ఆంధ్ర ప్రదేశ్
Andhra Pradesh Rains: వీడియో ఇదిగో, మోకాలి లోతు నీటిలో నడుచుకుంటూ వెళ్లిన చంద్రబాబు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన సీఎం పర్యటన
Hazarath Reddyవిజయవాడ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన ముగిసింది. సోమవారం ఉదయం నుంచి ముంపు ప్రాంతాల్లో సుమారు నాలుగు గంటల పాటు నిర్విరామంగా సీఎం పర్యటించారు.
Vijayawada Floods: విజయవాడలో వరద బాధితులకు హెలికాప్టర్ల ద్వారా ఆహారం పంపిణీ, బాధితులకు ఆహారం అందించేందుకు ముందుకు వచ్చిన దివీస్, అక్షయపాత్ర సంస్థలు
Hazarath Reddyవిజయవాడలో వరద బాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు ఏపీ ప్రభుత్వం హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వరద బాధితులకు నేడు హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందించారు. బుడమేరు ముంపునకు గురైన ప్రాంతాల్లో రెండు హెలికాప్టర్ల సాయంతో ఆహార ప్యాకెట్లను, మంచినీటి బాటిళ్లను జారవిడిచారు.
Telugu States Floods: తెలుగు రాష్ట్రాల్లో జల ప్రళయం, రూ. 5 లక్షలు విరాళం ప్రకటించిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
Hazarath Reddyఏపీ, తెలంగాణ రాష్ట్రాలను భారీ వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలతో రెండు రాష్ట్రాలు విలవిల్లాడుతున్నాయి. ఈ వరదలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. తనకు వచ్చే పెన్షన్ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి రూ. 5 లక్షల చొప్పున సహాయాన్ని ప్రకటించారు.
Andhra Pradesh Road Accident: కావలిలో ఘోర రోడ్డు ప్రమాదం, కంటైనర్ కిందకు బైక్ దూసుకువెళ్లడంతో మంటలు, ఇద్దరికీ తీవ్ర గాయాలు
Hazarath Reddyకావలి రూరల్ పరిధిలోని రుద్రకోట సమీపంలో హైవే పై లారీ, బైక్ ఢీ..ఇద్దరికీ గాయాలు. రోడ్డు ప్రమాదం లో కంటైనర్ కిందకు వెళ్లిన ద్విచక్ర వాహనం నుండి మంటలు, బైక్ పూర్తిగా దగ్ధం, కంటైనర్ కు కూడా అంటుకున్న మంటలు.మంటలార్పిన అగ్నిమాపక శాఖ...క్షతగాత్రులను కావలి ఆసుపత్రికి తరలింపు.
Vijayawada Rains: వీడియో ఇదిగో, కరకట్ట మీద నీట మునిగిన మంతెన సత్యనారాయణ ఆశ్రమం, భవానిపురానికి పొంచి ఉన్న వరద ముప్పు
Hazarath Reddyకృష్ణా నది మహోగ్రరూపంతో కరకట్ట వాసులు భయం భయంగా గడుపుతున్నారు. మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమంలోకి కూడా నీట మునిగింది.గత రాత్రి అమరావతి రైతులు, అధికారులు ఎంత ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఆశ్రమంలోకి నీళ్లు చేరాయి. దీంతో అందులో చికిత్స పొందుతున్న వారిని ఆశ్రమం నిర్వాహకులు బయటకు పంపేస్తున్నారు.
Telugu States Floods: మా ఆలోచనలన్నీ తెలుగు రాష్ట్రాల ప్రజలతోనే, భారీ వరదల నేపథ్యంలో స్పందించిన రాహుల్ గాంధీ, ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలపై ఏఐసీసీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. తన ఆలోచనలు అన్నీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలతోనే ఉన్నాయని పేర్కొన్నారు. వరదల వల్ల ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, బాలికపై అత్యాచారయత్నం చేసిన వ్యక్తిని స్థంభానికి కట్టేసి చితకబాదిన స్థానికులు
Hazarath Reddyనంద్యాల - అవుకు మండలం కాశిపురం గ్రామంలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారయత్నం చేసిన దాసయ్య. బాలిక కేకలు వేయటంతో దాసయ్యను పట్టుకున్న స్థానికులు.. కట్టేసి కొట్టి, నిందితుడిని పోలీసులకు అప్పగించిన స్థానికులు. ఘటనకు సంబంధించిన వీడియో ఇదిగో..
