తెలంగాణ
Trujet: మూసివేత దిశగా రామ్ చరణ్ విమానయాన సంస్థ! జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉందంటూ ప్రచారం, క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్, కంపెనీ ప్రతినిధులు
Naresh. VNSమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నడిపిస్తున్న ట్రూజెట్ విమానయాన సేవలు నిలిచిపోయాయా? సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ట్రూజెట్ ఉందా? గత నవంబర్ నుంచి ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని వస్తున్న వార్తలపై ఆ సంస్థ క్లారిటీ ఇచ్చింది. ట్రూజెట్ కొంత నష్టాల్లో ఉన్న మాట వాస్తవమే కానీ, సంస్థను మూసివేయడం లేదని ప్రకటించింది.
Telangana: తెలంగాణలో ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియకు గ్రీన్‌సిగ్నల్‌, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన హైకోర్టు
Hazarath Reddyతెలంగాణలో ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియకు హైకోర్టు (Telangana high court ) గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. భూములను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. భూములను విక్రయించడానికి వీల్లేదని చట్టంలో ఎక్కడా లేదని, ఈ నేపథ్యంలో తాము వేలం ప్రక్రియను ( sale of government lands in the State) నిలిపి వేయలేమని స్పష్టం చేసింది.
Medaram Jatara: గద్దెల మీదకు సమ్మక్క తల్లి, జాతరలో కీలక ఘట్టం పూర్తి, మొక్కులు సమర్పించుకుంటున్న భక్తులు, కోలాహలంగా మేడారం
Naresh. VNSమేడారం జాతరలో (Medaram Jatara) అసలైన ఘట్టం మొదలైంది. చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి (Sammakka) గద్దె మీదకు చేరింది. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు గిరిజన పూజారులు. ఇప్పటికే సారక్క(Sarakka), పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలనెక్కి భక్తులకు దర్శనమిస్తుండగా కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని ఆదివాసీల సంప్రదాయం ప్రకారం చిలుకలగుట్ట నుంచి తీసుకొచ్చారు.
Corona in TS: తెలంగాణలో కొత్తగా 453 మందికి కరోనా, అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 134 కొత్త కేసులు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 41,310 కరోనా పరీక్షలు నిర్వహించగా, 453 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 134 కొత్త కేసులు వెలుగు చూశాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 33, రంగారెడ్డి జిల్లాలో 27, ఖమ్మం జిల్లాలో 20, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 20 కేసులు గుర్తించారు.
CM KCR Birthday: సీఎం కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్, ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తమిళనాడు సీఎం స్టాలిన్
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం కేసీఆర్‌ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
Coron in TS: తెలంగాణలో కొత్తగా 512 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో 125 కేసులు నిర్ధారణ, కరోనా కారణంగా ఒక వ్యక్తి మృతి
Hazarath Reddyతెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 512 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 125 కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనా కారణంగా ఒక వ్యక్తి మృతి చెందారు. ఇదే సమయంలో 1,217 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 7,85,143కి చేరుకున్నాయి
BJP MLA Raja Singh: యోగి ఆదిత్యనాథ్‌కు ఓటు వేయకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తాం, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు, నోటీసులు జారీ చేసిన ఈసీ
Hazarath Reddyయూపీలో యోగి ఆదిత్యనాథ్ కు ఓటు వేయని వారి ఇళ్లపైకి జేసీబీలను, బుల్డోజర్లను పంపిస్తామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (BJP MLA Raja Singh) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలకు సంబంధించి రాజాసింగ్ కు ఎన్నికల సంఘం నోటీసులు (Election Commission issues notice to BJP's T Raja Singh) పంపించింది.
Telangana Minister KTR: తెలంగాణను మళ్లీ ఏపీలో కలిపేస్తారు, కేంద్రం తెలంగాణకు ఏం చేసిందో చెప్పే దమ్ముందా?, ప్రధాని మోదీ, బీజేపీపై విరుచుకుపడిన తెలంగాణ మంత్రి కేటీఆర్
Hazarath Reddyతెలంగాణ కోసం ఏం అడిగినా ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదని మంత్రి కేటీఆర్‌ (Telangana Minister KTR) మండిపడ్డారు. వర్ని మండలంలో సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులకు మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
Medaram Sammakka Sarakka Jatara: ఆసియాలో అతిపెద్ద జాతర, కన్నుల పండుగగా ప్రారంభమైన మేడారం సమ్మక్క సారక్క జాతర, ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు కొనసాగనున్న జాతర
Hazarath Reddyభక్తజనమంతా వనమంతా నిండి కుంభమేళాను తలపించే ఆదివాసీల వేడుక మేడారం జాతర (Medaram Sammakka Sarakka Jatara) ప్రారంభమైంది. ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు జాతర సాగుతుంది. గత జాతరకు 1.20 కోట్ల మంది భక్తులు హాజరైనట్లు ప్రకటించిన అధికారులు, ఈసారి కూడా అదేస్థాయిలో వస్తారని అంచనా వేసి ఆ మేరకు ఏర్పాట్లు చేశారు.
Samatamoorthy Open for Visitors: సమతామూర్తి విగ్రహాన్ని చూసేందుకు వెళ్తున్నారా? టికెట్ ధర ఎంతో తెలుసా? ఇప్పడైతే ప్రతిరోజు మూడున్నర గంటలే పర్మిషన్
Naresh. VNSముచ్చింతల్‌ లో ఇటీవల ఆవిష్కరించిన సమతామూర్తిని (Samatamoorthy) దర్శించుకునేందుకు నేటి(బుధవారం) నుంచి సామాన్య భక్తులకు అనుమతించనున్నారు. సమతామూర్తితో పాటూ,108 దివ్యదేశాల సందర్శనకు (devotees will be allowed ) మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.30 వరకు అనుమతించనున్నారు.
