తెలంగాణ

TSRTC: వీసీ స‌జ్జ‌నార్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం, హైద‌రాబాద్ సిటీలో ఉచితంగా ప్ర‌యాణం, 250 కిలోమీట‌ర్ల పైన టికెట్ బుక్ చేసుకున్న వారికి తీపి కబురు చెప్పిన టీఎస్ఆర్టీసీ

Hazarath Reddy

తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. 250 కిలోమీట‌ర్లపై ఉన్న సుదూర ప్రాంతాల‌కు వెళ్ల‌డానికి ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ చేసుకున్న ప్ర‌యాణికుల‌కు తీపి క‌బురు అంద‌జేశారు. ఇలా సుదూర ప్రాంతాల‌కు వెళ్లే వారు త‌మ ప్రాంతం నుంచి ఆర్టీసీ బ‌స్సు ఎక్కే ప్రాంతం వ‌ర‌కూ హైద‌రాబాద్ సిటీలో ఉచితంగా ప్ర‌యాణం చేయ‌వ‌చ్చ‌ని ప్ర‌క‌టించారు.

Minister Srinivas Goud: హత్య చేసేందుకు రూ.12కోట్ల సుపారీ, తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్య కుట్రను చేధించిన పోలీసులు, నలుగురు అరెస్ట్

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్య కుట్రను పోలీసులు ఛేదించారు. మంత్రితో ( Telangana Minister Srinivas Goud) పాటు ఆయన సోదరుడు శ్రీకాంత్‌కు సుపారీ గ్యాంగ్‌తో హత్యకు మహబూబ్‌నగర్‌కు చెందిన కొందరు కుట్ర పన్నారు.

GST Collections in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రూ.3,157 కోట్ల జీఎస్టీ, తెలంగాణలో రూ.4,113 కోట్ల జీఎస్టీ

Hazarath Reddy

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి నెలలో జీఎస్టీ వసూళ్లు (GST Collections in Telugu States) పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రూ.3,157 కోట్ల జీఎస్టీ వసూలైంది. ఇది గత ఏడాది ఫిబ్రవరి కంటే 19 శాతం ఎక్కువ. అటు, తెలంగాణలో కూడా జీఎస్టీ ఆదాయం 13 శాతం పెరిగి రూ.4,113 కోట్లకు చేరుకున్నది.

Telangana: చౌటుప్పల్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, కారును ఢీకొట్టిన ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సు, ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

తెలంగాణలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Telangana Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, పదకొండు మంది గాయపడ్డారు.

Advertisement

Corona in TS: తెలంగాణలో కొత్తగా 152 మందికి కరోనా, అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదులో 64 కొత్త కేసులు

Hazarath Reddy

గడచిన 24 గంటల్లో తెలంగాణలో 19,527 కరోనా టెస్టులు నిర్వహించగా, 152 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదులో 64 కొత్త కేసులు వెలుగు చూశాయి. మంచిర్యాల జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి. మరికొన్ని జిల్లాల్లో సింగిల్ డిజిట్ కేసులే రాగా... మిగతా జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

Mana Ooru Mana Badi: తెలంగాణలో మన ఊరు -మన బడి, మార్చి 8న వనపర్తి జిల్లా నుంచి ప్రారంభించనున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌

Hazarath Reddy

తెలంగాణ సీఎం కేసీఆర్‌ మార్చి 8న వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. మన ఊరు -మన బడి (Mana Ooru Mana Badi) కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కన్నెతండా లిప్టును, వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్మించిన వ్యవసాయ మార్కెట్‌ యార్డును ప్రారంభిస్తారు.

Discounts on Traffic E-Challans: భారీగా పెండింగ్ చలానాలు ఉన్నాయా.. ఏం పర్లేదు, ఈ నెలాఖరు వరకు 75 శాతం డిస్కౌంట్‌తో కట్టేయండి, వాహనదారులకు బంపరాఫర్ ప్రకటించిన తెలంగాణ ట్రాఫిక్‌ పోలీస్ శాఖ

Hazarath Reddy

తెలంగాణ ట్రాఫిక్‌ పోలీసులు వాహనదారులకు మార్చి నెలల శుభవార్తను అందించారు. మార్చి 1 నుంచి 31వ తేదీ వరకు వాహనాదారులు పెండింగ్‌లో ఉన్న చలానాల మొత్తంలో 25 శాతం మాత్రమే చెల్లిస్తే (Discounts on Ttraffic E-Challans) సరిపోతుంది. అంటే 75శాతం రాయితీ (Pending Challans from March 1) ఉంటుంది.

