తెలంగాణ

Marri Shashidhar Meets Amit Sha: బీజేపీలోకి మర్రి శశిధర్ రెడ్డి? అమిత్ షాతో భేటీ అయిన సీనియర్ కాంగ్రెస్ నేత.. 40 నిమిషాల పాటు కొనసాగిన సమావేశం.. హాజరైన బండి సంజయ్, డీకే అరుణ..

Rudra

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరుతారా? లేదా? అనే సందిగ్ధతకు పుల్ స్టాప్ పడింది. కేంద్ర హోమంత్రి అమిత్ షాతో నిన్న రాత్రి ఆయన భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు వీరి సమావేశం కొనసాగింది.

TRS MLAs Coming Out From Pragathi Bhavan: మూడు వారాల తర్వాత తొలిసారి బయటకు వస్తున్న ఆ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. రక్షణ కోసమే ప్రగతి భవన్‌లో ఉన్నామన్న శాసనసభ్యులు.. ఎమ్మెల్యేలు కనిపించడం లేదంటూ పోలీసులకు కాంగ్రెస్ ఫిర్యాదు

Sriyansh S

ఎమ్మెల్యే కొనుగోలు కేసు వ్యవహారంలోని నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, రేగ కాంతారావు, గువ్వల బాలరాజు నేడు బయటకు రానున్నారు. మూడు వారాలుగా ప్రగతి భవన్‌కే పరిమితమైన వీళ్ళు ఈరోజు ప్రజాక్షేత్రంలోకి రానున్నారు.

BL Santhosh Summoned By SIT: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సంచలనం, ఏకంగా బీజేపీ ముఖ్యనేతకు సిట్ సమన్లు, విచారణకు హాజరుకావాలంటూ బీఎల్‌ సంతోష్‌కు సిట్ సమన్లు, ఈ నెల 21న రావాలంటూ నోటీసులు, రాకపోతే అరెస్ట్ చేస్తామన్న సిట్

Naresh. VNS

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు (BL Santhosh Summoned) నోటీసులు ఇచ్చింది సిట్. ఈ నెల 21న ఉదయం 10.30 గంటలకు కమాండ్ కంట్రోల్‌ కేంద్రంలోని సిట్ కార్యాలయంలో (SIT Office) విచారణకు హాజరుకావాలని సీఆర్ పీసీ 41 ఏ కింద నోటీసులు జారీ చేసింది.

Telangana: సికింద్రాబాద్ కస్తూర్బా విద్యాసంస్థలో గ్యాస్ లీక్, 25 మంది విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత, విష వాయువు లీక్‌ కావడంతో స్పృహ తప్పిపోయిన విద్యార్థులు

Hazarath Reddy

సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్‌ పల్లి కస్తూర్బా విద్యాసంస్థలో గ్యాస్ లీక్ అయింది. ఈ ఘటనలో 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కాలేజీ సైన్స్ ల్యాబ్‌లో ప్రయోగాలు చేస్తుండగా విష వాయువు లీక్‌ కావడంతో విద్యార్థులు స్పృహ తప్పి పడిపోయారు.

Advertisement

Telangana: తెలంగాణలో మళ్లీ వేడెక్కిన పొలిటికల్‌ వార్‌, నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ అరవింద్‌ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి, ప్రతిగా తెలంగాణ భవన్ ముట్టడించేందుకు ప్రయత్నించిన బీజేపీ నేతలు

Hazarath Reddy

తెలంగాణ పొలిటికల్‌ వార్‌ మరోసారి వేడెక్కింది. నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ అరవింద్‌ ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు హంగామా చేశారు.ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ (defamatory remarks against MLC Kavitha) హైదరాబాద్‌లోని అరవింద్‌ ఇంటిని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు (TRS activists storm) ముట్టడించారు.

Tamilisai Calls Harsih: అసెంబ్లీ ఆమోదించిన బిల్లుపై తమిళిసై అసంతృప్తి.. హరీశ్ రావును రాజ్ భవన్ కు రమ్మన్న తెలంగాణ గవర్నర్.. మెడికల్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగ విరమణ వయస్సు పెంపుపై హరీశ్ ను వివరణ కోరనున్న తమిళిసై

Sriyansh S

తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోదముద్ర వేసే విషయంలో గవర్నర్ తమిళిసై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పలు బిల్లులకు ఆమోదం తెలపకుండా తన వద్దే ఉంచుకుంటున్నారు. పూర్తి క్లారిటీ ఉంటేనే ఆమోదిస్తున్నారు. ఈ క్రమంలో... రాజ్ భవన్ కు రావాలంటూ తాజాగా ఆరోగ్యమంత్రి హరీష్ రావుకు పిలుపు వచ్చింది.

