తెలంగాణ

Chicken Rate in Hyd: తెలంగాణలో మండుతున్న చికెన్ ధ‌ర‌లు, రూ.180 ఉన్న ధర ఇప్పుడు ఏకంగా రూ. 280 నుంచి రూ.300 మ‌ధ్యలోకి, మరి కొన్ని నెల‌ల వ‌ర‌కు ఇలాగే కొన‌సాగే అవ‌కాశం

Hazarath Reddy

తెలంగాణ‌లో చికెన్ ధ‌ర‌లు ఇప్ప‌ట్లో త‌గ్గేలా క‌న‌ప‌డ‌ట్లేదు. నెల రోజుల క్రితం వ‌ర‌కు రూ.180 లోపు ఉన్న కిలో చికెన్ ధ‌ర (Chicken Rate in Hyd) ఇప్పుడు రూ. 280 నుంచి రూ.300 మ‌ధ్య ఉంది. కోళ్ల దాణా రేట్లు పెరిగాయ‌ని అందుకే చికెన్ ధ‌ర‌లు (Chicken Rate in Hyderabad Today) పెరిగాయ‌ని హ్యాచ‌రీస్ య‌జ‌మానులు అంటున్నారు

Telangana Temperatures: రెండు రోజులు బయటకెళ్తే మాడిపోతారు, తెలంగాణలో వడగాలులు వీచే అవకాశముందని హెచ్చరిక, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

Naresh. VNS

ఈ రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సాధారణంగా మే నెలలో వడగాలులు వీస్తాయని కానీ ఈ సంవత్సరం మార్చిలోనే వీస్తుండడం సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది.

Telangana Traffic Challans: ట్రాఫిక్ చలాన్ డిస్కౌంట్లకు భారీ డిమాండ్, 15 రోజుల్లో రూ.140 కోట్లు వసూల్, మొత్తం టార్గెట్ ఎంతో తెలుసా? సర్వర్ మొరాయిస్తుండటంతో చాలా మంది అవస్థలు

Naresh. VNS

మొదటి రోజే రూ. 5.5 కోట్ల ఫైన్లు చెల్లించారు. తెలంగాణ (Telangana)వ్యాప్తంగా ఈనెల 31వ తేదీ వరకు ఆఫర్ వర్తించనుంది. మొత్తంగా రూ. 140 కోట్ల జరిమాన వసూలైంది. రాయితీకి మరో 15 రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ గడువును ఉపయోగించుకోని వారు..తనిఖీల్లో చలాన్లు () ఉంటే.. మొత్తం బకాయిలు చెల్లించాల్సి ఉంటుందని ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

Liquor Outlets to be Closed: మద్యం షాపులు 2 రోజులు బంద్, హోలీ పండుగ సందర్భంగా జంటనగరాల్లో పోలీసుల నిర్ణయం, షాపుల ముందు క్యూకట్టిన మద్యం ప్రియులు

Naresh. VNS

హోలీ (Holi) పండుగకు ఎంజాయ్ చేద్దామనుకుంటున్నవారికి షాక్ ఇచ్చారు హైదరాబాద్ పోలీసులు. పండుగ సందర్భంగా తాగి ఎలాంటి గొడవలు జరుగకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ పోలీసులు (Telangana police) ఆంక్షలు విధించారు.

Advertisement

Vikas Raj New CEO of TS: తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారిగా వికాస్‌రాజ్‌, ఉత్త‌ర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి (సీఈఓ) పోస్టు గ‌త కొంత కాలంగా ఖాళీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. మొన్న‌టిదాకా ఆ పోస్టులో కొన‌సాగిన శ‌శాంక్ గోయ‌ల్ ఇదివ‌ర‌కే బ‌దిలీ కాగా.. తాజాగా సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి వికాస్‌రాజ్‌ను తెలంగాణ రాష్ట్రఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారిగా నియ‌మిస్తూ కేంద్ర ఎన్నిల సంఘం బుధ‌వారం సాయంత్రం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 75 కేసులు, గత 24 గంటల్లో హైదరాబాద్‌లో అత్యధికంగా 34 మందికి కరోనా

Hazarath Reddy

తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 75 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 82 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు. హైదరాబాద్ లో అత్యధికంగా 34 మంది కరోనాకు గురయ్యారు. కరోనా రికవరీ రేటు 99.37 శాతానికి పెరిగింది

TS Inter Exams 2022: తెలంగాణలో మే 6వ తేదీ నుంచి ఇంట‌ర్ ప‌రీక్ష‌లు, స‌వ‌రించిన ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను విడుదల చేసిన రాష్ట్ర ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు, పూర్తి వివరాలు కథనంలో..