Covid in TS: గడచిన 24 గంటల్లో తెలంగాణలో 156 మందికి కరోనా, జీహెచ్ఎంసీలో అత్యధికంగా 44 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

గడచిన 24 గంటల్లో తెలంగాణలో 19,947 కరోనా పరీక్షలు నిర్వహించగా, 156 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీలో అత్యధికంగా 44 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధిక జిల్లాల్లో సింగిల్ డిజిట్ లోనే తాజా కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 425 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Advertisement

Telangana Assembly Sessions 2022: మార్చి 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు, ఈ సారి గవర్నర్‌ ప్రసంగం లేకుండానే బడ్జెట్‌ సమావేశాలు

Hazarath Reddy

మార్చి 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. ఈ సారి గవర్నర్‌ ప్రసంగం లేకుండానే బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించనున్నారు. బడ్జెట్‌ ఆమోదంపై మార్చి 6న ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు.

Prashant Kishor Meets CM KCR: సీఎం కేసీఆర్‌‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ, ముఖ్యమంత్రి ఫాంహౌస్‌లో కీలక చర్చలు, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ మోడల్‌ పేరిట ప్రజల్లోకి వెళ్లనున్నటీఆర్ఎస్

Hazarath Reddy

తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా, కేసీఆర్‌తో భేటీ (Prashant Kishor Meets CM KCR) కావడం రాజకీయ వర్గాల్లో చర్చను రేపుతోంది.

Telangana: లాడ్జిలో మైనర్ బాలికపై తెగబడిన టీఆర్ఎస్ నేత, బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసిన నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ షాజిద్ ఖాన్, కేసు నమోదు చేసుకున్న పోలీసులు

Hazarath Reddy

బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి (Sajid Khan Khan Booked for raping minor) తెగబడ్డాడు. అంతే కాకుండా పలు ప్రదేశాలకు ( Telangana's Nirmal) తీసుకువెళ్లి ఆమెపై లైంగిక దాడి చేశాడు. పోలీసుల వద్దకు వెళ్లొద్దని కూడా ఆమెను బెదిరించాడు. ఇంటికి చేరుకున్నాక జరిగిన విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పింది.

COVID in Telangana: తెలంగాణలో భారీ స్థాయిలో పడిపోయిన కేసులు, గత 24 గంటల్లో 151 మందికి పాజిటివ్, జీహెచ్ఎంసీలో అత్యధికంగా 68 కొత్త కేసులు

Hazarath Reddy

గడచిన 24 గంటల్లో తెలంగాణలో 18,881 కరోనా పరీక్షలు నిర్వహించగా, 151 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీలో అత్యధికంగా 68 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధిక జిల్లాల్లో సింగిల్ డిజిట్ లోనే తాజా కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 453 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Advertisement

Prashant Kishor, Prakash Raj Visit Mallanna sagar Project: మల్లన్న సాగర్ ప్రాజెక్టును సందర్శించిన ప్రశాంత్ కిషోర్, ప్రకాష్ రాజ్, తెలంగాణ పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్

Krishna

మల్లన్న సాగర్ ప్రాజెక్టును ప్రశాంత్ కిషోర్, ప్రకాష్ రాజ్ పరిశీలించారు. మల్లన్నసాగర్ నిర్వాసితులతో వీరిద్దరూ మాట్లాడారు. ప్రశాంత్ కిషోర్ తో కలిసి ప్రకాష్ రాజ్ తెలంగాణలో పర్యటించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ టీం ను వచ్చే ఎన్నికలకు వ్యూహకర్తగా నియమించుకున్నారు.

Woman Raped In Moving Bus: ప్రైవేటు బస్సులో చివరి సీట్లో పడుకున్న మహిళపై డ్రైవర్ రేప్, బస్సు నిండా ప్రయాణికులు, అయినా లైంగిక దాడికి పాల్పడిన మృగాడు..

Krishna

కదులుతున్న బస్సులో డ్రైవర్ మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన తెలంగాణలోని సూర్యాపేట సమీపంలో జరిగింది. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్తున్న ప్రైవేటు బస్సులో ఒంటరిగా ఉన్న మహిళపై డ్రైవర్ అత్యాచారం చేయగా.. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.

