప్పినా చెల్లుతుందనే భావనలో ఉండే నాయకులు ఇప్పటికీ కళ్లు తెరిచి తమ వైఖరి మార్చుకోకపోతే రాష్ట్రం ఎప్పటికీ పురోగతి సాధించదు. ఏపీలో మున్ముందు ఇంకా ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయో....
Coronavirus Outbreak in AP: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మరో కరోనావైరస్ పాజిటివ్ కేసు నమోదు, నివారణ కోసం మరిన్ని చర్యలు చేపట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం
Vikas Mandaదిల్లీ మరియు ఏపీలో ప్రత్యేక కంట్రోల్ రూంలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఎలాంటి సహాకారం కోసం అయినా దిల్లీ కంట్రోల్ రూమ్ నంబర్లు: 9871999055/9871999059 మరియు ఏపీ కంట్రోల్ రూమ్ నంబర్లు: 8971170178/8297259070 లను సంప్రదించాలని సూచించింది.
Telangana: తెలంగాణలో కలకలం, కరీంనగర్‌లో ఒక్కరోజులోనే 7 కరోనావైరస్ పాజిటివ్ కేసులు గుర్తింపు, రాష్ట్రంలో 13కు పెరిగిన కేసుల సంఖ్య, వంద బృందాలతో స్పెషల్ డ్రైవ్
Vikas Mandaఈ ఇండోనేషియన్ దేశస్థులు మాత్రం మొత్తం 10 మంది బృందంగా ముందు దిల్లీ చేరుకొని, అక్కడ్నించి మార్చి 13న 'ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్' (రైలు నంబర్ 12708) ద్వారా మార్చి 14 తెల్లవారుజామున రామగుండం స్టేషన్ లో దిగారు. వీరు ప్రయాణించిన ఎయిర్ కండిషన్డ్ స్లీపర్ కోచ్‌లో మొత్తం 82 మంది ప్రయాణికులు ఉన్నారు......
APPSC Revises Exam Schedules: ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్లో మార్పు, ఏప్రిల్ నుంచి మే నెలకు వాయిదా, సవరించిన పరీక్షల తేదీల వివరాలు ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) కొన్ని పోస్టుల నియామకాలకు సంబంధించిన ప్రధాన పరీక్ష తేదీలను (APPSC Revises Exam Schedules) సవరించింది. కమిషన్ కార్యదర్శి పిఎస్ఆర్ అంజనేయులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం, మార్చి 21 , 22వ తేదీ జరగాల్సిన డిగ్రీ కళాశాల లెక్చరర్ల పోస్టుకు నియామకం కోసం జరగాల్సిన పరీక్షను ఏప్రిల్ 3 మరియు 4 తేదీకి సవరించారు. ఈనెల 21, 22, 27, 28, 29 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను ఏప్రిల్, మేలో నిర్వహించేలా కొత్త షెడ్యూళ్లను ప్రకటించింది.
Andhra Pradesh: ఏపీలో అన్ని స్కూళ్లు, కాలేజీలు మూసివేత, పరీక్షలు మాత్రం యథావిధిగా జరుగుతాయి, కరోనా నియంత్రకు గట్టి చర్యలు తీసుకుంటున్న రాష్ట్రప్రభుత్వం
Hazarath Reddyదేశ వ్యాప్తంగా కరోనావైరస్ (CoronaVirus) పంజా విసురుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో (Andhra Pradesh) రేపటి నుంచి అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. అన్ని యూనివర్సిటీలు, కాలేజీలు, పాఠశాలలు, కోచింగ్‌ సెంటర్లకు ఏపీ ప్రభుత్వం సెలవు (Schools and Colleges Closed in AP) ప్రకటించింది.దేశ వ్యాప్తంగా ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. తాజగా ఏపీ కూడా స్కూళ్లకు సెలవు ప్రకటించింది.
AP Local Body Elections: ఏపీలో తక్షణం ఎన్నికల కోడ్ ఎత్తేయండి, ఎన్నికల నిర్వహణ పూర్తిగా ఎలక్షన్ కమిషన్ పరిధిలోనిదే, స్పష్టం చేసిన అత్యున్నత ధర్మాసనం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో (Andhra pradesh) స్ధానిక సంస్థల ఎన్నికల వాయిదాపై (Local Body Elections PostPoned) సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో ఎన్నికల కోడ్‌ను తక్షణం ఎత్తివేయాలని బుధవారం ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను (AP Local Body Elections) వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (AP Election Commission) జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే.