Hazarath Reddy

తెలంగాణ వ్యాప్తంగా మే 6వ తేదీ నుంచి ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. జేఈఈ అడ్వాన్స్ పరీక్షల తేదీల మార్పు కారణంగా ఇంటర్ పరీక్షల్లో ఇంటర్ బోర్డు మార్పులు చేసింది. ఈ మేర‌కు స‌వ‌రించిన ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను రాష్ట్ర ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు బుధ‌వారం విడుద‌ల చేసింది.

Telangana: తెలంగాణలో ఘోర విషాదాలు, వనపర్తిలో ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి, పెద్దపల్లి జిల్లాలో మరొకరు మృతి, ఏపీలో రోడ్డు ప్రమాదంలొ మరో ముగ్గురు చిన్నారులు మృతి

Hazarath Reddy

వనపర్తి (wanaparthy) జిల్లా కేంద్రంలో విషాదం ఘటన చోటుచేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు శవాలుగా (3 children drown in lake) తేలారు. పట్టణంలో బండార్‌నగర్‌కు చెందిన మున్నా, అజ్మద్‌, భరత్‌.. పదో తరగతి చదువుతున్నారు. మంగళవారం సాయంత్రం సరదాగా వనపర్తి శివారులోని చెరువులో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు

Advertisement

Corona in TS: తెలంగాణలో కొత్తగా 81 మందికి కరోనా, అత్యధికంగా హైదరాబాదులో 35 కొత్త కేసులు

Hazarath Reddy

తెలంగాణలో కరోనా వ్యాప్తిపై ప్రజారోగ్య శాఖ తాజా బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో రోజువారీ కేసుల సంఖ్య తగ్గిపోతుండడంతో యాక్టివ్ కేసుల సంఖ్యలోనూ తగ్గుదల కనిపిస్తోంది. గత 24 గంటల్లో 24,848 కరోనా పరీక్షలు నిర్వహించగా, 81 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

TS Budget Session 2022: తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా, బడ్జెట్‌పై ప్రసంగించిన సీఎం కేసీఆర్, హిజాబ్ వివాదం ఎందుకని ప్రశ్నించిన తెలంగాణ ముఖ్యమంత్రి

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. బుధవారం అసెంబ్లీ సమావేశాలు జరిగిన అనంతరం అసెంబ్లీని (TS Budget session 2022) నిరవధిక వాయిదా వేశారు.ఏడు రోజుల పాటు కొనసాగిన అసెంబ్లీ సమావేశాల్లో (TS Budget session 2022) మొత్తం 4 బిల్లులు ఆమోదం పొందాయి

CM KCR on Hijab Controversy: హిజాబ్ వివాదంపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు, ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ప్రభుత్వాలకు ఏం అభ్యంతరమని సూటి ప్రశ్న

Hazarath Reddy

దేశంలో అత్యంత చర్చనీయాంశంగా మారిన హిజాబ్ అంశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రస్తావించారు. బెంగుళూరులో హిజాబ్ పంచాయతీ పెడుతున్నారని... ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ప్రభుత్వాలకు ఏం అభ్యంతరమని ప్రశ్నించారు. ప్రజలు తొడుక్కునే వస్త్రాలతో ప్రభుత్వాలకు ఏం పని అని అడిగారు.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 67 మందికి కరోనా, హైదరాబాదులో 19 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 21,843 కరోనా పరీక్షలు నిర్వహించగా, 67 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో 19 కొత్త కేసులు నమోదు కాగా, నల్గొండ జిల్లాలో 9 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 152 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Advertisement

Half-Day Schools in TS: తెలంగాణ‌లో రేప‌ట్నుంచి ఒంటిపూట బ‌డులు, ఉద‌యం 8 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల వ‌ర‌కు కొనసాగనున్న స్కూల్స్