Pulse Polio: దేశవ్యాప్తంగా పల్స్ పోలియా డ్రైవ్, ఐదేళ్లలోపు చిన్నారులకు రెండు చుక్కలు తప్పనిసరి, మూడు రోజులు రోజల పాటూ కొనసాగనున్న కార్యక్రమం, తెలంగాణలో ప్రత్యేక ఏర్పాట్లు

Naresh. VNS

దేశవ్యాప్తంగా పల్స్ పోలియో(pulse polio) కార్యక్రమం కొనసాగుతోంది. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కల మందు అందించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్సూఖ్ మాండ‌వీయ(Mansuk Mandaviya) పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐదేళ్ల లోపు చిన్నారుల‌కు పోలియో చుక్కల‌ను వేశారు.

Bigg Boss OTT Telugu: మొదలైన బిగ్‌ బాస్ తెలుగు ఓటీటీ, కంటెస్టెంట్ల ఫుల్ లిస్ట్ ఇదే! అన్ని సీజన్లలోని కంటెస్టెంట్లనే తిరిగి తెచ్చిన బిగ్ బాస్, ఒకరిద్దరు కొత్త మొహాలకు చోటు

Naresh. VNS

తెలుగు బిగ్ బాగ్ ఓటీటీ (Bigg Boss Telugu OTT ) మొదలైంది. నో కామా...నో ఫుల్ స్టాప్ అంటూ బిగ్ బాస్ ఓటీటీని మొదలు పెట్టారు కింగ్ నాగార్జున(Nagarjuna). ఓటీటీ జమానాలో ఇక 24 గంటల పాటు పూర్తి స్థాయి వినోదాన్ని పంచడానికి ఓటీటీ బిగ్ బాస్ తెలుగు రెడీ అయ్యింది. శనివారం నుంచి డిస్నీ హాట్ స్టార్‌లో (Disney+ Hotstar) ఈ షో ప్రసారం మొదలైంది

Advertisement

Wife Cheated Husband: ఆఫీసుకు వెళ్తున్నా అని చెప్పి, ప్రియుడి ఇంటికి చేరి బెడ్రూంలో శృంగారం చేస్తూ, భర్తకు అడ్డంగా దొరికిపోయిన మహిళ

Krishna

మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడో భర్త. భార్యను, ఆమె ప్రియుడిని చితకబాది బుద్ధి చెప్పాడు. ఈ షాకింగ్ ఘటన కరీంనగర్ టౌన్‌లో వెలుగుచూసింది.

Training Helicopter Crashes: నల్గొండ జిల్లాలో విషాదం, తుంగతుర్తిలో కూలిన ట్రైనీ హెలికాప్ట‌ర్, మహిళా పైలెట్ సహా మరొకరు మృతి

Krishna

నల్లగొండ జిల్లాలోని పెద్దవూర మండలం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సాంకేతిక లోపంతో ట్రైనీ హెలికాప్టర్ (శిక్షణ విమానం) కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మరణించారు.

Telangana High Court: అగ్రిగోల్డ్‌, అక్షయ గోల్డ్‌ కేసుల్లో కీలక మలుపు, రెండు కేసుల వివాదాలను ఏలూరు కోర్టుకు బదిలీ చేసిన తెలంగాణ హైకోర్టు

Hazarath Reddy

అగ్రిగోల్డ్‌, అక్షయ గోల్డ్‌ కేసుల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. అగ్రిగోల్డ్‌, అక్షయగోల్డ్‌ కేసులను ఏపీలోని ఏలూరు కోర్టుకు బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

Russia-Ukraine War: ఎంత ఖర్చైనా మేము భరిస్తాం, మా రాష్ట్ర విద్యార్థులను క్షేమంగా ఇండియాకు తీసుకురండి, కేంద్ర విదేశాంగ మంత్రికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి

Hazarath Reddy

ఉక్రెయిన్‌లో చదువుతున్న తమ రాష్ట్ర విద్యార్థులను క్షేమంగా ఇండియాకు తీసుకురావాలని కేంద్ర విదేశాంగ మంత్రికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. వారి తరలింపుకు అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు.

Advertisement
Advertisement