Vijayawada Floods: వీడియో ఇదిగో, విజయవాడ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న జగన్, కృష్ణలంక వాసుల్ని కలిసిన మాజీ సీఎం, బాధితులకు అండగా ఉండాలని వైసీపీ శ్రేణులకు పిలుపు
Hazarath Reddyపులివెందుల పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్నారు వైఎస్ జగన్. విజయవాడ కృష్ణలంక ఏరియాలో రిటైనింగ్ వాల్ దగ్గర కృష్ణా నది ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సీఎంగా ఉన్న సమయంలో కట్టించిన రిటైనింగ్ వాల్ వల్లే తమ ప్రాణాలు నిలిచాయని వైఎస్ జగన్కు కృష్ణలంక వాసులు కృతజ్ఞతలు తెలిపారు
Vijayawada Rains: వీడియో ఇదిగో, మంచినీళ్లు లేవు, ఆహారం లేదు, కాపాడాలంటూ వీడియో ద్వారా వేడుకున్న విజయవాడ వైఎస్ఆర్ కాలనీవాసులు
Hazarath Reddyభారీ వర్షాలతో వాగులు, వంకలు ఉధృత రూపం దాల్చడంతో విజయవాడ నగరం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది.రహదారులు.. వాగులు, వంకలుగా మారాయి. భారీ నుంచి అతి వర్షాలకు కొండవీటి వాగు ఉప్పొంగింది.
Vijayawada Floods: వీడియో ఇదిగో, ప్రకాశం బ్యారేజీ రైల్వే పైబ్రిడ్జిని తాకిన కృష్ణమ్మ, 125 సంవత్సరాల బ్యారేజ్ చరిత్రలో రికార్డ్ స్ధాయిలో వరద, 11 లక్షల క్యూసెక్కులు దాటిన వరద ప్రవాహం
Hazarath Reddyప్రకాశం బ్యారేజీలోకి వచ్చి చేరుతున్న వరద ఉధృతి గంటగంటకూ పెరుగుతోంది. ఫలితంగా ప్రకాశం బ్యారేజీ వరద ఉధృతి ఆల్ టైం రికార్డు స్ధాయిలో నమోదైంది. సోమవారం ఉదయం 125 సంవత్సరాల బ్యారేజ్ చరిత్రలో రికార్డ్ స్ధాయిలో కృష్ణమ్మకి వరద కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద 11.25 లక్షలు క్యూసెక్కులు ఇన్ ఫ్లో దాటింది
Telugu States Floods: తెలుగు రాష్ట్రాల్లో భారీ వరదలు, 432 రైళ్లతో పాటు 560కి పైగా బస్సులు రద్దు, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరద
Hazarath Reddyగత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. వాగులు, వంకలు, నదులు అన్నీ ఏకమయ్యాయి. చాలా ప్రాంతాలలో చెరువులు, జనావాస ప్రాంతాలు అనే తేడా లేకుండా మొత్తం జలమయంగా మారింది.
Andhra Pradesh Rains: ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరుతాం, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు
Hazarath Reddyవరద పరిస్థితిపై సోమవారం ఉదయం విజయవాడ కలెక్టరేట్లో అధికారులతో సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.జలను కాపాడే విషయంలో ప్రయత్నాలు ఎక్కడా ఆగకూడదని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఒక్క రాత్రి ధైర్యంగా ఉండాలని ముంపు ప్రాంతాల ప్రజలకు హామీ ఇచ్చానని సీఎం చంద్రబాబు తెలిపారు
Telugu States Floods: వరదలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలను ఆదుకుంటామని ప్రధాని మోదీ హామీ, కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తుందని వెల్లడి
Hazarath Reddyగత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. వాగులు, వంకలు, నదులు అన్నీ ఏకమయ్యాయి. చాలా ప్రాంతాలలో చెరువులు, జనావాస ప్రాంతాలు అనే తేడా లేకుండా మొత్తం జలమయంగా మారింది.