Hazarath Reddy

తెలంగాణ‌లో రేప‌ట్నుంచి (మార్చి 15) ఒంటిపూట బ‌డులు ప్రారంభం కానున్నాయి. అన్ని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల్లో మంగ‌ళ‌వారం నుంచి ఒంటిపూట బ‌డులు (Half-Day Schools in TS) నిర్వ‌హించాల‌ని స్కూల్ ఎడ్యుకేష‌న్ డైరెక్ట‌ర్ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

Gutha Sukender Reddy: శాస‌న‌మండ‌లి చైర్మ‌న్‌గా గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, రెండో సారి పదవీ బాధ్యతలు స్వీకరించిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ

Hazarath Reddy

తెలంగాణ శాస‌న‌మండ‌లి చైర్మ‌న్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి (Gutha Sukender Reddy) రెండోసారి ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. మండ‌లి చైర్మ‌న్‌గా సుఖేంద‌ర్ రెడ్డి ఏక‌గ్రీవంగా ( legislative council chairman ) ఎన్నిక‌య్యారు. ఈ ఎన్నిక‌కు ఒకే ఒక్క నామినేష‌న్ రావ‌డంతో.. గుత్తా ఏక‌గ్రీవంగా ఎన్నికైనట్లు మండ‌లి అధికారులు ప్ర‌క‌టించారు.

TS Budget Session 2022: రేప‌టితో తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాలు ముగింపు, ఆరో రోజు అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చలు

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ఆరో రోజు (TS Budget Session 2022) ప్రారంభ‌మ‌య్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అయితే నేడు జీరో అవర్ కూడా ఉంటుందని, సభ్యులు ప్రశ్నలు అడగాలని, ఉపన్యాసాలు ఇవ్వద్దని తెలిపారు.

Coronavirus in TS: తెలంగాణలో కొత్తగా 50 మందికి కరోనా, హైదరాబాదులో అత్యధికంగా 23 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 16,128 కరోనా పరీక్షలు నిర్వహించగా, 50 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 23 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 164 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Advertisement

Bandi sanjay warns KTR : దమ్ముంటే కరంట్ కట్ చేయ్! మంత్రి కేటీఆర్ కు బండి సంజయ్ సవాల్, కేసీఆర్, కేటీఆర్ దేశ ద్రోహులంటూ ఫైరయిన బండి, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

Naresh. VNS

మంత్రి కేటీఆర్‌కు (Minister KTR) సవాల్ విసిరారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. కంటోన్మెంట్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. దమ్ముంటే కంటోన్మెంట్ (cantonment) కరెంటు కట్ చేయండి చూస్తాం.. అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, పురపాలక శాఖమంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు

Good News For Telangana Beer Lovers: తెలంగాణలో బీరు ప్రియులకు గుడ్ న్యూస్, బాటిల్‌పై ఏకంగా 30 రూపాయలు తగ్గించే చాన్స్, వేసవిలో బీర్ల సేల్స్ పెరిగే చాన్స్..

Krishna

మద్యం అమ్మకాలపై దృష్టి సారించిన ప్రభుత్వం.. బీర్ బాటిల్ పై రూ.20-30 వరకూ తగ్గించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Kandikonda Passes Away: పాటల రచయిత కందికొండ కన్నుమూత, చివరిదశలో చాలా ఇబ్బందుల పడ్డ కందికొండ, మళ్లీకూయవే గువ్వతో అరంగేట్రం, రెండేళ్లుగా మంచానికే పరిమితం

Naresh. VNS

సినీ గేయ రచయిత (Lyricist) కందికొండ(49) (Kandikonda) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వెద్యులు తెలిపారు. వెంగళరావు నగర్‌లోని తన ఇంట్లో కందికొండ తుదిశ్వాస విడిచారు. ఆయన పూర్తి పేరు కందికొండ యాదగిరి. వరంగల్‌ జిల్లా (Warangal) నర్సంపేట (Narsampet) మండలం నాగుర్లపల్లిలో కందికొండ జన్మించారు.

MLA Rasamayi Balakishan: తెలంగాణ అసెంబ్లీలో కలకలం, డిప్యూటీ స్పీకర్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి గరంగరం, మైక్ కట్ చేయడంతో తీవ్రఆగ్రహం, మంత్రి కేటీఆర్ ముందే అసహనం

Krishna

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ సభ్యులే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిప్యూటీ స్పీకర్ పద్మారావుపై అసహనం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement