ఆంధ్ర ప్రదేశ్

Orange Alert In Kerala: ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ, భారీ వర్షాలతో కుదేలవుతున్న కేరళ, మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు, ఏపీ, తమిళనాడు, తెలంగాణా రాష్ట్రాలకు అలర్ట్ మెసేజ్

Hazarath Reddy

ఉపరితల ద్రోణి ఏర్పడడంతో రానున్న రెండు రోజుల పాటు కేరళలో భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతోభారత వాతావరణ శాఖ కేరళలోని 13 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది. కేరళలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొల్లాం, అలపూజ, కొట్టాం, ఇడుక్కి, ఎర్నాకులం, పాలక్కడ్‌, త్రిసూర్‌, మల్లాపురం, వయనాడ్‌, కోజికోడ్‌, కన్నూర్‌, కాసర్‌ఘడ్‌, పాతనామ్‌ తిట్టా జిల్లాలో వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది.

YS Jagan New Decession: ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం, మంత్రులను మారుస్తూ ఉత్తర్వులు, కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షాతో భేటీ కోసం ఢిల్లీ వెళ్లిన జగన్

Hazarath Reddy

ఏపీ సీఎం వైయస్ జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలకు కొత్త మంత్రులను ఇన్ ఛార్జ్ లుగా నియమించారు. ఇప్పటివరకు ఉన్న వారిని వేరేచోటుకు మారుస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 13 జిల్లాలకు ఇన్‌చార్జ్ మంత్రులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం జీవో జారీ చేశారు.

Fuel Home Delivery: ఇక మీ ఇంటికే పెట్రోల్, డీజిల్, ఎంత కావాలంటే అంత ఆర్డర్ చేసుకోవచ్చు, కసరత్తు చేస్తున్నకేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ, యాప్‌ను రెడీ చేస్తున్న చమురు సంస్థలు

Hazarath Reddy

కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ త్వరలో శుభవార్తను అందించబోతోంది. ఇకపై మీరు నేరుగా డీజిల్, పెట్రోల్ కోసం పెట్రోలు బంకులు చుట్టూ తిరగకుండా మీ ఇంటికే నేరుగా అవి వచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు పెట్రోలియం ఎక్స్ ప్లోజివ్స్ భద్రతా విభాగం (PESO)తో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.

Godavari Boat Mishap Update: సాయంత్రానికి రాయల్ వశిష్ట బోటు బయటకు వచ్చే అవకాశం, బోటుకు తాళ్లు బిగించిన విశాఖ డీప్ సీ డైవర్స్, మరో డెడ్ బాడీ బయటకు, 40 అడుగుల లోతులో బోటు

Hazarath Reddy

దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ట పున్నమి బోటును వెలికితీత ఆఖరి దశకు చేరుకుంది. విశాఖ నుంచి వచ్చిన డీప్ సీ డైవర్స్.. నదీ గర్భంలో ఉన్న బోటుకు తాళ్లు బిగించేశారు. బోటు ముందు భాగానికి స్కూబా డైవర్స్ ఐరన్ రోప్స్ కట్టారు.

Advertisement

TSRTC Strike : సమ్మెపై కొనసాగుతున్న సస్పెన్స్, చర్చలపై ప్రభుత్వం నుంచి ఇంకా రాని ప్రతిపాదన, భవిష్యత్ కార్యాచరణను ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ, హుజూర్ నగర్ ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టిన సీఎం కేసీఆర్

Hazarath Reddy

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం సహా మొత్తం 26 డిమాండ్ల సాధనకు తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మెపై సస్పెన్స్ కొనసాగుతోంది. చర్చలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు లేకపోవడంతో ఆర్టీసీ జేఏసీ భవిష్యత్‌ కార్యాచరణపై ఫోకస్‌ చేసింది.

Heavy Rains In HYD: భారీ వర్షంతో తడిసి ముద్దయిన హైదరాబాద్, జలమయమైన లోతట్టు ప్రాంతాలు, ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ అంతరాయం, మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. నగరంలోని జూబ్లిహిల్స్‌, బంజారాహిల్స్‌, కోఠి, అబిడ్స్‌, బేగంబజార్‌, సుల్తాన్‌ బజార్‌ నాంపల్లి, లక్డికాపూల్‌, మాసబ్‌ట్యాంక్‌, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి.