Robbery Caught on Camera: చంద్రగిరి ఎస్బీఐ ఏటిఎంలో చోరీ వీడియో ఇదిగో, రూ.39 లక్షలు సిస్టంలో పెట్టినట్లు నమోదు చేసిన నిందితుడు
Hazarath Reddyతిరుపతి జిల్లాలోని చంద్రగిరి ఎస్బీఐ ఏటిఎంలో చోరీ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డ్ అయింది. ఏటిఎంలో క్యాష్ పెట్టే ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది సురేష్ ఈ దొంగతనానికి పాల్పడ్డాడని గుర్తించారు. దాదాపు రూ.39 లక్షలు సిస్టంలో పెట్టినట్లు నమోదు చేసిన నిందితుడు.
Vijayawada Horror: వరద ప్రవాహంలో కొట్టుకొచ్చిన కారుపై మహిళ మృతదేహం.. వెళ్లేందుకు ఎవరూ ధైర్యం చేయకపోవడంతో కొన్ని గంటలపాటు అలాగే.. విజయవాడలో హృదయవిదారక ఘటన.. గుండెల్ని మెలిపెట్టే వీడియో మీరూ చూడండి!!
Rudraభారీ వర్షాలు, వరదల ధాటికి విజయవాడ ప్రజలు వణికిపోతున్నారు. దాదాపు నగరమంతా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ముఖ్యంగా నగరంలోని అజిత్ సింగ్ నగర్ లోని బుడమేరు ముంపు ప్రాంతంలో పరిస్థితి మరింత దిగజారింది.
YS Jagan: వైఎస్సార్ వర్ధంతి నేడు.. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన ఏపీ మాజీ సీఎం జగన్ (వీడియో)
Rudraదివంగత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద మాజీ సీఎం, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు.
Prakasam Barrage Three Gates Damaged: ప్రకాశం బ్యారేజ్ మొదటి మూడు గేట్లు భారీగా ధ్వంసం.. ఎగువన వస్తున్న భారీ వరదతో కొట్టుకొచ్చిన బోట్లు ఢీకొట్టడంతోనే గేట్లు డ్యామేజీ.. (వీడియోతో)
Rudraభారీ వర్షాలతో విజయవాడలో అల్లకల్లోలం అవుతున్నది. కృష్ణమ్మకు పై నుంచి భారీగా వరద వస్తోండటంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి ఉధృతి ఎక్కువగా ఉన్నది.
Home Minister Amit Shah Calls Telugu states CM's: తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సంపై రంగలోకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా! ఏపీకి 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, తెలంగాణకు ఏ సాయం కావాలన్నా చేస్తానని హామీ
VNSఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్ లో (Amit Shah Calls Chandrababu) మాట్లాడారు. చంద్రబాబు విన్నపంతో హోం సెక్రటరీ స్పందించింది. 6 ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లను ఇతర రాష్ట్రాల నుండి తక్షణమే ఏపీకి పంపుతున్నట్లు హోం సెక్రటరీ తెలిపింది
CM Chandrababu Monitor Flood Situation: విజయవాడలో భారీ వరదల నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం, ఇవాళ రాత్రికి విజయవాడ కలెక్టరేట్ లోనే మానిటరింగ్, హోంమంత్రితో పాటూ ఇతర అధికారలు కూడా..
VNSవిజయవాడలో సాధారణ స్థితి వచ్చే వరకు అక్కడే ఉండాలని సీఎం చంద్రబాబు (CM Chandra Babu) నిర్ణయించారు. ఇవాళ రాత్రికి విజయవాడ కలెక్టరేట్ లోనే (Vijayawada Collectorate) సీఎం చంద్రబాబు బస చేయనున్నారు. అంతేకాదు బుడమేరు (Vijayawada Flood) వరద బాధితుల కష్టాలు తీర్చేవరకు విశ్రమించేది లేదన్నారు చంద్రబాబు.
Andhra Pradesh Rains: లంక గ్రామాలకు అలర్ట్, కొన్ని దశాబ్దాల తర్వాత తొలిసారిగా ప్రకాశం బ్యారేజీకి భారీ స్థాయిలో వరద, రెండో ప్రమాద హెచ్చరిక జారీ
Hazarath Reddyప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి గంట గంటకూ పెరుగుతోంది. ఎగువ నుంచి 9.18లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఈ రోజు ఉదయం.. ఐదు లక్షల క్యూసెక్కులుగా ఉన్న ఇన్ఫ్లో రాత్రి 7గంటల సమయానికి 9లక్షల క్యూసెక్కులు దాటింది. ఇంత భారీ స్థాయిలో వరద రావడం కొన్ని దశాబ్దాల తర్వాత ఇదే మొదటిసారి