CoronaVirus Health Bulletin: 14 రోజులు ఇంట్లో నుంచి బయటకు రావద్దు, కరోనా లక్షణాలు ఉంటే వెంటనే 104కి కాల్ చేయండి, భయపడాల్సిన అవసరం లేదు: రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి
Hazarath Reddyకోవిడ్‌-19 వైరస్‌ (COVID-19) నియంత్రణకు యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకుంటూ నిరంతరం సమీక్షిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి (Dr. KS Jawahar Reddy) అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడూతూ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని సూచించారు. కరోనా వ్యాప్తిని (CoronaVirus) అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందని చెప్పారు.
COVID 19 in Telangana: తెలంగాణలో 5కు పెరిగిన కరోనావైరస్ పాజిటివ్ కేసులు, మహారాష్ట్రలో 42 కేసులు నమోదు, అంతరాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్‌ల వద్ద తెలంగాణ సర్కార్ నజర్
Vikas Mandaఉంటే పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో కరోనావైరస్ విజృంభిస్తుంది. బుధవారం నాటికి ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 42కు చేరింది. మంగళవారం 63 ఏళ్ల వ్యక్తి కూడా కరోనావైరస్ బారినపడి ముంబై ఆసుపత్రిలో చనిపోయాడు. దీంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. మహారాష్ట్ర నుంచి వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉంటూ సరిహద్దు చెక్ పోస్టుల వద్ద స్క్రీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది....
AB Venkateswara Rao: మాజీ చీఫ్‌కు క్యాట్‌లో చుక్కెదురు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌, ప్రవర్తనా నియమాల ఉల్లఘన కింద సస్పెండ్ అయిన ఏబీ వెంకటేశ్వరరావు
Hazarath Reddyమాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావుకు (AB Venkateswara Rao) కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో (CAT) భారీ షాక్ తగిలింది. ప్రవర్తనా నియమాల ఉల్లంఘనకు సంబంధించి సస్పెన్షన్‌కు గురైన ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు తన సస్పెన్షన్‌ను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ (క్యాట్‌) (Central Administrative Tribunal (CAT) మంగళవారం కొట్టేసింది.
Cement prices Drop in AP: శుభవార్త..ఏపీలో తగ్గిన సిమెంట్ ధరలు, పీపీసీ బస్తా ధర రూ.225, ఓపీసీ సిమెంటు బస్తా ధర రూ.235, ప్రకటించిన సిమెంట్ కంపెనీల యాజమాన్యం
Hazarath Reddyఏపీ ప్రజలకు ఇది నిజంగా శుభవార్త లాంటిదే. ప్రభుత్వ పనులు, పేదలకు ఇళ్ల నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనులకు సిమెంటు ధరలను తగ్గిస్తున్నట్లు (Reduction In Cement Prices) సిమెంటు కంపెనీలు ప్రకటించాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (CM YS Jagan) సోమవారమిక్కడ ఆయా కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా ఆయన చేసిన విజ్ఞప్తి మేరకు ధరలు తగ్గిస్తున్నామని ప్రతినిధులు తెలిపారు.
COVID-19 in India: దేశవ్యాప్తంగా 125కు చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, అత్యధికంగా 39 పాజిటివ్ కేసులతో మహారాష్ట్ర టాప్, తెలంగాణలో 4 కేసులు నమోదు, మహారాష్ట్ర నుంచి వచ్చే వారిపై నిఘా
Vikas Mandaపొరుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారిపై కూడా తెలంగాణ ప్రభుత్వం నిఘా పెట్టింది. మహారాష్ట్రలో కోవిడ్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే వారిని కూడా స్క్రీనింగ్ టెస్టులు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది......
AP Local Body Elections: ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన జగన్ సర్కారు, నెలాఖరు లోపు ఎన్నికలు పూర్తి కాకుంటే నిధులు రావన్న ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyఏపీ ఎన్నికల కమిషన్ (Andhra Pradesh State Election Commission) తీసుకున్న స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా ( AP Local Body Elections Postponed) నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జగన్ సర్కార్ సుప్రీం గడప తొక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో (Andhra Pradesh) స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను అర్ధాంతరంగా వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (SEC) ఈనెల 15న జారీచేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) సోమవారం ఉదయం సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.
