తెలంగాణ
Hyderabad: తల్లీకూతురు చేతిలో చావుదెబ్బలు తిని పరారైంది వీళ్లే, అరెస్ట్ చేసిన పోలీసులు, తల్లిబిడ్డల ధైర్యసాహసాలకు మెచ్చుకుని శాలువాతో సత్కరించిన నార్త్ జోన్ డీసీపీ
Hazarath Reddyహైదరాబాద్ లోని బేగంపేటలో తల్లికూతురు దాడి నుంచి తప్పించుకుని పరారైన ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు దొంగలు సుశీల్ కుమార్, ప్రేమ్ చంద్రలను అరెస్టు చేశారు.తల్లీకూతురు తుపాకులకు ఎదురునిలిచి ఆ దొంగలతో వీరోచితంగా పోరాడారు.
Telangana: హైదరాబాద్ నగరంలో అక్రమ డ్రగ్స్ తయారీ గుట్టు రట్టు, రూ. 8.99 కోట్ల విలువైన స్టాక్స్‌ను సీజ్ చేసిన డీసీఏ అధికారులు, వీడియోలు ఇవిగో..
Hazarath Reddyఒక ముఖ్యమైన ఆపరేషన్‌లో, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA), ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ సంయుక్తంగా సంగారెడ్డిలోని IDA బొల్లారంలో సైకోట్రోపిక్ పదార్ధం '3-Methylmethcathinone (3MMC)' యొక్క అక్రమ తయారీ యూనిట్‌ను కూల్చివేశాయి. రూ. 8.99 కోట్ల విలువైన స్టాక్స్‌ను సీజ్ చేశారు.
Telangana Elections 2024: నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ నుంచి వెంకట్రామిరెడ్డి, ఇప్పటివరకు ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల జాబితా ఇదిగో..
Hazarath Reddyరానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పోటీ చేసే మరో ఇద్దరు అభ్యర్థులను పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ శుక్రవారం(మార్చ్‌ 22) ఒక ప్రకటన విడుదల చేసింది. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ పార్లమెంటు స్థానం నుంచి ఎమ్మెల్సీ, మాజీ ఐఏఎస్ అధికారి పి. వెంకట్రామిరెడ్డి పోటీ చేయనున్నారు.
Delhi Excise Policy Case: బెయిల్ కోసం ముందు ట్రయల్ కోర్టుకు వెళ్లండి, కవితకు సుప్రీంకోర్టు సూచన, ఆరు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఈడీకి నోటీసులు జారీ
Hazarath Reddyఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో (Supreme Court) నిరాశ ఎదురయింది. తనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను క్వాష్ చేయాలని, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత (MLC Kavitha) దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం... ఆమెకు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది.
Telangana: దారుణం, లంచాలు ఇవ్వలేదని లారీ డ్రైవర్ బట్టలు విప్పి చితకబాదిన కానిస్టేబుల్స్, వీడియో ఇదిగో..
Hazarath Reddyమహబూబాద్ - కేసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో నడిరోడ్డుపై ఇసుక లారీ డ్రైవర్‌ను బట్టలు విప్పి చితకబాదిన ఇద్దరు కానిస్టేబుల్స్. రోజూ మామూళ్లు ఇవ్వాలంటూ లారీ డ్రైవర్లను బెదిరింపులకు గురి చేస్తున్న కానిస్టేబుల్స్ సాంబయ్య, వీరన్న. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికలు, 57 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ మూడో జాబితా విడుదల, తెలంగాణ నుంచి ఐదుగురు అభ్యర్థుల ప్రకటన
Hazarath Reddyలోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ 57 మంది అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ కీలక నేత అధిర్ రంజన్ చౌదరి పశ్చిమ బెంగాల్‌లోని బెర్హంపూర్ నుంచి మళ్లీ పోటీ చేయనున్నారు. ఇందులో తెలంగాణ నుంచి ఐదుగురు అభ్యర్థులను ప్రకటించింది.
