తెలంగాణ

TS CPGET Exam Date 2023: తెలంగాణ సీపీగెట్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ఈ నెల 30 నుంచి జూలై 10 వరకు ఎగ్జామ్స్, ప్రతిరోజు మూడు సెషన్లలో పరీక్షలు

Hazarath Reddy

తెలంగాణలోని యూనివర్సిటీల్లో సంప్రదాయ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షల (CPGET) షెడ్యూల్‌ విడుదలైంది. రాష్ట్రంలో పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సీపీగెట్‌)ను ఈ నెల 30 నుంచి జూలై 10 వరకు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.

Hyderabad Police Traffic Advisory: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభం సందర్భంగా రోడ్లు మూసివేత, ప్రత్యామ్నాయ మార్గాలివే!

VNS

హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో ఇవాళ ట్రాఫిక్‌ ఆంక్షలు (Traffic Restrictions) విధించనున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవం (Telangana Martyrs Memorial Inauguration) నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Asia's Largest 2 BHK Township: ఆసియాలోనే అతిపెద్ద డబుల్‌ బెడ్‌రూం టౌన్‌ షిప్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్, ఒకేచోట ఏకంగా 15వేలకు పైగా ఫ్లాట్లతో భారీ నిర్మాణాలు

VNS

గ్రేటర్‌ పరిధిలోని నిరుపేద ప్రజల సొంతింటి కల నెరవేరనున్నది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు (Patancheru) అసెంబ్లీ నియోజకవర్గ పరిధి రామచంద్రాపురం మండలం కొల్లూరు (Kolluru) గ్రామంలో రెండో దశ కింద చేపట్టిన ఆసియాలోనే అతిపెద్దదైన కేసీఆర్‌ నగర్‌ 2 బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్‌ కాలనీని గురువారం ఉద యం 11 గంటలకు సీఎం కేసీఆర్‌ (CM KCR) ప్రారంభించనున్నారు.

Gaddar Suspended from Praja Shanti Party: వీడియో ఇదిగో, గద్దర్‌ను ప్రజా శాంతి పార్టీ నుండి సస్పెండ్ చేసిన కేఏ పాల్, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని నిర్ణయం

Hazarath Reddy

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ సొంతంగా పార్టీ పెట్టినందుకు ప్రజా గాయకుడు గద్దర్ ని.. ప్రజా శాంతి పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు కేఏ పాల్ ప్రకటించారు. వీడియో ఇదే..

Advertisement

Transgenders Murdered in Hyd: అక్రమ సంబంధం అనుమానాలు, అర్థరాత్రి హిజ్రాలను కత్తులతో నరికి చంపిన దుండగులు, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన సౌత్‌ జోన్‌ డీసీపీ కిరణ్‌

Hazarath Reddy

హైదరాబాద్‌ నగరంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వివిద ప్రాంతాల్లో రెండు జంట హత్యలు కలకలం రేపాయి. టపాచబుత్ర పీఎస్‌ పరిధిలో ఇద్దరు హిజ్రాలను దుండగులు దారుణంగా (Transgenders Murdered in Hyd) హతమార్చగా..రాజేంద్రనగర్‌ ప్రాంతంలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఇద్దరిని బండరాళ్లతో మోది హత్య చేశారు.

Hyderabad Shocker: పెళ్లికి ఒప్పుకోలేదని టీకి పిలిచి యువతి గొంతు కోసిన యువకుడు, ముఖం, చేతులపైనా తీవ్ర గాయాలు, నిందితుడిని అరెస్ట్ చేసిన నార్సింగి పోలీసులు

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలోని నార్సింగి పీఎస్‌ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది.మహిళా సాఫ్ట వేర్ ఇంజనీర్ పెళ్లికి నిరాకరించందనే కారణంతో ఓ యువకుడు ఆమె గొంతు కోసి దారుణంగా హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన పుప్పాలగూడ టీ గ్రిల్‌ హోటల్‌ సమీపంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.