Resolution Against CAA: విభజన రాజకీయాలు దేశానికి అవసరమా? సిఎఎపై కేంద్రం పున:సమీక్షించుకోవాలి, సిఎఎ వ్యతిరేక తీర్మానాన్ని తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్
Vikas Mandaవందల సంవత్సరాలుగా విభిన్నమైన సంస్కృతి ఉన్న దేశంలో, మన వైఖరి ఏంటనేది తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. విశ్వమానవ సౌభ్రాతృత్వం కోరుకునే దేశంలో ఇలాంటి చట్టాలు దేశ ప్రతిష్ఠను దిగజారుస్తాయని సీఎం కేసీఆర్ అన్నారు. స్వయంగా అమెరికా అధ్యక్షుడు దేశ రాజధానిలో పర్యటిస్తున్నప్పుడు జరిగిన అల్లర్లను సీఎం గుర్తుచేశారు.....
YS Jagan Comments on COVID-19: బ్లీచింగ్ పౌడర్‌తో కరోనాను తరిమేయండి, ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలను ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు, కరోనా మాటలను వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్
Hazarath Reddyప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (CoronaVirus) వ్యాధిపై ఏపీ సీఎం జగన్ (AP CM YS jagan) సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ భయంకరమైన రోగం కాదని, అంతగా భయపడాల్సిన పని లేదన్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నయమవుతుందన్నారు. కరోనాతో మనుషులు చనిపోతున్నారని ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు. కరోనాకి మందు(మెడికేషన్) పారాసిటమాల్ ట్యాబ్లెట్ అని చెప్పిన సీఎం జగన్, బ్లీచింగ్ పౌడర్ తో కరోనా వైరస్ చనిపోతుందన్నారు.
AP CS Sahni Letter To SEC: ఏపీలో కరోనా లేదు, ఎన్నికలను యథాతథంగా కొనసాగించండి, ఎన్నికల సంఘానికి లేఖ రాసిన ఏపీ సీఎస్ నీలం సాహ్ని, గవర్నర్‌తో భేటీ కానున్న ఎన్నికల కమిషనర్‌
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికలను (AP Local Body polls) యథాతథంగా కొనసాగించాలని కోరతూ రాష్ట్ర ప్రధాన కార్యదర్మి నీలం సాహ్ని ఎన్నికల సంఘానికి లేఖ ( AP CS Neelam Sahni Letter) రాశారు. కరోనా వైరస్‌ సాకుతో ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా వేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఎస్ కోరారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధంగా ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.
AP CM Meets Governor: ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం, గవర్నర్‌ను కలిసిన ఏపీ సీఎం, ఎన్నికలు జరిపేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని విన్నపం, సీఎం వైయస్ జగన్‌పై చంద్రబాబు ఘాటు విమర్శలు
Hazarath Reddyఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా (Local Body Elections postponed) వేస్తున్నామని ఏపీ ఎన్నికల అధికారి రమేష్ కుమార్ (SEC Ramesh Kumar) ప్రకటించిన నేపథ్యంలో ఇది రాజకీయ వేడిని రాజేస్తోంది. అధికార పార్టీ (YSRCP), ప్రతిపక్ష పార్టీల (TDP) మధ్య దీనిపై వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో (Biswabhushan Harichandan) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) ఆదివారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
AP Local Elections Postponed: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా, కరోనా వివరాలను వెల్లడించిన ఏపీ సర్కారు, కరోనా వైరస్‌ను జాతీయ విపత్తుగా ప్రకటించిన కేంద్రం
Hazarath Reddyఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వాయిదా (Local Body Elections Postponed) పడింది. కరోనా వైరస్‌ను (Coronovirus) కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించిన నేపథ్యంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను (AP Local Body Elections) వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (State Election Commission) నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌ ప్రకటించారు.
TTD Cancels Standing System: టీటీడీ సంచలన నిర్ణయం, భక్తులు వేచి ఉండే పద్దతికి తాత్కాలికంగా స్వస్తి, టైమ్ స్లాట్ ద్వారా మాత్రమే దర్శనానికి అనుమతి, ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం రద్దు
Hazarath Reddyకరోనా వైరస్ (Coronavirus) వ్యాప్తి ధాటికి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సంచలన నిర్ణయం తీసుకుంది. భక్తులు వేచి ఉండే పద్దతికి తాత్కాలికంగా చెక్ (TTD Cancels Standing System) పెట్టింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ (Coronavirus in India) వణికిస్తున్న నేపథ్యంలో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.టైమ్ స్లాట్ ద్వారా మాత్రమే టోకెన్లు కేటాయించి భక్తులను దర్శనానికి పంపాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ (TTD EO Anil Singhl) వివరాలను వెల్లడించారు.