Kanti Velugu: తెలంగాణలో మళ్లీ 'కంటి వెలుగు'.. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ శ్రీకారం.. జనవరి 18 నుంచి రెండో విడత అమలు

Sriyansh S

తెలంగాణ వ్యాప్తంగా మరోసారి కంటి వెలుగు కార్యక్రమం అమలు కాబోతోంది. జనవరి 18 నుంచి రెండో విడత అమలు చేయనున్నారు. ఈ కార్యక్రమం తొలి విడతకు ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. 2018 ఆగస్ట్ 15న మెదక్ జిల్లా మల్కాపూర్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ED Eyes On Liger Funding: లైగర్ సినిమాలో ఎమ్మెల్సీ కవిత పెట్టుబడులు ఉన్నాయని కాంగ్రెస్ నేత ఫిర్యాదు.. ఈడీ విచారణకు హాజరైన పూరీ జగన్నాథ్, చార్మి.. జనగణమన సినిమా పెట్టుబడులపైనా ఆరా.. పూరీ, చార్మిలను వేర్వేరుగా పది గంటలకు పైగా విచారించిన అధికారులు

Sriyansh S

‘లైగర్’ సినిమా పెట్టుబడులకు సంబంధించి దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత చార్మీ కౌర్‌ నిన్న ఈడీ విచారణకు హాజరయ్యారు. అవసరమైన పత్రాలతో బషీరాబాగ్‌లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్న వీరిద్దరినీ వేర్వేరుగా 10 గంటలకుపైగా విచారించారు.

Advertisement

Telangana: పార్టీ మార్పుపై ఈటెల రాజేందర్ క్లారిటీ, నేను టీఆర్ఎస్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదు, టీఆర్‌ఎస్‌ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని తెలిపిన హుజురాబాద్ ఎమ్మెల్యే

Hazarath Reddy

ప్రచారాన్ని ఈటల రాజేందర్ ఖండించారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. బీజేపీ నుంచి తాను తిరిగి టీఆర్ఎస్ లో (TRS) చేరుతున్నానని, తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నారన్న ప్రచారం అంతా పుకారే అని ఆయన (MLA Etela Rajender) కొట్టి పారేశారు. ఇదంతా పచ్చి అబద్ధం అన్నారు. ఇది సీఎం కేసీఆర్ చేయిస్తున్న ప్రచారం అని విమర్శించారు.

Cold Wave in Telugu States: వచ్చే 4 రోజులు చలి పులితో అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక, తెలుగు రాష్ట్రాల్లో గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు, ఏపీలో అక్కడక్కడా మోస్తారు నుంచి భారీ వర్షాలు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాలు చలితో వణికిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా చలి తీవ్రత ఎక్కువగా (Cold Wave in Telugu States) ఉంది. ప్రధాన నగరాలతో పాటు ముఖ్యపట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో గురువారం చలి విజృంభణ కనిపిస్తోంది.

2023 Government Holidays List: 2023లో సెలవులు ఇవే! హాలిడేస్ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన తెలంగాణ ప్రభుత్వం, వచ్చే ఏడాదిలో మొత్తం ఎన్ని సెలవులు ఉన్నాయో తెలుసా?

Naresh. VNS

వచ్చే ఏడాదికి సంబంధించిన సెలవుల విషయంలో క్లారిటీ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం (Telanagan Govt.). జనరల్ సెలవులతో (Genaral holidays) పాటూ, ఆప్షనల్ సెలవులు (Optional Holidays), వేతనంతో కూడిన సెలవుల లిస్టును తాజాగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ (Somesh kumar) విడుదల చేశారు.

Cold Wave in Telangana: తెలంగాణను వణికిస్తున్న చలి, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, వచ్చే 3 రోజులు 10 డిగ్రీల సెల్సియ‌స్ కంటే త‌క్కువ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యే అవ‌కాశం

Hazarath Reddy

తెలంగాణలో చలి పంజా విసురుతోంది. అయితే రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా చ‌లి తీవ్ర‌త పెరిగే అవ‌కాశం (cold wave sweep in Telangana) ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది.