Gaddar Praja Party: గద్దర్‌ ప్రజా పార్టీ పేరుతో తెలంగాణ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ, రిజిస్ట్రేషన్ కోసం ఈసీ ఆఫీసుకు వెళ్లిన ప్రజా గాయకుడు గద్దర్

Hazarath Reddy

తెలంగాణ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ చేరింది. తూటాల వంటి పాటలతో ప్రజల్లో విప్లవ స్ఫూర్తిని రగిలించిన, ప్రజాగాయకుడు గద్దర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారు. ప్రజా గాయకుడు గద్దర్‌ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. కొత్త పార్టీగా ‘గద్దర్‌ ప్రజా పార్టీ’ పేరును విప్లవ సింగర్ అనౌన్స్‌ చేశారు.

Flyover Slabs Collapsed in LB Nagar: ఎల్బీ నగర్ ఫ్లైఓవర్‌ నిర్మాణ పనుల్లో ప్రమాదం, కుప్పకూలిన పిల్లర్ల మధ్య ఇనుప ర్యాంప్‌, తొమ్మిది మందికి గాయాలు, ముగ్గురు పరిస్థితి విషమం

Hazarath Reddy

హైదరాబాద్ ఎల్బీ నగర్ లో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సాగర్ రింగ్ రోడ్డులో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ లో నిన్న అర్ధరాత్రి కొంత భాగం కూలిన ఘటనలో తొమ్మిది మందికి గాయాలు అయ్యాయి. రెడీ మిక్సర్ తయారు చేసే లారీ రివర్స్ తీసుకునే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

Advertisement

T Cong Joinings: పొంగులేటి, జూపల్లి చేరిక ఖరారు, కాసేపట్లో ఇరువురు నేతలతో భేటీ కానున్న రేవంత్ రెడ్డి, ముఖ్య అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్న ఇరువురు నేతలు, త్వరలోనే ఢిల్లీ వెళ్లి రాహుల్‌ను కలిసే అవకాశం

VNS

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy), మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) లు త్వరలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party)నుంచి బయటకు వచ్చిన తరువాత వారిద్దరూ ఏ పార్టీలో చేరుతారనే ఉత్కంఠ రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Flyover Ramp Collapse: ఎల్బీనగర్‌లో ఘోర ప్రమాదం, నిర్మాణం మధ్యలోనే కుప్పకూలిన ఫ్లై ఓవర్, 10మందికి గాయాలు, నలుగురి పరిస్థితి విషమం

VNS

ప్లై ఓవర్ పిల్లర్ల మధ్య ఇనుప ర్యాంప్ ఏర్పాటు చేస్తుండగా ఒక్కసారిగా అది కూలిపోయింది(Flyover Ramp Collapse). ఈ ఘటనలో 10మందికి గాయాలయ్యాయి. వారిని హుటాహుటీని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడిన కార్మికులంతా బీహార్‌కు చెందిన వారిగా తెలుస్తోంది.

Southwest Monsoon: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ చల్లని కబురు, రాగల మూడు రోజుల్లో రెండు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు

Hazarath Reddy

ఈ నెల 11 నుంచి కర్ణాటక-ఏపీ సరిహద్దుల వద్ద నిలిచిపోయిన రుతుపవనాల్లో కదలిక ప్రారంభమైంది. మంగళవారం ఏపీలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. దీని ప్రభావంతో ఏపీలోని పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.

Hyderabad: నెలకి రూ.300 బిల్లు వచ్చే ఇంటికి రూ. 8 లక్షలు కరెంట్ బిల్లు వేసిన అధికారులు, లబోదిబోమంటూ తలలు పట్టుకున్న ఇంటి యజమాని

Hazarath Reddy

ఉప్పల్ పరిధిలోని హైకోర్టు కాలనీలో ఓ ఇంటి కరెంట్ బిల్లు ఏకంగా ఏడు లక్షల తొంబై ఏడువేల ఐదువందల డెభై ఆరు రూపాయలు రావడంతో ఆ యజమాని గుండె గుభేల్లుమంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఖాళీగా ఉన్న పోర్షన్ కి ప్రతి నెల మూడువందల లోపు కరెంట్ బిల్లు వచ్చేది.

Advertisement

Man Sets His Bike on fire: పెండింగ్ చలాన్ కట్టమన్నందుకు బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, పోలీసులను దుర్భాషలాడి మరీ నిప్పు..

Hazarath Reddy

శంషాబాద్ బెంగుళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ పోలీసులు ఆపి పెండింగ్ చాలన్ కట్టాలని చెప్పడంతో వాగ్వాదానికి దిగిన ఫసియుద్దీన్ అనే యువకుడు. ట్రాఫిక్ పోలీసులను దుర్భాషలాడి తన యాక్టివా బండికి నిప్పు పెట్టిన యువకుడు.