Heavy Rainfall Warning: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక, పిడుగులు పడే అవకాశం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, హెచ్చరించిన హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం

Hazarath Reddy

ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ఇంకా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.

CM Jagan Master Plan: ఆరోగ్యాంధ్రప్రదేశ్ వైపుగా ఏపీ అడుగులు, ఆరు సూత్రాల ఫార్ములాతో ముందుకు వెళుతున్న ఏపీ సీఎం, అధికారులతో సచివాలయంలో ఉన్నత సమీక్ష

Hazarath Reddy

పరిపాలనలో తనదైన ముద్రతో దూసుకుపోతున్న ఏపీ సీఎం జగన్ ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా ఆరు సూత్రాలు నిర్ణయించారు. ఈ ఫార్ములాతో ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు.

Advertisement

Boat Accident Update: బోటు వెలికితీతలో ఫలిస్తున్న ప్రయత్నాలు, 40 అడుగుల లోతులో బోటు, పది మీటర్లు ఒడ్డు వైపుకు చేరితే బోటు బయటకు వచ్చినట్లే, ఆటంకం కలిగిస్తున్న వర్షం

Hazarath Reddy

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ట పున్నమి బోటు వెలికితీత పనులు కొనసాగుతూనే ఉన్నాయి. బోటు చేతికి చిక్కినట్లే చిక్కి చేజారిపోతోంది.

One Rupee Registrstion: రూపాయికే 2 సెంట్ల స్థలం రిజిస్ట్రేషన్, పేదలకు బంపరాఫర్ ఇచ్చిన జగన్ సర్కారు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు, మంత్రులతో సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష

Hazarath Reddy

పరిపాలనలో ఏపీ సీఎం వైయస్ జగన్ దూసుకుపోతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన జగన్ తాజాగా పేదల కోసం మరో సంచలన కార్యక్రమాన్ని చేపట్టారు.

YSR Navodayam: ఎంఎస్‌ఎంఈలకు రక్ష వైయస్సార్ నవోదయం, ఆర్థిక తోడ్పాటు కింద రూ.10 కోట్ల రూపాయలు, రూ.4వేల కోట్ల రుణాలు వన్ టైమ్ రీస్ట్రక్చర్, అవకాశాన్ని వినియోగించుకునేందుకు ఎంఎస్‌ఎంఈలకు 9 నెలల గడువు

Hazarath Reddy

రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊరటగా కొత్త పథకం తెచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ నవోదయం పథకాన్ని క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం, బ్యాంకర్ల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

AP Formation Day: మరో సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం జగన్, ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం యథాతథం, జూన్ 2కు బై బై, నవంబర్ 1న అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఏపీ అనే రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవానికి స్వస్తి పలికారు. విభజన తర్వాత రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సర్కారు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నవ నిర్మాణ దీక్షలుగా మార్పు చేసింది.

Advertisement

Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్‌లో ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, ఇకపై రాత పరీక్ష ద్వారానే ఉద్యోగాల భర్తీ, ఇంటర్వ్యూ విధానం రద్దు, ఏపీపీఎస్సీపై సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం జగన్

Vikas Manda

ఈ ఏడాది మేలో గ్రూప్-1 (Group -1 Posts) పోస్టుల కోసం నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ ఇంతవరకు ప్రకటించలేదు. దీంతో ఈ పరీక్షకు హాజరైన సుమారు 60,000 మంది అభ్యర్థులు ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు...

AP Cabinet Meet Highlights: ఆంధ్ర ప్రదేశ్‌లో సీఎం జగన్ వరాలు, చేనేత కుటుంబాలకు రూ. 24వేలు, మత్యకారులకు రూ.10వేలు, మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం, ముఖ్యాంశాలు ఇవే

Vikas Manda

వైఎస్ఆర్ నేతన్న హస్తం' (YSR Nethanna Hastham) కింద ప్రతీ చేనేత కుటుంబానికి ఏడాదికి రూ. 24 వేలు ఆర్థిక సహాయం అందజేయాలని ఏపీ కేబినేట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలోని 90 వేల చేనేత కుటుంబాలు లబ్ది పొందనున్నాయి...