Advertisement

14 Feet Snake at Secunderabad: బాబోయ్, సికింద్రాబాద్‌లో 14 అడుగుల భారీ కొండ చిలువ, పార్కులో చెత్తలో మాటు వేసిన భారీ ఫైథాన్

Hazarath Reddy

సికింద్రాబాద్‌ రైల్‌ నిలయం కాలనీ పార్కులో మంగళవారం ఉదయం భారీ కొండ చిలువ కనబడింది. దీంతో ఒక్కసారిగా భయాందోళనలకు గురైన స్థానికులు స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం అందజేయడంతో వాళ్లు వచ్చి కొండ చిలువను తీసుకెళ్లారు.

TS Early Elections Row: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండవు, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు, టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్

Hazarath Reddy

ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంగళవారం టీఆర్‌ఎస్‌ (TRS) విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండొచ్చన్న ఊహాగానాలపై (TS Early Elections Row) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు క్లారిటీ ఇచ్చారు.

Superstar Krishna Funeral: ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు, మంచి మిత్రుడుని కోల్పోయాం, కృష్ణ మరణం పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం

Hazarath Reddy

కృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని వెల్లడించారు. సీఎం వెంట మంత్రులు హరీష్‌రావు, పువ్వాడ అజయ్‌ కుమార్, ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, పాడి కౌశిక్‌ రెడ్డి ఉన్నారు.

TRS MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి ఇచ్చేందుకు నిరాకరించిన తెలంగాణ హైకోర్టు, హైకోర్ట్‌ సింగిల్‌ జడ్జి విజయ్‌సేన్‌రెడ్డి అధ్వర్యంలోనే దర్యాప్తు జరగాలని ఆదేశాలు

Hazarath Reddy

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. హైకోర్ట్‌ సింగిల్‌ జడ్జి విజయ్‌సేన్‌రెడ్డి అధ్వర్యంలోనే దర్యాప్తు జరగాలని ఆదేశించింది. దర్యాప్తు పారదర్శకంగా జరగాలని హైకోర్టు పేర్కొంది.

Advertisement

Superstar Krishna No More: సూపర్ స్టార్ కృష్ణ మరణం చిత్ర సీమకు తీరని లోటని తెలిపిన సీఎం కేసీఆర్, నిజ జీవితంలో కూడా మనసున్న మనిషి అని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సైతం కృష్ణ కన్నుమూతపై సంతాపం ప్రకటించారు. కృష్ణ మరణం తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటు అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

Medical Colleges Inauguration: నేడు 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్.. తెలంగాణలో పెద్ద సంఖ్యలో ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటు.. వర్చువల్ విధానంలో ప్రారంభించనున్న కేసీఆర్

Sriyansh S

తెలంగాణలో కొత్తగా నిర్మించిన 8 ప్రభుత్వ వైద్య కళాశాలలు నేడు ప్రారంభం కానున్నాయి. జగిత్యాల, రామగుండం, కొత్తగూడెం, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, మంచిర్యాల, వనపర్తి, మహబూబాబాద్ లో మెడికల్ కాలేజీలను నిర్మించిన సంగతి తెలిసిందే.

Telangana College Ragging: IBS కాలేజీలో ర్యాగింగ్, 10 మంది విద్యార్థులపై హత్యాయత్నం కేసు నమోదు, జూనియర్‌ని దారుణంగా ర్యాగింగ్ చేసిన సీనియర్లు

Hazarath Reddy

హైదరాబాద్‌ నగరంలో మరోసారి ర్యాగింగ్ భూతం (Telangana College Ragging) పడగ విప్పింది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం దొంతనపల్లి గ్రామ శివారులోని IBS కాలేజీలో ఓ విద్యార్ధిని (10 Students Thrash Junior) చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది

Cold Intensity: చలితో వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు, గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు, పదేళ్లలో ఎప్పుడు లేని విధంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. అక్టోబర్ నెలలో చూస్తే పదేళ్లలో ఎప్పుడు లేని విధంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు (Temperatures sees a fall) కాగా, ఈ నెలలోనూ ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్న నేపథ్యంలో.. ఉద‌యం పొగ మంచు కురుస్తుంది.

Advertisement
Advertisement