Hyderabad Horror: వీరోచిత తల్లీకూతుళ్లకు సలాం.. తుపాకీతో తెగబడిన దొంగలు.. ఇంట్లోకి చొరబడి బెదిరింపులు.. భయపడకుండా తిరగబడ్డ తల్లీకూతుళ్లు.. తుపాకీ లాక్కొని తరమికొట్టిన వైనం... బేగంపేటలో అరుదైన ఘటన.. వీడియో వైరల్
Rudraసాధారణంగా తుపాకీ చూస్తే ఎంతటి వాళ్లైనా భయపడతారు. బెదిరించిన వాళ్లకు తమ వద్ద ఉన్నది ఉన్నట్టు ఇచ్చి పంపుతారు. కానీ హైదరాబాద్ లోని బేగంపేటలో నివాసం ఉంటున్న తల్లీ కూతుళ్లు ఇద్దరు దుండగులను ఎదిరించి వారిని తరిమికొట్టిన ఘటన ఆశ్చర్యపర్చింది.
Breaking News, ED arrested CM Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌ అరెస్ట్‌. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో అరెస్ట్‌ చేసిన ఈడీ...ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్న ఈడీ..
sajayaఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. సీఎం నివాసంలో విచారణ అనంతరం అరెస్ట్ చేశారు. అరెస్టు నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఇంటి దగ్గర హైటెన్షన్‌ వాతావరణం నెలకొని ఉంది. అయితే ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు దక్కని ఊరట లభించలేదు.
Mango Racket Busted in Hyderabad: హైదరాబాద్‌లో మామిడి పండ్ల రాకెట్ గుట్టు రట్టు, వ్యాపారుల నుంచి రూ. 12. 64 లక్షల విలువైన హానికర రసాయన పండ్లను స్వాధీనం చేసుకున్న అధికారులు
Hazarath Reddyవేసవి కాలంతో పాటుగా మామిడి పండ్లు సీజన్ కూడా వచ్చేసింది. ఈ నేపథ్యంలో వ్యాపారులు సరికొత్త దందాకు తెరతీసారు. ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే హానికరమైన రసాయనాలతో కృత్రిమంగా పండిన మామిడి పండ్లను వ్యాపారులు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.
Hyderabad: బ్యాగులో 10 కిలోల గంజాయి పెట్టుకుని ఒడిషా నుండి హైదరాబాద్‌కు, యువకుడిని మాటు వేసి పట్టుకున్న పోలీసులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఒడిశా నుంచి హైదరాబాద్‌కు రైలులో దాదాపు 10 కిలోల గంజాయిని రవాణా చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్‌లోని లింగంపల్లి రైల్వే స్టేషన్ (సిరిలింగంపల్లి) వద్ద పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డ్రగ్‌పెడ్లర్‌ను అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి భారీగా గంజాయిను స్వాధీనం చేసుకున్నారు.
Holi Wishes In Telugu 2024: మీ బంధు మిత్రులకు Images, Wishes, Quotes, Messages, WhatsApp Greetings రూపంలో హోలీ శుభాకాంక్షలు తెలపండి..
sajayaహోలీ పండుగ వచ్చిందంటే చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడుపుతారు. వసంత ఋతువులో వచ్చే అతి ముఖ్యమైన పండుగ హోలీ. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ సారి మార్చి 25న ఈ పండుగ వస్తోంది.
Gas Cylinder Exploded Video: టిఫిన్ సెంటర్లో ఒక్కసారిగా పేలిన గ్యాస్ సిలిండర్, బాంబు అనుకుని భయాందోళనకు గురై బయటకు పరుగులు తీసిన స్థానికులు
Hazarath Reddyవనస్థలిపురంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. రైతుబజార్‌ సమీపంలో ఉన్న టిఫిన్‌ సెంటర్‌లో బుధవారం సాయంత్రం గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. పేలుడు శబ్దం భారీగా రావడంతో టిఫిన్‌ సెంటర్‌లోని పనివాళ్లు, స్థానికులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు.