Telangana: మళ్లీ అధికారం మనదే, హ్యట్రిక్ కొట్టబోతున్నామని తెలిపిన సీఎం కేసీఆర్, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి తీరుతామని స్పష్టం

Hazarath Reddy

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని తుమ్మలూరులో నిర్వహించిన హరితోత్సవంలో సీఎం కేసీఆర్‌ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటే పాలమూరు పూర్తి కావాల్సిందని, పుణ్యాత్ములు కాంగ్రెసోళ్ల వల్లే ఆలస్యమైందని తెలిపారు.

Double Bedroom Houses: ఈనెల జూన్ 22న కేసీఆర్ చేతుల మీదుగా 15,660 డబుల్ బెడ్ రూం ఇళ్ళ పంపిణీ

Hazarath Reddy

ఈనెల జూన్ 22న కేసీఆర్ చేతుల మీదుగా కొల్లూరులోని 15,660 డబుల్ బెడ్ రూం ఇళ్ళ పంపిణీ ప్రారంభం కానుంది. ఇప్పటికే అక్కడ ఇళ్ల నిర్మాణం పూర్తి అయింది.

Ajit Pawar on CM KCR: కేసీఆర్‌కు మహారాష్ట్రలో అంత సీన్ లేదు, ఎన్సీపీ నేత అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు, ఆ ప్రచార డబ్బంతా ఎక్కడిది అంటూ విమర్శలు

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలో తన స్థావరాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆ రాష్ట్రంలో అడుగుపెట్టేందుకు ఆయన సఫలం కాలేడని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నేత అజిత్ పవార్ (Ajit Pawar on CM KCR) సోమవారం అన్నారు

Advertisement

Mahesh Bank Case: కోర్టు ధిక్కరణ కేసులో ఆర్‌బీఐ గవర్నర్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు, జులై 7లోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు

Hazarath Reddy

మహేష్ బ్యాంకు కోర్టు ధిక్కరణ కేసులో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలో జారీ చేసిన కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదంటూ ఏపీ మహేశ్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ వాటాదారులు కోర్టుకు వెళ్లారు.

Kalyanam at Yellamma Devasthanam: కన్నుల పండువగా బల్కంపేట్‌ ఎల్లమ్మ కల్యాణం.. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సీఎం కేసీఆర్ సతీమణి శోభ, కుమార్తె కవిత.. వీడియో ఇదిగో

Rudra

తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బల్కంపేట్‌ ఎల్లమ్మ కల్యాణం నేడు. ఈ సందర్భంగా మంగళ, బుధవారాల్లో ఆలయం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ సుధీర్‌బాబు వివరించారు. మంగళవారం కల్యాణోత్సవం, బుధవారం రథోత్సవ కార్యక్రమాలుంటాయని తెలిపారు. కళ్యాణం సందర్భంగా సీఎం కేసీఆర్ సతీమణి శోభ, కుమార్తె కవిత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

Telangana Govt. Hikes DA: తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 2.73 శాతం డీఏ మంజూరు.. పెంచిన డీఏ 2022 జనవరి నుండి అమల్లోకి... 7.28లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి

Rudra

ఉద్యోగులకు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏను విడుదల చేసింది. ఉద్యోగుల మూల వేతనం, పెన్షన్‌పై 2.73 శాతం డీఏ పెరగనుంది. ఉద్యోగుల డీఏను పెంచుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ నెల నుండి డీఏను పెంచింది.

Ramcharan Upasana Blessed With Baby Girl: మెగా ఇంట సంబరాలు.. అమ్మానాన్నలైన రామ్‌ చరణ్‌-ఉపాసన దంపతులు.. నేడు తెల్లవారుజామున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన.. మెగా ఇంట మిన్నంటిన సంబరాలు, యువరాణి వచ్చిందంటూ మెగా ఫ్యామిలీ ప్రకటన

Rudra

మెగా ఫ్యామిలీ ఇంట సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మెగా కుటుంబం, మెగాభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అద్భుతమైన క్షణం రానే వచ్చింది. రామ్ చరణ్, ఉపాసన అమ్మానాన్నలు అయ్యారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో మంగళవారం తెల్లవారుజామున ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

Advertisement
Advertisement