Operation Vasista Resumes: గోదావరిలో మునిగిపోయిన బోట్ ఆచూకీ లభ్యం? కచ్చులూరు వద్ద లంగరుకు బోటు తగిలినట్లు చెప్తున్న ధర్మాడి సత్యం బృందం, వెలకితీత పనులు తిరిగి ప్రారంభం

Vikas Manda

ఈరోజు బోటు ఉన్న చోటును గుర్తించినట్లు ధర్మాడి సత్యం (Dharmadi Sathyam) బోటు బృందం వెల్లడించింది. ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి దాదాపు 500 మీటర్ల దూరం వరకు బోటు కొట్టుకుపోయిందని చెప్తున్నారు....

Coriander Price Hike: ఉల్లిగడ్డతో పోటీకి కొత్తిమీర సై, అమాతంగా పెరిగిన ధర, 2రూపాయిల నుంచి 17 రూపాయిలకు చేరిక, నవంబర్ నెలలో ఇంకా పెరిగే అవకాశం

Hazarath Reddy

కొత్తిమీర వంటకాలకు మంచి సువాసనను ఇవ్వడమే కాకుండా బరువును తగ్గించడంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇందులోని సి,కె. ఐరన్, క్యాల్షియం వంటివి పుష్కలంగా వున్నాయి.

Advertisement

Telugu Trend in 'Maha' Election: మహారాష్ట్రలో 'రావాలి జగన్, కావాలి జగన్' పాటను పోలిన శివసేన ఎన్నికల ప్రచార గీతం, తెలుగు రాష్ట్రాల ట్రెండ్‌ను ఫాలో అవుతున్న మహారాష్ట్ర రాజకీయ పక్షాల ఎన్నికల ప్రచారం

Vikas Manda

సక్తికరమైన విషయం ఏమిటంటే ఇదివరకే ఎన్నికలు పూర్తిచేసుకుని ప్రస్తుతం అధికారం చేపట్టిన తెలంగాణలోని టీఆర్ఎస్ పార్టీ మరియు ఏపీలో వైసీపీ ప్రచార సరళిని శివసేన అనుకరిస్తున్నట్లు అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వ మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి క్షేత్ర స్థాయిల్లోకి తీసుకెళ్లేలా శివసేన పార్టీ...

Visit PS Program: పోలీసులపై నమ్మకాన్ని కలిగించడానికి ‘‘విజిట్‌​ పోలీస్‌ స్టేషన్‌’’ పోగ్రాం, ఏపీలో వారం రోజుల పాటు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు, ఫేక్ న్యూస్ ట్రోల్ చేస్తే కఠిన చర్యలు తప్పవు, ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడి

Hazarath Reddy

పోలీసులంటే ప్రజల్లో ఓ రకమైన అపోహలు ఉన్నాయని, వీటిని తొలగించేందుకు సరికొత్తగా కార్యక్రమాలు చేపడుతున్నామని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. ఇందులో భాగంగా ‘విజిట్‌​ పోలీస్‌ స్టేషన్‌’ అనే కార్యక్రమం మొదలుపెడుతున్నామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పేర్కొన్నారు. ఈ సంధర్భంగా వారం రోజుల పాటు పోలీస్‌ అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు జరగనున్నాయని ఆయన వెల్లడించారు.

Earthquake Threat: విజయవాడకు తీవ్ర భూకంపం, డేంజర్ జోన్‌లో చెన్నై, ముంబై, ఢిల్లీలతో పాటు ఇతర ప్రధాన నగరాలు, భూకంపం వచ్చే నగరాల లిస్టును ప్రకటించిన ఎన్‌డీఎంఏ

Hazarath Reddy

ప్రపంచంలో పర్యావరణం అత్యంత వేగంగా మారిపోతున్నది. దీంతో భూమిలో కూడా మార్పులు వస్తున్నాయి. భూమిలోపల ఉండే ప్లేట్ లెట్స్ లో ఒత్తిడి పెరుగుతుండటంతో భూమి కూడా షేక్ అవుతోంది. దీన్ని భూకంపం అని పిలుస్తుంటారు.

Bus Accident In Ap: లోయలో బడ్డ బస్సు, 8 మంది అక్కడికక్కడే మృతి, తూర్పు గోదావరి జిల్లాలో విషాద ఘటన, సహాయక చర్యలు ముమ్మరం చేసిన పోలీసులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని మారేడుమిల్లి, చింతూరు మధ్య వాల్మీకి ఘాట్ రోడ్డులో పర్యాటక బస్సు లోయలో పడింది. ఘాట్ రోడ్డులోని వాల్మీకి కొండ వద్ద బస్సు అదుపుతప్పి లోయలో పడడంతో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Advertisement
Advertisement