Nalgonda Road Accident: నల్గొండ జిల్లాలో కారు బీభత్సం, ఇంటి మీదకి దూసుకెళ్లడంతో ఒకరికి గాయాలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyనల్గొండ జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. ఏకంగా ఇంటి మీదకి దూసుకెళ్లింది. మర్రిగూడ మండలం భట్లపల్లి గ్రామంలో అదుపుతప్పిన కారు ఓ ఇంట్లోకి దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Telangana: భూమి సమస్య తీర్చడం లేదంటూ ఎమ్మార్వోపై పెట్రోల్ పోసిన మహిళా రైతులు, అనంతరం ఆత్మహత్యాయత్నం, జోగులాంబ గద్వాల జిల్లాలో ఘటన
Hazarath Reddyజోగులాంబ గద్వాల జిల్లా అయిజ ఎమ్మార్వో కార్యాలయంలో తమ భూమి సమస్యను తీర్చలేదంటూ నలుగురు మహిళలు బాటిల్లో పెట్రోల్ తీసుకువచ్చి తహశీల్ధార్ పై పోసి ఆత్మహత్యానికి పాల్పడిన బాధితులు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తహశీల్ధార్ జ్యోతి.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Heartwarming Video: పోలియోతో కాళ్లు పూర్తిగా పడిపోయిన కొడుకుని చేతులతో మోస్తూ పదో తరగతి పరీక్షలకు తీసుకువచ్చిన తల్లి, నెటిజన్ల మనసు గెలుచుకున్న వీడియో ఇదిగో..
Hazarath Reddyనిర్మల్ - చించోలి(బి)కి చెందిన చరణ్‌కు పోలియోతో కాళ్లు పూర్తిగా పడిపోయాయి.. పుట్టిన ఏడాదికే తండ్రి చనిపోతే తల్లి పద్మ బీడీలు చుడుతూ చరణ్ బాగోగులు చూస్తోంది. చరణ్ పదో తరగతి కావడంతో తల్లి రోజు పరీక్ష కేంద్రానికి చేతులపై మోస్తూ ఆటో ఎక్కించి తీసుకొచ్చి పరీక్షలు రాయిస్తోంది.
Hyderabad Shocker: ఇంట్లో ప్రియుడితో కూతురిని చూసిన తల్లి, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చూస్తూ కుమార్తెకు ఉరివేసి చంపిన తల్లి, ఇబ్రహీంపట్నంలో పరువు హత్య కేసు వివరాలను వెల్లడించిన పోలీసులు
Hazarath Reddyఇబ్రహీంపట్నం దండుమైలారంలో ప్రేమ వ్యవహారం పరువు హత్యకు దారితీసిన సంగతి విదితమే. నవ మాసాలు మోసి కన్న తన కూతురునే ఓ తల్లి కడతేర్చింది. తాజాగా యువతి అనుమానాస్పద మృతి కేసును.. పోలీసులు ఎట్టకేలకు పరువు హత్యగా (19-Year-Old Girl Strangled to Death by Mother ) తేల్చారు.
Theft Caught on Camera: అడిషనల్ కలెక్టర్ ఇంట్లోకి చొరబడిన దొంగలు, ముసుగేసుకుని ఇంట్లోకి పోతున్నప్పుడు కెమెరాకు చిక్కిన అగంతకులు
Hazarath Reddyభూపాలపల్లి - ఏటూరునాగారం మండల కేంద్రంలో నివాసముంటున్న ఖమ్మం అడిషనల్ కలెక్టర్ నూతి మధుసూదన్ ఇంట్లో దొంగలు పడి చోరీ చేశారు.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Telangana: వీడియో ఇదిగో, తెలంగాణలో పిల్లలను ఎత్తుకెళ్లే వ్యక్తిని వెంబడించిన గ్రామస్థులు, గెస్ట్ హౌస్‌లో దాక్కోవడంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు
Hazarath Reddyమోత్కూరు మండలం అనాజిపురంలో ఓ వ్యక్తి పిల్లలను ఎత్తుకెళ్లేందుకు వచ్చాడంటూ అతన్ని గ్రామస్థులు వెంబడించారు. గ్రామస్థుల నుంచి పరారైన దొంగ ఓ గెస్ట్ హౌస్‌లో దాక్కున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అతన్ని పట్టుకుని విచారిస్తున్నారు.
Earth Hour 2024: మార్చి 23న హైదరాబాద్‌లో ఈ ఐకానిక్ ప్రదేశాల్లో దీపాల వెలుగులు ఉండవు, ఎర్త్ అవర్ సందర్భంగా చీకటిలోకి జారుకోనున్న ప్రఖ్యాత కట్టడాలు
Hazarath Reddyఎర్త్ అవర్ అనేది వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF)చే నిర్వహించబడే వార్షిక కార్యక్రమం. ఈ సంవత్సరం మార్చి 23న రాత్రి 8:30 గంటల నుండి 9:30 గంటల వరకు ఎర్త్ అవర్‌ను పాటించనున్నారు.