KCR Will Meet Uddhav Thackeray: బీజేపీకి వ్య‌తిరేకంగా..మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాకరేతో సీఎం కేసీఆర్ భేటీ, ఈ నెల 20వ తేదీన ముంబైకి సీఎం కేసీఆర్
Hazarath Reddyతెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు మ‌హారాష్ట్ర ప‌ర్య‌ట‌న ఖ‌రారు అయింది. ఈ నెల 20వ తేదీన మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాకరేతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. మ‌హారాష్ట్ర సీఎం ఆహ్వానం మేర‌కు 20న కేసీఆర్ ముంబ‌యికి వెళ్ల‌నున్నారు.
Corona in TS: తెలంగాణలో కొత్తగా 569 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో 133 కొత్త కేసులు నమోదు
Hazarath Reddyతెలంగాణలో గత 24 గంటల్లో 569 మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రాష్ట్రవ్యాప్తంగా 51,518 కరోనా పరీక్షలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 133 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 49, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 37, నల్గొండ జిల్లాలో 33 కేసులు వెలుగు చూశాయి.
Hyderabad Traffic Police: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల మరో చేయూత, యశోద నుంచి కిమ్స్‌కు అవయువాలను తీసుకువెళ్లే అంబులెన్స్‌కు ట్రాఫిక్ క్లియర్ చేసిన పోలీసులు
Hazarath Reddyహైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల మరో చేయూత, యశోద నుంచి కిమ్స్‌కు అవయువాలను తీసుకువెళ్లే అంబులెన్స్‌కు ట్రాఫిక్ క్లియర్ చేసిన పోలీసులు
Telangana Shocker: పిల్లలు పెద్దయ్యారని చెప్పినా వినకపోవడంతో.. ప్రియుడ్ని దారుణంగా గొడ్డలితో నరికేసిన ప్రియురాలు, నల్గొండ జిల్లాలో ఘటన
Hazarath Reddyనల్గొండ జిల్లాలో దివ్యాంగుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన (Telangana Shocker) డిండి మండల పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది.
COVID in TS: తెలంగాణలో కొత్తగా 614 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో 131 కొత్త కేసులు నమోదు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 50,520 కరోనా పరీక్షలు నిర్వహించగా, 614 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 131 కొత్త కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 48, రంగారెడ్డి జిల్లాలో 43, ఖమ్మం జిల్లాలో 33 కేసులు వెల్లడయ్యాయి.
CM KCR Press Conference: సర్జికల్‌ స్ట్రైక్స్‌పై నాకు ఎన్నో అనుమానాలున్నాయి, అడిగితే రాహుల్ గాంధీని అంత ఘోరంగా అవమానిస్తారా, కేంద్రంపై మండిపడిన తెలంగాణ సీఎం కేసీఆర్
Hazarath Reddyభారత ఆర్మీ జరిపిన సర్జికల్‌ స్ట్రైక్స్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ ఆధారాలను కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అడగటంలో తప్పేలేదని, అడిగే హక్కు ఆయనకు ఉన్నదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుండబద్ధలు కొట్టారు.
COVID in TS: తెలంగాణలో కొత్తగా 429 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో 142 కొత్త కేసులు వెల్లడి
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 32,932 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 429 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 142 కొత్త కేసులు వెల్లడి కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 41, రంగారెడ్డి జిల్లాలో 33, నల్గొండ జిల్లాలో 22 కేసులు గుర్తించారు.
Statue Of Equality: 120 కేజీల సువర్ణమూర్తిని లోకార్ఫణం చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌, రామానుజులు దేశ ప్రజల్లో సమతా చైతన్యం నింపారు-రాష్ట్రపతి కోవింద్
Krishnaశ్రీభగవద్రామానుజాచార్యుల 120 కిలోల స్వర్ణమూర్తిని లోకావిష్కరణ చేయడం తన అదృష్టమన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌జీ. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామీజీ, మైహోంగ్రూప్‌ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు శ్రీభగవద్రామానుజాచార్యుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌.
KCR Fires on Modi: అమెరికా రాజకీయాల్లో వేలు పెట్టడం అవసరమా? అంటూ మోదీపై కేసీఆర్ ఫైర్, కొత్త స్పూర్తి కోసం కొత్త చట్టం రావాల్సిందేనన్న తెలంగాణ సీఎం, అవసరమైతే జాతీయ పార్టీ పెడతా!
Naresh. VNSప్రధాని మోదీ (PM Modi) అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌కు (Trump) మద్దతివ్వడంపై కూడా కేసీఆర్ మండిపడ్డారు. అమెరికా ఎన్నికలు అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికలు అనుకున్నారా అంటూ ప్రధాని మోదీని ప్రశ్నించారు. అమెరికా ఎన్నికలతో (America Elections) మీకేం సంబంధం.. ఎవరైనా వేరే దేశం ఎన్నికల్లో ప్రచారం చేస్తారా.. ఇది విదేశీ నీతేనా..? అని ప్రశ్నించారు.
Rashtrapathi To Come Hyderabad Today: నేడు ముచ్చింతల్‌కు హైదరాబాద్ కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, 120 కిలోల బంగారు రామానుజుల విగ్రహం ఆవిష్కరించనున్న ప్రథమ పౌరుడు
Krishnaముచ్చింతల్ లో సమతామూర్తి ఉత్సవాలల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదివారం హైదరాబాద్ కు రానున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2.20 గంటలకు రాష్ట్రపతి బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ లు రాష్ట్రపతికి ఘన స్వాగతం పలకనున్నారు.