ఆంధ్ర ప్రదేశ్

MLA Gali Banu Prakash: రోజా జైలుకు వెళ్లడం ఖాయం, ఆడుదాం ఆంధ్రా పేరుతో కోట్ల రూపాయలు తినేసిందని ఎమ్మెల్యే భాను ప్రకాష్ సంచలన కామెంట్

Arun Charagonda

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం అన్నారు ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. మంత్రిగా ఆమె చేసిన అవినీతి ఒక్కొకటిగా బయటకు వస్తోందని..ఆధారాలతో త్వరలో రోజా జైలుకు వెళ్ళబోతున్నారు అన్నారు. ఎన్డీయే పాలనలో రోజాకు చిప్పకూడు ఖాయం..ఆడుదాం ఆంధ్ర అంటూ కోట్ల రూపాయలు తినేశారన్నారు.

AP CM Chandrababu: సీఎం చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం, చంద్రబాబుకు సమీపంలో వచ్చిన రైలు, వెంట్రుక వాసిలో తప్పిన ప్రమాదం

Arun Charagonda

ఏపీ వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు సీఎం చంద్రబాబు. ఇందులో భాగంగా ఇ వాళ నిడమానూరు ప్రాంతంలో బుడమేరుకు పడిన గండిన పరిశీలించేందుకు వెళ్లారు. బుడమేరు ప్రవాహాన్ని పరిశీలించేందుకు రైలు వంతెనపైకి కాలి నడకన వెళ్లారు. భద్రతా సిబ్బంది వారించినా వినలేదు.

MLA Koneti Adimulam: చెల్లి చెల్లి అంటూనే మూడు సార్లు ఎమ్మెల్యే అత్యాచారం, ఏకాంత వీడియోలతో మూగబోయిన వైనం, ఎమ్మెల్యే ఇంటిదగ్గర నిశ్శబ్ద వాతావరణం!

Arun Charagonda

ఆయనో ప్రజా ప్రతినిధి. సమాజంలో అందరికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి. కానీ బుద్ది వక్రీకరించింది. ఫలితం సమాజంలో అందరిలో దోషిగా నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. అవును తిరుపతి జిల్లా సత్యవేడు కోనేటి ఆదిమూలం వ్యవహార తీరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

Andhra Pradesh Rains: వీడియో ఇదిగో, అల్లూరి జిల్లాలో ఉగ్రరూపం దాల్చిన సోకిలేరు వాగు, 40 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు

Hazarath Reddy

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మండలంలో సోకిలేరు వాగు పొంగిపొర్లుతోంది. దీంతో సుమారు 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి, శబరి నదులకు భారీగా వరద నీరు రావడంతో సోకిలేరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.

Advertisement

Andhra Pradesh: వీడియో ఇదిగో, టోల్ ప్లాజా ఫీజు కట్టలేదని స్థానికులను చితకబాదిన టోల్ ప్లాజా సిబ్బంది

Hazarath Reddy

సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని రోళ్ళ మండలం టోల్ ప్లాజా వద్ద టోల్ ప్లాజా ఫీజు కట్టలేదని స్థానికులను టోల్ ప్లాజా సిబ్బంది చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. వీడియోలో టోల్ ప్లాజా సిబ్బంది ఇద్దరు ముగ్గురిపై దాడి చేయడం చూడవచ్చు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Vijayawada Floods: హ్యాట్సాఫ్‌..వరదల్లో నలుగురిని కాపాడి చనిపోయిన వ్యక్తి, భార్య 8 నెలల గర్భవతి, విజయవాడ వరదల్లో పెను విషాదం

Arun Charagonda

విజయవాడ వరదల్లో పెను విషాదం చోటు చేసుకుంది. నలుగురిని కాపాడి.. వరదల్లో కొట్టుకుపోయి చనిపోయాడు ఓ వ్యక్తి. విజయవాడకు చెందిన చంద్రశేఖర్(32) సింగ్ నగర్‌లో డెయిరీఫాంలో పనిచేస్తుండగా వరద పోటెత్తింది. తనతో పనిచేస్తున్న తన ఇద్దరు సోదరులు, మరో ఇద్దరిని కాపాడి షెడ్డు పైకప్పు మీదకు ఎక్కించి, తాళ్లతో కట్టేసిన ఆవులనూ వదిలేశాడు.

Budameru River Flood: బుడమేరుకు మళ్లీ పెరుగుతున్న వరద, నీట మునిగిన పలు కాలనీలు, ఇళ్లు ఖాళీ చేసి వెళుతున్న ప్రజలు

Hazarath Reddy

విజయవాడను ముంచెత్తిన వరదలు కాస్త తగ్గుముఖం పడుతుండగానే గురువారం మరోసారి భారీ వర్షం కురిసింది. దీంతో బుడమేరుకు వరద తాకిడి పెరుగుతోంది. విజయవాడ వీధుల్లోకి మరోసారి నీళ్లు చేరుతున్నాయి.

TDP Suspends MLA Koneti Adimulam: రాసలీలల ఎఫెక్ట్, టీడీపీ నుండి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సస్పెండ్, ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు!

Arun Charagonda

రాసలీలల ఎఫెక్ట్ పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు సత్యవేడు ఎమ్మెల్యే, టీడీపీ నేత కోనేటి ఆదిమూలం. ఈ మేరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. లైంగిక ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తూ సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

Advertisement

Andhra pradesh: ఫార్చునర్ కారులో వచ్చి చోరి, బంగారం షాపులో 38 కిలోల వెండి ఆబరణలు అపహరణ, దొంగల్లో ఒకరిని పట్టుకున్న స్థానికులు..వీడియో

Arun Charagonda

ఖరీదైన కారులో వచ్చి చోరీ చేసి దొరికిపోయిన సంఘటన గుంటూరు జిల్లా పొన్నూరులో చోటు చేసుకుంది. ఫార్చునర్ కారులో వచ్చి బంగారం షాపులో 38 కిలోల వెండి ఆభరణాలు చోరీ చేశారు. పారిపోతున్న దొంగల్లో ఒకడిని పట్టుకున్న స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. నిందితులది రాజస్థాన్‌గా భావిస్తున్నారు పోలీసులు.

TDP MLA Koneti Adimulam Episode: టీడీపీ ఆఫీస్ ముందే ఆత్మహత్య చేసుకుంటా..ఎమ్మెల్యే లైంగిక వేధింపులపై బాధితురాలు, పలు న్యూడ్ వీడియోలు రిలీజ్

Arun Charagonda

సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళతో ఉన్న న్యూడ్ వీడియో వైరల్‌గా మారగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో బాధితురాలు పలు న్యూడ్ వీడియోలను రిలీజ్ చేసింది. ఈ అంశాన్ని గతంలో సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లానని వెల్లడించింది.

TDP MLA Koneti Adimulam: అది మార్ఫింగ్ వీడియో, టీడీపీ నేతలే తనపై కుట్ర చేశారని వెల్లడించిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, ఆమెతో ఎలాంటి సంబంధం లేదని ప్రకటన

Arun Charagonda

సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఓ మహిళతో రొమాన్స్ చేస్తున్న వీడియో బయటకు రాగా దీనిపై స్పందించారు ఆదిమూలం. సొంతపార్టీ నేతలే తనపై కుట్రచేశారని, ఆమెతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.

TDP MLA Koneti Adimulam: ఓ వైపు వర్షం..మరోవైపు రాసలీలల్లో టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, లైంగికంగా దాడి చేశారని ఫిర్యాదు చేసిన మహిళా..వీడియో ఇదిగో

Arun Charagonda

టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వివాదంలో చిక్కుకున్నారు. సత్యవేడు నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆదిమూలం. చెల్లి అంటూనే తనపై లైంగికంగా దాడి చేశారని కోనేటి ఆదిమూలంపై ఓ మహిళ ఫిర్యాదు చేయగా రాసలీలకు సంబంధించిన వీడియో లీక్ అయింది.

Advertisement

YS Sharmila On Rainy Season: వర్షాకాలానికి సరికొత్త అర్ధం చెప్పిన వైఎస్ షర్మిల, రైనీ సీజన్ అంటే షర్మిల ఏం చెప్పిందో తెలుసా?, అందుకే నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారా!

Arun Charagonda

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు మరోసారి ట్రోలింగ్‌గా మారారు. గతంలో పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అని చెప్పి నవ్వుల పాలైన షర్మిల తాజాగా వర్షాకాలనికి అలాంటి సమాధానమే చెప్పింది. విజయవాడలో పర్యటించిన షర్మిల...మీడియాతో మాట్లాడుతూ రైనీ సీజన్ అంటే రైన్స్ వచ్చే సీజన్‌ అని చెప్పేశారు. అంతే నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు

Vijayawada Floods: కన్నీరు తెప్పిస్తున్న వీడియో, వరద నీటిలో శవమై తేలిన 14 ఏళ్ల బాలుడు,విజయవాడలో కన్నీటి దృశ్యాలు

Arun Charagonda

వరద నుండి ఇప్పుడిప్పుడే విజయవాడ బయటపడుతోంది. ఇక సహాయక చర్యల్లో భాగంగా హృదయ విదారక సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. చిట్టినగర్ పరిధిలో అదృశ్యమైన 14 ఏళ్ల బాలుడు వరద నీటిలో శవమై తేలాడు. నడుములోతు నీటిలో మృతదేహాన్ని కుటుంబసభ్యులు తీసుకెళ్తుండగా కొడుకుని తలుచుకుని రోదిస్తున్న ఆ తల్లి బాధ మాటల్లో చెప్పలేదని. ఈ దృశ్యాలు అందరిని కంటతడి పెట్టిస్తున్నాయి.

Nandigam Suresh Arrest: వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్, టీడీపీ కార్యాలయంపై దాడి ఎఫెక్ట్, హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు

Arun Charagonda

వైసీపీ నేత, మాజీ ఎంపి నందిగం సురేష్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో హైదరాబాద్‌లో ఉన్న సురేష్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం మంగళగిరికి ఆయన తరలించారు.

Central Govt Committee: ఏపీలో వ‌ర‌ద‌ల‌పై సాయానికి సిద్ధ‌మైన కేంద్ర ప్ర‌భుత్వం, రేపు వ‌రద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌నున్న కేంద్ర క‌మిటీ, అమిత్ షా ట్వీట్

VNS

విజయవాడలో దారుణ పరిస్థితులపై ఎట్టకేలకు కేంద్రం స్పందించింది. ఏపీలో వరద ప్రభావిత ప్రాంతంలో కేంద్ర నిపుణుల కమిటీ పర్యటిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amith Shah) తెలిపారు.

Advertisement

YS Jagan Comments on Chandrababu: క‌ర‌కట్ట ద‌గ్గ‌ర‌ ఇళ్లు మునిగింది కాబ‌ట్టే..చంద్ర‌బాబు క‌లెక్ట‌రేట్ లో ఉంటున్నారు! సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన వైఎస్ జ‌గ‌న్

VNS

విజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు (Chandra Babu) ఘోరంగా విఫలమయ్యారని వైసీపీ అధినేత , మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ (YS Jagan) ఆరోపించారు. బుధవారం విజయవాడలో ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు.

Telangana: కేసీఆర్ కనబడుట లేదు, ప్రజలు వరదల్లో ఇబ్బందులు పడుతుంటే ప్రతిపక్ష నేత ఎక్కడంటూ పోస్టర్లు వైరల్

Hazarath Reddy

కేసీఆర్ కనబడుట లేదని తెలంగాణలో పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. రెండు సార్లు అధికారం ఇచ్చినా... ప్రజలు వరదల్లో ఇబ్బందులు పడుతుంటే బయటకు రాని ప్రతిపక్ష నేత అంటూ పోస్టర్లు.రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

Godavari Water Level Rises: వీడియో ఇదిగో, గోదావరిలో క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు భారీ వరద ఉధృతి

Hazarath Reddy

తుఫాను ప్రభావం వలన ఎగువ రాష్ట్రాల్లో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో నీటిమట్టం బుధవారం సాయంత్రానికి పెరుగుతూ వస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే ఎగువన 31.770 మీటర్ల నీటిమట్టం, స్పిల్ వే దిగువన 23.100 మీటర్ల నీటిమట్టం నమోదయింది.

Vijayawada Floods: అటు కృష్ణానది, ఇటు బుడమేరు కలిసి విజయవాడను ముంచేశాయి, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపిన సీఎం చంద్రబాబు

Hazarath Reddy

రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వరదల పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా నదిలో అదనంగా 40 వేల క్యూసెక్కుల నీరు వచ్చి ఉంటే పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉండేదని అన్నారు.

Advertisement
Advertisement